#🏏క్రికెట్ 🏏 #t 20 world cup 2026 #🇮🇳టీమ్ ఇండియా😍
*వెస్టిండీస్పై పదేళ్ల తర్వాత పగ తీర్చుకున్న టీమిండియా🇮🇳*
Mar 02 , 2026🏏
'రావడం లేటవచ్చు.. కానీ రావడం మాత్రం పక్కా' అనే సినిమా డైలాగ్ తరహాలో.. ' ప్రతీకారం తీర్చుకోవడం ఆలస్యం కావచ్చు.. కానీ తీర్చుకోవడం మాత్రం పక్కా' అనే డైలాగ్ టీమిండియా జట్టుకు సరిగ్గా సరిపోతుంది. వెస్టిండీస్ చేతిలో 2016 నాటి ఓటమికి 2026లో భారత్ వడ్డీతో సహా చెల్లించింది.
వెస్టిండీస్పై పదేళ్ల తర్వాత పగ తీర్చుకున్న టీమిండియా
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నిన్న(ఆదివారం) జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ గెలుపుతో పదేళ్ల క్రితం సొంతగడ్డపై సెమీస్లో ఎదురైన ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన సూపర్-8 మ్యాచ్లోసంజు శాంసన్ (97* నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్తో భారత్.. విండీస్పై పగ తీర్చుకుని సెమీస్లోకి దూసుకెళ్లింది. అసలు పదేళ్ల క్రితం నాటి భారత్ ఓటమి ఏమిటి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సరిగ్గా పదేళ్ల క్రితం అంటే 2016 టీ20 ప్రపంచ కప్లో భాగంగా సెమీ ఫైనల్లో భారత్, వెస్టిండీస్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్లో టీమిండియాను వెస్టిండీస్ జట్టు చిత్తుగా ఓడించింది. ముంబైలోని వాంఖెడ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లకు 192 పరుగులు చేసింది. ఆ మ్యాచ్లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 47 బంతుల్లో 89 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కరేబియన్ జట్టు 19.4 ఓవర్లలో 196 పరుగులు చేసి.. భారత్ను ఓడించింది. 192 పరుగులు చేసిన భారత్.. గెలుస్తుందని అందరూ ధీమా ఉన్న వేళ.. వెస్టిండీస్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి 196 పరుగులు చేసి టీమిండియాను టోర్నీ నుంచి బయటకు పంపారు. ఆ రోజు భారతీయుల కళ్లలో నీళ్లు తిరిగిన క్షణాలను ఎవరూ మర్చిపోలేరు. అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని సైతం కన్నీరు పెట్టుకున్నాడు. ఆ టోర్నీలో తర్వాత వెస్టిండీస్ ఫైనల్కు వెళ్లి కప్పు కూడా గెలిచింది. సరిగ్గా పదేళ్లు తిరిగే సరికి అదే వెస్టిండీస్ను.. భారత్ అదే విధంగా ఓడించింది.
ఇంకా విచిత్రం ఏమిటంటే... 2016లో వెస్టిండీస్ చేసిన 196 పరుగుల స్కోర్.. తాజా టోర్నీలో కూడా టీమిండియాకు టార్గెట్. ఈసారి టీమిండియా ఏమాత్రం తడబడలేదు. సంజు శాంసన్ తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్(97 *)తో విండీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. భారత్ కేవలం 19.2 ఓవర్లలోనే 199 పరుగులు చేసి, 5 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టును ఓడించింది. పదేళ్ల క్రితం వారు మనల్ని ఫైనల్కి చేరకుండా అడ్డుకుంటే, ఈరోజు భారత్ వారిని ఓడించి టోర్నీ నుంచే పంపించి ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయం తర్వాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియం మొత్తం భావోద్వేగాలతో నిండిపోయింది. పదేళ్ల క్రితం వాంఖెడేలో మొదలైన బాధాకరమైన కథ, తాజాగా ఈడెన్ గార్డెన్స్లో అద్భుతమైన విజయంతో సుఖాంతమైంది.
#f🤣un..
*శరీర భాగాలు - ఉపయోగాలు*
(నవ్వు తెప్పిస్తుంది సుమా..)
