Madhavi kalla
ShareChat
click to see wallet page
@89623894
89623894
Madhavi kalla
@89623894
I Love Sharechat :)
#🙆 Feel Good Status
🙆 Feel Good Status - **************** మహనీయునిమాట **************** శరీరాన్ని; "బుతువులు మారినపుడు ಏರಿಸ್ಥಿೀುಲು ಮೌರಿನಮ್ಬಿಡು ಮನಸ್ಸುನಿ; దృఢపరచుకోవాలి, అప్పుడే జీవితాన్ని సజావుగా కొనసాగించగలం: ' ]| ************** నేటిమంచి మాట ************** "మనం మంచివాళ్ళుగా జీవిస్తేచాలు; వద్ద నిరూపించుకోవాలని ದೌನಿನಿ ಎಏರಿ ప్రయత్నించ వలసిన అవసరంలేదు: I Ul **************** మహనీయునిమాట **************** శరీరాన్ని; "బుతువులు మారినపుడు ಏರಿಸ್ಥಿೀುಲು ಮೌರಿನಮ್ಬಿಡು ಮನಸ್ಸುನಿ; దృఢపరచుకోవాలి, అప్పుడే జీవితాన్ని సజావుగా కొనసాగించగలం: ' ]| ************** నేటిమంచి మాట ************** "మనం మంచివాళ్ళుగా జీవిస్తేచాలు; వద్ద నిరూపించుకోవాలని ದೌನಿನಿ ಎಏರಿ ప్రయత్నించ వలసిన అవసరంలేదు: I Ul - ShareChat
#😇My Status *ఇందిర భైరి(గజల్ కవయిత్రి, ఉపాధ్యాయిని)* ఇందిర భైరి (1962, జూలై 7 - 2023, ఫిబ్రవరి 19) తెలంగాణకు చెందిన గజల్ కవయిత్రి, ఉపాధ్యాయిని. తెలంగాణ తొలి గజల్ కవయిత్రిగా పేరొందింది. 2018లో దక్కన్ గజల్ అకాడమీ స్థాపించింది. ఉపాధ్యాయురాలిగా పాఠాలు బోధిస్తూనే తీరిక సమయాల్లో గజల్స్‌ రాయడంతోపాటు తెలంగాణ గజల్‌ కావ్యం, సవ్వడి, గజల్‌ భారతం, మన కవులు పేరుతో గజల్స్‌ సంకలనాన్ని తీసుకొచ్చింది. బతుకమ్మ, తెలంగాణ అమరవీరులు, ఉద్యమ నేపథ్యం, సాయుధ పోరాటం, తెలంగాణ పండుగలపై కూడా అనేక గజల్స్‌ రాసింది. ఇందిర 1962, జూలై 7న భైరి రామ్మూర్తి - వెంకటరమణ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో జన్మించింది. ఎంఏ, బీఈడి, ఎంఫిల్ చదివింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, కారేపల్లి తదితర ప్రాంతాల్లో పలు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా పనిచేసింది. ప్రభుత్వ ఉద్యోగం రాకముందు ఇల్లెందు పట్టణంలోని శాంతినికేతన్ అనే ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తించింది. ఆ తరువాత ఇల్లందులో 20 ఏళ్ళపాటు ప్రభుత్వ పాఠశాలలో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 2020లో ప్రధానోపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ పొందింది. 1980లో ఇందిరకు రామశంకరయ్యతో వివాహం అయింది. భర్త సింగరేణి ఉద్యోగి. వారికి ఇందుసాగర్, రఘురాం, హిమజా రామం సంతానం. హిమజా రామం గాయనిగా రాణిస్తోంది. బాల్యంలో తండ్రి నేర్పిన పుష్ప విలాపం, పోతన పద్యాలు, గబ్బిలం, మాలపల్లి వంటి కావ్య ప్రస్తావనలు అభ్యుదయ కవిత్వ దిశగా అడుగులు వేయించాయి. లోకం తెలుస్తున్న తరుణంలో తండ్రి పోత్సాహంలో కవిత్వం రాయడం ప్రారంభించి తొమ్మిదో తరగతిలో 'ఉక్కు పిడికిళ్లు' పేరుతో మొదటి కవిత రాసింది. ఆ తరువాత అప్పుడప్పుడు రాస్తుండేది. ఉద్యోగంలో చేరిన 1997 నుండి పూర్తిస్థాయి సాహిత్యరంగంలోకి అడుగుపెట్టింది. హైకూ, మినీ, నానో, వచన కవిత, గజల్, కథ, గేయం, పాట, అనువాదం, పరిశోధన మొదలైన ప్రక్రియలన్నింటిలో రచనలు చేసింది. అవన్నీ పలు దిన పత్రికలు, విద్యా వైజ్ఞానిక పత్రికలు, పుస్తకాలలో అచ్చయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో సాహితీ స్రవంతి కార్యకర్తగా ఖమ్మం, హైదరాబాద్‌లలో జరిగిన జనకవనం, సాహిత్య కార్యశాలలో కూడా పాల్గొన్నది. *రచనలు* 2005: అలవోకలు (హైకూలు) 2007: అభిమతం (వచన కవిత్వం) 2015: తెలంగాణ గజల్ కావ్యం 2017: సవ్వడి (శతాధిక గజళ్లు) 2018: మనకవులు (గీతికలు) 2018: ఘనచరితలు (గేయ కవిత్వం). 1998లో ఆస్ట్రేలియా పత్రిక 'తెలుగు పలుకు' వారిచే తొలి కవితా పురస్కారం 1999లో రాగమయి ఆర్ట్స్ అకాడమీ జాతీయ స్థాయి అవార్డు (కవిత్వం) 2004లో అంబేద్కర్ రాష్ట్ర(ఉమ్మడి) అవార్డు (కవిత్వం) 2010లో చిగురు సాహిత్య సంస్థ జాతీయ స్థాయి అవార్డు (నానో) 2015లో మానస సాహిత్య సంస్థ జాతీయ స్థాయి అవార్డు (కవిత్వం) 2016లో అనసూయ-రత్నావతి పురస్కారం (గజల్) 2018లో రావి రంగారావు సాహిత్యపీఠం వారి ‘జనరంజక కవితా పురస్కారం. కాన్సర్ వ్యాధికి చికిత్సను తీసుకుంటూ 2023, ఫిబ్రవరి 19న హైదరాబాదులో మరణించింది. ఇందిర కవిత రాసుకున్న ప్రకారమే 2023 ఫిబ్రవరి 20న సోమవారం ఉదయం హైదరాబాదులోని నిజాంపేటలో అంత్యక్రియలు జరిగాయి. *మాధవి కాళ్ల* *సేకరణ*
😇My Status - ShareChat
#😇My Status *కోన వెంకట్(సంభాషణల రచయిత)* కోన వెంకట్, తెలుగు సినిమా సంభాషణల రచయిత. ఆత్రేయ వెంకట్‌కు మంచి స్నేహితుడు. పరిచయం అయిన కొత్తల్లో ఆయన ప్రేమ, అభినందన సినిమాలకు సంభాషణలు రాసేవాడు. తను రాసిన సంభాషణలూ సీన్లూ చదివి వినిపించేవాడు.అతను రచయిత కావడానికి బీజం ఇక్కడే పడింది. రాష్ట్ర మాజీ మంత్రి కోన ప్రభాకరరావు అతని తాత. రాజకీయనాయకుడైనా సినిమాలపైనా బాగా ఆసక్తి ఉండేదాయనకు. మంగళసూత్రం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎల్వీప్రసాద్‌ ద్రోహి సినిమాలో విలన్‌గా చేశాడు. వెంకట్ తండ్రి పోలీసు ఉద్యోగం చేయడం వల్ల తరచు బదిలీలు అయ్యేవి. అందుకని హైదరాబాదు‌లో తాతయ్య దగ్గరే పెరిగాడు. గ్రూప్స్‌ పరీక్షలు రాసి పాసయ్యాడు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతానికి పౌరసరఫరా శాఖ అధికారిగా ఉద్యోగం వచ్చింది. కొద్దినెలలకే ఆ పనిమీదా ఆసక్తి పోయింది. నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలోని ఒక మంత్రి దగ్గర వ్యక్తిగత సహాయకునిగా చేరాడు. ఆ ఉద్యోగం దాదాపు మూడేళ్లు చేశాడు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ప్రచార సంఘాన్ని ఏర్పాటు చేస్తే దానికి కన్వీనర్‌గా ఎంపికయ్యాడు. ఆ బాధ్యతల్లో భాగంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా సినిమా వాళ్లతో ప్రచారం చేయించేవాడు. ప్రచారంలో ఆయనతో పాటు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, నరేష్‌ ఉన్నాడు. ఆ సమయంలో ధర్మవరపు ఆయనకొక కథ చెప్పాడు. వెంకట్ దాన్ని సినిమాగా తీస్తానన్నాడు. ఆ సినిమా... తోకలేనిపిట్ట. ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకుడు, హీరో నరేష్‌. ఆ సినిమా బాగా ఆడలేదు. అప్పటికి ఆయనకు హైదరాబాదు‌లో ఒక అపార్ట్‌మెంట్‌ ఉండేది. రెండు కార్లుండేవి. ఈ సినిమా దెబ్బకి మొత్తం పోయింది. అపార్ట్‌మెంటు, కార్లు, ఆఖరుకి భార్య నగలు కూడా అమ్మేశాడు. మాసాబ్‌ట్యాంక్‌ దగ్గర ఒకచిన్న గదిలో అద్దెకి చేరాడు. అద్దె కట్టడానికీ కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో రామ్‌గోపాల్‌వర్మను కలిశాడు. రామ్‌గోపాల్ వర్మ అతనికికు కాలేజీ రోజుల నుంచీ పరిచయం. అతని సలహా మేరకు బాంబే వెళ్ళి ఆయన సినిమా సత్యకు పనిచేశాడు. సంభాషణల రచయితగా అది తొలిమెట్టు. ఆ సినిమా సంభాషణలను చెన్నైలో దర్శకుడు మణిరత్నం విని తన 'దిల్‌ సే' తెలుగు అనువాదానికి ఆయన్ను సంభాషణలు రాయమని అడిగాడు. తర్వాత... వెన్నెలకంటి, రామకృష్ణ లాంటి రచయితలు కాదన్న అనువాద చిత్రాలన్నీ ఆయన దగ్గరకు వచ్చేవి. మరోవైపు రాము తీసిన సినిమాలన్నింటికీ తెలుగు అనువాదాలు రాసేవాడు. పేరుకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌నే అయినా ప్రొడక్షన్‌ మేనేజర్‌లా ఉండేది ఆయన పని.దీంతో ఒకరోజు రామూకి చెప్పాపెట్టకుండా సామాను సర్దుకుని హైదరాబాదు‌కి వచ్చేశాడు. ఇక్కడ పూరి జగన్నాథ్‌ పరిచయమయ్యాడు. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, ఆంధ్రావాలాకు పనిచేశాడు. అప్పుడే శ్రీనువైట్ల తోనూ వినాయక్ తోనూ పరిచయమైంది. వరసగా వెంకీ, సాంబ, అందరివాడు, బాలు, ఢీ, రెడీ, హోమం, చింతకాయల రవి, అదుర్స్ సినిమాలు చేశాడు. సినిమా రచయితగా పనిచేస్తోన్న వెంకట్ అమెరికా వెళ్ళినప్పుడు ఒక ఫీచర్ ఫిలిం తయారుచేశారు. త్వరలో యూట్యూబులో దాన్ని విడుదల చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఆయన భార్య సునీల. వాళ్ళది ప్రేమ వివాహం. హైదరాబాదు‌లో బీకాం చేసేటప్పుడు ఆయన క్లాస్‌మేట్‌. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలకు చెప్తే ఒప్పుకొంటారో లేదోనన్న భయంతో ఆర్యసమాజంలో పెళ్ళి చేసేసుకున్నారు. ఆయన మామ ఆయన మీద కిడ్నాప్‌కేసు పెట్టారు. అప్పటి కమిషనర్‌కువెంకట్ తాతయ్య బాగా తెలుసు. దాంతో ఆయన వాళ్ళ మామగారిని పిలిపించి 'వాళ్లిద్దరూ మేజర్లు, పైగా మంచి కుటుంబం' అని నచ్చజెప్తే వూరుకున్నారు. పెళ్ళినాటికి ఆయన వయసు పంతొమ్మిదేళ్లు. ప్రస్తుతం వాళ్ళకిద్దరు అమ్మాయిలు. కావ్య, శ్రావ్య. పెద్దమ్మాయి అమెరికాలో ఇంజినీరింగ్‌ చేస్తోంది. చిన్నమ్మాయి హైదరాబాదు లో మాస్‌కమ్యూనికేషన్స్‌ డిగ్రీ చేస్తోంది. వ్యక్తిగతంగా తాను క్లీన్ హ్యూమర్ నే ఇష్టపడతాననీ, అదే వృత్తిలో కూడా ప్రతిఫలిస్తుందని వెంకట్ పేర్కొంటారు. ఈ అంశంపై మాట్లాడుతూ నేను మితిమీరిన ద్వందార్థాలు, వెగటు హాస్యం రాయను. నాకు ఇద్దరు కూతుళ్ళున్నారు. వాళ్ళతో కలిసి నా సినిమా చూసి నేనే ఇబ్బంది పడే స్థితి తెచ్చుకోకూడదు కదా. మాస్ పేరును అడ్డం పెట్టుకుని గీతలు దాటి రాసే ప్రయత్నం చేయనని పేర్కొన్నారు. వివిధ అంశాల పట్ల కోన వెంకట్ వ్యక్తంచేసిన అభిప్రాయాలు ఇవి: కామెడీ డైలాగులు రాయదానికి కారెక్టరైజేషన్ మూలం. అదొక ట్రాన్స్ ఫార్మర్ లాంటిది. ఎన్ని బల్బులైనా వేసుకోవచ్చు. ఏ డైలాగ్ రాసినా పైనుంచి ఊడిపడదు. సినిమాలో వచ్చేవన్నీ ఇదివరకు ఎక్కడో ఎవరో ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకున్నవే! అవి తెరమీద కనిపించేసరికి ప్రాచుర్యం పొందుతాయి. *తెలుగు చిత్రాలు* జిన్నా (2022) సౌఖ్యం (2015)[2] బాద్‍షా (2013) అదుర్స్ (2010) ఢీ రెడీ బాలు. *ప్రఖ్యాత డైలాగులు* రావు గారూ..! నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ - ఢీ సినిమాలో చారి పాత్ర (నటించినవారు కన్నెగంటి బ్రహ్మానందం) అ-అడిగాను, ఇ-ఇవ్వనన్నావు, ఉ-ఊరుకుంటానా? - సాంబలో కారెక్టర్ పాత్ర ఆస్తిని లాక్కునే సన్నివేశంలో విలన్ పాత్రధారి ప్రకాష్ రాజ్ ఒరే, మనకు జేబులు ఎడమవైపే ఎందుకు పెడతారో తెలుసా? మనం చెయ్యి పెట్టుకున్నప్పుడు ఎడమ వైపున్న గుండె మనకు ధైర్యం చెబుతుంది - భగీరథ సినిమాలో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న సందర్భంలో హీరో రవితేజ పాత్ర ద్వారా ప్రేమ అనేది బస్ జర్నీ లాంటిది. ఎప్పుడైనా దిగి వేరే బస్ ఎక్కొచ్చు. కాని పెళ్ళి ఫ్లైట్ జర్నీ లాంటిది. ఒక్కసారి ఎక్కితే మధ్యలో దిగడానికి కుదరదు - బాడీగార్డ్ సినిమాలో. *మాధవి కాళ్ల* *సేకరణ*
😇My Status - ShareChat
#😇My Status *మైఖేలాంజెలో(ఇటలీకి చెందిన చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు)* మైఖేలాంజెలో డి లోడోవికో బుయోనరోటి సిమోని (6 మార్చి 1475 – 18 ఫిబ్రవరి 1564), మైఖేలాంజెలో అని ఏకనామంగా పిలుస్తారు , ఒక ఇటాలియన్ శిల్పి, చిత్రకారుడు, వాస్తుశిల్పి, మరియు ఉన్నత పునరుజ్జీవనోద్యమ కవి. అతను రిపబ్లిక్ ఆఫ్ ఫ్లోరెన్స్‌లో జన్మించాడు కానీ తన 30ల నుండి ఎక్కువగా రోమ్‌లో చురుకుగా ఉన్నాడు. అతని పని శాస్త్రీయ పురాతన కాలం నాటి నమూనాల నుండి ప్రేరణ పొందింది మరియు పాశ్చాత్య కళపై శాశ్వత ప్రభావాన్ని చూపింది . మైఖేలాంజెలో యొక్క సృజనాత్మక సామర్థ్యాలు మరియు వివిధ కళాత్మక రంగాలలో అతని నైపుణ్యం అతని ప్రత్యర్థి మరియు సీనియర్ సమకాలీనుడు లియోనార్డో డా విన్సీతో పాటు ఒక ఆదర్శవంతమైన పునరుజ్జీవనోద్యమ వ్యక్తిగా నిర్వచించబడ్డాయి. మనుగడలో ఉన్న ఉత్తరప్రత్యుత్తరాలు, స్కెచ్‌లు మరియు జ్ఞాపకాల యొక్క అపారమైన పరిమాణాన్ని బట్టి, మైఖేలాంజెలో 16వ శతాబ్దపు ఉత్తమంగా నమోదు చేయబడిన కళాకారులలో ఒకడు. సమకాలీన జీవిత చరిత్ర రచయితలు అతని యుగంలో అత్యంత నిష్ణాతుడైన కళాకారుడిగా ఆయనను ప్రశంసించారు. మైఖేలాంజెలో ముందుగానే కీర్తిని పొందాడు. అతని అత్యంత ప్రసిద్ధ రచనలలో రెండు, పియేటా మరియు డేవిడ్ , 30 ఏళ్ళకు ముందే చెక్కబడ్డాయి. అతను తనను తాను చిత్రకారుడిగా భావించకపోయినా, మైఖేలాంజెలో పాశ్చాత్య కళా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రెండు ఫ్రెస్కోలను సృష్టించాడు: రోమ్‌లోని సిస్టీన్ చాపెల్ పైకప్పుపై జెనెసిస్ నుండి దృశ్యాలు , మరియు దాని ఆల్టర్ గోడపై ది లాస్ట్ జడ్జిమెంట్ . లారెన్షియన్ లైబ్రరీ యొక్క అతని రూపకల్పన మానెరిస్ట్ ఆర్కిటెక్చర్‌కు మార్గదర్శకంగా నిలిచింది. 