
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
@deerajreddy
ఐ లవ్ షేర్ చాట్ నా హాబీలు: డాన్స్, రైటింగ్,రీడింగ్
సప్తగిరులపై వెలసి వేంకటేశా!
ఆప్తుడవు అయినావు భువికి శ్రీనివాస!
ధర్మమే నీ తేజం సర్వదా!
భక్త జనుల ద్రోచు దైవం నీవేకదా!
ఏడుకొండల వాడ వెంకటరమణ, అనాధ రక్షక, దీన జన వల్లభుడా, ఆపద మొక్కుల వాడ గోవిందా గోవిందా!
మా హిందూ భక్తజనవాహినికి ఆధ్యాత్మిక ఓం నమో వేంకటేశాయ శుభ శనివారం! #శుభ శనివారం
మన ఇండియా లో ఒక పిల్లాడిని పోషించడానికే తల్లిదండ్రులు నానా అవస్థలు, అపసోపనాలు పడుతుంటే,విదేశాలలో అయితే ఎంతమంది పిల్లలు వున్న వారి పోషణ తమకు పెద్ద భారం కాబోదని అక్కడి తల్లిదండ్రులు చెప్పకనే చెబుతున్నారు! ఎందుకంటే వారివి ధనిక దేశాలు, కానీ భారతదేశం ఇంకా పేదరికం తో మగ్గిపోతూనే వుంది! అది సంగతి!✍️✍️✍️ #💪పాజిటీవ్ స్టోరీస్
బ్రిటిష్ పాలనకు వ్యతిరేఖంగా పోరాడిన ప్రముఖ తెలుగు విప్లవకారుడు అల్లూరి వారి 102వ వర్ధంతి నేడు! ( 7 - 5 - 2026)!
లేదా
భారత స్వాతంత్ర్య చరిత్రలోనే ఓక మహోజ్వాలశక్తి, అగ్గి పిడుగు,మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 102వ వర్ధంతి నివాళులు!
మన్యం ప్రజల హక్కుల కోసం తెల్లదొరల అణిచివేతకు వ్యతిరేఖంగా అల్లూరి వారు జరిపిన ' రంప విప్లవం ' ( 1922 - 24) భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఓక సువర్ణ అధ్యాయం.గెరిల్లా యుద్ధతంత్రంలో బ్రిటిష్ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టిన ఆయనను ' మన్యం వీరుడిగా ' పిలుస్తారు.ఇక ఈ ప్రత్యేక సందర్బంగా ఆ విప్లవ సూరీడు,గెరిల్లా యోధుడు అయిన అల్లూరి విశేషాల గురించి మనం ఒక్కసారి మననం చేసుకుంటే ఆయన 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పాడ్రంగిలో జన్మించారు. ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామం.ఆ తిరుగుబాటు శిఖరంకు జన్మనిచ్చిన జననీ జనకులు వెంకటరామరాజు,సూర్య నారాయణమ్మ. అదేమాదిరి ఆ విప్లవజ్వాల పోరాట నేపథ్యం గురించి చెప్పాలంటే అటవీ చట్టాల ద్వారా గిరిజనులను బ్రిటిష్ వారు పీడిస్తుంటే,వారి తరపున నిలిచి సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు.ముఖ్యంగా రంప విప్లవం ( 1922 - 1924) ద్వారా గిరిజనులను సమీకరించి,బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి మరీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న సాహసి,గొప్ప దేశభక్తుడు ఈ అల్లూరి.అలాగే ఆ మహనీయుని పోరుబాట శైలి విషయానికి వస్తే గెరిల్లా యుద్ధతంత్రం అంటే ( విప్లవకారులు దాక్కుని ఆకస్మాతుగా దాడి చేసే పద్దతి,ఈ విద్యలో ఆరితేరేలా తనతో పాటు తన అనుచరులకు మంచి తర్పీదును ఇచ్చిన దీశాలి.ఇక అల్లూరి గారి దేశభక్తిని మెచ్చి,ఆయన ధైర్య సాహసాలకు గుర్తుగా మన్యం వీరుడు అనే బిరుదును సైతం ఇవ్వడం జరిగింది. ( Hero of the Jungle ). ఇక ఆ విప్లవ కెరటం అల్లూరి ప్రాణత్యాగానికి సైతం సిద్దపడి,మన భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చే బృహత్తర లక్ష్యంలో భాగంగా చివరకు అంతిమంగా బ్రిటిష్ వారికి చిక్కి 1924 మే 7న కృష్ణదేవిపేట సమీపంలో అమరులయ్యారు ఈ విప్లవ కణ,అగ్గి జ్వాల అల్లూరి.అలాంటి మహోన్నతుడు, కారణజన్ముడు అయిన ఈ అల్లూరి భారతదేశానికి వెలకట్టలేని,అజరామమైన సేవలు అందించాడు కాబట్టి ఆ మహనీయుని పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఏకైక లక్ష్యంతో మన కేంద్రప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ లోని ఓక జిల్లాకు ' అల్లూరి సీతారామరాజు జిల్లాగా ' పేరు పేట్టారు,నామకరణం చేశారు.