* తల - తాకట్టు పెట్టుకోవడానికి
* గడ్డం – పట్టుకుని బతిమాలడానికి
* ముక్కు – పిండి వసూలు చేయడానికి
* వీపు – విమానం మోత మోగించడానికి
* కాలు – బలపం కట్టుకుని తిరగడానికి
* కాళ్లు - పట్టుకుని బతిమాలడానికి
* అరికాలు – దానిమంట తలకెక్కించుకోవడానికి
* కళ్ళు – నిప్పులు పోసుకోవడానికి
* భుజాలు - గుమ్మడికాయ దొంగ ఎవరో తడుముకోవడానికి
* చెంప – చెల్లుమనిపించడానికి
* వేలు – ఎత్తి చూపించడానికి
* చేతులు – జోడించి నమస్కరించడానికి
* అరచేయి – వైకుంఠం చూపించడానికి
* పొట్ట - తిప్పల కోసం
* నడుము – వంచి పనిచేయడానికి
* నొసలు – చిట్లించడానికి
* మొత్తంగా దేహం – తనువు చాలించడానికి..🫣
#🏏క్రికెట్ 🏏 #t 20 world cup 2026
*నాలుగు దేశాలు, నాలుగు ఖండాలు... సెమీ ఫైనల్స్లో అరుదైన దృశ్యం..❗*
02.03.2026🏏
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ప్రీ క్లైమాక్స్కి చేరుకుంది. 20 దేశాల టీమ్స్ తో మొదలైన టీ20 వరల్డ్ కప్లో 8 దేశాలు సూపర్ 8 స్టేజీకి రాగా అందులో నుంచి నాలుగు టీమ్స్.. సెమీ ఫైనల్స్ ఆడబోతున్నాయి. గ్రూప్ 1 నుంచి సౌతాఫ్రికా, భారత్.. సెమీ ఫైనల్కి అర్హత సాధించగా, గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి.
2022 టీ20 వరల్డ్ కప్, 2024 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్లో భారత జట్టు, ఇంగ్లాండ్తోనే తలబడింది. వరుసగా మూడో టీ20 వరల్డ్ కప్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య సెమీస్ జరగనుంది. మార్చి 4న కోల్కత్తాలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీ ఫైనల్ జరిగితే.. మార్చి 5న ఇంగ్లాండ్ - ఇండియా మధ్య రెండో సెమీస్ జరుగుతుంది.
అయితే 2026 టీ20 వరల్డ్ కప్ సెమీస్లో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సెమీ ఫైనల్స్ ఆడే నాలుగు దేశాలు కూడా నాలుగు ఖండాలకు చెందినవి కావడం విశేషం.
భారత్, ఆసియా ఖండానికి చెందిన దేశం కాగా, ఇంగ్లాండ్ జట్టు, యూరప్ ఖండానికి చెందింది. సౌతాఫ్రికా జట్టు, ఆఫ్రికా ఖండానికి చెందిన టీమ్ అయితే, న్యూజిలాండ్ జట్టు, ఓషియానియా (ఆస్ట్రేలియా) ఖండంలో ఉంది. ఈసారి ఆసియా టీమ్ లేకుండానే సెమీ ఫైనల్స్ జరుగుతుందేమోనని ఐసీసీ కంగారుపడింది. అయితే ఆఖరి సూపర్ 8 మ్యాచ్లో వెస్టిండీస్ని ఓడించిన భారత జట్టు, సెమీ ఫైనల్కి దూసుకెళ్లింది.
2024 టీ20 వరల్డ్ కప్లో ఇండియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్తో పాటు ఆఫ్ఘనిస్తాన్.. సెమీస్ కి అర్హత సాధించింది. ఈసారి ఆఫ్ఘనిస్తాన్ ప్లేస్లో న్యూజిలాండ్, సెమీ ఫైనల్స్కి వచ్చింది.
#🏏క్రికెట్ 🏏 #t 20 world cup 2026 #🇮🇳టీమ్ ఇండియా😍
*విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన సంజూ శాంసన్..సెమీస్లో టీమిండియా🇮🇳*
02.03.2026🏏
కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరిగిన సూపర్-8 డూ-ఆర్-డై మ్యాచ్లో వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో టీమిండియా (India vs WI T20 World Cup 2026) ఘన విజయం సాధించి సెమీ-ఫైనల్కు దూసుకెళ్లింది.
196 పరుగుల భారీ టార్గెట్ను ఛేదించడంలో సంజూ శాంసన్ (97 నాటౌట్) ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించగా, తెలుగోడు తిలక్ వర్మ (27) కీలక భాగస్వామ్యం అందించాడు.