71 సంవత్సరాల వయస్సులో, అతను ఆంటోనియో డా సంగల్లో ది యంగర్ స్థానంలో సెయింట్ పీటర్స్ బసిలికా వాస్తుశిల్పిగా నియమితుడయ్యాడు . మైఖేలాంజెలో ప్రణాళికను మార్చాడు, తద్వారా అతని మరణం తర్వాత, పశ్చిమ చివరను, గోపురంను కూడా కొంత మార్పులతో అతని డిజైన్‌కు పూర్తి చేశాడు. మైఖేలాంజెలో జీవించి ఉన్నప్పుడు జీవిత చరిత్ర ప్రచురించబడిన మొదటి పాశ్చాత్య కళాకారుడు. అతని జీవితకాలంలో మూడు జీవిత చరిత్రలు ప్రచురించబడ్డాయి. వాటిలో ఒకటి, జార్జియో వాసరి రాసినది , మైఖేలాంజెలో రచన జీవించి ఉన్న లేదా చనిపోయిన ఏ కళాకారుడి రచనను అధిగమించిందని మరియు "ఒక్క కళలోనే కాదు, మూడింటిలోనూ అత్యున్నతమైనది" అని ప్రతిపాదించింది. తన జీవితకాలంలో, మైఖేలాంజెలోను తరచుగా ఇల్ డివినో ("దైవికమైనది") అని పిలిచేవారు. అతని సమకాలీనులు అతని టెరిబిలిటాను - అతని కళను చూసేవారిలో విస్మయాన్ని కలిగించే సామర్థ్యాన్ని - మెచ్చుకున్నారు. మైఖేలాంజెలో శైలి యొక్క వ్యక్తీకరణ భౌతికతను అనుకరించడానికి తదుపరి కళాకారుల ప్రయత్నాలు హై పునరుజ్జీవనం మరియు బరోక్ మధ్య పాశ్చాత్య కళలో స్వల్పకాలిక ఉద్యమం అయిన మానెరిజం పెరుగుదలకు దోహదపడ్డాయి. కాప్రీస్‌లో జన్మించాడు , ఈ రోజు కాప్రీస్ మైఖేలాంజెలో అని పిలుస్తారు, ఇది టస్కానీలోని అరెజ్జో సమీపంలోని వాల్టిబెరినాలో ఉన్న ఒక చిన్న పట్టణం. అనేక తరాలుగా , అతని కుటుంబం ఫ్లోరెన్స్‌లో చిన్న తరహా బ్యాంకర్లుగా ఉండేది ; కానీ బ్యాంకు విఫలమైంది, మరియు అతని తండ్రి లుడోవికో కొంతకాలం కాప్రీస్‌లో ప్రభుత్వ పదవిని చేపట్టారు. మైఖేలాంజెలో జన్మించిన సమయంలో, అతని తండ్రి చియుసి డెల్లా వెర్నా యొక్క పట్టణం యొక్క న్యాయ నిర్వాహకుడు మరియు పోడెస్టా (స్థానిక నిర్వాహకుడు) . మైఖేలాంజెలో తల్లి ఫ్రాన్సిస్కా డి నెరి డెల్ మినియాటో డి సియెనా. బుయోనారోటిస్ కౌంటెస్ మాటిల్డే డి కనోస్సా నుండి వచ్చినట్లు పేర్కొన్నారు - ఇది నిరూపించబడలేదు, కానీ మైఖేలాంజెలో నమ్మాడు. మైఖేలాంజెలో జన్మించిన చాలా నెలల తర్వాత, కుటుంబం ఫ్లోరెన్స్‌కు తిరిగి వచ్చింది, అక్కడే అతను పెరిగాడు. అతని తల్లి దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మరియు 1481లో ఆమె మరణించిన తర్వాత (అతనికి ఆరు సంవత్సరాల వయసులో), మైఖేలాంజెలో సెట్టిగ్నానో పట్టణంలో ఒక నానీ మరియు ఆమె భర్త, రాతి కొట్టే వ్యక్తితో నివసించాడు , అక్కడ అతని తండ్రికి పాలరాయి క్వారీ మరియు ఒక చిన్న పొలం ఉంది. అక్కడ ఆ చిన్న పిల్లవాడు పాలరాయితో పనిచేయడం పట్ల తన ప్రేమను పొందాడు. అతని జీవిత చరిత్ర రచయిత జార్జియో వాసరి అతనిని ఉటంకించినట్లుగా: నాలో ఏదైనా మంచి ఉందంటే, దానికి కారణం నేను మీ అరెజ్జో దేశంలోని సూక్ష్మ వాతావరణంలో జన్మించడం. నా నర్సు పాలు తాగడంతో పాటు, ఉలి మరియు సుత్తిని ఉపయోగించగల నైపుణ్యాన్ని నేను పొందాను, దానితో నేను నా బొమ్మలను తయారు చేస్తాను. మైఖేలాంజెలో ఒక భక్తుడైన కాథలిక్, అతని జీవిత చరమాంకంలో అతని విశ్వాసం మరింతగా పెరిగింది. రాఫెల్‌తో పాటు, అతను సెక్యులర్ ఫ్రాన్సిస్కాన్ ఆర్డర్‌లో చేరాడు. అతని కవిత్వంలో 285వ కవిత నుండి ఈ క్రింది ముగింపు పంక్తులు ఉన్నాయి: "చిత్రలేఖనం లేదా శిల్పం ఇకపై నా ఆత్మను శాంతింపజేయలేవు, ఇప్పుడు మనల్ని లోపలికి తీసుకెళ్లడానికి సిలువపై తన చేతులను తెరిచిన ఆ దైవిక ప్రేమ వైపు తిరిగింది." మైఖేలాంజెలో తన వ్యక్తిగత జీవితంలో మితంగా ఉండేవాడు, మరియు ఒకసారి తన శిష్యుడు అస్కానియో కొండివితో ఇలా అన్నాడు : "నేను ఎంత ధనవంతుడిని అయినా, నేను ఎప్పుడూ పేదవాడిలా జీవించాను." మైఖేలాంజెలో బ్యాంకు ఖాతాలు మరియు అనేక కొనుగోలు పత్రాలు అతని నికర విలువ దాదాపు 50,000 బంగారు డక్యాట్‌లు అని చూపిస్తున్నాయి , ఇది అతని కాలంలోని అనేక మంది యువరాజులు మరియు డ్యూక్‌ల కంటే ఎక్కువ. కొండివి అతను ఆహారం మరియు పానీయాల పట్ల ఉదాసీనంగా ఉండేవాడని, "ఆనందం కంటే అవసరం కోసం ఎక్కువగా తినేవాడని" మరియు అతను "తరచుగా తన బట్టలు మరియు ... బూట్లలో నిద్రపోయేవాడని" చెప్పాడు. అతని జీవిత చరిత్ర రచయిత పాలో జియోవియో ఇలా అంటాడు, "అతని స్వభావం చాలా కఠినంగా మరియు అసభ్యంగా ఉండేది, అతని గృహ అలవాట్లు చాలా మురికిగా ఉండేవి మరియు అతనిని అనుసరించే విద్యార్థులను సంతానానికి దూరం చేశాయి." అయితే, ఇది అతనిని ప్రభావితం చేసి ఉండకపోవచ్చు, ఎందుకంటే అతను స్వభావరీత్యా ఒంటరి మరియు విచారకరమైన వ్యక్తి, బిజ్జార్రో ఇ ఫెంటాస్టికో , "పురుషుల సహవాసం నుండి తనను తాను ఉపసంహరించుకునేవాడు." ది మడోన్నా ఆఫ్ ది స్టెయిర్స్ అనేది మైఖేలాంజెలో పాలరాయితో చేసిన తొలి రచన. దీనిని నిస్సారమైన రిలీఫ్‌లో చెక్కారు, ఈ టెక్నిక్‌ను 15వ శతాబ్దం ప్రారంభంలో మాస్టర్-శిల్పి అయిన డోనాటెల్లో మరియు డెసిడెరియో డా సెట్టిగ్నానో వంటి వారు తరచుగా ఉపయోగించారు. మడోన్నా ప్రొఫైల్‌లో ఉన్నప్పుడు, నిస్సారమైన రిలీఫ్‌కు సులభమైన అంశం, బాలుడు మెలితిప్పిన కదలికను ప్రదర్శిస్తాడు, ఇది మైఖేలాంజెలో పనిలో లక్షణంగా మారింది. 1502 నాటి టాడ్డీ టోండో , శిలువ వేయడానికి చిహ్నంగా ఉన్న బుల్‌ఫించ్ ద్వారా భయపెట్టబడిన క్రీస్తు బిడ్డను చూపిస్తుంది . పిల్లల ఉల్లాసమైన రూపాన్ని తరువాత రాఫెల్ బ్రిడ్జ్‌వాటర్ మడోన్నాలో స్వీకరించాడు . బ్రూగెస్ మడోన్నా , దాని సృష్టి సమయంలో, వర్జిన్ తన కొడుకును గర్వంగా ప్రదర్శిస్తున్నట్లు చిత్రీకరించే ఇతర విగ్రహాల మాదిరిగా కాకుండా ఉంది. ఇక్కడ, తన తల్లి పట్టుకునే చేతితో నిగ్రహించబడిన క్రీస్తు బిడ్డ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాడు. పవిత్ర కుటుంబాన్ని వర్ణించే డోని టోండో , మునుపటి మూడు రచనల అంశాలను కలిగి ఉంది: నేపథ్యంలో ఉన్న బొమ్మల ఫ్రైజ్ తక్కువ-ఉపశమనం యొక్క రూపాన్ని కలిగి ఉంటుంది, అయితే వృత్తాకార ఆకారం మరియు డైనమిక్ రూపాలు టాడియో టోండోను ప్రతిధ్వనిస్తాయి. బ్రూగెస్ మడోన్నాలో ఉన్న మెలితిప్పిన కదలిక పెయింటింగ్‌లో ఉద్ఘాటించబడింది. సిస్టీన్ చాపెల్ పైకప్పుపై మైఖేలాంజెలో ఉపయోగించాల్సిన రూపాలు, కదలిక మరియు రంగును ఈ పెయింటింగ్ తెలియజేస్తుంది. లియోనార్డో డా విన్సీ మరియు రాఫెల్‌తో కలిసి మైఖేలాంజెలో, ఫ్లోరెంటైన్ హై పునరుజ్జీవనోద్యమానికి చెందిన ముగ్గురు దిగ్గజాలలో ఒకరు . వారి పేర్లు తరచుగా కలిసి ప్రస్తావించబడినప్పటికీ, మైఖేలాంజెలో లియోనార్డో కంటే 23 సంవత్సరాలు చిన్నవాడు మరియు రాఫెల్ కంటే ఎనిమిది సంవత్సరాలు పెద్దవాడు. అతని ఒంటరి స్వభావం కారణంగా, అతను ఏ కళాకారుడితోనూ పెద్దగా సంబంధం కలిగి లేడు మరియు వారిద్దరినీ 40 సంవత్సరాలకు పైగా జీవించాడు. మైఖేలాంజెలో కొద్దిమంది శిల్ప విద్యార్థులను తీసుకున్నాడు. అతను మెడిసి అకాడమీలో తన తోటి విద్యార్థి అయిన గ్రానాచీని నియమించుకున్నాడు మరియు సిస్టీన్ చాపెల్ పైకప్పుపై అనేక మంది సహాయకులలో ఒకడు అయ్యాడు. మైఖేలాంజెలో ప్రధానంగా ఉపరితలాలను సిద్ధం చేయడం మరియు రంగులను గ్రైండింగ్ చేయడం వంటి మరింత మాన్యువల్ పనుల కోసం సహాయకులను ఉపయోగించినట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ, అతని రచనలు రాబోయే అనేక తరాల వరకు చిత్రకారులు, శిల్పులు మరియు వాస్తుశిల్పులపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. *జనాదరణ పొందిన సంస్కృతిలో...