
బుగ్గన మధుసూదనరెడ్డి, ఎం.బి.ఏ
@deerajreddy
ఐ లవ్ షేర్ చాట్ నా హాబీలు: డాన్స్, రైటింగ్,రీడింగ్
ఓం నమశ్శివాయ శివాయనమ ఓం! హర హర మహదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🕉️🕉️ #శుభ సోమవారం
అల్ టైం టాప్ మ్యూజిక్,ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ కు ఒకప్పటి గ్లామర్ తార టబు ఎక్స్ప్రెషన్స్ మరో లెవెల్లో! ✍️✍️✍️ #🔊తెలుగు చాట్రూమ్😍
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం! ( World Press Freedom Day )! ( 3 - 5 - 2026)!
లేదా
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్చా ప్రాముఖ్యతను ప్రభుత్వాలు గుర్తించి తీరాలి!
ఈ రోజు అంటే ( మే 3 ) ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవాన్ని పురస్కరించుకొని దీని వెనుక ఉన్న ప్రదాన నేపథ్యాన్ని మనం ఈ ప్రత్యేక సందర్బంగా మనం ఒక్కసారి మననం చేసుకుంటే,స్మరించుకుంటే 1991లో ( UNESCO ) జనరల్ కాన్ఫరెన్స్ సిఫార్సు మేరకు, 1993లో ఐక్యరాజ్యసమితి దీనిని అధికారికంగా స్థాపించింది.ఇక ఈ ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవ ఉద్దేశ్యం గురించి చెప్పాలంటే భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించడం,పత్రికా స్వేచ్చాను రక్షించడం, వార్తా సేకరణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులను స్మరించుకోవడం.అలాగే దీని ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ప్రభుత్వాలు పత్రికా స్వేచ్చను గౌరవించేలా గుర్తుచేయడం మరియు ప్రజాస్వామ్యనికి పత్రికలు వెన్నెముక అని చాటి చెప్పడం.అంతేకాదు ఈ ప్రత్యేక సమయాన స్వేచ్చాయుతమైన పత్రికా రంగం ఈ ఆరోగ్యకరమైన సమాజానికి ఓ సంకేతం అనే విషయాన్ని మనమంతా తప్పక గ్రహించి తీరాలి.అంతేకాదు నిజాలను నిర్భయంగా వెలికి తీస్తున్న జర్నలిస్టులకు సెల్యూట్ చేయాల్సిన గురుతరబాధ్యత ఈ సమాజంలోని, ప్రజాస్వామ్యంలోని ప్రజలం అయిన మనందరిపై ఎంతైనా వుంది.అన్నింటికి మించి ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం యొక్క ప్రదాన లక్ష్యాలు ఏవి అనే ప్రదాన అంశాన్ని ఒక్కసారి మనం బేరీజు వేసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని మనం ఒక్కసారి గుర్తుచేసుకోవాలి.అదేమాదిరి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన,అశువులు బాసిన జర్నలిస్టులకు నివాళులర్పించడం మరియు వారి రక్షణకు మనం ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. ఇంకా చెప్పుకుంటూపోతే స్వీయ - సెన్సార్ షిప్ తగ్గించి, ప్రతీకార భయం,ఆన్ లైన్ వేధింపులు మరియు ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పెరుగుతున్న స్వీయ - సెన్సార్ షిప్ ను అరికట్టడం, నిజాయితీ గల పాత్రికేయం అనే అంశానికి మనం వస్తే స్వతంత్ర,నైతిక మరియు నిర్భయమైన పాత్రికేయాన్ని ప్రోత్సహించడం.( Fearless Journalism ).