ఈ అద్భుత ఇన్నింగ్స్తో టీ20 వరల్డ్ కప్ ఛేజింగ్లో విరాట్ కోహ్లీ (82 రన్స్) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును సంజూ శాంసన్ చెరిపేశాడు.
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 (India vs WI T20 World Cup 2026) ‘సూపర్ 8’ మ్యాచ్లో టీమిండియా అదరగొట్టింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన పోరులో వెస్టిండీస్ నిర్దేశించిన 196 పరుగుల భారీ టార్గెట్ను మరో 4 బంతులు మిగిలి ఉండగానే, 5 వికెట్లు కోల్పోయి సక్సెస్ ఫుల్ గా ఛేదించింది. ఈ విజయంతో గ్రూప్-1 నుంచి సౌతాఫ్రికాతో పాటు భారత్ అధికారికంగా సెమీ-ఫైనల్స్కు క్వాలిఫై అయింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ (40), షాయ్ హోప్ (32) మంచి పునాది వేయగా.. కెప్టెన్ రోవ్మన్ పావెల్ (34 నాటౌట్), జాసన్ హోల్డర్ (37 నాటౌట్) ఆఖర్లో రెచ్చిపోయారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు తీసి విండీస్ స్కోరు బోర్డుకు కళ్లెం వేసాడు.
భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు పవర్ ప్లే లోనే దెబ్బ తగిలినా.. సంజూ శాంసన్ (50 బంతుల్లో 97 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అతనికి తోడుగా మన తెలుగు కుర్రాడు, హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ కేవలం 15 బంతుల్లోనే 27 పరుగులు చేసి తెలుగు రాష్ట్రాల అభిమానులను ఉర్రూతలూగించాడు. వీరిద్దరి భాగస్వామ్యం విండీస్ బౌలర్ల లయను దెబ్బతీసింది. చివర్లో హార్దిక్ పాండ్యా (17) ఔటైనా.. శివమ్ దూబే సపోర్ట్ తో, రోమారియో షెఫర్డ్ వేసిన ఆఖరి ఓవర్లో శాంసన్ భారీ సిక్సర్, ఆ వెంటనే ఓ కళ్లు చెదిరే ఫోర్ కొట్టి స్టైల్గా మ్యాచ్ను ముగించాడు.
రికార్డుల మోత: ఈ ఛేజింగ్ టీమిండియాకు చాలా ప్రత్యేకం. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో లక్ష్య ఛేదనలో ఒక భారత బ్యాటర్ చేసిన అత్యధిక స్కోరు (97) ఇదే. గతంలో విరాట్ కోహ్లీ (ఆస్ట్రేలియా, పాకిస్థాన్పై 82 పరుగులు) పేరిట ఉన్న ఈ రికార్డును శాంసన్ బ్రేక్ చేశాడు.
గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత్, సూపర్ 8లో సౌతాఫ్రికా చేతిలో ఓడటంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కానీ కఠినమైన ప్రెషర్ సిట్యువేషన్లో జింబాబ్వే, విండీస్ పై వరుసగా భారీ స్కోర్లను నమోదు చేసి డిఫెండింగ్ ఛాంపియన్ ట్యాగ్ను భారత్ నిలబెట్టుకుంది. ముఖ్యంగా స్పిన్ను అద్భుతంగా ఆడే తిలక్ వర్మ ఫామ్లోకి రావడం, రాబోయే నాకౌట్ మ్యాచ్లకు ముందు భారత మిడిలార్డర్ కు కొండంత బలాన్నిచ్చింది.
వాంఖడేలో ఇంగ్లండ్తో అమీతుమీ
విండీస్పై అద్భుత విజయంతో సెమీ-ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు మహా సంగ్రామానికి సిద్ధమైంది. మార్చి 5 (గురువారం) ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న రెండో సెమీ-ఫైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్తో భారత జట్టు తలపడనుంది. వాంఖడే పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలించే అవకాశం ఉండటంతో, మరోసారి పరుగుల వరద ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాకుండా భారత జట్టుకు ఈ మైదానంతో ఉన్న సెంటిమెంట్ (2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, 2023 వన్డే వరల్డ్ కప్ సెమీస్ విజయాలు) అభిమానుల్లో కొండంత ఉత్సాహాన్ని నింపుతోంది. ఇదే జోరు కొనసాగించి, ఇంగ్లండ్ను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
#🏏క్రికెట్ 🏏 #t 20 world cup 2026
*నోరు ఉంది కదా అని వాగితే ఇలానే ఉంటుంది మరి❗*
Jakki Mahesh
March 2, 2026🏏
కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో వెస్టిండీస్ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్ 2026 సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ విజయంతో భారత్ కేవలం సెమీస్కు చేరడమే కాకుండా.. టీమిండియా సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడిన పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్కు చెంపబెబ్బ లాంటి సమాధానం ఇచ్చింది.
