RAJENDRAPRASAD, M.Com.
ShareChat
click to see wallet page
@raajendraprasad
raajendraprasad
RAJENDRAPRASAD, M.Com.
@raajendraprasad
"దయచేసి నమ్మక ద్రోహం చెయ్యకండి"
#ఈ రోజు 🌧️🌛🌔🌠 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌷పంచాంగం🌷 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 19 - 05 - 2026, వారం ... భౌమవాసరే ( మంగళవారం ) శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం, తిథి : *తదియ* సా6.45 వరకు, నక్షత్రం : *మృగశిర* మ12.50 వరకు, యోగం : *ధృతి* రా10.21 వరకు, కరణం : *తైతుల* ఉ7.58 వరకు, తదుపరి *గరజి* సా6.45 వరకు, వర్జ్యం : *రా8.40 - 10.09* దుర్ముహూర్తము : *ఉ8.05 - 8.56* మరల *రా10.48 - 11.33* అమృతకాలం : *ఉ6.08 వరకు* మరల *రా1.54 - 3.23* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండం : *ఉ9.00 - 10.30* సూర్యరాశి : వృషభం, చంద్రరాశి : మిథునం సూర్యోదయం : 5.31, సూర్యాస్తమయం : 6.21, *_నేటి మాట_* *కర్మ ఫలితం లోని రహస్యం* ఇది చెప్పడం చాలా సులభం, కానీ ఆచరించడం చాలా కష్టం, ఎలా అంటే!!... ఏదైనా ధర్మ సంస్థకు విరాళం ఇచ్చినప్పుడు, తగినంత గుర్తింపు రాలేదని అనుకోవద్దు, మంచైనా, చెడు అయినా అనుభవింప వలసిన భక్తులు మీరే! ఫలాపేక్ష లేకుండా కర్మ చేస్తే, పాపపుణ్యాల ఫలితం మిమ్మల్ని బాధపెట్టదు. లాభం కావాలని కోరితే నష్టానికి కూడా నీవు సిద్ధంగా ఉండాలి, నాలుగు దారుల మధ్యలో, బావి త్రవ్వించి మనుష్యులకు పశువులకు దాహం తీర్చి నందుకు పుణ్యం కావాలని కోరావు. పొరబాటున ఎవరైనా అందులో పడి ప్రాణం కోల్పోతే, వచ్చే అపఖ్యాతి ని కూడా నీవు భరించక తప్పదు. ప్రేమతో ఎవరికైనా విసనకర్ర తో విసురుతూ, నీ ఇష్టం వచ్చిన ప్పుడు ఊరు కోవచ్చు. కానీ జీతం పుచ్చుకొని పంకాలాగే జవాను, ఇష్టం ఉన్నా లేకపోయినా ఆపని చేస్తూ ఉండవలసిందే! అనగా ప్రతిఫలాన్ని వదులుకుంటే నీకు స్వేఛ్చ, ప్రతిఫలాన్ని ఆశిస్తే బంధన తప్పదు, కర్మ ఫల త్యాగం లో ఉన్న రహస్య మిదే! *_🌷శుభమస్తు🌷_* 🙏సమస్త లోకాః సుఖినోభవంతు 🙏
#మా ఇంటివంటలు ☕☕🏠 18-05-2026
మా ఇంటివంటలు ☕☕🏠 - ShareChat
#ఈ రోజు 🌧️🌛🌔🌠 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ☘️పంచాంగం☘️ శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 18 - 05 - 2026, వారం ... ఇందువాసరే ( సోమవారం ) శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం, తిథి : *విదియ* రా9.11 వరకు, నక్షత్రం : *రోహిణి* మ2.31 వరకు, యోగం : *సుకర్మ* రా1.25 వరకు, కరణం : *బాలువ* ఉ10.20 వరకు, తదుపరి *కౌలువ* రా9.11 వరకు, వర్జ్యం : *ఉ7.03 - 8.32* మరల *రా7.43 - 9.12* దుర్ముహూర్తము : *మ12.21 - 1.13* మరల *మ2.55 - 3.47* అమృతకాలం : *ఉ11.31 - 1.01* మరల *తె4.39 నుండి* రాహుకాలం : *ఉ7.30 - 9.00* యమగండం : *ఉ10.30 - 12.00* సూర్యరాశి : వృషభం, చంద్రరాశి : వృషభం సూర్యోదయం : 5.31, సూర్యాస్తమయం : 6.21, *_నేటి మాట_* *మనం దైవాన్ని కోరిక ఏమని కోరాలి ???* 1.నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది. 2. నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది. 3. నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు.. 4. నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది. 5. నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం.. 6. భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం... 7. కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి.. 8. చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం.. మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాకా ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది. *_☘️శుభమస్తు☘️_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
