P.Venkateswara Rao
ShareChat
click to see wallet page
@prasad831
prasad831
P.Venkateswara Rao
@prasad831
ప్రేమించు కానీ నటించకు
#🇮🇳టీమ్ ఇండియా😍 #t 20 world cup 2026 #🏏ఇంగ్లండ్ టీమ్🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 *సిక్సర్ల సెమీస్.. దడ పుట్టించిన ఇంగ్లండ్❗* MARCH 6, 2026🏏 ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియానే తన బ్యాటింగ్ తో దుమారం రేపిందనుకుంటే.. ఇంగ్లండ్ కూడా హడలుగొట్టింది! 18 ఓవర్ వరకూ ఏ ఓవర్ లెక్క చూసినా.. ఇండియా కన్నా ఇంగ్లండ్ పరుగుల విషయంలో ముందు నిలిచింది! కొట్టేస్తారేమో.. అని భారత క్రికెట్ అభిమానులు ఇంగ్లండ్ బ్యాటింగ్ ను చూసి కంగారు పడ్డారు! 253 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోతున్నారే.. అనే ఆందోళన కనిపించింది, అంతవరకూ కేరింతలు కొట్టినవారిలో కూడా! అయితే.. అంత భారీ లక్ష్యం అనే ప్రెజర్ ను ఆఖరి వరకూ అధిగమించినట్టుగానే కనిపించిన ఇంగ్లండ్ బ్యాటర్లు చివరకు తలొంచకతప్పలేదు! వాంఖడే వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ రెండో సెమిఫైనల్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫైనల్లో అడుగుపెట్టింది. 253 పరుగులు చేసి కూడా కేవలం ఏడు పరుగుల వ్యత్యాసంతో మాత్రమే టీమిండియా నెగ్గగలిగింది అంటే.. ఇంగ్లండ్ బ్యాటింగ్ ధాటి ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు! భారీ లక్ష్యం కనిపించే సరికి ఇంగ్లండ్ ఓపెనర్లు కాస్త తడబడ్డారు. ఆదిలోనే చేతులెత్తేశారు. అంతటితో మ్యాచ్ వన్ సైడెడ్ అవుతుందన్న అంచనాలు ఆ తర్వాత తలకిందులయ్యాయి! ప్రత్యేకించి జాకబ్ బేథెల్ 48 బంతుల్లో 105 పరుగులతో టీమిండియా అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు! అతడికి విల్ జాక్స్ 20 బంతులతో 35 పరుగులు చేసి సపోర్ట్ ఇవ్వడంతో..ఆ పార్టనర్ షిప్ కొనసాగుతున్నంతసేపూ కొట్టేస్తారేమో.. రికార్డు సృష్టిస్తారేమో అనే భయపడాల్సి వచ్చింది! అయితే చివరకు ఆ పార్టనర్ షిప్ కు తెరపడటం.. ఆ తర్వాత కూడా ఇంగ్లండ్ వైపు నుంచి పోరాటం కొనసాగినా, ప్రతి బంతికీ కచ్చితంగా రెండు పరుగులకు మించి చేయాల్సిన పరిస్థితుల్లో.. చివర్లో తడబాటుతో ఇంగ్లండ్ ఓడిపోయింది. టాస్ గెలిచి ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. యథారీతిన అభిషేక్ శర్మ మరోసారి చేతులెత్తేశాడు. ఆ తర్వాత వెంటనే లభించిన లైఫ్ తో ఊపిరిపీల్చుకున్న సంజూసామ్సన్ గత మ్యాచ్ కు కొనసాగింపులాంటి ఇన్నింగ్స్ ను ఆడాడు. ఒకవేళ ఆ దశలో సంజూ ఔట్ అయ్యి ఉంటే.. ఈ మ్యాచ్ ఫలితం ఇంకోలా ఉండేదని కచ్చితంగా చెప్పొచ్చు! సంజూ ధాటిగా ఆడాడు. 42 బంతుల్లో 89 పరుగులతో భారీ స్కోర్ కు పునాదులతో పాటు, గోడను కూడా కట్టాడు! ఆ తర్వాత ఇషాన్ కిషాన్, దుబే, పాండ్యా, తిలక్ వర్మలు కూడా ఒక్కొక్కరిగా తక్కువ పరుగులే అయినా.. బ్యాట్ లు ఝలిపించడంతో టీమిండియా ఏకంగా 253 పరుగులను సాధించగలిగింది. ఆ భారీ స్కోర్ కు ఇంగ్లండ్ మొదట్లో కాస్త బెంబేలెత్తినట్టుగానే కనిపించింది. తొలి మూడు వికెట్లు వేగంగానే పడ్డాయి. అయితే బేథెల్ వచ్చీ రాగానే విరుచుకుపడ్డాడు. కొడితే ఫోరో, సిక్సో.. అన్నట్టుగా ఆడాడు. ఆ ప్రయత్నంలో ఔట్ అయినా పెద్ద నష్టం లేదన్నట్టుగా