19న అరకు నియోజకవర్గ
*మినీ మహానాడు* #🆕Current అప్డేట్స్📢
..............................................
తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జిలు, గ్రామ అధ్యక్షులు, జడ్పిటిసిలు, మాజీ జడ్పిటిసిలు, ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, రాష్ట్రస్థాయిలో వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు , డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ అనుబంధ శాఖల్లో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముఖ్య విజ్ఞప్తి....
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహించే *మహానాడు* ఈ ఏడాది మే 27 నుంచి 29 వరకు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు *శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు* తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ **శ్రీ నారా లోకేష్ గారు* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ *శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు* నిర్ణయించడం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లాలో ఈ వేడుక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో నిర్వహించనున్న *మినీ మహానాడు* అరకు నియోజకవర్గంలో మే 19న అనగా మంగళవారం అరకు వేలిలోని వాలీబాల్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అరకు నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాం.
======================
ఇట్లు
*డా. సియ్యారి దొన్ను దొర* గారి క్యాంప్ కార్యాలయం - అరకువాలీ
రాహుల్కు విజయ్ సాలువా సత్కారం!
సీఎం ప్రమాణస్వీకారంలో వైరల్ సీన్స్ ఇవిగో..!
తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధినేత జోసఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేసిన వేళ, కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి విజయ్ సాలువాతో సత్కారం చేశారు. అనంతరం రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రముఖులతో కలిసి ప్రమాణస్వీకార వేదిక వైపు విజయ్ నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
విజయ్ ప్రమాణస్వీకారం చేసిన క్షణాలు, సభలోని ముఖ్య అతిథులు, అభిమానుల హర్షధ్వానాలు, కార్యక్రమంలోని ముఖ్య ఘట్టాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా చూడొచ్చు. #🆕Current అప్డేట్స్📢
*విజయవాడలో ‘విష చేపల’ వణుకు.!రైల్వే చెరువుల్లో రాక్షస సాగు*
*విజయవాడలో ఫుడ్ టెరర్ కలకలం* ..!
చేపల పేరుతో విషం అమ్ముతున్నారా..?
*సెంట్రల్ రైల్వే చెరువుల్లో షాకింగ్ దందా* ..!
*కోడి వ్యర్థాలతో చేపల పెంపకం* ..!
ప్రజల ప్రాణాలతో కోట్ల గ్యాంబ్లింగ్..!
*రాత్రిళ్లు చెత్త.. పగళ్లూ చేపల అమ్మకాలు* ..!
*విజయవాడలో సంచలన ఫిష్ స్కాం..!
చెరువుల్లో కోడి వ్యర్థాలు* ..!
మార్కెట్లోకి చేరుతున్న చేపలపై భయం..!
ఇదేం ఫిష్ మాఫియా రా బాబోయ్..!
కోడి* చెత్తతో కోట్ల దందా..!
చేపల చెరువుల్లో డెత్ గేమ్..!
ప్రజల ఆరోగ్యంపై పడా బాబుల పందెం..!
*విజయవాడలో బిగ్ ఎక్స్పోజ్..!
కోడి వ్యర్థాలతో చేపల పెంపకం ఆరోపణలు..!
*కోడి చెత్త నుంచి డైనింగ్ టేబుల్ వరకూ* ..!
*విజయవాడలో కలకలం రేపుతున్న చేపల దందా* ..!
రైల్వే చెరువుల్లో విషపు వ్యాపారం..?
అధికారుల మౌనం వెనుక మిస్టరీ ఏంటి..?
కోట్ల కోసం కర్కశం..!
ప్రజల ప్రాణాలతో చేపల మాఫియా ఆట..!
విజయవాడలో ఫుడ్ బాంబ్ పేలిందా..?
కోడి వ్యర్థాలతో చేపల సాగుపై తీవ్ర ఆరోపణలు..!
చెరువుల్లో చెత్త.. జనాల ప్లేట్లో చేపలు..!
ఇదేం దారుణం విజయవాడలో..!
చేపల సాగు కాదు..!