ఏదిఏమైన అల్లూరి సీతారామరాజు గారు భారత స్వాతంత్ర్య చరిత్రలో ఓక మహోజ్వాల శక్తి.ఇతడు జరిపిన సాయిధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఓక ప్రత్యేక అధ్యాయం.అగ్గిపిడుగు,మన్నెం వీరుడు, తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన వీర కిశోరం మన అల్లూరి.అంతేకాదు భారత స్వాతంత్ర్య ఉద్యమాన్ని విప్లవ పథం వైపు నడిపిన యోధుడు. ఏమైనా ఆంగ్లేయుల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవబాణం ఈ అల్లూరి.అంతేకాదు మన్యం ప్రజల కొరకు ఆయన ప్రాణాలకు సైతం తెగించి,పణంగా పెట్టి మరీ ఆంగ్లేయులపై వ్యతిరేఖంగా పోరుబాట సల్పిన మహోన్నత విప్లవకారుడు ఈ అల్లూరి.అన్నింటికి మించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య శక్తులపై కన్నెర్ర చేసి,వారు మన్నెం ప్రజలపై చేస్తున్న దౌర్జన్యాలను,దురాగాతాలను ప్రతిఘటించి గెరిల్లా యుద్ధతంత్రం ద్వారా వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి,సింహా గర్జన చేసి మరీ వారి తుటాలకు తల ఎత్తుకొని మరీ బలైన ఆరణాల నిజమైన, అంకితభావం,అడుగడుగునా పోరాటపటిమ గల నిఖార్సైనా దేశభక్తుడు ఈ అల్లూరి.అదేమాదిరి ఇలాంటి అసలుసిసలు ఉడుగు రక్తం గల స్వాతంత్ర్య సమరయోధుని అడుగుజాడల్లో నేటి యువత నడిచి ఆయన ఆశయాలు,సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొని మరీ ముందడుగు వేస్తే,మున్ముందుకు ఓ తార జువ్వలా దూసుకుపోతే మన భారతదేశం అన్ని రంగాలలో అగ్రగామిగా నిలవడం తథ్యం అనే మాట అక్షర సత్యం.అమర్ రహే! అమర్ రహే! జోహార్ మన్యం వీరుడు అల్లూరి!✍️✍️✍️🇮🇳🇮🇳🇮🇳
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #అల్లూరి సీతారామరాజు వర్ధంతి💐
నువ్వుంటే పూల బాట, లేకుంటే రాళ్ల బాట! #🔊తెలుగు చాట్రూమ్😍
రాజకీయాలలో గెలుపు ఓటములు అత్యంత సహజం - ప్రజా తీర్పు ముందు ఎంతటి వారైనా తోక మూడవాల్సిందే!