అతడు ఆడిన ఇన్సింగ్స్ .. ఇంగ్లండ్ ను విజయ తీరాల దిశగా నడిపింది. అయితే భారీ టార్గెట్ అనే ప్రెజర్ అంతిమంగా ఇంగ్లండ్ కు ఓటమిని చవి చూపింది! ఒకవేళ టీమిండియా ఏ 220, 230 స్థాయి టార్గెట్ ను పెట్టి ఉంటే.. ఇంగ్లండ్ ఊదేసేది. పదేళ్ల కిందట ఇదే స్టేడియంలో, ఇలాంటి టీ20 ప్రపంచకప్ లోనే ఇంగ్లండ్ జట్టు సౌతాఫ్రికాపై 230 స్థాయి లక్ష్యాన్ని చేధించింది. టీమిండియా స్కోరు 250 ని దాటి సరిపోయింది కానీ.. లేకపోతే అంతే సంగతులు! మొత్తానికి టీమిండియా టీ20 ప్రపంచకప్ ఫైనల్ ను చేరింది. న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉందిక! సూపర్ ఇన్నింగ్స్ తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ సామ్సన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. వెస్టిండీస్ తో క్వార్టర్ ఫైనల్ తరహా మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన సామ్సన్, సెమిస్ లో కూడా సత్తా చూపించాడు.
🇮🇳టీమ్ ఇండియా😍 - ೦323es 2 so ೦323es 2 so - ShareChat
#ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *వైసీపీ బలాన్ని అసెంబ్లీ వేదికగా చాటి చెప్పిన పవన్కల్యాణ్❗* MARCH 6, 2026🎯 వైసీపీపై విమర్శలు చేయడానికి డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఒంటికాలిపై లేస్తుంటారు. మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా ఆయన ద్వేషిస్తున్నట్టుగా, ఆయన విమర్శలుంటాయి. ఈ నేపథ్యంలో వైసీపీని విమర్శించే క్రమంలో ఆ పార్టీ బలాన్ని అసెంబ్లీ వేదికగా పవన్కల్యాణ్ బయటపెట్టారు. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై డిప్యూటీ సీఎం మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. ఇప్పటికీ వాళ్లకు (వైసీపీ) సభ్యులు తక్కువే అన్నారు. 11 మంది సభ్యులే ఉన్నప్పటికీ 1100 మంది ఉన్నట్టు మాట్లాడుతుంటారన్నారు. ఇదే సందర్భంలో వారు చెప్పే విషయాలను ప్రజలు చాలా బలంగా నమ్ముతున్నారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం మంచి చేస్తున్నా చెప్పుకోవడంలో విఫలమవుతోందన్నారు. వైసీపీ నాయకులు రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను సరిగా అర్థం చేసుకోలేదన్నారు. మాట్లాడే స్వేచ్ఛను ఇతరుల్ని దూషించడానికి ఉపయోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే వైసీపీ నాయకులు తమ తప్పుల్ని దాచిపెట్టి ఇతరులపై ఆరోపణలు చేస్తారని, ఆ తర్వాత కులాల వెనుక దాక్కోవడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ కామెంట్స్ మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించినట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ఇటీవల కాలంలో కూటమి దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మరీ ముఖ్యంగా భయం అంటే ఏంటో తెలియదన్నట్టు వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. అయితే ఏమవుతుందని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మహా అయితే కేసులు, లేదంటే జైలుకు పంపుతారని, ఇంతకంటే ఏం చేస్తారనే ధిక్కార స్వరం పెరిగింది. ఇదే పవన్కు ఆందోళన కలిగిస్తున్నట్టుంది. వైసీపీ ఎంత బలంగా వుందో, ఆ పార్టీపై వ్యతిరేకతను ప్రదర్శించే క్రమంలో పవన్ బయటపెట్టడం జోష్ నింపుతోంది.
ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 - ShareChat
#🏏క్రికెట్ 🏏 #t 20 world cup 2026 #🇮🇳టీమ్ ఇండియా😍 *గెలిచాం సరే… కానీ ఈ సెమీస్ గెలుపుకీ ఓ పోస్ట్ మార్టం అవసరం…‼️* March 6, 2026🏏 ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించాం అని రాస్తున్నారు చాలామంది… తప్పు… ఇంగ్లండ్ చాలా గౌరవప్రదంగా, పోరాడి, ఒ దశలో ఇండియాను ఓడించినంత పని చేసి, వణికించి, చెమటలు పట్టించింది… గెలుపు గెలుపే, నిజమే, కానీ గెలుపు వెనుక తప్పొప్పుల మథనం అవసరం… 253 పరుగుల భారీ స్కోర్ చేసినా సరే, ఇంగ్లండ్ జస్ట్ 7 రన్స్ దూరం దాకా ఛేజ్ చేసిందంటే మామూలు విషయం కాదు కాబట్టి మన మైనసుల సమీక్ష అవసరం… ఎందుకంటే… మార్చి 8న ఫైనల్స్‌లో ఆడబోయే న్యూజీలాండ్ కూడా టఫ్ ఫైటరే… చివరి బాల్ వరకూ పోరాడే తత్వమే… మరి మనం..? అదుగో ఆ ప్లస్ మైనసులే ఓసారి చెప్పుకోవాలి… బహుశా ఇదే టీమ్‌ను ఆడిస్తారేమో గానీ… తప్పొప్పుల నెమరివేత కూడా తప్పక అవసరమే మరి… ఫస్ట్ క్రెడిట్ సంజూ శాంసన్… సెమీస్‌లోకి తీసుకొచ్చిన తనే ఇప్పుడు ఫైనల్స్‌లోకీ తీసుకొచ్చాడు… హీరో నంబర్ వన్… వికెట్ కీపింగులో మెరుపుల్లేకపోయినా తప్పిదాలు మాత్రం కనిపించలేదు… విధ్వంసుడు బెథెల్ రనవుట్ క్రెడిట్‌లో తనకూ పార్టనర్‌షిప్ ఉంది… హీరో నంబర్ టూ బుమ్రా… కీలకమైన ఓవర్లలో పొదుపుగా రన్స్ ఇచ్చి, ఇండియాను గెలుపు గాడిలో పడేసింది తనే… ఇది ప్రధనంగా బ్యాటర్ల గెలుపు… ఎస్, వాంఖెడ్ స్టేడియం బ్యాటింగ్ పిచ్, పైగా బౌండరీ లైన్ దగ్గరగా ఉంటుంది… ఐనా సరే, మన బ్యాటర్లు బాగా ఆడారు… ఎప్పటిలాగే అభిషేక్ శర్మ మరోసారి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు… నిజానికి వరుణ్ చక్రవర్తి టీ20 మ్యాచుల్లో అగ్రగణ్యుడైన బౌలర్… కానీ అస్సలు ఫామ్‌లో లేడు… ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు… కొట్టినోడికి కొట్టుకున్నంత అన్నట్టుగా… ఇంగ్లండ్ బౌలర్ అర్చర్ 61 పరుగులు ఇస్తే, నేనేం తక్కువ అన్నట్టు వరుణ్ చక్రవర్తి 64 