ఆమిర్ జోస్యానికి భారత్ 'పవర్'ఫుల్ రిప్లై
ఈ ప్రపంచకప్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ మాజీ ఆటగాడు మహమ్మద్ ఆమిర్ టీమిండియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్ కనీసం సెమీఫైనల్కు కూడా చేరుకోలేదని.. ఈ జట్టులో ఆ సత్తా లేదని ఓ ఇంటర్వ్యూలో ఎద్దేవా చేశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా మైదానంలో అద్భుత ప్రదర్శనతో ఆమిర్ అంచనాలను తలకిందులు చేసింది. ఇప్పుడు భారత్ అధికారికంగా సెమీస్లోకి అడుగుపెట్టడంతో సోషల్ మీడియాలో భారత అభిమానులు మహ్మద్ ఆమిర్ పాత ప్రకటనను గుర్తు చేస్తూ.. "ఇది మా టీమిండియా ఇచ్చిన గట్టి సమాధానం" అంటూ గట్టిగా ట్రోల్ చేస్తున్నారు.
ఫీల్డింగ్ లోపాలను అధిగమించిన బ్యాటర్లు
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్కు ఫీల్డింగ్ రూపంలో కొన్ని చుక్కెదురు దృశ్యాలు కనిపించాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ సులువైన క్యాచ్లను వదిలేయడం విండీస్ జట్టు భారీ స్కోరు సాధించడానికి దోహదపడింది. రూథర్ఫోర్డ్ ఇచ్చిన క్యాచ్ను తిలక్ వర్మ చేజార్చగా.. అది సిక్సర్గా మారడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు అత్యధికంగా 13 క్యాచ్లను వదిలేసింది. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్లకు ముందు ఈ ఫీల్డింగ్ లోపాలు జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతున్నప్పటికీ.. బ్యాటర్లు ఆ లోటును భర్తీ చేశారు.
ఫీల్డింగ్ లోపాలను అధిగమించిన బ్యాటర్లు
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్కు ఫీల్డింగ్ రూపంలో కొన్ని చుక్కెదురు దృశ్యాలు కనిపించాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ సులువైన క్యాచ్లను వదిలేయడం విండీస్ జట్టు భారీ స్కోరు సాధించడానికి దోహదపడింది. రూథర్ఫోర్డ్ ఇచ్చిన క్యాచ్ను తిలక్ వర్మ చేజార్చగా.. అది సిక్సర్గా మారడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు అత్యధికంగా 13 క్యాచ్లను వదిలేసింది. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్లకు ముందు ఈ ఫీల్డింగ్ లోపాలు జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతున్నప్పటికీ.. బ్యాటర్లు ఆ లోటును భర్తీ చేశారు.
బౌలర్ల కట్టుదిట్టం.. బ్యాటర్ల విధ్వంసం
వెస్టిండీస్ బ్యాటర్లు ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ తమ అనుభవంతో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థిని అడ్డుకున్నారు. అనంతరం బ్యాటింగ్లో ఫీల్డింగ్లో చేసిన తప్పును సవరించుకుంటూ అభిషేక్ శర్మ ఆరంభంలోనే ధాటిగా ఆడాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా క్రీజులో పాతుకుపోయి, బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లతో భారత్ను విజయతీరాలకు చేర్చారు. 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి భారత్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.
టైటిల్కు రెండు అడుగుల దూరంలో..
బయట వినిపించే విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా, మైదానంలో కేవలం ఆటతోనే సమాధానం చెప్పడం టీమిండియా ప్రత్యేకత అని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. పాక్ మాజీల విమర్శలన్నింటినీ పక్కనపెట్టి, ఇప్పుడు భారత్ ప్రపంచకప్ టైటిల్కు కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచింది. సెమీస్ గండం గడిస్తే మరోసారి భారత్ విశ్వవిజేతగా నిలిచే అవకాశం మెండుగా ఉంది.
