#🏏క్రికెట్ 🏏 IND vs ENG: #t 20 world cup 2026
*ఇండియా, ఇంగ్లాండ్ సెమీఫైనల్లో బద్దలైన 5 రికార్డులు ఇవే.. మనదే జోరు❗*
06.03.2026🏏
2026 టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ టీం చివరివరకూ పోరాడినా 246 పరుగులు చేయగలిగింది.
విజయానికి కేవలం 7 పరుగుల దూరంలో ఆగిపోవడంతో ఓడిన ఇంగ్లాండ్ జట్టు టోర్నీ నుంచి వైదొలిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ 105 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు సంజూ శాంసన్ 89 పరుగులు చేశాడు. మొత్తంగా చూస్తే ఈ సెమీఫైనల్ మ్యాచ్లో 499 పరుగులు నమోదయ్యాయి. మొదటి నుంచి చివరి వరకు భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్లో 5 భారీ రికార్డులు బద్దలయ్యాయి. అద్భుతమైన ఫీల్డింగ్ భారత జట్టును ఓటమి నుంచి తప్పించిందని చెప్పవచ్చు.
భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్లో బద్దలైన 5 భారీ రికార్డులు
ఒక టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో అత్యధిక పరుగులు: భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్లో మొత్తం 499 పరుగులు నమోదయ్యాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఓ మ్యాచ్లో నమోదైన అత్యధిక పరుగులు ఇవే. అంతకుముందు ఈ రికార్డు 459 పరుగులు. 2016లో జరిగిన ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్లో ఆ స్కోరు నమోదైంది.
జాకబ్ బెథెల్ వరల్డ్ రికార్డు: ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లాండ్ తరపున ఇది ఫాస్టెస్ట్ సెంచరీ. ఇదే మ్యాచ్లో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఇది టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ తరపున అత్యంత వేగవంతమైన ఫిఫ్టీగా నిలిచింది.
ఒక టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు: భారత్, ఇంగ్లాండ్ 2వ సెమీఫైనల్ మ్యాచ్లో మొత్తం 34 సిక్సర్లు నమోదయ్యాయి. భారత ఇన్నింగ్స్లో 19 సిక్సర్లు నమోదు కాగా, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో 15 సిక్సర్లు వచ్చాయి. ఒక టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఇవే అత్యధిక సిక్సర్లు కావడం విశేషం. అంతకుముందు ఈ రికార్డు 31 సిక్సర్లతో ఉండేది. ఇదే టోర్నమెంట్లో వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్లో ఆ రికార్డు నమోదైంది.
ఒక టీ20 వరల్డ్ కప్లో అత్యధిక సిక్సర్లు (టీమ్): ఒక టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును భారత్ తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు భారత్ ఈ వరల్డ్ కప్లో 88 సిక్సర్లు బాదేసింది. ఇంకా ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ విషయంలో ఇండియా టీం వెస్టిండీస్ను అధిగమించింది. ఇదే టీ20 వరల్డ్ కప్లో విండీస్ బ్యాటర్లు 76 సిక్సర్లు బాదారు.
పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 250+ పరుగులు: మెన్స్ టీ20 క్రికెట్లో భారత్ 250 కంటే ఎక్కువ స్కోరు నమోదు చేయడం ఇది ఆరోసారి. ఈ విషయంలో భారత్ ఒక వరల్డ్ రికార్డు నిలిపింది. ఈ జాబితాలో రెండో స్థానంలో వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరో మూడుసార్లు ఈ ఘనత సాధించాయి.
https://youtube.com/watch?v=Wcrow4p7mLM&si=9YkJkGrskq7G9GZR #తిరుమల లడ్డు
https://youtube.com/watch?v=Qs5xQUKPuRI&si=jVjRz4l7NEbR0S6P #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
#🇮🇳టీమ్ ఇండియా😍 #t 20 world cup 2026 #🏏ఇంగ్లండ్ టీమ్🏴
*సిక్సర్ల సెమీస్.. దడ పుట్టించిన ఇంగ్లండ్❗*
MARCH 6, 2026🏏
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియానే తన బ్యాటింగ్ తో దుమారం రేపిందనుకుంటే.. ఇంగ్లండ్ కూడా హడలుగొట్టింది! 18 ఓవర్ వరకూ ఏ ఓవర్ లెక్క చూసినా.. ఇండియా కన్నా ఇంగ్లండ్ పరుగుల విషయంలో ముందు నిలిచింది! కొట్టేస్తారేమో.. అని భారత క్రికెట్ అభిమానులు ఇంగ్లండ్ బ్యాటింగ్ ను చూసి కంగారు పడ్డారు! 253 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోతున్నారే.. అనే ఆందోళన కనిపించింది, అంతవరకూ కేరింతలు కొట్టినవారిలో కూడా! అయితే.. అంత భారీ లక్ష్యం అనే ప్రెజర్ ను ఆఖరి వరకూ అధిగమించినట్టుగానే కనిపించిన ఇంగ్లండ్ బ్యాటర్లు చివరకు తలొంచకతప్పలేదు! వాంఖడే
వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ రెండో సెమిఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫైనల్లో అడుగుపెట్టింది.