లేదా
అధికారం శాశ్వతం కాదు,అది మూడు నాళ్ల ముచ్చటే - అంతిమంగా ప్రజా తీర్పు శాశ్వతం - ప్రజాగర్జన ముందు కాకలుతీరిన పాలకులు సైతం మట్టికరచాల్సిందే
ఈ మారు అధికారం మేం ఛేజిక్కించుకున్నాం కదా అని మిడిసిపడితే మాత్రం ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు కాక తప్పదు. అంటే ఏ ప్రజలైతే మీకు బ్రహ్మరథం పట్టారో అదే ప్రజల చేతిలో మీకు భంగపాటు,శృంగభంగం తప్పదు.కాబట్టి ఓట్లు వేసి మిమల్ని గెలిపించిన ప్రజల పట్ల భాద్యతగా వ్యవహరించి నేటి పాలకులు వారి ఋణం తీర్చుకోవాలి గాని,ఏదో ఎలక్షన్ల ముందు అధికారం ఛేజిక్కించుకోవడం కోసం ఏదో అరచేతిలో వైకుంఠం చూపించినట్లుగా,ఆచరణ సాధ్యం కాని అనేక హామీలను ప్రజలకు ఇచ్చి తీరా గెలిచిన తరువాత వాటిని అమలు చేయకుండా ప్రభుత్వ ఖజానా ఖాళీగా వుంది మేము ఏమి చేస్తుము సోమలింగం అని ప్రజలకు ఊసడప్పు కబుర్లు చెప్పి ,వారి చెవిలో పువ్వు పెట్టి మరీ వారిని మభ్యపెట్టాలని చూస్తే మాత్రం ప్రజలు ఖచ్చితంగా వజ్రాయుధం వంటి తమ ఓటు ద్వారా మీకు తగిన గుణపాఠం చెప్పి తీరతారు.అదేమాదిరి ప్రజలను వెర్రి బాగోళ్ళను చేసి వారితో సెంటిమెంట్ రాజకీయాలు నడిపాలని చూస్తే మాత్రం ప్రజల చేతిలో ఏ పాలకులకు అయిన చావుదెబ్బ తప్పదు.సరిగ్గా ఇప్పుడు జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలే రెండో విడత ప్రజల ముందుకు వెళ్లి చతికిల పడ్డారు అయా రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పినరయి విజయన్,స్టాలిన్, మమతా బెనర్జీ (దీదీ ).ఇక వీరిని ప్రజలు ఎందుకు ఓడించారు అనే దానికి సవాలక్ష కారణాలు వున్నాయి. అన్నింటికి మించి వీరి ఓటమికి ప్రదాన కారణం ఏమంటే కోట్లాదిమంది హిందు ప్రజల ఆరాధ్య దైవాలను అడుగడుగునా అవమానాల పాలు చేశారు ఈ ముగ్గురు పాలకులు.కేరళ గత కమ్యూనిస్ట్ ప్రభుత్వ పాలకుడు విజయన్ అయితే కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతున్న,ఎంతో మహిమ గల క్షేత్రం సాక్షాత్తు అయ్యప్పస్వామి కొలువై ఉన్న శబరిమల దేవాలయంలో దొంగతనం జరిగితే చేసినవారు ఎవరో ఆచూకీ కనుగొనడంలో తీవ్ర కాలయాపన,జాప్యం చేసి మిన్నకుండి పోవడం,ఇక తమిళనాడు రాష్ట్ర గత ప్రభుత్వ డీఎంకే పార్టీ పాలకుడు స్టాలిన్ సోదరుడు అయిన ఉదయనిది స్టాలిన్ అయితే హిందూ సనాతన ధర్మం యొక్క గొప్పతనం గురించి పదే పదే చిన్నబుచ్చేలా మాట్లాడుతూ,దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను చాలా తీవ్ర స్థాయిలో దెబ్బతినేలా వ్యవహరించడం,ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గత ప్రభుత్వ పాలన విషయానికి వస్తే దీదీ గా పేరుపడ్డ తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ గారు గౌరవనీయమైన సీఎం హోదాలో వుంటూ ఓక నియంతలా పాలనచేసి హిందూ సోదర,సోదరీమణుల అత్యంత పెద్ద,ప్రతిష్టాత్మక పండుగ అయిన దసరా పండుగ ఉత్సవాలు సక్రమంగా జరుగనీయకుండా పదే పదే అడ్డంకులు సృష్టించి హిందూ ఆత్మీయ సోదరుల భక్తిభావాన్ని కించపరిచేలా వ్యవహరించడంతో ఆ శాపం ఇప్పుడు ఈవిడగారికి తగిలి ఆమె గారు ఓటమి పాలు అయ్యారు అనే మాట అక్షర సత్యం.