#తిరుమల తిరుపతి #ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
*తొలగించండి బాబూ.. పోయేది మీ పరువే❗*
MARCH 2, 2026🔱
ప్రపంచంలోనే అత్యున్నతమైన ధార్మిక సంస్థగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు పేరుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరు వేంకటద్రీశుని పాలకమండలికి సారథ్యం వహించడం అంటే.. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ.. దక్కే బాధ్యత కాదని అందరూ పరిగణిస్తూ ఉంటారు. కానీ కాలక్రమంలో కేవలం.. రాజకీయ పైరవీలు, రాజకీయ ప్రాపకాలు మాత్రమే ఈ పుణ్యపదవిని దక్కించుకోవడానికి ప్రాతిపదిక అయిపోతున్నాయి.
ఆ క్రమంలోనే ఆ పదవిని దక్కించుకున్న వ్యక్తి బిఆర్ నాయుడు. తనకున్న టీవీఛానెల్ ద్వారా.. జగన్ మీద బురద చల్లడమే జీవితంగా గడిపి, తద్వారా చంద్రబాబు గద్దె ఎక్కడానికి తన వంతు సాయం చేసి, క్విడ్ ప్రోకో గా టీటీడీ ఛైర్మన్ పదవిని పొందారు. అప్పటినుంచి అనేక వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారుతున్నారు.
తాజాగా ఆయన ఒక మహిళతో రాసలీలలు సాగిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. సహజంగానే వైరల్ అయింది. వైసీపీ నాయకులు దీనిని అందింపుచ్చుకున్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కూడా.. ఎలాంటి అత్యున్నత ధార్మికమైన పదవిలో ఎలాంటి వారిని కూర్చోబెట్టారో చంద్రబాబు ఆత్మసమీక్ష చేసుకోవాలంటూ.. ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేశారు. తన బండారాన్ని కడిగిపారేస్తున్న భూమన పట్ల బిఆర్ నాయుడుకు కక్ష ఉండడం సహజం. రాసలీలల వైరల్ వీడియో కు కౌంటర్ ఇవ్వడంలో కూడా బిఆర్ విఫలమవుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఈ రాసలీలల వీడియో విషయంలో బిఆర్ నాయుడు మాటలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. ఆయన ఒక మహిళతో అభ్యంతరకరంగా, అసభ్యంగా ఉన్న దృశ్యాలు వైరల్ అయిన వీడియోలో ఉన్నాయి. అయితే బిఆర్ దీనిని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ మహిళ కుటుంబంతో తమ కుటుంబానికి ముప్ఫయ్యేళ్లుగా పరిచయాలు ఉన్నాయని, ఒకరి ఇంటికి మరొకరు వస్తూ పోతూ ఉంటామని అంటున్నారు.
పరిచయం ఉండడాన్ని ఎవరూ తప్పు పట్టరు కదా.. తప్పు జరుగుతున్నట్టుగా వీడియోలో ఉన్నందువల్ల మాత్రమే అది ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇదే బీఆర్ నాయుడు ఒకవైపు ఆ వీడియోను నేను చాలా సార్లు చూశాను. అందులో తప్పు ఏముంది? అసభ్యకరమైనది, అశ్లీలమైనది ఏమీ లేదని అంటున్నారు. అలా అంటూనే.. కొన్ని చోట్ల ఆ వీడియోను మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. వీడియో ఆధారాలు బయటపడినప్పుడు.. ప్రతివాళ్లూ మార్ఫింగ్ అని, డీప్ ఫేక్ అని మాట్లాడడం ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది.
మార్ఫింగ్ చేసినదే నిజమైతే గనుక.. కొన్ని చోట్ల మాత్రమే ఎందుకు చేస్తారు? ఇంకా ఘాటైన రాసలీలు ఉండేట్టుగా మార్ఫింగ్ చేస్తే ఇంకా బద్నాం చేయవచ్చు కదా.. అనేది ప్రజల సందేహం. బిఆర్ నాయుడు పరస్పర విరుద్ధ మాటలతో తానే దొరికిపోయేలా చేస్తున్నారు.