253 పరుగులు చేసి కూడా కేవలం ఏడు పరుగుల వ్యత్యాసంతో మాత్రమే టీమిండియా నెగ్గగలిగింది అంటే.. ఇంగ్లండ్ బ్యాటింగ్ ధాటి ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు! భారీ లక్ష్యం కనిపించే సరికి ఇంగ్లండ్ ఓపెనర్లు కాస్త తడబడ్డారు. ఆదిలోనే చేతులెత్తేశారు. అంతటితో మ్యాచ్ వన్ సైడెడ్ అవుతుందన్న అంచనాలు ఆ తర్వాత తలకిందులయ్యాయి! ప్రత్యేకించి జాకబ్ బేథెల్ 48 బంతుల్లో 105 పరుగులతో టీమిండియా అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు! అతడికి విల్ జాక్స్ 20 బంతులతో 35 పరుగులు చేసి సపోర్ట్ ఇవ్వడంతో..ఆ పార్టనర్ షిప్ కొనసాగుతున్నంతసేపూ కొట్టేస్తారేమో.. రికార్డు సృష్టిస్తారేమో అనే భయపడాల్సి వచ్చింది! అయితే చివరకు ఆ పార్టనర్ షిప్ కు తెరపడటం.. ఆ తర్వాత కూడా ఇంగ్లండ్ వైపు నుంచి పోరాటం కొనసాగినా, ప్రతి బంతికీ కచ్చితంగా రెండు పరుగులకు మించి చేయాల్సిన పరిస్థితుల్లో.. చివర్లో తడబాటుతో ఇంగ్లండ్ ఓడిపోయింది.
టాస్ గెలిచి ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. యథారీతిన అభిషేక్ శర్మ మరోసారి చేతులెత్తేశాడు. ఆ తర్వాత వెంటనే లభించిన లైఫ్ తో ఊపిరిపీల్చుకున్న సంజూసామ్సన్ గత మ్యాచ్ కు కొనసాగింపులాంటి ఇన్నింగ్స్ ను ఆడాడు. ఒకవేళ ఆ దశలో సంజూ ఔట్ అయ్యి ఉంటే.. ఈ మ్యాచ్ ఫలితం ఇంకోలా ఉండేదని కచ్చితంగా చెప్పొచ్చు! సంజూధాటిగా ఆడాడు. 42 బంతుల్లో 89 పరుగులతో భారీ స్కోర్ కు పునాదులతో పాటు, గోడను కూడా కట్టాడు! ఆ తర్వాత ఇషాన్ కిషాన్, దుబే, పాండ్యా, తిలక్ వర్మలు కూడా ఒక్కొక్కరిగా తక్కువ పరుగులే అయినా.. బ్యాట్ లు ఝలిపించడంతో టీమిండియా ఏకంగా 253 పరుగులను సాధించగలిగింది.
ఆ భారీ స్కోర్ కు ఇంగ్లండ్ మొదట్లో కాస్త బెంబేలెత్తినట్టుగానే కనిపించింది. తొలి మూడు వికెట్లు వేగంగానే పడ్డాయి. అయితే బేథెల్ వచ్చీ రాగానే విరుచుకుపడ్డాడు. కొడితే ఫోరో, సిక్సో.. అన్నట్టుగా ఆడాడు. ఆ ప్రయత్నంలో ఔట్ అయినా పెద్ద నష్టం లేదన్నట్టుగా అతడు ఆడిన ఇన్సింగ్స్ .. ఇంగ్లండ్ ను విజయ తీరాల దిశగా నడిపింది. అయితే భారీ టార్గెట్ అనే ప్రెజర్ అంతిమంగా ఇంగ్లండ్ కు ఓటమిని చవి చూపింది!
ఒకవేళ టీమిండియా ఏ 220, 230 స్థాయి టార్గెట్ ను పెట్టి ఉంటే.. ఇంగ్లండ్ ఊదేసేది. పదేళ్ల కిందట ఇదే స్టేడియంలో, ఇలాంటి టీ20 ప్రపంచకప్ లోనే ఇంగ్లండ్ జట్టు సౌతాఫ్రికాపై 230 స్థాయి లక్ష్యాన్ని చేధించింది. టీమిండియా స్కోరు 250 ని దాటి సరిపోయింది కానీ.. లేకపోతే అంతే సంగతులు!
మొత్తానికి టీమిండియా టీ20 ప్రపంచకప్ ఫైనల్ ను చేరింది. న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉందిక! సూపర్ ఇన్నింగ్స్ తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ సామ్సన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. వెస్టిండీస్ తో క్వార్టర్ ఫైనల్ తరహా మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన సామ్సన్, సెమిస్ లో కూడా సత్తా చూపించాడు.