#ఈ రోజు 🌧️🌛🌔🌠 *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩* *వైశాఖ పురాణం - 30 వ రోజు పారాయణం* *పుష్కరిణి - ఫలశ్రుతి.* నారదమహర్షి రాజర్షియగు అంబరీష మహరాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వైశాఖవ్రత మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవమహారాజా వైశాఖ శుక్లపక్షమున చివర వచ్చు మూడు తిధులును త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను నీ మూడు తిధులును 'పుష్కరిణీ యను పేరుతో ప్రసిద్దములు. పుష్కరిణియనునది సర్వపాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించును. ఈ మూడు తిధులలోను స్నానాదులను చేయలేనివారు యీ మూడిటిలో నేతిధియందు వైశాఖస్నానాదులను చేసినను వారికి మూడు తిధులయందును స్నానాదికమును చేసిన పుణ్యఫలము సిద్దించును. త్రయోదశినాడు సర్వదేవతలును జలముల నావహించి యుందురు. ఆ తిధియందు సంపూర్ణముగ వసింతురు. పూర్ణిమ యందు శ్రీమహావిష్ణు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించియుండు పై కారణమున నీ మూడు తిధులును ప్రశస్తములైనవి సుమా. బ్రహ్మహత్య సురపానము మున్నగు పాపములను చేసినవారిని గూడ నీ తిధులు పవిత్రులను చేసి పుణ్య ఫలముల నిచ్చును. దేవాసురులు క్షీరసాగరమును మధించుచుండగా నేకాదశియందు అమృతము జనించినది. ద్వాదశినాడు సర్వోత్తముడు దయానిధియగు శ్రీమన్నారాయణుడమృతమును దానవులనుండి కాపాడెను. త్రయోదశినాడు దేవతలకు నమృతమును యిచ్చెను. దేవతలతో వివాదపడి విరోధమును వహించిన రాక్షసులను చతుర్దశియందు సంహరించెను. పూర్ణిమనాడు దేవతలు అందరును తమ సామ్రాజ్యమును పొందిరి. అందువలన దేవతలు సంతుష్టులై త్రయోదశి, పూర్ణిమ యను మూడు తిధులకును, "ఈ మూడుతిధులను మానవులకు వారు చేసిన సర్వపాపములను పోగొట్టి పుత్రపౌత్రాది సర్వసంపదలను యిచ్చును. వైశాఖమాసము ముప్పది దినములును వైశాఖమాస వ్రత స్నానదాన జపాదులను చేయలేక పొయినవారు. యీ మూడు తిధులయందును స్నానాదికమును చేసినచో వారికి సంపూర్ణ ఫలము నిత్తుము. ఈ మూడు తిధులయందును స్నానాదికమును చేయనివారు నీచ జన్మలను పొంది రౌరవమను నరకమును పొందుదురు. వేడినీటి స్నానమును చేసినవారు పదునాలుగు మన్వంతరములను, దడచునంతవరకు నరకమును పొందుదురు. పితృదేవతలకు, దేవతలకు పెరుగన్నము నీయనివారు పిశాచములై పంచభూతములున్నంతవరకు బాధపడుచుందురు. వైశాఖమాస వ్రతమును నియమనిష్ఠలతో నాచరించినవారు కోరినకోరికలను పొందుటయేకాక శ్రీహరి సాయుజ్యమును పొందుచున్నారు. వైశాఖమాసముల నెలనాళ్లు స్నానాదులను చేయలేని వారు పై మూడు తిధులయందును స్నానాదికములను చేసిన సంపూర్ణ ఫలము నంది శ్రీహరి సాయుజ్యమునందుదురు. ఈ మాసవ్రతము నాచరింపక దేవతలను పితృదేవతలను శ్రీహరిని, గురువును పూజింపనివారికి మేము శాపముల నిత్తుము. అట్టివారు సంతానము ఆయువు శ్రేయస్సు, లేనివారై బాధలను పొందుదురని దేవతలందరును కట్టడిచేసిరి. కావున నీ మూడు తిధుల సముదాయము అంత్య పుష్కరిణి నామధేయమున సర్వపాపములను హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని  యిచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును యిచ్చి సకల సంపదలను ముక్తిని యిచ్చును. పూర్ణిమనాడు సద్బ్రాహ్మణునకు సూపమును(పప్పును), పాయసమును యిచ్చిన స్త్రీ కీర్తిశాలియగు పుత్రుని పొందును. ఈ మూడు దినములయందును గీతా పఠనము చేసిన వారు ప్రతిదినము అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము నందుదురు. ఈ దినములయందు విష్ణు సహస్రనామములను చదివినచో వాని పుణ్యమింతయని చెప్పవలనుపడదు. పూర్ణిమనాడు సహస్రనామములతో శ్రీహరిని క్షీరముతో అభిషేకించినవారు శ్రీహరి లోకమును చేరుదురు. సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించినవారు యెన్నికల్పములు గడచినను శ్రీహరి లోకమునందే యుందురు. శక్తియుండి వైశాఖవ్రతము నాచరింపనివారు సర్వపాపములను పొంది నరకమును చేరుదురు. వైశాఖమున నీమూడు దినములందు భాగవతమును యే మాత్రము చదివినను బ్రహ్మపదవిని పొందుదురు. గొప్ప జ్ఞానులగుదురు. ఈ మూడు దినముల వ్రతమును