ఏదిఏమైన 2026 ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం గొప్పతనం,ప్రత్యేకత గురించి ఒక్క మాటలలో చెప్పాల్సి వస్తే జర్నలిస్టుల స్వేచ్చను మరియు నిజాయితీని కాపాడటం,సమాజంలో మీడియా పాత్రను బలోపేతం చేయడంపై మనమంతా అంటే ప్రభుత్వాలు,ప్రజలు సైతం ఓక యుద్ధ ప్రాతిపదికన దృష్టి పెట్టాలి.అలాగే 2026 ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ డే కాన్ఫరెన్స్ ' శాంతి భవిష్యత్తు ' ను రూపొందించే దిశగా ముందడుగు వేస్తుంది. (Shaping a Future of Peace) అనే థీమ్ తో మున్ముందుకు సాగేలా ప్రోత్సహన్ని అందిస్తుంది.ఏమైనా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఏప్రిల్ 30, 2026 విడుదల చేసిన పత్రికా స్వేచ్చ సూచికలో భారతదేశం 180 దేశాలలో 157వ స్థానంలో నిలిచింది.దీన్ని బట్టి చూస్తే మన భారతదేశం పత్రికా స్వేచ్ఛలో ఎంతో వెనుకబడి వుంది,మున్ముందు ఎంతో పురోభివృద్దిని ఈ రంగంలో మన దేశం సాదించి తీరాలి.అదేమాదిరి వాక్ స్వాతంత్య్రం మరియు భావ ప్రకటన స్వేచకు మీడియాకు ఉన్న హక్కు,భారతదేశంలోని ప్రతి పౌరుడి హక్కు కంటే ఎక్కువ కాదు,తక్కువ కాదు. అయినప్పటికీ 1991 కోర్టు దిక్కరణ చట్టంలోని 2,3,4,5 మరియు 7 సెక్షన్లలో సహా అనేక విభాగాలు న్యాయవ్యవస్థ మీడియా మధ్య ఉన్న సంబంధానికి నేరుగా సంబందించినది కూడా.అన్నింటికి మించి ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం అయిన ఈ సుదినాన అశేష కోట్లాది మంది ప్రజలం అయిన అయిన మనమంతా మనసా,వాచ,కర్మణ హృదయపూర్వకంగా కోరుకోవాల్సింది ఒక్కటే ఈ సమాజాన్ని,ప్రజలను నిద్రాణావస్థ నుండి మేల్కొలిపే జర్నలిస్టుల హక్కులు మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా వర్ధిల్లాలని,వారు వారి కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అత్యంత సురక్షితంగా ఉండాలని!అమర్ రహే! అమర్ రహే! జోహార్! తమ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన,అశువులు బాసిన జర్నలిస్టు సోదరులు! జైహింద్! మేరా హిందూస్తాన్ మహాన్!🎤🎤🎤✍️✍️✍️!
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! ## 👨🏻💼️ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం📰
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం! ( World Press Freedom Day )! ( 3 - 5 - 2026)!
లేదా
ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్చా ప్రాముఖ్యతను ప్రభుత్వాలు గుర్తించి తీరాలి!
ఈ రోజు అంటే ( మే 3 ) ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవాన్ని పురస్కరించుకొని దీని వెనుక ఉన్న ప్రదాన నేపథ్యాన్ని మనం ఈ ప్రత్యేక సందర్బంగా మనం ఒక్కసారి మననం చేసుకుంటే,స్మరించుకుంటే 1991లో ( UNESCO ) జనరల్ కాన్ఫరెన్స్ సిఫార్సు మేరకు, 1993లో ఐక్యరాజ్యసమితి దీనిని అధికారికంగా స్థాపించింది.ఇక ఈ ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవ ఉద్దేశ్యం గురించి చెప్పాలంటే భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించడం,పత్రికా స్వేచ్చాను రక్షించడం, వార్తా సేకరణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులను స్మరించుకోవడం.అలాగే దీని ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే ప్రభుత్వాలు పత్రికా స్వేచ్చను గౌరవించేలా గుర్తుచేయడం మరియు ప్రజాస్వామ్యనికి పత్రికలు వెన్నెముక అని చాటి చెప్పడం.అంతేకాదు ఈ ప్రత్యేక సమయాన స్వేచ్చాయుతమైన పత్రికా రంగం ఈ ఆరోగ్యకరమైన సమాజానికి ఓ సంకేతం అనే విషయాన్ని మనమంతా తప్పక గ్రహించి తీరాలి.అంతేకాదు నిజాలను నిర్భయంగా వెలికి తీస్తున్న జర్నలిస్టులకు సెల్యూట్ చేయాల్సిన గురుతరబాధ్యత ఈ సమాజంలోని, ప్రజాస్వామ్యంలోని ప్రజలం అయిన మనందరిపై ఎంతైనా వుంది.అన్నింటికి మించి ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం యొక్క ప్రదాన లక్ష్యాలు ఏవి అనే ప్రదాన అంశాన్ని ఒక్కసారి మనం బేరీజు వేసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని మనం ఒక్కసారి గుర్తుచేసుకోవాలి.అదేమాదిరి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన,అశువులు బాసిన జర్నలిస్టులకు నివాళులర్పించడం మరియు వారి రక్షణకు మనం ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. ఇంకా చెప్పుకుంటూపోతే స్వీయ - సెన్సార్ షిప్ తగ్గించి, ప్రతీకార భయం,ఆన్ లైన్ వేధింపులు మరియు ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా పెరుగుతున్న స్వీయ - సెన్సార్ షిప్ ను అరికట్టడం, నిజాయితీ గల పాత్రికేయం అనే అంశానికి మనం వస్తే స్వతంత్ర,నైతిక మరియు నిర్భయమైన పాత్రికేయాన్ని ప్రోత్సహించడం.( Fearless Journalism ).