* వీటా డి మైఖేలాంజెలో (1964) ది అగోనీ అండ్ ది ఎక్స్టసీ (1965), కరోల్ రీడ్ దర్శకత్వం వహించారుమరియు చార్ల్టన్ హెస్టన్ మైఖేలాంజెలోగా నటించారు. జెయింట్స్ సీజన్ (1990) మైఖేలాంజెలో - ఎండ్లెస్ (2018), ఎన్రికో లో వెర్సో మైఖేలాంజెలోగా నటించారు. సిన్ (2019), ఆండ్రీ కొంచలోవ్స్కీ దర్శకత్వం వహించారు. *మాధవి కాళ్ల* *సేకరణ*
😇My Status - ShareChat
#😇My Status
😇My Status - శుభోదయం బుతువులు మాఠినపుడుశరీఠాన్ని పరిస్థితులు మాఠినప్పుడు మనస్సుని దృఢపరచుకోవాలి:. అప్పుడే జీవితాన్నిసజావుగా కొనసాగించగలం శుభోదయం బుతువులు మాఠినపుడుశరీఠాన్ని పరిస్థితులు మాఠినప్పుడు మనస్సుని దృఢపరచుకోవాలి:. అప్పుడే జీవితాన్నిసజావుగా కొనసాగించగలం - ShareChat
#😇My Status *ఆశావాది ప్రకాశరావు(బహుగ్రంథరచయిత, అవధాని, కవి. పద్మశ్రీ పురస్కార గ్రహీత)* డాక్టర్ ఆశావాది ప్రకాశరావు (1944 ఆగష్టు 2 - 2022 ఫిబ్రవరి 17) సాహితీ ప్రపంచంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుగ్రంథరచయితగా, అవధానిగా, కవిగా పేరు గడించాడు. 2021లో పద్మశ్రీ పురస్కారం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం కళారత్న బిరుదుతో సత్కరించింది. తారణ నామ సంవత్సరం, శ్రావణమాసం, త్రయోదశి, బుధవారం 1944వ సంవత్సరం ఆగష్టు 2 వ తేదీ ఆశావాది ప్రకాశరావు కుళ్ళాయమ్మ, పక్కీరప్ప దంపతులకు కొరివిపల్లి గ్రామంలో మాతామహుల ఇంటిలో జన్మించాడు. ఇతని అసలు పేరు ఆసాది ప్రకాశం. ఇతని గురువు నండూరి రామకృష్ణమాచార్య ఇతని పేరును ఆశావాది ప్రకాశరావుగా మార్చాడు.[2] దళిత కుటుంబంలో జన్మించిన ఇతని బాల్యం బెళుగుప్ప, శీరిపి గ్రామాలలో గడిచింది. ఆ గ్రామాలలోని సోషియల్ వెల్ఫేర్ స్కూళ్లలో ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అనంతపురం పట్టణంలోని పొట్టి శ్రీరాములు మునిసిపల్ బాయ్స్ స్కూలులోనూ, రాజేంద్ర మునిసిపల్ హైస్కూలులోను 1953-1959 మధ్య చదివాడు. అనంతపురం గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో 1960-61ల మధ్య పి.యు.సి. చదివాడు. అదే కాలేజీలో 1962-65లో బి.ఏ. స్పెషల్ తెలుగు చదివాడు. తరువాత ఎ.పి.పి.ఎస్.సి.గ్రూప్-4 పరీక్షనెగ్గి లోయర్ డివిజినల్ క్లర్క్‌గా ఏలూరులో కొద్దిరోజులు పనిచేశాడు. తన ప్రగతికి అవరోధంగా భావించి ఆ ఉద్యోగం వదిలి వెంకటాద్రిపల్లె, వై.రాంపురం,కణేకల్, కుర్లి జిల్లాపరిషత్ పాఠశాలలో తెలుగుపండితుడిగా 1965-68ల మధ్య పనిచేశాడు. అనంతపురం పి.జి.సెంటర్(శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతికి అనుబంధం) నుండి తెలుగు భాషాసాహిత్యాలలో ఎం.ఏ. 1968-70ల మధ్య చదివాడు. 1970 నుండి రాయదుర్గం గవర్నమెంటు జూనియర్ కాలేజీలోను,అనంతపురం, గుంతకల్లు, నగరి, పుంగనూరు,పెనుకొండలలోని గవర్నమెంట్ డిగ్రీకాలేజీలలో ఆంధ్రోపన్యాసకునిగా పనిచేశాడు. పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేసి 2002లో పదవీవిరమణ చేశాడు. ప్రస్తుతం పెనుకొండలో నివసిస్తున్నాడు. 17-02-2022 (గురువారం) వ తేదీన తన స్వగృహం (పెనుకొండ) లో గుండెపోటుతో కన్నుమూశారు. అవధాన విద్యలో డాక్టర్.సి.వి.సుబ్బన్న శతావధానిని గురువుగా స్వీకరించి అతని ఆశీస్సులతో ఆశుకవిత అలవరచుకున్నాడు. 1963లో తన 19వయేట మొదటి అవధానం చేశాడు. అప్పటి నుండి ఆంధ్రసాహితీ చరిత్రలో దళితులలో ఏకైక అవధానిగా ముద్రవేసికొని అసాధారణ ధారణాశక్తితో, అనిర్వచనీయమైన మహేంద్రజాలశక్తితో శ్రోతలను మంత్రముగ్ధులను చేశాడు. ఇతడు ఆంధ్రదేశంలోనే కాకుండా ఆంధ్రేతర ప్రాంతాలైన తరుత్తణి, అరక్కోణం, పళ్ళిపట్టు, హోసూరు,బెంగళూరు, బళ్లారి, తుంగభద్రడ్యామ్‌, దోణిమలై, ఢిల్లీ మొదలైన పలుప్రాంతాలలో 171 అష్టావధానాలు, ఒక ద్విగుణిత అష్టావధానం చేశాడు. ఇతని అవధానాలు దూరదర్శన్, ఆకాశవాణిలలో కూడా ప్రసారం అయ్యాయి. కొన్ని ఆశుకవితా ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. 1978-1983 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ హైదరాబాదు - కార్యవర్గసభ్యుడు. 1996-2002 శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం - పాలకమండలి సభ్యుడు. తిరుమల తిరుపతి దేవస్థానం - గ్రంథనిపుణుల మండలి సభ్యుడు - రెండుసార్లు రాయల కళా గోష్ఠి అనంతపురం - వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి - రెండు దశాబ్దాలు ఆథర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా - న్యూఢిల్లీ - సభ్యుడు ఆంధ్ర పద్య కవితాసదస్సు -అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాలు - రాయలసీమ ప్రాంత కార్యదర్శిగా ఆరు సంవత్సరాలు - రాష్ట్ర అధ్యక్షుడిగా రెండేండ్లు. ఆం.ప్ర.సామాజిక సమరసతావేదిక - రాష్ట్ర అధ్యక్షుడు -2007 నుండి. రాయలసీమ రచయిత్రీరచయితల మహాసభ - సాహిత్యవిభాగ కార్యదర్శి - మూడు సంవత్సరాలు దోమా వేంకటస్వామిగుప్త సాహిత్యపీఠము, కడప - పద్యశిక్షణాతరగతుల నిర్వహణ - ఒక పర్యాయము సి.వి.సుబ్బన్న శతావధాని కళాపీఠము, ప్రొద్దుటూరు - కార్యదర్శి - రెండు సంవత్సరాలు ఘనగిరి సాంస్కృతిక మండలి,పెనుకొండ - కార్యదర్శి - ఒక దశాబ్దము ఆం.ప్ర.సాంస్కృతిక శాఖ, హైదరాబాదు - పద్యశిక్షణాతరగతుల నిర్వహణ - ఒక పర్యాయము సాహితీ గగన్‌మహల్, పెనుకొండ - సలహామండలి సభ్యుడు కలుగోట్ల విజయాత్రేయ సాహితీ రజతోత్సవ సంఘం, కర్నూలు - సభ్యుడు ఆం.ప్ర.