చేయుటచే వారి వారి శ్రద్దాసక్తులను బట్టి కొందరు దేవతలుగను, సిద్ధులుగను, బ్రహ్మపదవిని పొందిరి. బ్రహ్మజ్ఞాని, ప్రయాగలో మరణించినవారు. వైశాఖ స్నానమాచరించినవారు సర్వపురుషార్థములను పొందుదురు. దరిద్రుడగు బ్రాహ్మణునకు గోదానము నిచ్చినవారికి అపమృత్యువెప్పుడును ఉండదు. మూడుకోట్లయేబది లక్షల తీర్థములును కలసి మేమి పాపములను పోగొట్టుదుమని మానవులు మనలో స్నానము చేయుచున్నారు. అట్టివారు పాపములన్నియు మనలో చేరి మనము యెక్కువగా కల్మషమును కలిగియుంటిమి. దీనిని పోగొట్టుకొను మార్గమును చెప్పుమని శ్రీహరిని కోరవలెను. అనియనుకొని శ్రీహరి కడకు పోయినవి. ఆయన ప్రార్థించి తమ బాధను చెప్పుకొన్నవి. అప్పుడు శ్రీహరి వైశాఖమాస శుక్లపక్షమున అంత్యపుష్కరిణి కాలమున సూర్యోదయముకంటె ముందుగా మీరు నదులు, చెరువులు మున్నగువానిలో స్నానమాడినవారికి మీ కల్మషములంటును అనగా సూర్యోదయముకంటె ముందుగా స్నానము చేసినవారికి మీ కల్మషమంటదు. వారి పాపములు పోవును అని చెప్పెను. సర్వతీర్థములును ఆ విధముగ చేసి తమ కల్మషములను పోగొట్టుకొన్నవి. కావున వైశాఖమాసమున శుక్లపక్షము చివర వచ్చు త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ పవిత్ర తిధులు సర్వపాపహరములు సుమా. నాయనా! శ్రుతదేవా నీవడిగిన వైశాఖమహిమను, నేను చూచినంత, విన్నంత, తెలిసినంత నీకు చెప్పితిని. దాని మహిమను పూర్తిగ చెప్పుట నాకే కాదు శివునకును సాధ్యము కాదు. వైశాఖమహిమను చెప్పుమని కైలాసమున పార్వతి యడుగగా శివుడు నూరు దివ్యసంవత్సరములు ఆ మహిమను వివరించి ఆపై శక్తుడుకాక విరమించెను. ఇట్టిచోసామాన్యుడనగు నేనెంటివాడను? శ్రీహరి సంపూర్ణముగ చెప్పగలడేమో తెలియదు. పూర్వము మునులు జనహితమునకై తమ శక్తికొలది వైశాఖమహిమను చెప్పిరి. రాజా! నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖవ్రతము నాచరించి శుభములనందుము. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పి తన దారిన తాను పోయెను. శ్రుతకీర్తియు పరమ సంతుష్టుడై మహావైభవముతో వైశాఖవ్రతము నాచరించి శ్రీహరిని యూరేగించి తాను పాదచారియై యనుసరించెను. అనేక దానముల నాచరించి ధన్యుడయ్యెను. అని అంబరీషునకు నారదుడు చెప్పి అంబరీష మహారాజా! సర్వశుభకరమగు వైశాఖమహిమను చెప్పితిని. దీని వలన భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము వీనిని పొందుము. దీనిని శ్రద్ధాభక్తులతో నాచరింపుము అని నారదుడనెను. అంబరీషుడును నారదునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ నమస్కారములను మరల మరల చేసెను. నారదుని బహువిధములుగ గౌరవించెను. నారదుడు చెప్పిన ధర్మములనాచరించి శ్రీహరి సాయుజ్యమును పొందెను. ఈ యుత్తమ కథను విన్నను చెప్పినను సర్వపాపములను పోగొట్టుకొని ముక్తినందుదురు. దీనిని పుస్తకముగ వ్రాసి యింటనుంచుకొన్న సర్వశుభములు భుక్తి, ముక్తి శ్రీహరియనుగ్రహము కలుగును. *వైశాఖ పురాణం సమాప్తం.* *నేటితో వైశాఖ పురాణాలు సంపూర్ణంము.* *సభ్యులు గమనించగలరు స్వస్తి.* *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*
#ఈ రోజు 🌧️🌛🌔🌠 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌻పంచాంగం🌻 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 17 - 05 - 2026, వారం ... భానువాసరే ( ఆదివారం ) శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం, తిథి : *పాడ్యమి* రా11.37 వరకు, నక్షత్రం : *కృత్తిక* సా4.08 వరకు, యోగం : *శోభన* ఉ7.29 వరకు, తదుపరి *అతిగండ* తె4.28 వరకు, కరణం : *కింస్తుఘ్నం* మ12.48 వరకు, తదుపరి *బవ* రా11.37 వరకు, వర్జ్యం : *ఉ.శే.వ 6.24 వరకు* దుర్ముహూర్తము : *సా4.38 - 5.29* అమృతకాలం : *మ1.53 - 3.23* రాహుకాలం : *సా4.30 - 6.00* యమగండం : *మ12.00 - 1.30* సూర్యరాశి : వృషభం, చంద్రరాశి : వృషభం సూర్యోదయం : 5.31, సూర్యాస్తమయం : 6.21, *_నేటి విశేషం_* *అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం* *మూడేళ్లకొకసారి వచ్చే 'అధిక మాసం'- ఈసారి జ్యేష్ఠంలో- మరి శుభకార్యాలు చేసుకోవచ్చా?