పరుగులు ఇచ్చాడు… అర్షదీప్ కూడా 51 పరుగులు ఇచ్చాడు… పైగా అనేకె వైడ్లు… ఏమాత్రం క్రమశిక్షణ లేని బౌలింగ్… పదే పదే ఈ సూర్యకుమారుడు శివమ్ దూబేకు బౌలింగ్ ఎందుకిస్తాడో తెలియదు… ఒకే ఓవర్ ఇస్తే ఏకంగా 22 పరుగులు ఇచ్చాడు, కాకపోతే అప్పటికే మన గెలుపు ఖాయమైంది కాబట్టి నష్టం జరగలేదు… అంతకుముందు మ్యాచుల్లో కూడా దూబెకు బౌలింగ్ ఇచ్చాడంటేనే ఫ్యాన్స్‌లో గుబులు… అయ్యా, సూర్యకుమారా..? ఏమిటిది..? తిలక్ వర్మ లేకపోతే నువ్వు బౌలింగ్ చేసినా బాగుండు… పైగా కెప్టెన్ అప్పుడప్పుడూ బుమ్రాకు బౌలింగే ఇవ్వడు సరిగ్గా… ఈ సెమీస్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు అరివీర భీకరంగా బాదుతున్నప్పుడు 18 వ ఓవర్‌లో కేవలం ఆరు పరుగులు ఇచ్చాడు తను… 16వ ఓవర్‌లో కూడా కేవలం ఎనిమిది రన్స్… అదీ బుమ్రాను సరిగ్గా వాడుకుంటే వచ్చే ఫలితం… తను ఇండియా తురుఫు ముక్క… అర్షదీప్, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె… న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచులో విలన్లు కావద్దంటే జాగ్రత్తగా బౌల్ చేయాల్సిందే… లేకపోతే ఫిన్ అలెన్, సీఫర్ట్ ఇద్దరు చాలు ఉతికి ఆరేయడానికి… చూశాం కదా, బలమైన దక్షిణాఫ్రికా జట్టునే 13 ఓవర్లలో చాపచుట్టేసి గెలిపించారు ఈ ఇద్దరు ఓపెనర్స్… హార్దిక్ ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగుల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు, పర్లేదు, సూర్యకుమార్ స్వయంగా ఓ మంచి ఇన్నింగ్స్ నిర్మించలేకపోతున్నాడు… ఇషాన్ కిషన్ వోకే… ఈ సెమీస్ మ్యాచులో మెచ్చాల్సింది క్యాచులు… అక్షర్ పటేల్, తిలక్ వర్మ, దూబె క్యాచులు ఔట్ స్టాండింగ్… అక్షర్ క్యాచ్ మరీ స్టన్నింగ్… ఒక్కసారి ఊహించండి… ఇండియా టీ20 మ్యాచుల్లో నాలుగో హయ్యెస్ట్ స్కోర్, ఇండియా సెకండ్ హయ్యెస్ట్ స్కోర్ సాధించకుండా ఉండి ఉంటే… బెథెల్ ఒంటిచేత్తో ఇంగ్లండ్‌ను ఫైనల్స్‌లోకి తీసుకుపోయేవాడు కాదా..? తప్పొప్పుల సీరియస్ సమీక్ష ఫైనల్స్‌కు ముందు అవసరమా, కాదా..?!