సాహితీ సాంస్కృతిక సంస్థల సమాఖ్య, మచిలీపట్నం - సభ్యుడు జిల్లా సాంస్కృతికమండలి, అనంతపురం - కార్యవర్గ సభ్యుడు - ఐదు సంవత్సరాలు అభ్యుదయ రచయితల సంఘం, అనంతపురం జిల్లా - సహకార్యదర్శి - ఒక సంవత్సరం అనంతపురం జిల్లా రచయితల సంఘం - కార్యవర్గ సభ్యుడు - నాలుగు సంవత్సరాలు మహాకవి గుఱ్ఱం జాషువా శతజయంతి కమిటీ, అనంతపురం - ఉపాధ్యక్షుడు - రెండు సంవత్సరాలు అనంతసాహితి, గుత్తి - వ్యవస్థాపకుడు, సలహాసంఘ సభ్యుడు భువనవిజయ శారదాపీఠము, గుంతకల్లు - వ్యవస్థాపక అధ్యక్షుడు పాంచజన్య ప్రజ్ఞాసదస్సు,పెనుకొండ - వ్యవస్థాపక హితవరి శ్రీ కళామంజరి, షాద్‌నగర్ - ప్రధాన సలహాదారు - 1995 నుండి శ్రీశైలజ్యోతి (మాసపత్రిక), అనంతపురం - సహాయ సంపాదకుడు - రెండు సంవత్సరాలు తెలుగు విశ్వవిద్యాలయం - అవార్డు కమిటీ సలహాసభ్యుడు - నాలుగు పర్యాయాలు రాష్ట్రస్థాయి పద్యనాటక పోటీలు (లలితకళాపరిషత్, అనంతపురం) - న్యాయనిర్ణేతల సంఘం సభ్యుడు - ఒక పర్యాయం వేకువ (సాహితీ సాంస్కృతిక సాంఘిక సేవా సంస్థ),పెనుకొండ - సలహాసంఘసభ్యుడు -2009 నుండి. అంతర్జాతీయ బాలల ఉద్యమసంస్థ న్యూఢిల్లీ - సభ్యుడు - రెండు సంవత్సరాలు అధికార భాషా సమీక్షాసంఘం - జిల్లాస్థాయి సభ్యుడు - మూడు సంవత్సరాలు తెలుగు భాషా వికాస ఉద్యమం - సలహాసంఘ సభ్యుడు - రెండు సంవత్సరాలు. పుష్పాంజలి : 1968లో వెలువడిన ఈ పుస్తకంలో డాక్టర్.సి.వి.సుబ్బన్న శతావధాని వెంట అవధాన సభలకు వెళ్ళినప్పుడు తన గురువు కవితావైభవాన్ని గురించి ఆశావాది ప్రకాశరావు ఆశువుగా చెప్పిన పద్యాలు ఉన్నాయి. వరదరాజశతకము : సమాజంలోని అసమానతలపై ఎక్కుపెట్టిన బాణం. వనాధిజా మనోజ! వరదరాజ అనే మకుటంతో 108 పద్యాలున్నాయి. 1969లో ప్రకటితం. నిర్యోష్ఠ్య కృష్ణశతకము : రాప్తాటి ఓబిరెడ్డి వ్రాసిన ఈ శతకానికి ఆశావాది ప్రకాశరావు లఘుటీక వ్రాశాడు. 1972లో వెలువడింది. విద్యాభూషణ : తన అభివృద్ధికి కారణమైన భోగిశెట్టి జూగప్ప,ఐ.ఏ.ఎస్.(రిటైర్డ్) జీవితచరిత్ర ఇది. రాయలకళాగోష్ఠి అనంతపురం తరఫున 1973లో ప్రకటించాడు. మెరుపు తీగలు : పద్యఖండికల సంపుటి. అవ్వారి సాహిత్యపరిషత్, బుక్కరాయసముద్రం పక్షాన 1976లో వెలువడింది. గురువుగారైన నండూరి రామకృష్ణమాచార్యకి అంకితమివ్వబడిన ఈ గ్రంథంలో తన జీవితంలో తారసిల్లిన విద్వాంసులపై కవితలున్నాయి. ఆర్కెస్ట్రా : ఇది ఇతని సంపాదకత్వంలో వెలువడిన వచనకవితాసంకలనము. 1979 రాయలకళాగోష్ఠి ప్రచురణ. చెళ్లపిళ్లరాయ చరిత్రము : తాళ్లపాక అన్నమయ్య వ్రాసిన యక్షగానం ఇది. దీనిలోని ఇతివృత్తం బీబీ నాంచారి కళ్యాణగాథ. అముద్రితంగా తాళపత్రాలలో ఉన్న ఈ గ్రంథాన్ని ఆశావాది ప్రకాశరావు వెలికి తీసి పరిష్కరించి భువనవిజయ శారదాపీఠం(గుంతకల్లు) పక్షాన 1982లో ప్రచురించాడు. దీనికి విపులమైన పీఠిక వ్రాశాడు. కవికాలాదులను నిర్ణయించాడు. శ్రీ రాప్తాటి పరిచయ పారిజాతము : అజ్ఞాతంగా ఉన్న అద్భుతమైన కవి రాప్తాటి ఓబిరెడ్డి జీవిత సాహిత్యాలను వివరించే లఘు గ్రంథం. 1986లో అచ్చయ్యింది. సహాయాచారి సాహితీ సాహచర్యము : నడితోక మృత్యుంజయ సహాయాచారి వ్రాసిన సాయిలీలా గుచ్ఛము అనే గ్రంథంలో ఆశావాది ప్రకాశరావు వ్రాసిన ఈ వ్యాసం 1986లో చిన్న పుస్తకంగా వెలువడింది. పోతన భాగవతము -తృతీయ స్కంధము : తిరుమల తిరుపతి దేవస్థానము వారి పోతన భాగవతం ప్రాజెక్టులో భాగంగా భాగవతం తృతీయ స్కంధానికి సరళగద్యానువాదంగా వ్రాసిన ఈ గ్రంథం 1986 నుండి అనేక ముద్రణలు పొందింది. అంతరంగ తరంగాలు : ఈ వచనకవితా సంకలనంలో 52 ఖండికలున్నాయి. 1988లో నవ్యసాహితీ సమితి ప్రొద్దుటూరు ఈ పుస్తకాన్ని ప్రచురించింది. దీనిలోని కవితలు కొన్ని హిందీలోనికి అనువదించ బడ్డాయి. ప్రహ్లాద చరిత్ర - ఎఱ్ఱన పోతన తులనాత్మక పరిశీలన : ఒంగోలులోని ఎఱ్ఱన పీఠం నిర్వహించిన సిద్ధాంతగ్రంథాల పోటీలో బహుమతి పొంది 1989లో అదే సంస్థ చేత ప్రచురింపబడింది. డాక్టర్ జి.చెన్నయ్య సహరచయిత. జ్యోతిస్సుప్రభాతము : కె.మునిరెడ్డి సంస్కృతంలో రచించిన శ్లోకాలకు ఆశావాది ప్రకాశరావు చేసిన ఆంధ్రవచనానువాదం. 1989లో బ్రహ్మజ్ఞాన జ్యోతి ఆశ్రమం, తిరుత్తణి ప్రకటించింది. హనుమత్ స్తోత్రమంజరి : ఆశావాది ప్రకాశరావు సంకలనం చేసిన ఈ గ్రంథాన్ని 1989లో దోర్నాదుల చిన్నవరదరాజు ప్రచురించాడు. సుబ్రహ్మణ్య స్తోత్రకదంబము : ఆశావాది ప్రకాశరావు సంకలనం చేసిన ఈ గ్రంథాన్ని 1990లో దోర్నాదుల చిన్నవరదరాజు ప్రచురించాడు. లోకలీలాసూక్తము : భువనవిజయ శారదాపీఠం (గుంతకల్లు) ప్రచురించింది. 1990లో వెలువడింది. దీవనసేసలు: నూతన వధూవరులకు ఆశీర్వాద సందేశరూపమైన ఆశావాది కవితలు (55పద్యాలు + 2 వచన కవితఖండికలు) ఈ పుస్తకంలో ఉన్నాయి. 1992లో ప్రకటింపబడింది. అవధాన చాటువులు : ఆంధ్రపద్యకవితాసదస్సు అనంతపురం శాఖ ప్రచురించిన ఈ పుస్తకంలో కడప చిత్తూరు జిల్లాలలో చేసిన 24 అవధానాల విశేషాలు ఉన్నాయి. దీనిలో మొత్తం 153 పద్యాలు ఉన్నాయి. 1993లో అచ్చయ్యింది. రామకథా కలశం : 35 పద్యాలున్న ఆశు లఘుకావ్యం. దోర్నాదుల చిన్నవరదరాజు షష్టిపూర్తి సందర్భంగా ఆశావాది చెప్పినవి ఈ పద్యాలు. 1993లో ప్రకటింపబడింది. అవధాన దీపిక : అనంతకళాపీఠం పక్షాన 1998లో ప్రచురింపబడింది. అనంతపురం పట్టణంలో చేసిన 21 అవధానాల సంపుటి ఇది. తన తల్లిదండ్రులు కుళ్ళాయమ్మ, టీచర్ పక్కీరప్పలకు ఈ పుస్తకం అంకితమిచ్చాడు. కళ్యాణవాణి - శాంతి నారాయణ(సంకలనకర్త) ఆశావాది ప్రకాశరావు సాహిత్యము - అనుశీలన - మంకాల రామచంద్రుడు -పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథం అక్షరకిరీటి ఆశావాది - పి.రామసుబ్బారెడ్డి (సంకలనకర్త) అవధానాచార్య ఆశావాది - మాడభూషి అనంతాచార్యులు ఆశావాది కవితాంతరంగం - యన్.శాంతమ్మ ఆశావాది రచనాదృక్పథం - యన్.శాంతమ్మ ఆశావాది గ్రంథావలోకనం - ఆర్.రంగస్వామిగౌడ్ (సంకలనకర్త) ఆశావాది అంతరంగతరంగాలు - ఒక పరిశీలన - యన్.హేమావతి (ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాసం) హిరణ్మయి - ఆశావాది సాహితీస్వర్ణోత్సవాల విశేష సంచిక కమల పురస్కృతుడు ఆశావాది - పద్మశ్రీ పురస్కారం లభించిన సందర్భంగా వెలువరించిన అభినందన సంచిక. టి.శ్రీరంగస్వామి (సంకలనకర్త). భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం - గౌరవ డాక్టరేట్ (డి.