* *అధిక మాసం అంటే ఏమిటి?- ఎందుకు వస్తుంది? అది ఎలా ఏర్పడుతుంది? ఈ పవిత్ర మాసం విశిష్టత ఏమిటి?* తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. 2023 వ సంవత్సరంలో శ్రావణ మాసం అధిక మాసంగా వచ్చింది, తిరిగి 2026 లో జ్యేష్ఠ మాసం అధిక మాసంగా వచ్చింది. *అధిక మాసం అంటే?* ఒకే సంవత్సరంలో ఒకే పేరున్న మాసం రెండు సార్లు వస్తే మొదటిదాన్ని అధికం అని, రెండవదాన్ని నిజమాసమని, శుద్ధం అని అంటారు. శుభకార్యాలు నిషిద్ధమైన ఈ అధిక మాసంలో ఏమేమి చేయవచ్చు? ఏవి చేయకూడదు అనే అంశాలు ఋషులు చక్కగా వివరించి ఉన్నారు. *అధిక మాసం ఎలా ఏర్పడుతుంది?* ఈ ఏడాది మే 17, ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కానుంది. "అసంక్రాంతి మాసో అధికమాసః" అని సనాతన ధర్మశాస్త్రంలో వివరించి ఉంది. అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రయాణించడాన్ని సంక్రమణం లేదా సంక్రాతి అంటారు. ఏ మాసంలో అయితే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడో ఆ మాసాన్ని అధిక మాసమని అంటారు. *శాస్త్రీయ కోణం* శాస్త్రీయ కోణం నుంచి చూస్తే చాంద్రమానం ప్రకారం చూస్తే ఒక సంవత్సరానికి 354 రోజులు మాత్రమే ఉంటాయి. అదే సౌరమానం ప్రకారం 365 రోజులు ఉంటాయి. ఈ రెండింటి మధ్య వచ్చే 11 రోజుల తేడాను సరిచేయడానికి ప్రతి 33 నెలలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అంటే ఏడాదికి 11 రోజుల చొప్పున మూడు సంవత్సరాలకు సుమారుగా 30 రోజుల పైనే అవుతుంది. ఈ కాలాన్ని అధిక మాసంగా పరిగణించాలని శాస్త్రం చెబుతోంది. *ఏ నెల అధిక మాసం అవుతుంది?* ఏ నెలలో సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడో అంటే సూర్య సంక్రమణం జరగదో, ఆ నెల 'అధిక మాసం' అవుతుంది. *పురుషోత్తమ మాసం* అధిక మాసాన్ని పురుషోత్తమ మాసమని కూడా అంటారు. ఈ మాసానికి అధిపతి శ్రీమహావిష్ణువు. *అధిక మాసం ఎప్పుడు వస్తుంది?* సాధారణంగా చైత్రమాసం నుంచి ఆశ్వయుజ మాసం మధ్యలో అధిక మాసం వస్తుంది *2026లో అధిక మాసం ఎప్పుడు?* 2026 సంవత్సరంలో, మే 17, ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జ్యేష్ఠ మాసం రెండు సార్లు వస్తుంది. జూన్ 16 నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా అధిక మాసంలో ఎలాంటి పుణ్యకార్యాలు చేయవచ్చు? ఎలాంటి కార్యాలు నిషిద్ధం? అనే విషయాలు తెలుసుకుందాం. *ఋగ్వేద వాక్కు* శ్రౌత స్మార్తాది కర్మలన్నీ నిజమాసం అంటే శుద్ధ మాసంలోనే ఆచరించాలని ఋగ్వేదంలో వివరించి ఉంది. ఈ కర్మలు అధిక మాసంలో ఆచరిస్తే నిష్ఫలం అవుతాయని ఋషి వాక్కు. దేవకార్యాలు నిజమాసంలో, పితృ కార్యాలు అధిక నిజ రెండు మాసాల్లో ఆచరించవచ్చు. *అధిక మాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చా?* అధిక మాసంలో శుభకార్యాలు నిషిద్ధమైనప్పటికీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, నవగ్రహ హోమాలు, శాంతి పూజలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. *అధికస్య అధికం ఫలం* అధిక మాసంలో లౌకికమైన శుభకార్యాలు నిషిద్ధమైనప్పటికీ జపతపాలకు, అనుష్టానానికి ఇంతకు మించిన శుభ సమయం మరొకటి ఉండదు. ఈ మాసంలో చేసే జపతపాలకు, అనుష్టానానికి వెయ్యిరెట్లు అధిక ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అధికస్య అధికం ఫలం అంటారు. అధిక మాసంలో ఎంత ఎక్కువగా జపతపాలు, అనుష్ఠానాలు చేస్తే అంత ఎక్కువ ఫలితం లభిస్తుందని అర్ధం. ఈ మాసంలో చేసే ఏ పుణ్యకార్యమైన విశేషమైన ఫలాన్ని ఇస్తుంది. *శ్రాద్ధకర్మలు నిర్వహించవచ్చా?