ఏదిఏమైన 2026 ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం గొప్పతనం,ప్రత్యేకత గురించి ఒక్క మాటలలో చెప్పాల్సి వస్తే జర్నలిస్టుల స్వేచ్చను మరియు నిజాయితీని కాపాడటం,సమాజంలో మీడియా పాత్రను బలోపేతం చేయడంపై మనమంతా అంటే ప్రభుత్వాలు,ప్రజలు సైతం ఓక యుద్ధ ప్రాతిపదికన దృష్టి పెట్టాలి.అలాగే 2026 ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ డే కాన్ఫరెన్స్ ' శాంతి భవిష్యత్తు ' ను రూపొందించే దిశగా ముందడుగు వేస్తుంది. (Shaping a Future of Peace) అనే థీమ్ తో మున్ముందుకు సాగేలా ప్రోత్సహన్ని అందిస్తుంది.ఏమైనా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఏప్రిల్ 30, 2026 విడుదల చేసిన పత్రికా స్వేచ్చ సూచికలో భారతదేశం 180 దేశాలలో 157వ స్థానంలో నిలిచింది.దీన్ని బట్టి చూస్తే మన భారతదేశం పత్రికా స్వేచ్ఛలో ఎంతో వెనుకబడి వుంది,మున్ముందు ఎంతో పురోభివృద్దిని ఈ రంగంలో మన దేశం సాదించి తీరాలి.అదేమాదిరి వాక్ స్వాతంత్య్రం మరియు భావ ప్రకటన స్వేచకు మీడియాకు ఉన్న హక్కు,భారతదేశంలోని ప్రతి పౌరుడి హక్కు కంటే ఎక్కువ కాదు,తక్కువ కాదు. అయినప్పటికీ 1991 కోర్టు దిక్కరణ చట్టంలోని 2,3,4,5 మరియు 7 సెక్షన్లలో సహా అనేక విభాగాలు న్యాయవ్యవస్థ మీడియా మధ్య ఉన్న సంబంధానికి నేరుగా సంబందించినది కూడా.అన్నింటికి మించి ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం అయిన ఈ సుదినాన అశేష కోట్లాది మంది ప్రజలం అయిన అయిన మనమంతా మనసా,వాచ,కర్మణ హృదయపూర్వకంగా కోరుకోవాల్సింది ఒక్కటే ఈ సమాజాన్ని,ప్రజలను నిద్రాణావస్థ నుండి మేల్కొలిపే జర్నలిస్టుల హక్కులు మరో పది కాలాల పాటు అత్యంత దిగ్విజయంగా వర్ధిల్లాలని,వారు వారి కుటుంబాలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అత్యంత సురక్షితంగా ఉండాలని!అమర్ రహే! అమర్ రహే! జోహార్! తమ విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన,అశువులు బాసిన జర్నలిస్టు సోదరులు! జైహింద్! మేరా హిందూస్తాన్ మహాన్!🎤🎤🎤✍️✍️✍️!