ప్రజల ఆరోగ్యంపై బయో వార్..! #🆕Current అప్డేట్స్📢
*రిటైర్డ్ డీజీ సతీమణి తనూజ హత్య కేసు..* #🆕Current అప్డేట్స్📢
*సంచలన విషయాలు వెల్లడించిన సీపీ సజ్జనార్*
జూబ్లీహిల్స్లోని ప్రశాసన్ నగర్లో రిటైర్డ్ డీజీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ (55) హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. రిటైర్డ్ డీజీ సతీమణి తనూజ హత్య గావింపబడిందని తమకు మొదటగా సమాచారం వచ్చిందని తెలిపారు. రిటైర్డ్ డీజీ భార్య తనూజను నిన్న (గురువారం) రాత్రి రెండు గంటలకు దుండగులు హత్య చేశారని చెప్పుకొచ్చారు. నేపాలి గ్యాంగ్ పనిగా ప్రాథమికంగా తాము ఒక అంచనాకు వచ్చామని అన్నారు. కొన్ని క్లూస్ లభించాయని.. ఆ క్లూస్ ఆధారంగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నేపాలి పనివాళ్లపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పనిమనిషి కల్పన ఈ హత్య చేసింది..
నేపాలి పని మనుషులు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేరాలకు పాల్పడుతున్నారని సీపీ సజ్జనార్ చెప్పుకొచ్చారు. నిన్న (గురువారం) రాత్రి రిటైర్డ్ డీజీ ఇంట్లో ఎవరు లేనప్పుడు పనిమనిషి కల్పన అనే మహిళ మరికొందరితో కలిసి ఈ క్రైమ్ చేసిందని తెలిపారు. నిందితులు వెనుకాల గేటు నుంచి ఇంట్లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. ఈ ఘటన సమయంలో పిల్లలు ఇద్దరు పై ఫ్లోర్లో ఉన్నారని.. తనూజ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారని వెల్లడించారు. ఇంట్లో ఉన్న పనిమనిషి కల్పనాతో బయట వ్యక్తులు కాంటాక్ట్ పెట్టుకొని ఈ క్రైమ్ చేశారని చెప్పారు. ప్రజలు భయాందోళనకు గురికావొద్దని.. నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.
వాళ్లపై నిఘా ఉంచాలి..
నేపాలి పనిమనుషులు ఇంట్లో ఏడాది, రెండో ఏడాది పనిచేసిన కూడా వాళ్లపై నిఘా ఉంచాలని సీపీ సజ్జనార్ అన్నారు. ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుంటున్నామని తెలిపారు. చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను ఈ గ్యాంగ్ హత్య చేసిందని చెప్పారు. రిటైర్డ్ డీజీ తల్లి కోసం తనూజ హైదరాబాద్ వచ్చారని తెలిపారు. ఇటీవల రిటైర్డ్ డీజీ తల్లి మరణించారని.. అప్పటి నుంచి మృతురాలు తనూజ ఇక్కడే ఉంటున్నారని వివరించారు. ఈ కేసులో ఎంత బంగారం, నగదు పోయిందనే అంశాలపై ఆరా తీస్తున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు..
*_BIG BREAKING: విజయ్కు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్..!!_* #🆕Current అప్డేట్స్📢
_టీవీకే పార్టీకి గుడ్న్యూస్ అందింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 ఎమ్మెల్యేల మెజార్టీ లభించింది. ఇప్పటికే విజయ్కు 112 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా.._
_మరో ఆరుగురు ఎమ్మెల్యేలు సపోర్ట్ కావాలి. దీంతో తాజాగా వామపక్ష పార్టీలు, వీసీకే పార్టీ విజయ్కు మద్దతిచ్చాయి. సీపీఐ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు, సీపీఎం నుంచి ఇద్దరు, అలాగే వీసీకే నుంచి గెలిచిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. దీంతో టీవీకే ఎమ్మెల్యేల బలం 118కి చేరింది._
_అయితే సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజాకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు. టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే వీసీకే అధినేతకు ఆయన కాల్ చేసి విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్ మద్దతివ్వగా.. తాజాగా CPI, CPM, VCK సపోర్ట్తో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో సాయంత్రం 4.30 గంటలకు విజయ్ మరోసారి గవర్నర్ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు పర్మిషన్ ఇవ్వాలని కోరనున్నారు. దీంతో విజయ్ రేపే (శనివారం) సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ప్రచారం నడుస్తోంది._
అధికారిక ప్రకటన విడుదల చేసిన తమిళనాడు గవర్నర్ ఆఫీస్ *చెన్నై : టీవీకే అధినేత విజయ్తో భేటీపై ప్రెస్నోట్ విడుదల చేసిన తమిళనాడు లోక్భవన్..!*
*ఈరోజు గవర్నర్ ఆర్లేకర్తో టీవీకే పార్టీ అధినేత విజయ్ భేటీ అయ్యారు.*
*సంఖ్యాబలం చూపించాలని విజయ్ను గవర్నర్ కోరారు.. సంఖ్యాబలంపై టీవీకే పార్టీ పూర్తి వివరాలు అందించలేదు.*
*అవసరమైన ఎమ్మెల్యేల మద్దతుతో రావాలని గవర్నర్ విజయ్కు వివరించారు.*
*: ప్రెస్నోట్లో తమిళనాడు లోక్భవన్* #🆕Current అప్డేట్స్📢
*బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారు* #🆕Current అప్డేట్స్📢
కోల్కతా, మే 06: పశ్చిమ బెంగాల్లో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. దీంతో భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తుంది. ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టనున్నారనే అంశంపై పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో ఒకరిని ఎంపిక చేసేందుకు ఆ పార్టీ అగ్ర నాయకత్వం రాష్ట్రానికి చెందిన కీలక నేతలతో వరుసగా చర్చలు జరుపుతోంది. అయితే పశ్చిమ బెంగాల్ రాజకీయాలకు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది.