* జ్యేష్ఠ మాసంలో గతించిన పెద్దలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించే విషయంలో శాస్త్రం కొన్ని నియమాలు సూచించింది. అధిక మాసంలో పిండ రహితంగా, శుద్ధ మాసంలో పిండ సహితంగా శ్రాద్ధ కర్మలు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. అంతేకాదు ఈ మాసమంతా విరామం లేకుండా ఒక దీపాన్ని వెలిగించి ఉంచడం వలన పితృదేవతలకు సద్గతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం ఎవరైనా అధిక జేష్ఠ మాసంలో గతించి ఉంటే అలాంటివారి ఆబ్దికం మాత్రం అధికమాసంలోనే నిర్వహించాలి. నెల మాసికాలు నిర్వహించేవారు అధికమాసంలో కూడా మాసికం పెట్టి తీరాలి. సంవత్సరీకం అయితే అధిక మాసంలోనే ఆచరించాలని శాస్త్ర వచనం. *దానధర్మాలకు శ్రేష్టం అధిక మాసం* అధిక మాసం దానధర్మాలకు శ్రేష్టమైన మాసమని పెద్దలు అంటారు. ఈ మాసంలో ఫల దానం అంటే పళ్లు దానం చేసినా, పిండి వంటలు పంచి పెట్టినా అధిక ఫలం లభిస్తుందట! ముఖ్యంగా ఈ దానాలు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి, పౌర్ణమి, బహుళ అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య వంటి రోజుల్లో చేయడం వలన అనంతమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రంలో వివరించి ఉంది. ఈ రోజుల్లో దానాలు చేయడం వలన సుఖశాంతులు, సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. రానున్న అధిక జ్యేష్ఠ మాసంలో మనం కూడా జపతపాలు, దానధర్మాలు, దైవారాధనలు చేద్దాం. సకల శుభాలు పొందుదాం. శుభం భూయాత్!... *_🌻శుభమస్తు🌻_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
#మా ఇంటివంటలు ☕☕🏠
మా ఇంటివంటలు ☕☕🏠 - ShareChat
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
🙏శ్రీ వెంకటేశ్వర స్వామి - ShareChat
00:20
#ఈ రోజు 🌧️🌛🌔🌠 16-05-2026 శనివారం _* శనీశ్వరుడి జయంతి , శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం మీ వెంటే..!*_ *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩* శనీశ్వరుడి జయంతిని ఏటా వైశాఖ అమవాస్య తిథినాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారు. ఈ రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై.. అదృష్టం కలిసి వస్తుంది. *శనీశ్వరుడి జయంతి* దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి , వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అందుకే శని దేవుడిని నిర్లక్ష్యం చేయరాదు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ చతుర్దశి అనంతరం వచ్చే అమవాస్య రోజు శని జయంతి జరుపుకుంటారు. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. సూర్యదేవుడు కుమారుడైన శని.. శనిగ్రహం స్వరూపం. ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అట్టంకులు , సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి. *చేయవలసిన పూజలు* శని జయంతి రోజు భక్తులందరూ గంగాజలం , నూనే , నీరు పరిశుభ్రంగా స్నానమాచరించాలి. అనంతరం శని విగ్రహానికి 9 రాళ్లుతో చేసిన గొలుసును సమర్పించాలి. దుష్టశక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శని దేవుడును ప్రసన్నం చేసుకోవాలి. అంటే తేలాభిషేకం చేసి శాంతి పూజలు నిర్వహించాలి. తాంత్రిక విద్యల ప్రభావం నుంచి రక్షణ కోసం హోమం లేదా యజ్ఞాన్ని జరిపించాలి. ప్రజలు తమ వేలికి గుర్రపు ఉంగరాన్ని ధరించడం లేదా ఇంటి వెలుపల దాన్ని వేలాడదీయడమో చేయాలి. అంతేకాకుండా ఈ రోజు చీమలకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి. శని స్త్రోత్రాన్ని నిత్యం పఠిస్తే భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతారు. నలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది. అంటే నలుపు వస్త్రాలు , ఆవ నూనే లాంటివి దానం చేయాలి. *శని దేవుడి ప్రాముఖ్యత* సూర్య దేవుడి కుమారుడైన శని పుట్టిన రోజు సందర్భంగా శని జయంతిని ఏటా నిర్వహిస్తారు. వైశాఖ మాసంలోని అమావాస్య తిథినాడు ఈ జయంతి వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాడు శని. అంతేకాకుండా ఈయన శని గ్రహానికి రాజు. జీవితంలో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటోన్న సమయంలో శని దేవుడికి పూజ చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శనీశ్వరుడి