
Rochish Sharma Nandamuru
@nvsrs
🤗అందరు బాగుండాలి అందులో నేనుండాలి🙂
నిద్రపోయే ముందు ఒక చిన్న మాట...🙏🙏😴😴 #😴శుభరాత్రి #😇My Status #✌️నేటి నా స్టేటస్ #💗నా మనస్సు లోని మాట #😇శివ లీలలు✨
Kushitha Kallapu...🧡🧡🧡 #Wednesday crash...❤️ #First crush for me #👩టాలీవుడ్ భామలు #😍కుషిత కల్లపు❤️ #😍kushitha kallapu❤️
Kushitha Kallapu...🧡🧡🧡 #Wednesday crash...❤️ #First crush for me #👩టాలీవుడ్ భామలు #😍కుషిత కల్లపు❤️ #😍kushitha kallapu❤️
Record Dancer Smiley Suneetha...😍😍😍 #Wednesday crash...❤️ #First crush for me #👩టాలీవుడ్ భామలు #💖💖స్మైలీ సునీతా💖💖 #💖💖💖Smiley Suneetha💖💖💖
Record Dancer Smiley Suneetha...😍😍😍 #Wednesday crash...❤️ #First crush for me #👩టాలీవుడ్ భామలు #💖💖స్మైలీ సునీతా💖💖 #💖💖💖Smiley Suneetha💖💖💖
Bhavana Reddy Vangala...♥️♥️♥️ #Wednesday crash...❤️ #First crush for me #👩టాలీవుడ్ భామలు #😍భావన రెడ్డి వంగళ..❤️ #😍Bhavana Reddy Vangala..❤️
Bhavana Reddy Vangala...♥️♥️♥️ #Wednesday crash...❤️ #First crush for me #👩టాలీవుడ్ భామలు #😍భావన రెడ్డి వంగళ..❤️ #😍Bhavana Reddy Vangala..❤️
🌹🙏కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు...!!
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌸హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.
🌷1.విద్యాప్రాప్తికి:-
🌿పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన! సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!
🌷2.ఉద్యోగ ప్రాప్తికి :-
🌸హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే | ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే ||
🌷3.కార్యసాధనకు :-
🌿అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద | రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో ||
🌷4. గ్రహదోష నివారణకు :-
🌸మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ | శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో ||
🌷5. ఆరోగ్యమునకు :-
🌿ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా | ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే ||
🌷6. సంతాన ప్రాప్తికి :-
🌸పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్ |
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే ||
🌷7. వ్యాపారాభివృద్ధికి :-
🌿సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్ | అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్ ||
🌷8. వివాహ ప్రాప్తికి :-
🌸యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః | వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే ||
🌿ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు...స్వస్తి...🚩🌞🌹🙏
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
.
#🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩 జై భబజరంగబలి🙏
*శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఆరు దివ్య క్షేత్రాలు*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
శివుని కుమారునిగా పూజలందుకునే సుబ్రహ్మణ్యస్వామికి పురాణాల పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రమణ్యస్వామి అన్ని దైవాలతో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆరు ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రమణ్యేశ్వరునికి తమిళనాడులోనే అనేక ఆలయాలు అధికంగా ఉండడం విశేషం.
ఆంద్రప్రదేశ్ లో శైవ, వైష్ణవ క్షేత్రాలు అధికంగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రమణ్యేశ్వరుని ఆలయాలు ఎక్కువ సంఖ్యలో కొలువై ఉన్నాయి. ఆరుముఖల స్వామిగా తమిళులకు ప్రీతిపాత్రమైన సుబ్రమణ్యేశ్వరుని ఆరు దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రమణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునే వారు ఈ ఆరు క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది.
క్రింద చెప్పబడిన ప్రతీ క్షేత్రం గురించి సవివరంగా ఇది వరకే పోస్ట్ చేసాము గమనించగలరు. ఇప్పుడు కేవలం ఆ ఆరు క్షేత్రాలనూ భక్తితో తలచుకుంటున్నాము
తిరుచందూర్
సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీన సుబ్రమణ్యేశ్వరుని దేవాలయం తిరుచందూర్ లో ఉంది. సరన్ అనే రాక్షస రాజును సంహరించేందుకోసం స్వామివారు ఈ తిరుచందూర్ లో కొలువై నిలిచారట. తిరుచందూర్ లోని సుబ్రహ్మణ్యస్వామివారి విగ్రహం కూర్చుని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం.