తమ పార్టీ వారి రాసలీలు, అసభ్యపు చేష్టలు బయటకు వస్తే.. కూటమి పార్టీల నాయకులు ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు.. అనే వారి నైతిక విలువలకు బిఆర్ వ్యవహారం ఒక లిట్మస్ టెస్టుగా మారనుంది. దేవదేవుడి సేవలో ఇలాంటి తుచ్ఛులను నియమిస్తే.. అది కూడా దైవద్రోహమే అవుతుందని చంద్రబాబునాయుడు తెలుసుకోవాలి.
వీడియోలోని రాసలీలలను ప్రస్తావిస్తూ.. కొన్ని భాగాలు మార్ఫింగ్ చేశారని బిఆర్ అంటున్నారు. మార్ఫింగ్ అవునో కాదో ఫోరెన్సిక్ పరీక్షల్లో చాలా సునాయాసంగా తేలిపోతుంది. కనీసం అది మార్ఫింగ్ అని తేలేవరకు బిఆర్ ను ఆ పదవినుంచి పక్కన పెడితే.. చంద్రబాబునాయుడుకు కూడా వేంకటేశ్వరస్వామి పట్ల భక్తి ఉన్నట్టు నిరూపణ అవుతుంది.
ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా సరే.. తను చేసిన పనిలో తప్పు లేదని విశ్వాసం ఉన్నా సరే.. బిఆర్ నాయుడు.. తన ఫిర్యాదును పురస్కరించుకుని పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలలో వీడియో మార్ఫింగ్ సంగతి తేల్చేవరకు దేవుడి సేవకు దూరంగా ఉంటానని రాజీనామా చేయాలి. లేకపోతే చంద్రబాబు పరువు మాత్రమే కాదు, మొత్తంగా కూటమి పరువేపోతుంది.
ఇప్పటికే జనసేన పార్టీ ఎలాంటి రాసలీలల ఎమ్మెల్యేలతో భ్రష్టుపడుతున్నదో అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ రాసలీలలు.. తెలుగుదేశం పార్టీని కూడా భ్రష్టుపట్టించబోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.
T20 World Cup 2026 : #🏏క్రికెట్ 🏏
*నాలుగు జట్లు.. రెండు సెమీఫైనల్స్.. వరల్డ్ కప్ క్లైమాక్స్ మొదలైంది..❗*
02.03.2026🏏
టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తర దశకు చేరుకుంది. ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో జరిగిన కీలక పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.
ఈ విజయంతో భారత్ అధికారికంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ 97 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చడమే కాకుండా, సెమీస్ బెర్తును ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్కు చేరిన నాలుగో జట్టుగా భారత్ నిలిచింది.
ఈసారి సెమీఫైనల్ రేసులో నిలిచిన నాలుగు జట్లు ఇవే.. భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్. సూపర్-8 దశలో గ్రూప్-1 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్లు ముందంజ వేయగా.. గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ టికెట్ దక్కించుకున్నాయి. ఇందులో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచి సెమీస్కు అర్హత సాధించాయి. ఇక న్యూజిలాండ్ విషయానికొస్తే.. సూపర్-8 మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు శ్రీలంకపై 65 పరుగుల భారీ తేడాతో గెలవలేకపోవడంతో కివీస్కు మార్గం సుగమమైంది.
షెడ్యూల్ ప్రకారం, మొదటి సెమీఫైనల్ పోరు మార్చి 4న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్కు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. ఇక కోట్లాది మంది భారత అభిమానులు ఎదురుచూస్తున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 5న జరగనుంది. ఇందులో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంగ్లాండ్ను ఓడించి ఫైనల్కు వెళ్లాలని సూర్య సేన పట్టుదలతో ఉంది.
సెమీఫైనల్లో గెలిచిన రెండు జట్లు మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఫైనల్లో తలపడతాయి. ఈసారి భారత్ కనుక కప్పు గెలిస్తే చరిత్ర సృష్టించినట్లే. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా రెండుసార్లు ఛాంపియన్గా నిలవలేదు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్, ఈ ఘనత సాధించి ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది.