ఏదిఏమైన అధికారం వుంది కదా అని ఓట్లు వేసిన ప్రజలను వెర్రిబాగోళ్లను,వెంగలాయప్పలను చేసి ఆటలాడుకోవాలని చూస్తే మాత్రం ఫలితాలు ఇలాగే అత్యంత చేదుగా ఉంటాయి అనే దానికి ఈ ముగ్గురు దిగ్గజ కాకలుతీరిన రాజకీయ పాలకులు వారి వారి రాష్ట్రాల్లో అన్యూహంగా ఓటమి పాలు కావడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం కాక మరేమిటి.అదేమాదిరి ఏ పాలకుడు అయిన ఓట్లు వేసిన ప్రజల ఆశలు,కోరికలు,ఆకాంక్షల మేరా వాటికి అనుగుణంగా పాలన చేయాలి గాని ప్రజా వ్యతిరేఖ నిర్ణయాలకు ఆజ్యం పోసి వాటిని పెంచి పోషిస్తే మాత్రం ప్రజల ఆగ్రావేశాలకు,వారి కన్నెర్రకు ఎంతటి పేరుమోసిన పాలకుడు అయిన మట్టికరవక తప్పదు.ఏమైనా గతంతో పోలిస్తే ఓట్లు వేసే ప్రజలు ఎంతో పరిణతి చెందారు,ఓక విధంగా వారి ప్రజాతీర్పు అంచనా వేయడం ఎవ్వరి తరం కాదు,అంతగా వారు వివేకంలో అరితేరిపోయారు.వారికి ఏ పాలకుడు అయిన తాము ఇష్టపడేలా పాలన అందిస్తే వారిని అందలం ఎక్కిస్తారు,వారికి జేజేలు కొడతారు,అదే పాలకులు ఓట్లు వేసిన ప్రజలను పట్టించుకోకుండా వారిని ఇబ్బంది పెట్టేలా,విసిగించేలా పాలన సాగిస్తే మాత్రం వారు తమ ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పి తీరతారు అనే విషయం ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ద్వారా మరోసారి చాలా స్పష్టంగా గూడీ అయ్యింది.ఓక విధంగా చెప్పాలంటే ఈ సంచలనాత్మక ఫలితాలు ముమ్మాటికీ ప్రజావిజయానికి తార్కాణం వంటిది అనే మాట అక్షర సత్యం.జయ జయహో ఓటర్స్!ఈ ప్రజాస్వామ్యంలోని యావత్తు,అశేష ప్రజలు వర్ధిల్లాలి మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా!✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా. #భారత్ లో నేటి రాజకీయం
అవినీతి కుళ్ళు,కంపు కొడుతున్న నేటి రాజకీయాలను ప్రక్షాళన చేయాలంటే ఓక్క ఉన్నత విద్యావంతులైన యువతకే సాధ్యం!
ముఖ్యంగా నేటి రాజకీయాలలో నీతి,నైతిక విలువలు అనేవి పూర్తిగా అడగంటిపోయాయి అనేది ఎవరు కాదనలేని వాస్తవం.ఎందుకంటే ముఖ్యంగా ఈ సమాజంలో విద్యావంతులైన యువతకు బ్రష్టుపట్టిన నేటి రాజకీయాలలో ఉన్నత స్థానం అంటూ లేకుండా పోయింది.ఓక వేళ చదువుకున్న యువతకు నేటి రాజకీయాలలో అవకాశం వస్తున్న అది బహు స్వల్పమే అంటే నూటికి కేవలం 30 % శాతం మాత్రమే. అదేమీ దురదృష్టమో గాని ఎక్కువగా నేటి రాష్ట్ర రాజకీయాలను అవినీతి మకిలి అంటిన వారు, దౌర్జన్యకారులు,ప్రజల ఆస్తులను కొల్లగొట్టే దుర్మార్గపు వ్యవహారశైలి వున్న వారే శాసిస్తుండటం ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించి అత్యంత బాధాకరమైన,ఆందోళన కలిగించే విషయం.కాబట్టి ఈ ఆనారోగ్య,అనాగరిక పరిస్థితుల్లో మార్పు రావాలంటే మరింతమంది ఉన్నత విద్యావంతులైన యువత రాజకీయాలలోకి రావాలి,ప్రజలకు స్ఫూర్తిదాయకమైన, ఆదర్శవంతమైన,నీతి,నిజాయితితో కూడిన పాలన అందించాలి.అడుగడుగున ఉడుకు రక్తంతో కదంతొక్కే యువత అనుకోవాలే గాని కొండల్ని సైతం పిండి చేయగలరు,నేటి రాజకీయాలలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చే సత్తా వారి సొంతం.ఇందులో ఎలాంటి సందేహానికి తావు లేదు.