మే 9వ తేదీ (శనివారం) ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య బుధవారం కోల్కతాలో ప్రకటించారు. ఉదయం10 గంటలకు మహానగరంలోని ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం జరుగుతుందని వివరించారు.
గురువారం సాయంత్రం కోల్కతాలో శాసనసభా పక్ష సమావేశం జరుగుతుందని సమీక్ భట్టాచార్య తెలిపారు. ఈ సమావేశంలో శాసనసభా పక్ష నేతను పార్టీ ఎమ్మెల్యేలు అంతా కలిసి ఎన్నుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్రం మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే నాయకులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నేతలతోపాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో కొత్తగా కొలువుదీరనున్న మంత్రి వర్గంలో దాదాపు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర నాయకత్వం చెబుతుంది. మరోవైపు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికే దృష్టి కేంద్రీకరించారు.
*ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించిన పులిట్జర్ పురస్కారం* #🆕Current అప్డేట్స్📢
డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను వెలుగులోకి తెచ్చినందుకు ఆనంద్ ఆర్కే, సుపర్ణా శర్మకు పులిట్జర్.
*_Weather Update: వేసవిలో చల్లని కబురు, తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన... రేపు ప్రాంతాలకు రెయిన్ అలర్ట్_* #🆕Current అప్డేట్స్📢
_తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం కొనసాగుతుంది. వేసవిలో ఓవైపు భానుడి భగభగలు కొనసాగుతుండగా... మరోవైపు ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి._
_తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలోని పలుచోట్ల వడగాళ్ల వానలు...ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. అయితే మరో రెండు, మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ఎండల తీవ్రత మధ్య కురుస్తున్న వర్షాలు... వేసవి తీవ్రత నుంచి జనాలకు ఉపశమనం కలిగించగా, రైతులు మాత్రం చేతికి వచ్చిన పంట దెబ్బతింటుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో సోమవారం రోజున వెదర్ ఏ విధంగా ఉండనుందనే దానిపై వాతావరణ శాఖ అంచనాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం..._
_ఐఎండీ హైదరాబాద్ విభాగం ప్రకారం... తెలంగాణలో రానున్న నాలుగైదు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఆ తర్వాత మూడు రోజులలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది._
_సోమవారం (మే 4) రోజున రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హునుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది._
_ఇక, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే... ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా కొమోరియన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతుందని వెల్లడించింది. కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది._
_సోమవారం రోజున ఉత్తర కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది._
*మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు*
నైరుతి రుతుపవనాలు ఈసారి నిర్ణీత సమయం కంటే ముందుగానే, మే 14-16 తేదీల మధ్య అండమాన్ దీవులను తాకే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీనివల్ల మే నెలలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాదిలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే సూచనలున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పగలు, రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు అధికంగా ఉండి, ఉక్కపోత వేధించనుంది. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. #🆕Current అప్డేట్స్📢










![🆕Current అప్డేట్స్📢 - +0|#595 1="5 మ [ి] Halkape +0|#595 1="5 మ [ి] Halkape - ShareChat 🆕Current అప్డేట్స్📢 - +0|#595 1="5 మ [ి] Halkape +0|#595 1="5 మ [ి] Halkape - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_531186_cc80814_1778032528183_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=183_sc.jpg)