🏏క్రికెట్ 🏏 - FIRAL n 307 { 4 72 53 72 Lecl. 0 FIRAL n 307 { 4 72 53 72 Lecl. 0 - ShareChat
#⚜️🔱కర్మ సిద్ధాంతం 🧓
⚜️🔱కర్మ సిద్ధాంతం 🧓 - ఒకరిని నాశన్ం చేయాలనే దుర్బుః ఉండేవాడు 888 , చివరికి వాడే నాశనం అయిపోతాడు అదే కర్త్క ' ఫలితం అంటే ( ఒకరిని నాశన్ం చేయాలనే దుర్బుః ఉండేవాడు 888 , చివరికి వాడే నాశనం అయిపోతాడు అదే కర్త్క ' ఫలితం అంటే ( - ShareChat
#రెండు కళ్ళ సిద్ధాంతం.. 🤠 *చంద్రబాబు ముగ్గురు బిడ్డల పథకంపై మాజీ ఫ్రెండ్ పంచ్ లు..❗* Syed Ahmed March 6, 2026👀 ఏపీలో జనాభా పెంచేందుకు వీలుగా ప్రజలంతా ముగ్గురు పిల్లల్ని కనాలంటూ సీఎం చంద్రబాబు (Chandrababu)తెస్తున్న విధానంపై మాజీ కేంద్రమంత్రి, ఆయన మాజీ స్నేహితుడు కూడా అయిన చింతా మోహన్ (chinta mohan) మండిపడ్డారు. ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఉద్యోగులకు అదనపు సెలవులు ఇస్తామని, అలాగే 25 వేల ప్రోత్సాహకం ఇస్తామని చంద్రబాబు నిన్న చేసిన ప్రకటనపై చింతా మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా ఆయన సమస్య ఏంటో చెప్పాలన్నారు. నిన్న అసెంబ్లీలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో జనాభా నిర్వహణ పై డ్రాఫ్ట్ పాలసీపై ప్రకటన చేశారు. ఏపీలో ప్రస్తుతం టోటల్ ఫెర్టిలిటీ రేటు (టీఎఫ్ఆర్) 1.5గా ఉందని, దీనిని 2.1కి పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందుకోసం మూడో బిడ్డను కనే దంపతులకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. దీనిపై స్పందించిన చింతా మోహన్.. ఆయన మాత్రం ఒక బిడ్డనే కంటాడు, ఇతరుల్ని మాత్రం ముగ్గురు బిడ్డల్ని కనమని ఎలా చెప్తాడని ప్రశ్నించారు. ఇద్దరు, ఆపైన పిల్లలను కంటే రూ.25 వేలు, ఇంకా బోలెడు బెనిఫిట్స్: సీఎం చంద్రబాబు! ఇద్దరు, ఆపైన పిల్లలను కంటే రూ.25 వేలు, ఇంకా బోలెడు బెనిఫిట్స్: సీఎం చంద్రబాబు! అలాగే ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ సైతం ఒక బిడ్డనే కంటాడని, అయినా చంద్రబాబు ఇతరులు ముగ్గురు బిడ్డలు కనాలని చెప్పడం విడ్డూరంగా ఉందని చింతా మోహన్ తెలిపారు. చంద్రబాబు తాను చేయని పనులు ఇతరులకు చెప్తుంటాడని చింతా మోహన్ ఎద్దేవా చేశారు. ఒక్క బిడ్డనే పుట్టించిన చంద్రబాబు తెలివితేటలు తమకు కూడా ఉన్నాయన్నారు. ఇతరులకు ఏదైనా చెప్పేముందు ఆలోచించి చెప్పాలని తన మాజీ స్నేహితుడికి చింతా మోహన్ సలహా ఇచ్చారు. చంద్రబాబు ఏం చెప్తాడో, ఏం చేస్తాడో ఎవరికీ అర్ధం కాదన్నారు.