![✍️కోట్స్ - ఏళ్లు వచ్చేంతవరకు ఈ 50 10 విష్తయాలు అర్తం కావు: కంటే మనశాంతి ముఖ్యమని: డబ్బు 1). 2) మీ ఆరోగ్యమే మీ నిజమైన సంపద: 3) ಸಿಮಯಂ ಅನದಿ ವೌಲ್ ಅರುದಿಸ currency 4) ఎవరు రెడ్ లో chanceని వాడుకోరు . 5l నీ circle చిన్నదైతే మంచిగా ఉంటుంది - 6) ಏಲಿದಿ ಏಲ್ಬು5್ಕುಂಡ್ ಏದಿಲೆಯಡಿಂ ಅನೆದಿ ಒs skill. 32 ವಿನ್ನಿ) ನಿಏಿಯೌಲು ನುಂವಿ ಸಂe5್೩ಂ ಏಸ್ತುಂದಿ 7|. అన్ని వదిలేయాలి 81 ఎంత సంపాదించిన నువ్వు 91 జీవితంలో తొందరపడకండి ప్రశాంతంగా. ఉంటారు: 10] మనుషులకి దూరంగా ఉండడం . ఏళ్లు వచ్చేంతవరకు ఈ 50 10 విష్తయాలు అర్తం కావు: కంటే మనశాంతి ముఖ్యమని: డబ్బు 1). 2) మీ ఆరోగ్యమే మీ నిజమైన సంపద: 3) ಸಿಮಯಂ ಅನದಿ ವೌಲ್ ಅರುದಿಸ currency 4) ఎవరు రెడ్ లో chanceని వాడుకోరు . 5l నీ circle చిన్నదైతే మంచిగా ఉంటుంది - 6) ಏಲಿದಿ ಏಲ್ಬು5್ಕುಂಡ್ ಏದಿಲೆಯಡಿಂ ಅನೆದಿ ಒs skill. 32 ವಿನ್ನಿ) ನಿಏಿಯೌಲು ನುಂವಿ ಸಂe5್೩ಂ ಏಸ್ತುಂದಿ 7|. అన్ని వదిలేయాలి 81 ఎంత సంపాదించిన నువ్వు 91 జీవితంలో తొందరపడకండి ప్రశాంతంగా. ఉంటారు: 10] మనుషులకి దూరంగా ఉండడం . - ShareChat ✍️కోట్స్ - ఏళ్లు వచ్చేంతవరకు ఈ 50 10 విష్తయాలు అర్తం కావు: కంటే మనశాంతి ముఖ్యమని: డబ్బు 1). 2) మీ ఆరోగ్యమే మీ నిజమైన సంపద: 3) ಸಿಮಯಂ ಅನದಿ ವೌಲ್ ಅರುದಿಸ currency 4) ఎవరు రెడ్ లో chanceని వాడుకోరు . 5l నీ circle చిన్నదైతే మంచిగా ఉంటుంది - 6) ಏಲಿದಿ ಏಲ್ಬು5್ಕುಂಡ್ ಏದಿಲೆಯಡಿಂ ಅನೆದಿ ಒs skill. 32 ವಿನ್ನಿ) ನಿಏಿಯೌಲು ನುಂವಿ ಸಂe5್೩ಂ ಏಸ್ತುಂದಿ 7|. అన్ని వదిలేయాలి 81 ఎంత సంపాదించిన నువ్వు 91 జీవితంలో తొందరపడకండి ప్రశాంతంగా. ఉంటారు: 10] మనుషులకి దూరంగా ఉండడం . ఏళ్లు వచ్చేంతవరకు ఈ 50 10 విష్తయాలు అర్తం కావు: కంటే మనశాంతి ముఖ్యమని: డబ్బు 1). 2) మీ ఆరోగ్యమే మీ నిజమైన సంపద: 3) ಸಿಮಯಂ ಅನದಿ ವೌಲ್ ಅರುದಿಸ currency 4) ఎవరు రెడ్ లో chanceని వాడుకోరు . 5l నీ circle చిన్నదైతే మంచిగా ఉంటుంది - 6) ಏಲಿದಿ ಏಲ್ಬು5್ಕುಂಡ್ ಏದಿಲೆಯಡಿಂ ಅನೆದಿ ಒs skill. 32 ವಿನ್ನಿ) ನಿಏಿಯೌಲು ನುಂವಿ ಸಂe5್೩ಂ ಏಸ್ತುಂದಿ 7|. అన్ని వదిలేయాలి 81 ఎంత సంపాదించిన నువ్వు 91 జీవితంలో తొందరపడకండి ప్రశాంతంగా. ఉంటారు: 10] మనుషులకి దూరంగా ఉండడం . - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_528935_32722785_1772415527730_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=730_sc.jpg)
