*అలసిన వానిని ఊరడించు మాటలు*
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
*సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన*
*అనుదిన ధ్యానములు*
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
*🌷🌷ఏప్రిల్ 23🌷🌷*
*“మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ”(లూకా 15 : 7 )*
ప్రభువు యొక్క ఆనందము పరలోకములో ఆరంభమగును, భూమి మీద కాదు (లూకా 15:10) ఒక మానవుని హృదయములో పరిశుద్ధాత్మ, దేవుని వాక్యము ద్వారా బలమైన ఒప్పుదలను, నిజమైన పశ్చాత్తాపమును కలిగించును. అతడు నిజముగా తన పాపములను ఒప్పుకొని, తనకు బదులుగా యేసు క్రీస్తు ప్రభువు మరణించెనని విశ్వసించిన యెడల పరలోకమందు దేవుని దూతలందరి ఎదుట గొప్ప సంతోషము కలుగును. ఒక పాపి పశ్చాత్తాపపడిన వెంటనే దేవుడు, పరలోకపు వాయిద్యములతో పాటలు పాడుటకు దూతలనందరిని పిలుచును. పశ్చాత్తాపపడిన పాపి హృదయములో కూడా అదే పరలోకపు ఆనందము పోయబడును. కాబట్టి ఇది పరలోకమునుండి కలిగిన ఆనందము. ఒక వేళ అది బోధకుని నుండి వచ్చిన భూసంబంధమైన ఆనందమైన యెడల, అది వెంటనే వాడి పోవును. ఒక దినమున ఒక కూడికలో కొందరు చేతిని పైకెత్తి మేము తిరిగి జన్మించితిమని చెప్పవచ్చును. ఆ తరువాతి దినము ఒక కష్టతరమైన విషయములో వారు మనస్సు నొప్పించుకొందురు గాని పరలోకము నుండి ఒక వ్యక్తిలోనికి వచ్చిన సంతోషము ఎన్నటికి వాడిపోదు.
అందుచేతనే ప్రభువైన ఏసుక్రీస్తుకు ముందుగా వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను మారు మనస్సును గురించి బోధించి, “ మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి” అని చెప్పెను. యేసు ప్రభువు “పరలోక రాజ్యము సమీపించి యున్నది గనుక మారు మనస్సు పొందుడి” అని చెప్పుచు ప్రకటించెను (మత్తయి 4:17) బాప్తిస్మమిచ్చు యోహాను, యేసు క్రీస్తు ప్రభువు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మచే నింపబడుటను గూర్చి బోధించిరి. ప్రజలు తమ పాపములను ఒప్పుకొనిన యెడల అది హృదయములో నుండి రావలెను, గాని పెదవుల నుండి కాదు, పశ్చాత్తాప మనునది సరియైనదని నిశ్చయించుకొనుటకు, భయమును బట్టి మనము ఒప్పుకొనుట లేదని, లేక ప్రజలు మన గురించి ఏమనుకొందురని గాని, లేక మంచి పేరు కొరకు ఒప్పుకొనుట లేదని మనము నిశ్చయించు కొనవలెను. *కొంతమందికి పశ్చాత్తాపమును గురించి సరియైన గ్రహింపు ఉండదు. వారు చాల తేలికగా “ ఓ దేవా, నేనొక వేళ ఇది చేసిన యెడల, లేక అది చేసిన యెడల, దయచేసి నన్ను క్షమించుము” అని చెప్పుదురు. వారి పాపముల విషయమై వారికి నిజమైన ఒప్పుదల, విచారము ఉండవు*. యోబుకు దేవుని ప్రత్యక్షత కలిగినది. మునుపెన్నడును కలుగని విధముగా యోబుకు దేవుని మహిమా సౌందర్యములు, ఆయన సర్వశక్తిని గూర్చిన ప్రత్యక్షత కలిగినది. అది అతనిని దేవుని సన్నిధిలో తనను తాను అసహ్యించుకొని, ద్వేషించు కొనునట్లు చేసినది.
మనము లూకా 5:8 లో సీమోను పేతురు, యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి “ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను”. మన ప్రభువు సీమోను పాపములు బయటకు కనబరచుట గాని లేక గద్దించుట గాని చేయనవసరములేదు. పేతురు యేసు క్రీస్తు ప్రభువు యొక్క గొప్ప శక్తిని, గొప్పతనమును చూచి బహుగా ఒప్పించబడెను. మరల లూకా 19:8 లో జక్కయ్య ఎంత నమ్మకముగా పశ్చాత్తాపపడెనో చూచుచున్నాము. అతడు డబ్బు విషయములో అవినీతి పరుడు అని చూపించవలసిన అవసరత ప్రభువునకు లేదు. ప్రభువు యొక్క సన్నిధియే అతనిలో నిజమైన పశ్చాత్తాపమును, హృదయములో మార్పును తీసికొని వచ్చినది. అందుచేతనే అతడు “ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదల కిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనిన యెడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతును” అని ప్రభువుతో చెప్పెను. నిజమైన పశ్చాత్తాపము ద్వారా ఏవిధముగా పరలోకము నుండి సంతోషము మనకు కలుగునో చూచుచున్నాము. ఎవరైతే నిజముగా పశ్చాత్తాపపడుదురో వారి హృదయములలో కూడా ఇట్టి సంతోషము కుమ్మరించ బడును.
Please share
🙏🏼Praise the LORD.🙏🏼
#📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