రెండు కళ్ళ సిద్ధాంతం.. 🤠 - ShareChat
#⚜️🔱కర్మ సిద్ధాంతం 🧓
⚜️🔱కర్మ సిద్ధాంతం 🧓 - KARMA: what you You give get 1 KARMA: what you You give get 1 - ShareChat
#🏏క్రికెట్ 🏏 IND vs ENG: #t 20 world cup 2026 *ఇండియా, ఇంగ్లాండ్ సెమీఫైనల్లో బద్దలైన 5 రికార్డులు ఇవే.. మనదే జోరు❗* 06.03.2026🏏 2026 టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ టీం చివరివరకూ పోరాడినా 246 పరుగులు చేయగలిగింది. విజయానికి కేవలం 7 పరుగుల దూరంలో ఆగిపోవడంతో ఓడిన ఇంగ్లాండ్ జట్టు టోర్నీ నుంచి వైదొలిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ 105 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు సంజూ శాంసన్ 89 పరుగులు చేశాడు. మొత్తంగా చూస్తే ఈ సెమీఫైనల్ మ్యాచ్లో 499 పరుగులు నమోదయ్యాయి. మొదటి నుంచి చివరి వరకు భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్లో 5 భారీ రికార్డులు బద్దలయ్యాయి. అద్భుతమైన ఫీల్డింగ్ భారత జట్టును ఓటమి నుంచి తప్పించిందని చెప్పవచ్చు. భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్లో బద్దలైన 5 భారీ రికార్డులు ఒక టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో అత్యధిక పరుగులు: భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్లో మొత్తం 499 పరుగులు నమోదయ్యాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఓ మ్యాచ్లో నమోదైన అత్యధిక పరుగులు ఇవే. అంతకుముందు ఈ రికార్డు 459 పరుగులు. 2016లో జరిగిన ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్లో ఆ స్కోరు నమోదైంది. జాకబ్ బెథెల్ వరల్డ్ రికార్డు: ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లాండ్ తరపున ఇది ఫాస్టెస్ట్ సెంచరీ. ఇదే మ్యాచ్లో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఇది టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ తరపున అత్యంత వేగవంతమైన ఫిఫ్టీగా నిలిచింది. ఒక టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు: భారత్, ఇంగ్లాండ్ 2వ సెమీఫైనల్ మ్యాచ్లో మొత్తం 34 సిక్సర్లు నమోదయ్యాయి. భారత ఇన్నింగ్స్లో 19 సిక్సర్లు నమోదు కాగా, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో 15 సిక్సర్లు వచ్చాయి. ఒక టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఇవే అత్యధిక సిక్సర్లు కావడం విశేషం. అంతకుముందు ఈ రికార్డు 31 సిక్సర్లతో ఉండేది. ఇదే టోర్నమెంట్లో వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్లో ఆ రికార్డు నమోదైంది. ఒక టీ20 వరల్డ్ కప్లో అత్యధిక సిక్సర్లు (టీమ్): ఒక టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును భారత్ తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు భారత్ ఈ వరల్డ్ కప్లో 88 సిక్సర్లు బాదేసింది. ఇంకా ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ విషయంలో ఇండియా టీం వెస్టిండీస్ను అధిగమించింది. ఇదే టీ20 వరల్డ్ కప్లో విండీస్ బ్యాటర్లు 76 సిక్సర్లు బాదారు. పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 250+ పరుగులు: మెన్స్ టీ20 క్రికెట్లో భారత్ 250 కంటే ఎక్కువ స్కోరు నమోదు చేయడం ఇది ఆరోసారి. ఈ విషయంలో భారత్ ఒక వరల్డ్ రికార్డు నిలిపింది. ఈ జాబితాలో రెండో స్థానంలో వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరో మూడుసార్లు ఈ ఘనత సాధించాయి.
🏏క్రికెట్ 🏏 - 0 0 - ShareChat
#🙏🌹తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి🌹🙏
🙏🌹తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి🌹🙏 - ShareChat
00:26