స్వామిమలై
స్వామి మలై అని పిలిచే ఈ క్షేత్రంకు అత్యంత విశిష్టత ఉంది. తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రమణ్యస్వామి జ్ఞానోపదేశము చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు.
పళని
ఆంద్రప్రదేశ్ లోని తిరుమల క్షేత్రానికి ఎంతటి ప్రసిద్ధి వుందో తమిళనాడులో పళవి క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి ఉంది. తిరుమల తరహాలోనే పళవిలోనూ నిత్యం భక్తులు కిటకిటలాడుతుంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు వెయ్యి మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.
తిరుత్తణి
తిరుపతి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ క్షేత్రంలోనూ విశేషమైన దినాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లిని సుబ్రమణ్యస్వామి తిరుత్తణిలోనే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి.
పరిముదిర్ చోళై
దట్టమైన అడవి ప్రాంతంలో వెలసిన ఈ క్షేత్రం కూడా సుబ్రమణ్యస్వామి దివ్య క్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. పైన పేర్కొన్న క్షేత్రాలే కాకుండా తమిళనాడులోని చాలా ప్రదేశాల్లో సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి.
తిరువరన్ కున్రమ్
తమిళనాడులో ప్రసిద్ధి చెందిన కామాక్షి అమ్మవారు కొలువైన మధురైకు సమీపంలోనే ఈ తిరుపరన్ కున్రమ్ క్షేత్రం కూడా కొలువై ఉంది. తన ఇద్దరూ భార్యలలో ఒకరైన దేవసేనను సుబ్రమణ్యస్వామి వివాహం చేసుకున్న ప్రదేశమే తిరుపరన్ కున్రమ్.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 #🌅శుభోదయం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🦚శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి🕉️🚩
ఇలా నిజరూప దర్శనం ఎప్పుడు అనుగ్రహిస్తాడో ఆ సుబ్రహ్మణ్యుడు అత్యంత అరుదైన దర్శనం
నవ పాషాణ విగ్రహం పళని శ్రీ సుబ్రహ్మణ్యుని నిజరూపం ఈ దర్శనం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం.
🙏పళని దండాయుధపాణిస్వామి🙏
🌷పార్వతీనందనా...సుబ్రహ్మణ్యా🌷
🌿 శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి ఆరు ప్రఖ్యాతక్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో , మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.
🌸శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్యక్షేత్రం పళని.
🙏🌹దండాయుధపాణి🌹🙏
🌿ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళం వాళ్ళు ఈయనను “పళనిమురుగా” అని కీర్తిస్తారు.
🌸ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని , కౌపీన ధారియై , వ్యుప్తకేశుడై నిలబడి , చిరునవ్వులొలికిస్తూ ఉంటారు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణమహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్యఅవతారము అని పెద్దలు చెప్తారు.
🌿ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” - అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్ధం.
🌸అంటే ఈ పళనిక్షేత్రము జ్ఞానమును ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని
🌿ఇక్కడ పళని మందిరంలోని గర్భగుడిలోని స్వామి వారి మూర్తి నవపాషాణములతో చేయబడినది. ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు.
🌸ఈ మూర్తిని సిద్ధ భోగార్ అనే మహర్షి చేశారు. తొమ్మిదిరకాల విషపూరిత పదార్ధాలతో (వీటిని నవపాషాణములు అంటారు) చేశారు. పూర్వ కాలంలో ఇక్కడ పళనిస్వామివారి మూర్తిలో ఊరు (తొడ) భాగము వెనుకనుండి స్వామివారి శరీరంనుండి విభూతి తీసి కుష్ఠరోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే , వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు.
🌿అలా ఇవ్వగా ఇవ్వగా , స్వామివారి తొడభాగం బాగా అరిగి పోవడంతో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామివారిని వెనుకనుండి చూస్తే ఇది కనబడుతుందని పెద్దలు చెప్తారు. కాని మనకి సాధారణంగా ఆ అవకాశం కుదరదు
🌸ఇక్కడ స్వామివారిని ఈ క్రింది నామాలతో స్తుతిస్తూ ఉంటారు
కులందైవళం , బాలసుబ్రహ్మణ్యన్ , షణ్ముఖన్ , దేవసేనాపతి , స్వామినాథన్ , వల్లిమనలన్ , దేవయానైమనలన్ , పళనిఆండవార్ , కురింజిఆండవార్ , ఆరుముగన్ , జ్ఞానపండిత , శరవణన్ , సేవర్ కోడియోన్ , వెట్రి వేల్ మురుగా ...మొదలైన నామాలు ఎన్నో ఉన్నాయి స్వామికి ఇక్కడ
🌿ఇప్పుడు ఉన్న మందిరం సామాన్య శకం ఏడవ శతాబ్దంలో కేరళరాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత
🌸పాండ్యులకాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధిచేయబడింది
ఇంకొక విషయం ఏమిటంటే,పళనిలో
కొండపైకి ఎక్కడానికి
రెండుమార్గాలు ఉంటాయి.