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #ysr
బేతంచెర్ల మండలం విద్య,వైద్య,
రవాణా రంగాలలో అగ్రగామిగా నిలవడమే మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక శాఖమాత్యులు గౌరవనీయులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నయ్య గారి స్వప్నం,ఆశయం,మండలంలో నీటి దాహర్తిని సమూలంగా రూపుమాపడమే ఆయన ఏకైక ఎజెండా,ఓ బలీయమైన ఆకాంక్ష! జై జై జగన్!జై జై బుగ్గన! ✍️✍️✍️ #ysr
ప్రపంచంలో అత్యంత ఎతైనా హిందూ దేవాలయం తమిళనాడులోని శ్రీరంగంలో నిర్మితమైంది! ఈ దేవాలయ చరిత్రను ప్రతి హిందూ బంధువు తప్పక తనివితీరా తెలుసుకొని తరించాలి! జై శ్రీరామ్!🏹🏹🏹 #శుభ శనివారం
దిన దిన వర్ధమానంగా వెలుగొందుతున్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం,ప్రశాంతతకు మారుపేరు,భక్తుల కొంగు బంగారం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం!
లేదా
నిత్యకళ్యాణం పచ్చతోరణంలా తిరుమలకు పోటేత్తుతున్న భక్త జన సందోహం!
నిత్యం లక్షలాది మంది అశేష జనభక్త కోటి సందర్శించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వైభవాన్ని, అత్యంత మహిమాన్వితమైన ఆ ఏడుకొండలవాడు, తెల్ల నామాల వాడు,వడ్డీ కాసులవాడు,ఎల్లరు ఏలేటి వాడు,శంఖు చక్రాల వాడు ఇక్కడ అవతరించిన అత్యంత అపురూపమైన గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం, పుణ్య, కర్మభూమి,ప్రపంచంలోనే ఎక్కువమంది, మిక్కిలి భక్తులు సందర్శించే రెండవ అతి పెద్ద దేవాలయంగా ప్రసిద్ధి గాంచిన ఈ వెంకటరమణుని, పరందాముని,వరాలు ఇచ్చేవారైనా ఆ వెంకన్న స్వామి దివ్య మహిమలను గురించి వర్ణించడం ఎవరి తరం? ఎంత పొగిడిన తనివి తీరదు.ఏ క్షేత్రమేగిన,ఏ దేశమేగిన,ఎందుకాలిడిన పొగడరా ఈ భూమి భారతిని అంటారే ఆ విధంగా ఈ దీనజన వల్లభుడిని, అనాధ రక్షకుడిని,ఆపద మొక్కుల వాడిని,కరుణా కృప కటాక్షల గురించి ప్రతి ఓక్క హిందువు గర్వపడేలా చెప్పుకునే అత్యంత అపురూపమైన ఈ సర్వాంగ సుందరమైన అత్యంత ప్రశాంత వాతావరణంలో నిత్యం వేదాలను ఆపసోపాన పట్టిన వేద పండితులచే అంగ రంగ వైభవంగా అనేక శాస్రోక్తమైన పూజలు, కైంకర్యాలు,సేవలు అందుకుంటూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ వారికి కొంగుబంగారంగా బాసిల్లుతున్న ఈ నల్ల నల్లని వాడు,నీలి మేఘశ్యాముడు, వేంకటరమణుడు ఇలా దిన దిన వర్ధమానంగా వెలుగొందుతున్న తీరుతెన్నులు నిజంగా నభూతో నభవిష్యత్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.ఇక సౌకర్యాల విషయానికి వచ్చేసరికి నిత్యం లక్ష మందిభక్తుల దాక సందర్శించే ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అశేష జన భక్త సముహరానికి ఉచిత కాటేజీ,ఉచిత దర్శనం,ఉచిత భోజనం,ఉచిత ప్రసాద వితరణ,త్రాగునీరు ఇలా ఎలాంటి ఇబ్బందులు,లోటు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎంతో అంకితభావంతో,దృఢదీక్షతో తమ విధులు నిర్వర్తిస్తున్న తీరు ఎంతో హర్షణీయం, అభినందనీయం.