అనుగ్రహం పొందితే అదృష్టం కలిసి వస్తుంది. ఆ విధంగా శనిని ప్రార్థించడం వల్ల భక్తులను కష్టాలు , బాధల నుండి విముక్తులవుతారు. అంతేకాకుండా దుష్ట , చెడు ప్రభావాల నుంచి ఉపశమనం కలుగుతుంది. *శని శాంతి మంత్ర స్తుతి* ప్రతి శనివారం ఈ మంత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ మంత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది. నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది. క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్ ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్ నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ కృష్ణదేహాయ వై నమః శనైశ్చరాయ కౄరాయ శుద్ధబుద్ధి ప్రదాయనే య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్ మదీయం తు భయం తస్య స్వప్నేపి న భవిష్యతి నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. శని దోషం నుండి బయటపడేందుకు పైన ఉదహరించిన ''క్రోడం నీలాంజన ప్రఖ్యం..'' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి , తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి. శన్యారిష్టే తు సంప్రాప్తే శనిపూజాంచ కారయేత్ శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోపశాంతయే ఈ రెండు శ్లోకాలను స్మరించడంతో బాటు , నవగ్రహాలకు తైలాభిషేకం చేయాలి. ఇలా చేయడంవల్ల శని దోష బాధితులకు వెంటనే సత్ఫలితం కనిపిస్తుంది. *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*
#ఈ రోజు 🌧️🌛🌔🌠 *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩* *వైశాఖ పురాణం - 29 వ రోజు పారాయణం* *శునీ( కుక్క ) మోక్ష ప్రాప్తి* నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమనిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నిట్లు పలికెను. మహారాజా! అన్ని తిధులలో వైశాఖమాసమున శ్లుక్లపక్షమున వచ్చు ద్వాదశీ తిధి సర్వపాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశినాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు చేయుట, చెరువు మున్నగువానిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే. ఈనాడు ప్రాతఃకాల స్నానము చేసినచో గ్రహణకాలమున గంగాతీరమున వేయిగోవుల నిచ్చిన పుణ్యము వచ్చును. ఈనాడు చేసిన అన్నదానము విశిష్టఫలము కలుగును. ఈనాడు యముని పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జలకలశమును దధ్యన్నమును యిచ్చిన వచ్చు ఫలము మాటలకందనిది. అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము. ఈనాడు సాలగ్రామదానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట పంచామృతముతో నభిషేకించుట, పానకము నిచ్చుట, దోసపండ్ల రసమును, చెరకుగడను, మామిడిపండును, ద్రాక్షాఫలములను దానము చేయుట ప్రశస్తము. సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశీ మహిమను వెల్లడించు కథను వినుము. పూర్వము కాశ్మీరదేశమున దేవవ్రతుడను బ్రాహ్మణుడు కలడు. వానికి మాలినియను అందమైన కుమార్తె కలదు. అతడామెను సత్యశీలుడను వానికిచ్చి వివాహము చేసెను. సత్యశీలుడు తన భార్యయగు మాలినిని తన దేశమునకు గొనిపోయెను. అతడు మంచివాడే అయినను ఆమెయనిన పడదు. ఆమెకును అతడన్న పడదు. ఈ విధముగ వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండెను. మాలిని భర్తను వశీకరణ చేసికొను ఉపాయములను చెప్పుడని భర్తృపరిత్యక్తలగు స్త్రీలను అడిగెను. వారును మేము మా భర్తలకు చేసినదానిని చెప్పినట్లు చేయుము. మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు-మాకులను వశీకరణకై యిచ్చుయోగిని వివరములను చెప్పిరి. మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని యొద్దకు పోయి ధనము నిచ్చి తన భర్త తనకు వశమగునట్లు చేయుమని అడిగెను. యోగినికి ధనమును తన చేతి యుంగరమునిచ్చెను. యోగినియు నామొకొక మంత్రము నుపదేశించెను. అన్ని ప్రాణులును స్వాధీనమయ్యెడి చూర్ణము నిచ్చుచున్నాను. దీనిని నీ భర్తచే తినిపింపుము. ఈ యంత్రమును నీవు ధరింపుము. ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినును అని చూర్ణమును యంత్రమునిచ్చెను. మాలినియు సంతోషముతో ఇంటికి వచ్చెను. యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించెను. చూర్ణమును భర్తచే తినిపించెను. యంత్రమును తానుకట్టుకొనెను. ఆమె భర్తకు ఆ చూర్ణమును తినుటచే వ్యాధికలిగెను. మరికొన్ని దినములకు యేమియును అనలేనివాడు చేయలేనివాడును అయ్యెను. దురాచారురాలూగు ఆమె భర్తమరణించినచో తాను అలంకారములను విడువవలసి వచ్చునని బాధపడెను. మరల యోగిని వద్దకు పోయెను. ఆమె యిచ్చినదానిని భర్తచే తినిపించెను. వాని ఆరోగ్యము బాగుపడెను. కాని ఆమె స్వేచ్చగా చరించుచు విటులతో కాలక్షేపము చేయుటచే నామెకు వ్యాధులు కలిగి పలు బాధలు పడి తుదకు మరణించెను. యమలోకమును చేరి పెక్కు చిత్రవిచిత్రములగు హింసలననుభవించెను. పలుమార్లు కుక్కగా జన్మించెను. కుక్క రూపముననున్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు. సౌవీరదేశమున పద్మబంధువను బ్రాహ్మణుని యింట పనిచేయు దాసి గృహమందు కుక్కగానుండెను. ఇట్లు ముప్పది సంవత్సరములు గడచినవి. ఒకప్పుడు వైశాఖమాసమున ద్వాదశినాడు పద్మబంధువు కుమారుడు నదీస్నానము చేసి తిరిగి వచ్చి తులసి యరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనెను. సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో బాటు వచ్చిన కుక్క తులసి యరుగు క్రింద పండుకొనియున్నది. బ్రాహ్మణుడు పాదములు కడుగుకొన్న నీరు అరుగుపైనుండి జారి క్రిండపడుకొన్న కుక్కపై పడెను. ఆ పవిత్ర జలస్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతికల్గెను. తాను చేసిన పాపములకు మిగుల పశ్చాత్తాపము కలిగెను. తాను చేసిన దోషములను అన్నిటిని చెప్పి విప్రోత్తమా! దీనురాలైన నాపై దయయుంచి వైశాఖ శుద్ద ద్వాదశినాడు చేసిన పుణ్యకార్యములను, పుణ్యఫలమును నాకు ధారపోసి రక్షింపుమని బహువిధములుగ వేడుకొనెను. కుక్క మాటలాడుటయేమని యాశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని, తాను ద్వాదశినాడు చేసిన ప్రాతఃకాల నదీస్నానము పూజ, కథాశ్రవణము, జపము, తపము, హోమము, ఉపవాసము మున్నగు పుణ్యకార్యముల పుణ్యఫలము నిచ్చుటకు అంగీకరింపలేదు. కుక్క రూపమున నున్న మాలిని మరల పెక్కు విధములుగ దీనురాలై ప్రార్థించెను. బ్రాహ్మణుడంగీకరింపలేదు. అప్పుడాకుక్క మిక్కిలి దీనముగా దయాశాలీ! పద్మబంధూ! నన్ను దయజూడుము గృహస్థు తను పోషింపదగినవారిని రక్షించుట ధర్మము. నీచులు, కాకులు, కుక్కలు ఆ యింటిలోని బల్లులను ఉచ్చిష్టములను తినుట చేత వానికి పోష్యములై రక్షింపదగియున్నవి. కావున నేను నీకు పోష్యరాలను. రక్షింపదగిన దానను. జగత్కర్తయగు యజమానియగు విష్ణువునకు మనము పోష్యులమై రక్షింపదగినవారమైనట్లుగ నేనును నీచే రక్షింపబడదగినదాననని బహువిధములుగ ప్రార్థించెను. పద్మబంధువు దాని మాటలను విని వెలుపలికి వచ్చి ఏమని పుత్రుని యడిగెను. పుత్రుడు చెప్పిన వృత్తాంతమును కుక్కమాటలను విని యాశ్చర్యపడెను. పుత్రుని జూచి నాయనా! నీవిట్లు పలుకరాదు. సజ్జనులు యిట్లు మాటలాడరు. పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుచున్నారు. సజ్జనులు పరోపకారము కొరకై పాటుపడుదురు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనము, వృక్షములు, సజ్జనులు పరోపకారమునకై మాత్రమే యున్నారు. వారు చేయు పనులన్నియును పరోపకారములే. వారి కోరకై యేమియు నుండదు. గమనించితివా? రాక్షస సంహారమునకై దధీచిదేవతలకు దయతో తన వెన్నముకను దానము చేసెను. పావురమును రక్షించుటకై శిబిచక్రవర్తి ఆకలి గల డేగకు తన మాంసము నిచ్చెను. జీమూత వాహనుడను రాజు సర్పరక్షణకై తనను గౠడునకు అర్పించుకొనెను. కావున భూసురుడు భూమిపైనున్న దేవత బ్రాహ్మణుడు దయావంతుడై యుండవలయును. మనస్సు పరిశుద్దముగ నున్నప్పుడు దైవము