*అలసిన వానిని ఊరడించు మాటలు*
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
*సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు*
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
*🌷🌷ఫిబ్రవరి 27🌷🌷*
*"కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్ధన చేయవలెనని కోరుచున్నాను" ( 1 తిమోతి 2:8)*
ప్రభువైన యేసు క్రీస్తు మన పరలోక ప్రధాన యాజకుడు. ఆయన జతపనివారముగా అక్కరలోనున్న ప్రజల నిమిత్తము మనము ప్రార్ధించవలసి యున్నది. మహిమ పరచబడిన ప్రభువు యొక్క స్వరూపమును గురించి ప్రకటన మొదటి అధ్యాయములో ఇవ్వబడినది, అది ఏలాగున మనము శక్తివంతమైన విజ్ఞాపన పరిచర్యను చేయగలమో మనకు బోధించును.
ప్రకటన 1:14లో "ఆయన తలయు, ఆయన తల వెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను" అని చదువుదుము., తెల్లని వెంట్రుకలు ఆయన పరిపూర్ణ, పరలోక, దైవిక జ్ఞానమును గురించి మాటలాడుచున్నవి. ఆయన సమస్తమును ఎరుగును. ఆయన మన తలంపులు, మన పతనములు, మన శోధనలు, మన పేర్లు, మన సమస్తమును ఎరుగును. ఏదియును ఆయనకు మరుగై యుండదు. ఆయన జ్ఞానము పరిపూర్ణమైనది. ఆయన, విషయములను ఆరంభమునుండియే ఎరుగును (యెషయా 46:10) కావున మనము ఆయన పరలోక జ్ఞానమును కోరుకొనవచ్చును. పై నుండి వచ్చు ఆ జ్ఞానమును కలిగి యుండుట ద్వారా మనము ప్రజల అక్కరలు, పాపములు, సమస్యలు మరియు హద్దుబాటులను ఎరిగి దాని ప్రకారము ప్రార్ధించగలము. మనము విశ్వాసము ద్వారా " ప్రభువా, నీవు నా పరలోక జ్ఞానము. ఫలాని ఫలాని వారి అక్కరను తీర్చుము" అని మనము చెప్పవలసియున్నది. అప్పుడు జ్ఞానయుక్తముగా ప్రార్ధించగలము. మీ యొక్క విజ్ఞాపనా ప్రార్ధనల ద్వారా అనేకులు బలపరచబడి, ప్రోత్సహించబడుదురు.
తరువాత ప్రకటన 1:14 లో ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నేత్రములు అగ్ని జ్వాలవలె ఉన్నట్లు చదువుదుము. 2 దిన. 16:9 లో "తన యెడల యదార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది" అని చదువుదుము. ప్రభువు మనలో ప్రతి ఒక్కరిని చూడగలడు. ఆ సమయములో హింసను బట్టి విశ్వాసులు చెదరిపోయిరి. వారు కొండలలోను, గుహలలోను దాగుకొనిరి. ప్రభువు వారి అక్కర నెరిగినవాడై వారి పక్షముగా పని చేయుచుండెను. *ఒక వేళ మనము ఒంటరి ప్రదేశమునకు బదిలీ చేయబడినప్పటికిని, ఆయన నేత్రములు మనలను చూడగల్గును. ఆయన మన పరిస్థితిని, మన అక్కరలు, మన శోధనలు, మన పతనములను చూచును. ఆయన మనకు సహాయము చేయుటకు అంతటా సంచరించుచు మన అక్కరకొలది మనకు సహాయము చేయును. కలత చెందవలసిన అవసరత మనకు లేదు.* ఆయన నేత్రములు అగ్నిజ్వాలవలె ఎంతో ప్రకాశించుచున్నవి. మనలను పరిశుద్ధముగా ఉంచుటకు ఆయన అంతటా సంచారము చేయుచున్నాడు. అగ్ని ద్వారా పవిత్రతను, వేడిమిని, వెలుగును పొందగలము. ప్రభువు, "నా ప్రజలు ఎక్కడ ఉన్నారో నేనెరుగుదును. వారు గుహలలో దాగుకొనియున్నను వారిని చూడగలను. వారికి సహాయము చేయుటకై అంతటా సంచరించుచున్నాను" అని చెప్పుచున్నాడు. ఆయన దావీదు మరియు అతనితో నున్న 400 మంది పక్షముగా పనిచేసి, వారి అక్కరలన్నిటిని తీర్చెను. అదే రీతిగా, ఏలీయా బదరీ వృక్షము క్రింద ఉన్నప్పుడు అతనికి సహాయము చేసెను. మనము ఆయన యందు సంపూర్ణముగా నమ్మకముంచినప్పుడు, ఆయన కన్నులు మన నిమిత్తము అంతటను సంచరించుచున్నవి గనుక ఆయన మన అక్కరలన్నిటిని తీర్చును.
మూడవదిగా, "ఆయన పాదములు .. మెఱయుచున్న అపరంజితో సమానమై యుండెను" (ప్రకటన 1:15) పరిశుద్ధ గ్రంథములో ఇత్తడి దేవుని తీర్పుకు గుర్తుగా ఉన్నది. మన పాప జీవితమునకు సాతానే బాధ్యుడు. ప్రభువైన యేసు క్రీస్తు సిలువపై సాతానును ఓడించెను. ఆయన మరణ, భూస్థాపన, పునరుర్ధానముల ద్వారానే సాతానును జయించెను. గాని అద్భుతములు లేక ప్రసంగముల ద్వారా కాదు. సాతాను, ఆయనను మడిమె మీద కొట్టెను మరియు అదే మడిమెతో ఆయన సాతాను తలను చితుక ద్రొక్కెను. ఇత్తడివంటి పాదముల ద్వారా ప్రభువు ఇట్లు చెప్పుచున్నాడు, *"నీవు సాతానును ఓడించవలెనని కోరిన యెడల అద్భుతములు లేక సూచనలు లేక దర్శనములు ద్వారా జయించలేవు. కేవలము నా మరణము ద్వారానే నీవు వానిని ఓడించగలవు". ప్రభువు మన పాపముల నిమిత్తమై మరణించి, తిరిగి లేచెనని నమ్ముట ద్వారా సాతానును ఓడించగలము.* పాపములో ఉన్న వారి నిమిత్తము కూడా అదే విజయమును కోరుకొనవచ్చును. మనము ఇట్లు చెప్పవచ్చును, "యేసు క్రీస్తు ప్రభువా, నీవు నా తల్లికొరకు, నా సహోదరులు, సహోదరీలు , స్నేహితుల కొరకు మరణించితివి. దయచేసి ఫలాని, ఫలాని వారిపై కనికరము చూపుము. వారి ఆత్మలను రక్షించి, వారి పాపములను క్షమించుము". ఆ రీతిగా అక్కరలో ఉన్నవారి నిమిత్తము విజ్ఞాపనము చేసి, సిలువ యొక్క విజయమును కోరుకొనగలము.
Please share
🙏🏼Praise the LORD.🙏🏼
#📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