🌿ఓపిక ఉన్నవారు మెట్లమార్గంలో వెళ్లడం ఉత్తమం. మెట్లు కాకుండా , రోప్ వే లాంటి చిన్న రైలుసౌకర్యం కూడా ఉంది. దీనికి టికెట్
యాభైరూపాయలు.
🌸ఒక సారి వెళ్ళడానికి బావుంటుంది. (ఓపిక లేకపోతే ప్రతీ సారి)
🌷🙏పళనిక్షేత్ర స్థలపురాణము:🙏🌷
🌿పూర్వము విఘ్నాలకు అధిపతిని ఎవరిని చెయ్యాలి అని , పార్వతీ పరమేశ్వరులు ఒకనాడు మన బొజ్జవినాయకుడిని , చిన్ని సుబ్రహ్మణ్యుడిని పిలిచి ఈ భూలోకం చుట్టి ( అన్ని పుణ్య నదులలో స్నానం ఆచరించి ఆ క్షేత్రములను దర్శించి రావడం) ముందుగా వచ్చిన వారిని విఘ్నములకు అధిపతిని చేస్తాను అని శంకరుడు చెప్తే ,
🌸అప్పుడు పెద్దవాడు , వినాయకుడు యుక్తితో ఆదిదంపతులు , తన తల్లిదండ్రులు అయిన ఉమామహేశ్వరుల చుట్టూ మూడుమార్లు ప్రదక్షిణ చేస్తారు. మన బుజ్జిషణ్ముఖుడు తన యొక్క
నెమలివాహనముపై భూలోకం చుట్టి రావడానికి బయలుదేరతాడు. కాని , వినాయకుడు
🌿“తల్లిదండ్రుల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణచేస్తే సకలనదులలోనూ స్నానంచేసిన పుణ్యం వస్తుంది” అనే సత్యము తెలుసుకుని , కైలాసంలోనే ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల , సుబ్రహ్మణ్యుడు ఏ క్షేత్రమునకు వెళ్ళినా , అప్పటికే అక్కడ లంబోదరుడు వెనుతిరిగి వస్తూ కనపడతాడు.
🌸ఈ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అయ్యాడు. ఈ కథ మనకు అందరకూ తెలిసినదే
🌿కార్తికేయుడు శివకుటుంబంలో
చిన్నవాడు కదా , దానితో కాస్త చిన్నమొహం చేసుకుని, అలిగి ,కైలాసం వదిలి , భూలోకానికి వచ్చి ఒక కొండశిఖరంమీద నివాసం ఉంటాడు . ఏ తల్లిదండ్రులకైనా పిల్లవాడు అలిగితే బెంగ ఉంటుంది కదా , అందులోనూ చిన్నవాడు ,
🌸శివపార్వతుల అనురాగరాశి గారాలబిడ్డ అయిన కార్తికేయుడు అలా వెళ్ళిపోతే చూస్తూ ఉండలేరు కదా!శివపార్వతులు ఇద్దరూ షణ్ముఖుని బుజ్జగించడం కోసం భూలోకంలో సుబ్రహ్మణ్యుడు ఉన్న కొండశిఖరం వద్దకు వస్తారు*.
🌿ఆ కొండశిఖరం ఉన్న ప్రదేశమును తిరుఆవినంకుడి అని పిలుస్తారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని , “ నువ్వే సకలజ్ఞానఫలానివి నాన్నా” అని ఊరడిస్తారు.
🌸సకలజ్ఞానఫలం (తమిళంలో పలం), నీవు (తమిళంలో నీ) – ఈ రెండూ కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడు అయిన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతముగా ఆ కొండ మీదే కొలువు ఉంటానని అభయం ఇస్తారు. #🌅శుభోదయం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🦚శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి🕉️🚩