లిట్)ప్రదానం లోకనాయక్ పౌండేషన్, విశాఖపట్నం - అవధాన శిరోమణి పురస్కారం ఆరాధన సాంస్కృతిక సంస్థ హైదరాబాదు - జీవన సాఫల్య పురస్కారం భారతీ సాహితీసమితి, గుంతకల్లు - కందుకూరి వీరేశలింగం శతజయంతి పురస్కారం ఆంధ్ర సంఘం,హోసూరు - శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకోత్సవ పురస్కారం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం - కార్యమపూడి రాజమన్నారు ధర్మనిధి పురస్కారం శ్రీ దోమా వేంకటస్వామిగుప్త సాహిత్యపీఠం, కడప - శతావధాని పురస్కారం ఉన్నత విద్యాశాఖ, ఆం.ప్ర.ప్రభుత్వం - ఉత్తమ అధ్యాపక పురస్కారం టి.సుబ్బరామిరెడ్డి ఫౌండేషన్, విజయవాడ - కళాబంధు పురస్కారం. ఇతనిని ఎందరో ప్రముఖులు సన్మానించారు. వారిలో బాబూ జగ్జీవన్ రాం, బెజవాడ గోపాలరెడ్డి,కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్.టి.రామారావు, నారా చంద్రబాబునాయుడు, కొణిజేటి రోశయ్య, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, మండలి బుద్ధప్రసాద్,పి.వి.ఆర్.కె ప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, గొల్లపూడి మారుతీరావు మొదలైన వారున్నారు. *బిరుదులు* బాలకవి - సర్వేపల్లి రాధాకృష్ణన్ అవధానాచార్య - బద్దెన కళాపీఠము,బద్వేలు అభినవ సాహితీసోమయాజి - నండూరి శిష్యసమితి, అనంతపురం శారదాతనయ - ఆంధ్రసంఘం, తిరుత్తణి కళాతపస్వి - జైభారత్ కళానికేతన్, పత్తికొండ పండితమిత్ర - శ్రీశైల జగద్గురు పీఠం, గుంతకల్లు అవధాన కిశోర - శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, అనంతపురం వాణీవరపుత్ర - భాగ్యసమితి, బద్వేలు అవధాన కోకిల - చైతన్యభారతి, రాయదుర్గం అపర జాషువా - జిల్లా రచయితలసంఘం, కడప మధురకవి - యస్.సి.పోష్టల్ ఉద్యోగుల సంఘం,గుంతకల్లు. 77 యేళ్ల డాక్టర్ ఆశావాది ప్రకాశరావు అనంతపురం జిల్లా పెనుకొండలోని స్వగృహంలో 2022 ఫిబ్రవరి 17న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. *మాధవి కాళ్ల* *సేకరణ*
😇My Status - a 33೦ನ  0 'ರರಾವ್ VAD liE ` a [9131 a 33೦ನ  0 'ರರಾವ್ VAD liE ` a [9131 - ShareChat
#🎶భక్తి పాటలు🔱
🎶భక్తి పాటలు🔱 - ShareChat
00:34
#😇My Status *నార్ల వేంకటేశ్వరరావు(పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జననం)* నార్ల వెంకటేశ్వరరావు (డిసెంబర్ 1, 1908 - ఫిబ్రవరి 16, 1985) తెలుగునాట ప్రముఖ పాత్రికేయుడు, హేతువాది, రచయిత. వీ.ఆర్.నార్లగా కూడా వీరు ప్రసిద్ధులు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నాడు. పత్రికా రచనలే కాక పలు నాటికలు, కవితలు, కొన్ని కథలు రాసాడు. రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు. నార్ల వెంకటేశ్వరరావు మధ్య ప్రదేశ్ లోని జబల్‌పూర్‌లో 1908 డిసెంబరు 1 న నార్ల మహాలక్ష్మమ్మ, లక్ష్మణరావు దంపతులకు జన్మించాడు. వీరి పూర్వీకులు ఆంధ్రా కృష్ణా జిల్లా కౌతవరం నుండి వ్యాపార రీత్యా అక్కడికి వెళ్ళారు. కాని నార్ల విద్యాభ్యాసం కృష్ణా జిల్లాలో జరిగింది. నార్లకు 1938 లో సులోచనా దేవితో పెళ్ళి జరిగింది. వీరికి శారద, చంద్రకళ, మీనాక్షీ, ఉమాదేవి, రమాదేవి అనే ఐదుగురు కుమార్తెలు, మోహన్ దాస్, దుర్గా దాస్, లక్ష్మణ దాస్ అనే ముగ్గురు కుమారులూ ఉన్నారు. ప్రఖ్యాత భారత విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు వీరి సోదరుడే. వీరి పెద్ద కుమార్తె కొల్లి శారద గుంటూరు నగర పాలక సంస్థకు మేయరుగా పనిచేసారు. 1928లో మద్దూరి అన్నపూర్ణయ్య ప్రచురించే “కాంగ్రెస్ ” అనే పత్రికకు రాసిన ఉత్తరమే, ఆయన తొలి పత్రికా రచన. ఉపేంద్ర, రవీంద్ర అనే పేర్లతోనూ అనేక వ్యాసాలు రాశారు. 'స్వరాజ్య', 'జనవాణి', 'ప్రజామిత్ర' పత్రికల్లో మెరుపులు మెరిపించారు. 1938లో ఆంధ్రప్రభలో న్యూస్ ఎడిటర్ గా చేరి 1942 ఎడిటర్ గా భాద్యతలు చేపట్టి 1959 వరకు పనిచేసారు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల సంపాదక బాధ్యతలను చేపట్టి వాటిని తీర్చిదిద్దారు. సంపాదకుడిగా పనిచేసిన ముప్ఫై మూడేళ్ల కాలంలో ఛాందస విశ్వాసాలతో రాజీలేని పోరు సాగించి, నిజంపట్ల నిబద్ధత, జనశ్రేయంపట్ల నిజాయతీ, వృత్తిపథంలో తిరుగులేని నిర్భీకతలను పాత్రికేయుడి ప్రధాన లక్షణాలుగా నార్ల విశ్వసించారు.ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసే మూసలో కొట్టుకుపోతున్న పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేశారు. తెలుగు పత్రికా రచనకు కొత్త గౌరవాన్ని, మర్యాదను సమకూర్చారు. సంపాదకీయాలను పత్రికకు ప్రాణదీపాలుగా మార్చడంతోపాటు, సామాజిక సంస్కరణకు వాహికలుగా వాటిని నార్లవారు ఉపయోగించారు. సంపాదకీయాలకు కావ్యగౌరవం కల్పించిన ఘనత వీరిదే. మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు ఆయన రాసిన సంపాదకీయం ఆంధ్రదేశాన్ని పట్టి కుదిపింది. వేటూరి ప్రభాకరశాస్త్రి స్థాయి వ్యక్తి 'వారికి సాష్టాంగ నమస్కారం' అన్నారు. ప్రజలకు అర్థమయ్యే జీవభాషలో సంపాదకీయాలను రాశారు. నైజాం ప్రభుత్వం ఆంధ్రప్రభను నిషేధించినా రజాకార్ల దురాగతాలపై ఎత్తిన కత్తి దించకుండా కలం చేసిన యోధుడాయన. జైల్లో ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య గారు తమకు ఇస్తున్న ఆంధ్రప్రభ దినపత్రిక నానా కత్తిరింపులతో సెన్సారు చెయ్యబడి వస్తున్నదేమిటీ అని నార్ల గారికి ఉత్తరం రాశారు. తన సంపాదకత్వంలో వస్తున్న పత్రికని ప్రభుత్వం కత్తిరింపులతో రాజకీయఖైదీలకు అందిస్తున్నందుకు నిరసనగా ఒక రోజు పత్రిక మొదటి పేజీ నిండా నల్లగా తారుపూసి విడుదలచేసారు.[మూలం అవసరం] అది పత్రికా ప్రపంచంలో చాలా ఘాటైన నిరసన. దానితో, ప్రభుత్వం సెన్సారు చెయ్యడం మానుకున్నది. త్రిపురనేని గోపీచంద్ మానవ వాదం నుండి దూరమై, వారితో అభిప్రాయ భేదాలు ఉన్నా గోపీచంద్ చనిపోయినప్పుడు “ఎంత గుండె గలవాడికీ గుండె పోటు” అంటూ గొప్ప సంపాదకీయం రాశారు. నార్ల ఏ రాజకీయ వాదినీ విమర్శించకుండా వదలలేదు. టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, కళా వెంకటరావు, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఎన్.జి. రంగా ఆయన విమర్శకు గురైన వారే. రాజగోపాలాచారిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని 1946లో మహాత్ముడు నిర్ణయించినప్పుడు దానికి నిరసనగా నార్ల పరంపరగా సంపాదక శస్త్రాలను ప్రయోగించారు. నచ్చని నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పే హక్కు గాంధీజీకి సహా ఎవరికీ లేదు`అని తెగేసి చెప్పారు. ఇందిరాగాంధి నిరంకుశ పాలనను, కుటుంబ వారసత్వ రాజకీయాల్ని ద్వేషించారు. పౌరహక్కులు, మానవ విలువలు కావాలనేవారు. ఆ విషయంలో జయప్రకాశ్ నారాయణను మెచ్చుకునేవారు. నీళ్ళు నమలడం ఆయనకు చేతకాదు. మర్యాదలు పనికిరావు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. 'బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా' అన్న వేమన అభిప్రాయాన్ని అక్షరాలా అమలు చేసిన పత్రికా రచయిత ఆయన. ఒకానొక సంపాదకుడి కోసం పత్రికను నెలకొల్పిన ఒకే ఒక సందర్భం ఆంధ్రజ్యోతి ఆవిర్భావం. ఆంధ్రప్రభ నుంచి వైదొలిగి ఖాళీగా ఉన్న నార్ల కోసం కె.యల్.ఎన్. ప్రసాద్ ఆధ్వర్యంలో కొందరు ముఖ్యులు పూనుకొని ఆంధ్రజ్యోతి పేరుతో ఒక దినపత్రికను స్థాపించారు. ఈ పత్రికను 1960 జూలై 1న విజయవాడలో ప్రారంభించారు. ”పత్రికొక్కటున్న పదివేల సైన్యము, పత్రికొక్కటున్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో… ” అని చెప్పిన పత్రికా సైన్యాధ్యక్షుడు నార్ల వెంకటేశ్వరరావు. పత్రికను పైకి తేవడానికి నార్ల అనేక కొత్త ఒరవడులు ప్రవేశపెట్టారు. సంపాదకీయాలు టెలిప్రింటర్ ద్వారా పంపేవారు. 'కాగడా', 'జనవాణి'తో తాపీ ధర్మారావు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని నార్ల ఆంధ్ర ప్రభ, ఆంధ్రజ్యోతి ద్వారా సమర్థంగా కొనసాగించారు. తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగు వారిలో మనం కదలిక పుట్టించగలం' అని ఆయన తోటి జర్నలిస్టులకు ఉద్బోధించారు. సంపాదకుడు అనే మాటను నార్ల ఉపయోగించేవారు కాదు. ఎడిటర్ అనే రాసుకునే వారు, పిలిపించుకునేవారు. ఎడిటర్ అనే ఇంగ్లీషు మాటకు సంపాదకుడు అనే తెలుగు అనువాదాన్ని ఆయన ఆమోదించలేదు. సంపాదకుడు అంటే ఏమిటో, సంపాదకుడి స్థానం ఏమిటో యాజమాన్యాలకూ, సమాజానికీ తెలియజెప్పడానికి ఆయన శత విధాలుగా ప్రయత్నించారు. ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా' అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించిన యోధుడు నార్ల. ముఖ్యంగా జర్నలిజం రంగంలోకి అడుగుపెట్టేవారు నిజాయితీగా, నిర్భీతిగా ఉండాలని కోరేవాడు నార్ల. "నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ సేయు జర్నలిస్టు తార్చువాని కంటే తక్కువ వాడురా" అని చెప్పాడు. నండూరి రామమోహనరావును గుమస్తా సంపాదకుడు అని పిలిచేవాడు.[మూలం అవసరం] “ఏ ఎండకు ఆ గొడుగు పట్ట నేర్చినవాడు ఏమైనా కావచ్చునేమో కానీ, నిజమైన ఎడిటర్ కానేకాడు.” అని నిష్కర్షగా చెప్పేవారు. గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత 'కారం' ఉందో తెలియజెప్పినవాడు' నార్ల. 'విరామమెరుగని రాక్షసుడు నార్ల' అని ప్రఖ్యాత సంపాదకుడు ఖాసా సుబ్బారావు అభివర్ణించారు. నార్ల కేవలం పాత్రికేయుడు కాదు. సాహిత్యవేత్త, కవి, రచయిత, ఉద్యమకారుడు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో మంచి ప్రావీణ్యం ఉంది. ఇంగ్లీషులో వి ఆర్ నార్లగా ప్రసిద్ధులు. కవిగా, రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడుగా, అనువాదకుడుగా, పాత్రికేయునిగా అనేకులకు నార్ల స్ఫూర్తి ప్రదాత. బెర్నార్డ్ షా, గురజాడ, కందుకూరి, వేమన, కవిరాజు త్రిపురనేని రామస్వామి నార్లకు ఇష్టమైన రచయితలు. సంస్కృత భాషను విస్తృతంగా ప్రచారం చేస్తే తప్ప మన సంస్కృతి విస్తరించదన్న వాదనను ఆయన తుదికంటా వ్యతిరేకించారు. సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అంధ విశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ సీతజోస్యం రాశారు. రామాయణాన్ని, రామ రావణ యుద్ధాన్ని ఆయన ఆహారోత్పత్తి వ్యవస్థకు, ఆహార సేకరణ వ్యవస్థకు మధ్య సంఘర్షణగా వ్యాఖ్యానించారు. అగ్రకులాధిపత్యానికి, ఆధిపత్య భావజాలానికి సవాలు విసురుతూ శంబూక వధ రాశారు. బాలలకూ సాహిత్యాన్ని పరిచయం చేయాలని అనుకొనేవారు. అందుకే వారి కోసం నీతి పద్యాలు రాశారు. ‘వాస్తవమ్ము నార్ల మాట’ మకుటంతో రాసి, దానిని తర్వాత ‘నవయుగాల బాట నార్ల మాట’గా మార్చి ఆ మకుటంతో 700 కు పైగా సందేశాత్మక పద్యాలు ఆటవెలదిలో రాశారు. 16 ఏకాంకికల సంపుటి వెలువరించారు. కవితా ఖండికలు, పద్య సంకలనాలు, సాంఘిక, పౌరాణిక నాటకాలు, వ్యాసాలు ఎన్నో రాశారు. ఏవి రాసినా అందులో సామాజిక ప్రయోజనం ఉండేది. కేవలం తెలుగులోనే కాకుండా ఆంగ్లంలో కూడా పలు రచనలు చేశారు నార్ల. ఇంగ్లీషులో భగవద్గీతపై విమర్శనాత్మక రచన చేయగా అది పలు విదేశీ జర్నల్స్‌లో కూడా ప్రచురితమైనది. కలకత్తాలోని సుశీల్‌ముఖర్జీ అనే సంపాదకుడు నార్ల ఆంగ్ల రచనలు కొన్నిటిని వెలువరించారు. నార్ల వెంకటేశ్వర రావు వివిధ దేశాల చరిత్రల రచన చేసినా, ఎందరో మహానుభావుల జీవితాలను చిత్రించి సామాన్య ప్రజానికి పరిచయం చేసినా, మరేది చేసినా జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు. నార్ల ఎన్నో కొత్త మాటలు, పదబంధాలు సృష్టించారు. మాండలికాలకు పెద్దపీట వేశారు. ఇంగ్లీషు పదాలకు సమానార్ధకాలు నిర్దేశించే క్రమంలో, తిరోగమనం, ఐక్య రాజ్య సమితి, దిగ్బంధనం మొదలైనవాటిని ఎన్నింటినో ఉదాహరణగా చెప్పవచ్చు. భాషాపరమైన అంశాల్లో ప్రయోగాలు ఆయన సొత్తు. "గ్రంధకర్త తన భుక్తి కోసం వేరేవృత్తిని చూచుకోవలసి వచ్చినంతవరకు ఏ భాషలోనైనా ఉత్తమ గ్రంథాలు వెలునడవు" అనేది నార్ల అభిప్రాయం. తన నాటకాలను ప్రదర్శిస్తామనీ, అందుకు ఉచితంగా అనుమతి ఇవ్వాలనీ కోరిన సంస్థకు ప్రత్య్తుత్తరమిస్తూ నార్ల వెంకటేశ్వరరావు ఇలా రాసాడు: ఏదైనా నాటికనుగాని నాటకాన్ని గానీ ప్రదర్శించినపుడు నాటకకర్తకు ఎంతోకొంత రాయల్టీ చెల్లించాలని నా పట్టుదల. గ్రంధకర్త తన భుక్తి కోసం వేరేవృత్తిని చూచుకోవలసి వచ్చినంతవరకు మనభాషలో - నిజానికి ఏ భాషలోనైనా - ఉత్తమ గ్రంథాలు వెలువడవు. ఈ సూత్రాన్ని ప్రచారం చేయ్యాలనే తలంపు తోనే రాయల్టీ విషయమై నా పట్టుదల. మీరు నా నాటికలను రెండింటిని ప్రదర్శిస్తే, వాటికి రాయల్టీ ఇరవై రూపాయలు. అయితే మీకు దాన్ని చెల్లించగల తాహతు లేకపోవచ్చు గనుక, ఆ మొత్తాన్ని ముందు నాకు చెల్లించినట్లు మీ పద్దు పుస్తకంలో వ్రాసుకొని, తర్వాత దాన్ని మీసంఘానికి నా విరాళంగా జమకట్టుకోండి. మీ ప్రదర్శనంపై ప్రజాభిప్రాయాన్ని వివరంగా నాకు వ్రాయండి. 1954లో ఎం.