ఏదిఏమైనా గతంలో ఓ రెండు సంవత్సరాలు( 2020 - 22) కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో కోవిడ్ నిబంధనల మూలంగా భక్తుల సందడి,తాకిడి,రాకపోకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి కాస్తంత తగ్గినా,ఈ మధ్యకాలంలో అంటే గత కొంత కాలంగా కరోనా తగ్గు ముఖం పట్టడంతో తిరిగి మళ్ళీ హిందూ భక్త ప్రభంజనం ఈ ఏడుకొండలవాని,నారాయణుని వద్దకు పోటేత్తడం ప్రారంభం అయ్యింది,మొదలయింది ఈ గోపాలుని, అందచందాల వాడైనా,గోవిందుని దర్శనార్థం,ఆయన లీలలతో ఎంతో విలువైన తమ జీవితాలను ఆనందమయం చేసుకోవడానికి.ఏమైన నిత్యం కనివీని ఎరుగని విధంగా ఆ గోవిందుని,అదిశేషుని దర్శనార్థం విచ్చేసే భక్త జన సౌకర్యార్థం వారికి సుఖమైన రీతిలో, సురక్షితంగా దర్శన భాగ్యం కలిగించేందుకు ప్రతి రోజు, ఎల్లవేళలా దాదాపు 20,000 మంది దాక అహోరాత్రులు నిధులు అత్యంత నిజాయితీ గా నిర్వర్తిస్తున్న వారి సేవా తత్పరతకు,వారి అంకుటిత దీక్షకు ఒక్కసారి మనమంతా అంటే అశేష హిందూ భక్త జన కోటి అయిన మనమందరం వారికి జేజేలు పలుకుదాం,వారికి శతకోటి ధన్యవాదములు తెలియజేద్దాం!ఏడుకొండలవాడ వెంకటరమణ, అనాదదరక్షక,ఆపద్భాందవ,దీన జన వల్లభుడా,ఆపదల మొక్కులవాడ గోవిందా గోవిందా!🕉️🕉️🕉️🙏🙏🙏✍️✍️✍️
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #శుభ శనివారం
డాన్స్ చేయడానికి ఉత్సహాం వుంటే చాలు స్థులకాయం ఏ మాత్రం అడ్డురాదని నిరూపించిన ఈ భారీకాయుడుకు మనమంతా ఒక్కసారి హ్యాట్సాఫ్ చెబుదాం!✍️✍️✍️✍️🧛♀️🧛♂️🧛♂️🧛♂️👨🍼👨🍼👨🍼 #dance
పులివెందుల ముద్దుబిడ్డ వైస్సారు,మా పురిటి గడ్డ మిమల్ని మరువదు సారు! క్యాప్షన్ : పేద,సామాన్య,బడుగు బలహీనవర్గాల పెన్నిధి,రైతుభాంధవుడు దివంగత మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం,డాక్టర్ వైస్సార్ తాను సీఎంగా పనిచేసిన కాలంలో ప్రజల సౌకర్యార్థమై 108 అంబులెన్సు సర్వీస్,మహిళలకు పావలా వడ్డీ రుణాలు,పేద విద్యార్థులు చదువుకునేందుకు ఫీజురీయింబర్స్ మెంట్,రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ,పేద,సామాన్య ప్రజలకు ఏదైనా పెద్ద జబ్బు వచ్చినప్పుడు వారు చికిత్సతీసుకునే నిమితమై ఆరోగ్యశ్రీ వంటి పథకాలను ప్రవేశపెట్టి వారి హృదయాలలో కొలువై ఉన్న దేవుడిలా నేటికీ వారి చేత కొనియాడబడుతున్నాడు మాట మీద నిలబడే మడమ తిప్పని నేత,ఇచ్చిన హామీకీ,చెప్పిన మాటకు ఆరునూరైనా కట్టుబడే మహానేత,ఓ గొప్ప సుపరిపాలకుడు,నిరుపేదల తలవ్రాతను మార్చిన మేరుగరణధీరుడు ఈ మన దివంగత డాక్టర్ వైస్సార్! జోహార్ వైస్సార్! అమర్ రహే పులివెందుల ముద్దుబిడ్డ డాక్టర్ వైస్సార్!✍️✍️✍️
- మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు! #ysr
దీపావళి పండుగ అంటేనే మన కుటుంబాలలో ఎనలేని కళాకాంతులతో కూడిన సంతోషాలహరివిల్లు ఉప్పొంగిపోతుంటుంది!🧨🧨🧨🏹🏹🏹 #deepavali