ఏదిఏమైనా నేటి ఉన్నత విద్యావంతులైన యువత అత్యంత వివేకంతో ఆలోచించి తమ మేధస్సునంతా ఉపయోగించి నేటి రాజకీయాలకు అనుసంధానం చేయగలిగితే,పనిలో పనిగా ప్రజల మెప్పు,మద్దతు పొందగలిగితే రాబోయే కాలం అంతా మెజారిటీ విద్యావంతులైన యువత మాత్రమే రాజకీయాలను శాసించే రోజు అతి దగ్గరలోనే వుంది అనే మాట అక్షర సత్యం.ఏమైన విద్యావంతులైన యువతకు రాజకీయాలలో ముందున్నది అంతా మంచి కాలమే,అయితే అందుకు అత్యంత ఆశావాద దృక్పధం,అంతులేని దృఢ చిత్తంతో ముందడుగు వేయగలిగితే రాబోయే కాలంలో ఓక ఆరోగ్యవంతమైన రాజకీయాలకు వారు బీజం వేసినవారవుతారు, తద్వారా ప్రజలకు నిజమైన శ్రీరామచంద్రుని రామరాజ్యస్థాపనకు సాకారం చేకూర్చిన వారవుతారు! జయ జయహో విద్యావంతులైన యువత! మేరా హిందూస్తాన్ మహాన్!✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా. #ఏపీ రాజకీయాలు
చేసిన అభివృద్ధి ఇది అని సాక్ష్యాదారాలతో సహా ఈ డోన్ నియోజకవర్గ ప్రజానీకానికి మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర ఆర్థిక శాఖమాత్యులు అయిన బుగ్గన రాజారెడ్డి అన్నయ్య గారు నిరూపిస్తూ వుంటే అధికార పార్టీ వారేమో అభివృద్ధి ఎక్కడ జరిగింది అని చెప్పడం హాస్యాస్పదం కాదా,విడ్డురం అనిపించుకోదా అని నేను అడుగుతున్న!✍️✍️✍️ #ysr
పులివెందుల ముద్దుబిడ్డ వైస్సారు,మా పురిటి గడ్డ మిమల్ని మరువదు సారు! క్యాప్షన్ : పేద,సామాన్య,బడుగు బలహీనవర్గాల పెన్నిధి,రైతుభాంధవుడు దివంగత మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం,డాక్టర్ వైస్సార్ తాను సీఎంగా పనిచేసిన కాలంలో ప్రజల సౌకర్యార్థమై 108 అంబులెన్సు సర్వీస్,మహిళలకు పావలా వడ్డీ రుణాలు,పేద విద్యార్థులు చదువుకునేందుకు ఫీజురీయింబర్స్ మెంట్,రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ,పేద,సామాన్య ప్రజలకు ఏదైనా పెద్ద జబ్బు వచ్చినప్పుడు వారు చికిత్సతీసుకునే నిమితమై ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రవేశపెట్టి వారి హృదయాలలో కొలువై ఉన్న దేవుడిలా నేటికీ వారి చేత కొనియాడబడుతున్నాడు మాట మీద నిలబడే మడమ తిప్పని నేత,ఇచ్చిన హామీకీ,చెప్పిన మాటకు ఆరునూరైనా కట్టుబడే మహానేత,ఓ గొప్ప సుపరిపాలకుడు,నిరుపేదల తలవ్రాతను మార్చిన మేరుగరణధీరుడు ఈ మన దివంగత డాక్టర్ వైస్సార్! జోహార్ వైస్సార్! అమర్ రహే పులివెందుల ముద్దుబిడ్డ డాక్టర్ వైస్సార్!✍️✍️✍️
- మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr
దీపావళి పండుగ అంటేనే మన కుటుంబాలలో ఎనలేని కళాకాంతులతో కూడిన సంతోషాలహరివిల్లు ఉప్పొంగిపోతుంటుంది!🧨🧨🧨🏹🏹🏹 #deepavali