ఎన్. రాయ్ చనిపోయినప్పుడు దేశంలో అన్ని పత్రికలు సంపాదకీయాలు రాసినా, నార్ల ఆ పని చేయలేదు. ఎవడో అనామకుడు చనిపోతే “తార రాలింది, వటవృక్షం కూలింది” అని రాసే నార్లకు ఎం.ఎన్. రాయ్ ఎవరో తెలియదా అని ఆవుల గోపాలకృష్ణ మూర్తి గుంటూరు ఏకాదండయ్య హాలులో సభా ముఖంగా విమర్శించగా వెంటనే గుత్తికొండ నరహరి ద్వారా ఎం.ఎన్. రాయ్ రచనలు తెప్పించుకొని చదివారు. నార్ల అప్పటి నుండి రాయ్ అభిమానిగా, క్రమేణా హేతువాది గా, మానవవాది గా జీవించారు. నవయుగాల బాట నార్ల మాట లో వారి హేతువాద భావజాలం మనకు కనపడుతుంది. ఏల ఏప్పు డెవ్వడిత్యాది ప్రశ్నలే పశువు నుంచి వెరుపరిచె నరుని ప్రశ్నతోనే నరుడు పరిణామమొందెరా నవయుగాల బాట - నార్ల మాట! ప్రకృతినే జయించి, పరమాణువును చీల్చి శాస్త్రవేత్త కూర్చే సకల సిరులు, రాజకీయ వేత్త రణమును కూర్చెరా! నవయుగాల బాట - నార్ల మాట ! విశ్వనాథ సత్యనారాయణ, వడ్లమూడి గోపాలకృష్ణయ్య వంటి వారి ఆస్తిక, ఛాందస భావజాలాన్ని, మూఢ విశ్వాసాలను నార్ల తీవ్రంగా విమర్శించేవారు. నార్ల కళాభిమాని, బౌద్ధ కళల పట్ల ప్రత్యేక అభిరుచి, విదేశాలలో సేకరించిన బౌద్ధ మినీ విగ్రహాలు, కళాఖండాలు అట్టి పెట్టేవారు. శివుడు, కృష్ణుడి పరంగా వచ్చిన కళాఖండాల్ని కూడా సేకరించారు. మ్యూజియంలో, శిల్ప సౌందర్యాలు ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. వాటి విశేషాలు చెప్పేవారు. బౌద్ధానికి చెందిన కళాఖండాలు, మినీ విగ్రహాలు నార్ల సేకరించి ఇంట్లో పెట్టుకున్నారు. బిర్లా సంస్థ అడిగినా వారికి యివ్వలేదు. వీరు పుస్తక ప్రియులు. తనకు కావలిసిన పుస్తకాల కొరకు తరచు ఆదివారాలు పేవ్ మెంట్స్ పై పాత పుస్తకాలు కొరకు వెతికేవారు. నార్ల వారు సేకరించిన 20,000 పైగా పుస్తకాలు తో ఒక పెద్ద సొంత గ్రంథాలయం ఉంది. వారి మరణాంతరం ఈ పుస్తకాలను హైదరాబాదు లోని అంబెద్కర్ ఒపెన్ యూనివర్శటీకి ఇచ్చారు. బౌద్ధమతాన్ని నమ్మి ఆచరించి; స్వచ్ఛమైన హేతువాదిగా జీవించారు. నార్ల వేంకటేశ్వరరావు గంభీర స్వభావులన్న సంగతి చాలామందికి తెలుసు. కానీ సంభాషణా చతురులనీ, హాస్య కుశలురనీ తెలిసినవాళ్లు కొద్దిమందే. నార్ల వారి ఉత్తరాల్లో ఆయన హాస్య చమత్కారాలు మబ్బుల చాటున మెరుపుతీగల్లాగా మెరిసిపోతుంటాయి. నార్ల ఎప్పుడూ ఏదొక రుగ్మతతో బాధపడుతుండేవారు. మధురాపుట్ అని కాలికి జబ్బు. గుండెపోటు రెండు సార్లు వచ్చింది. విపరీతంగా సిగరెట్లు తాగే అలవాటును వదిలేసారు. కొన్నాళ్ళు చెవుల్లో రొదతో సతమతమయ్యారు. వీటిని గురించి ఇతరులు అడిగినప్పుడు ‘‘నాకు ఐదుమంది కొడుకులు. ఐదుగురూ డాక్టర్లే. ఐదుమంది కోడళ్లు కూడా డాక్టర్లే. వీళ్లంతా విదేశాల్లో స్థిరపడ్డారు. నా ముగ్గురు కుమార్తెలూ, అల్లుళ్లూ డాక్టర్లే. ఒక్క కూతురూ, అల్లుడు మాత్రమే ఇక్కడ వున్నారు. మరి నాకేమో రెండు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. మా కుటుంబంలో నా భార్య తప్ప మిగతావారంతా డాక్టర్లే. ఆమెకు కూడా ఏ విశ్వవిద్యాలయమైనా గౌరవ డాక్టరేట్‌ ఇస్తే బావుంటుంది. అప్పుడు మా ఇంట్లో అందరూ డాక్టర్లే అవుతారు. కాని ఇంతమంది డాక్టర్లున్నా నేనెప్పుడూ పేషెంటునే. తల నుంచి కాలు దాకా నేనో రోగాల పుట్ట.’’ నార్ల వారి అరుదైన చమత్కార మాటలివి. *నార్ల వారి మాటలు* యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు. ఎంత గొప్పవాడైనా వస్తాడేకాని విచ్చేయడు. సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి. బడు వాడేవాడు బడుద్ధాయి. నార్ల మాట నవయుగాల బాట ఆశలేని ప్రాణి అణగారిపోతుంది. ఆశ చంపుకోవడం ఆత్మహత్య. ఉక్కు మనిషి ఎవడో, ఊకమూట ఎవడో కష్ట కాలమందే స్పష్టపడును. ఉత్త వేళలందు ఉత్తములందురు. అవిటివానికేల అభినయశాస్త్రం? చెవిటి వానికేల కవులగోష్టి? ప్రశ్న ప్రగతికి మూలం. ప్రశ్నలేని జగత్తు ప్రశ్నార్ధకం. అస్పృశ్యులని మనం అందరిని దూరం నెడితే మనల్ని వెనక్కి నెట్టి ప్రపంచం ముందుకు పోతుంది. నార్ల వారి రచనలో సూటిదనం, గడుసుదనం, వ్యంగ్యం, చమత్కారం, లోకజ్ఞత, సమయజ్ఞత సమపాళ్ళలో ఉండేవి. సీతజోశ్యం జాబాలి నరకంలో హరిశ్చంద్రుడు ద్రౌపది హిరణ్యకశ్యపవధ నవయుగాలబాట నార్ల మాట కొత్త గడ్డ (నాటికలు) పిచ్చాపాటి, మాటా మంతి, కొత్తా పాత మూడు దశాబ్దాలు (30 ఏళ్ళ సంపాదకీయాలు) వేమన పరిశోధక గ్రంధం నార్ల వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు. నార్ల కుటుంబ సభ్యులు ఆయన రచనలు అన్నీ కూర్చి "నార్ల రచనలు" పేరిట 12 భాగాలుగా వెలువరించారు. నార్ల రచనలు 1 - దేశ చరిత్రలు నార్ల రచనలు 2 - సాంఘిక నాటికలు, వ్యాసాలు నార్ల రచనలు 3 - పౌరాణిక నాటికలు నార్ల రచనలు 4 - సాహిత్య రచనలు నార్ల రచనలు 5 - సంస్కృతి, సాహిత్యం, మతం నార్ల రచనలు 6 - వర్తమాన సంఘటనలు నార్ల రచనలు 7 - జీవిత చిత్రణలు *ఆంగ్ల రచనలు* The truth about the Geetha 1988 An essay on the upanishads 1989 Gods and goblins East and west Intellectual poverty in India Indian culture, its caste complexion Man and his world Veeresalingam (critical study) Works of Narla 8 - Writings on Religio Works of Narla 9 - The last word on ramayana - Jabali part - 2 Seetha's Destiny Works of Narla 10 - Writings on Culture Works of Narla 11 - Writings on Literature Works of Narla 12 - Miscellaneous Writings వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు. పాత్రికేయుడిగా అనేక అంశాలపై సంపాదకీయాలు వెలువరించినట్లే, అనేక అంశాలు, సమస్యలపై సభలో చర్చించేవారు. 1981లో ఆయన సీతజోస్యం నాటకానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. 1983 లో ఎన్.టి. రామారావు నార్లను సాంస్కృతిక వ్యవహారాల సలహాదారుగా నియమించారు. కళాప్రపూర్ణ’ ‘పండిత’ కొత్త సత్యనారాయణ చౌదరి గారు తన రచన ‘రామాయణ రహస్యాలు’ నార్ల వారికి అంకితం ఇచ్చారు. పత్రికారంగంలోనూ, తెలుగు సాహిత్యంలోనూ గొప్ప శకాన్ని ఆవిష్కరించిన దిగ్గజం నార్ల వెంకటేశ్వర రావు గారు 1985 పిబ్రవరి 16న గుండెపోటు తో హైదరాబాదులో కన్నుమూసారు. *మాధవి కాళ్ల* *సేకరణ*
😇My Status - ShareChat
#🎶భక్తి పాటలు🔱 🙏🙏
🎶భక్తి పాటలు🔱 - HAPPY Maha Shioratri Desh Keyboard HAPPY Maha Shioratri Desh Keyboard - ShareChat
#🎶భక్తి పాటలు🔱
🎶భక్తి పాటలు🔱 - ShareChat
00:43