వర్షించును. మనశ్శుద్దిలేనిచో దైవము వర్షింపదు. చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండ వెన్నెలనంతటను ప్రసరింపజేయుచున్నాడు కదా! కావున నేను దీనురాలై అడుగుచున్న యీ కుక్కను నా పుణ్యకార్యముల ఫలములనిచ్చి యుద్దరింతును అని పలికెను. ఇట్లు పలికి ద్వాదశినాడు తాను చేసిన పుణ్యకార్యాల ఫలమును కుక్కకు ధారపోసి నీవు పాపములు లేని దానవై శ్రీహరి లోకమును పొమ్మని పలికెను. అతడిట్ళు పలుకుచుండగా నా కుక్క రూపమును విడిచి దివ్యభరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను. బ్రాహ్మణునకు నమస్కరించి కృతజ్ఞతను దెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపజేయుచు దివ్యవిమానను నెక్కి పోయెను. స్వర్గమున పెక్కు భోగములను ఆ నుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడగు దైవమునుండి పుట్టి యూర్వశిగా ప్రసిద్దినందెను. యోగులు మాత్రమే పొందునట్టి, అగ్నివలె ప్రకాశించునట్టి సర్వోత్తమమగునట్టి, యెట్టివారికైన మోహమును కలిగించునట్టి పరమార్థ స్వరూపమగు సౌందర్యమునందెను. త్రిలోకసుందరిగా ప్రసిద్ది చెందెను. పద్మబంధువు ఆ ద్వాదశీ తిధిని పుణ్యములను వృద్ది చెందించు విష్ణుప్రీతికరమైన పుణ్యతిధిగా లోకములలో ప్రసిద్దినొందించెను. ఆ ద్వాదశీ తిధి కొన్ని కోట్ల సూర్యచంద్ర గ్రహణముల కంటె సమస్త యజ్ఞయాగాదులకంటె అధికమైన పుణ్యరూపము కలదై త్రిలోక ప్రసిద్దమయ్యెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి వైశాఖశుద్ద ద్వాదశీ మహిమను వివరించెనని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పెను. *వైశాఖ పురాణం  29వ అధ్యాయం సమాప్తం.* *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*
#ఈ రోజు 🌧️🌛🌔🌠 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌸పంచాంగం🌸 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 16 - 05 - 2026, వారం ... స్థిరవాసరే ( శనివారం ) శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళ పక్షం, తిథి : *అమావాస్య* రా1.58 వరకు, నక్షత్రం : *భరణి* సా5.39 వరకు, యోగం : *సౌభాగ్యం* ఉ10.23 వరకు, కరణం : *చతుష్పాత్* మ3.04 వరకు, తదుపరి *నాగవం* రా1.58 వరకు, వర్జ్యం : *ఉ.శే.వ 5.33 వరకు* మరల *తె4.54 నుండి* దుర్ముహూర్తము : *ఉ5.32 - 7.14* అమృతకాలం : *మ1.06 - 2.37* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండం : *మ1.30 - 3.00* సూర్యరాశి : వృషభం, చంద్రరాశి : మేషం సూర్యోదయం : 5.32, సూర్యాస్తమయం : 6.20, *_నేటి విశేషం_* *వైశాఖ అమవాస్య* *శని జయంతి* నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ । ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥ ప్రతి సంవత్సరం వైశాఖ అమవాస్య తిథినాడు శనిజయంతి వస్తుంది. నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడు, సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం... నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడు. ఈ రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి ఆయన అనుగ్రహం పొందితే కష్టాలు దూరమై.. శుభఫలాలు కలుగుతాయి. దేవతల్లో శని దేవుడికి విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే శని చెడు ప్రభావం మనమీద పడితే వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అనర్థాలు జరుగుతాయి. వారంలో ఒకరోజు అంటే శనివారం నాడు శనీశ్వరుడు శని గ్రహాన్ని పాలిస్తుంటాడు. శనిగ్రహం స్వరూపం, ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అడ్డంకులు, సమస్యలు తొలగిపోతాయి. శని దేవుడి ఆశీర్వాదం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి, శని జయంతి రోజు స్నానమాచరించడము, స్వామికి తేలాభిషేకము, జప, తర్పణ, దాన హోమములు వంటి శాంతి పూజలు నిర్వహించుటచే శుభఫలములు పొందవచ్చును. *_🌸శుభమస్తు🌸_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