RAJENDRAPRASAD, M.Com.
ShareChat
click to see wallet page
@raajendraprasad
raajendraprasad
RAJENDRAPRASAD, M.Com.
@raajendraprasad
"దయచేసి నమ్మక ద్రోహం చెయ్యకండి"
#మా ఇంటివంటలు ☕☕🏠
మా ఇంటివంటలు ☕☕🏠 - ShareChat
#ఈ రోజు 🌧️🌛🌔🌠 *ఈరోజు 13-05-2026 బుధవారం* *అపరా ఏకాదశి* *అపరా ఏకాదశి అనేది వైశాఖ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి. దీనిని “అచల ఏకాదశి” అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి మహిమ గురించి పురాణాలలో విశేషంగా చెప్పబడింది. “అపర” అంటే “అపారమైనది” లేదా “అనంతమైనది” అని అర్థం. ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి అపారమైన పుణ్యం, పాప విమోచనం లభిస్తాయని విశ్వాసం.* *అపరా ఏకాదశి విశిష్టత* *ఈ ఏకాదశి వ్రతం వలన బ్రహ్మహత్య, అబద్ధ సాక్ష్యం, గురు నింద, ఇతర పాపాలు తొలగుతాయని పురాణాలు చెబుతాయి.* *గంగాస్నానం, కాశీ యాత్ర, గోదానం వంటి మహా పుణ్యఫలాలు ఈ వ్రతం ద్వారా లభిస్తాయని చెప్పబడింది.* *భక్తితో ఉపవాసం చేసి విష్ణుని ధ్యానం చేస్తే పితృదోషాలు తగ్గి, ఆధ్యాత్మిక శాంతి కలుగుతుందని నమ్మకం*. *భవబంధనాల నుండి విముక్తి పొందడానికి ఈ ఏకాదశి ఎంతో శ్రేష్ఠమైనదిగా భావిస్తారు*. *అపరా ఏకాదశి రోజున ప్రధానంగా శ్రీమహావిష్ణువు ను పూజించాలి. ముఖ్యంగా ఈ రూపాలను ఆరాధించడం శ్రేయస్కరం:* *శ్రీమన్నారాయణుడు* *లక్ష్మీనారాయణ స్వామి* *సత్యనారాయణ స్వామి* *శ్రీకృష్ణుడు* *వేంకటేశ్వర స్వామి* *ఉదయం స్నానం చేసి విష్ణు ఆలయ దర్శనం చేయాలి.* *“ఓం నమో నారాయణాయ” మంత్రాన్ని జపించడం శుభప్రదం.* *విష్ణు సహస్రనామం, దశావతార స్తుతి, గోవింద నామస్మరణ, భగవద్గీత పారాయణం చేయాలి.* *తులసి దళాలతో పూజ చేయడం ఎంతో పవిత్రం.* *సాయంత్రం దీపారాధన చేసి, పండ్లు లేదా సాత్వికాహారంతో ఉపవాస విరమణ చేయాలి.* *ప్రత్యేకంగా చేయదగినవి* *పేదలకు అన్నదానం,గోసేవ తులసి చెట్టు వద్ద దీపం వెలిగించడం... విష్ణు నామస్మరణ* *ఈ ఏకాదశి భక్తితో ఆచరించినవారికి పాప విమోచనం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత, విష్ణు కటాక్షం లభిస్తాయని పురాణ విశ్వాసం.* *ఈ ఏకాదశి వ్రతపాలన వలన ఎన్నో జన్మలలో చేసిన పాపములనుండి కూడా విముక్తులౌతారు. ఈ రోజున ఇంటి మరమ్మత్తులు, మట్టి, రాతి పనులవంటివి చెయ్యరాదు.* *ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ* 🙏
#ఈ రోజు 🌧️🌛🌔🌠 *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩* *వైశాఖ పురాణం - 26 వ రోజు పారాయణం* *వాల్మీకి* నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్ప నారంభించెను. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజునకు శంఖ వ్యాధుల సంవాదమును చెప్పుచు నిట్లనెను. తమయెదురుగ నున్న మఱ్ఱిచెట్టు కూలుట దాని తొఱ్ఱనుండి వచ్చిన భయంకరసర్పము దివ్యరూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి యాశ్చర్యపడిరి. శంఖుడును ఆ దివ్యపురుషుని జూచి 'ఓయీ! నీవెవరవు? నీకిట్టి దశయేల వచ్చినది. విముక్తియేల కలిగినది? నీ వృత్తాంతమునంతయు  వివరముగ జెప్పుమని యడిగెను. శంఖుడిట్లడుగగనే ఆ దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి యిట్లు చెప్ప నారంభించెను. ఆర్యా! నేను ప్రయాగ క్షేత్రముననుండు బ్రాహ్మణుడను. కుసీదుడను ముని యొక్క పుత్రుడను. మాటకారిని. రూపయౌవనములు విద్యా, సంపదలు కలవని గర్వించువాడను. చాలమంది పుత్రులు అహంకారము కలవాడను నాపేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము కూర్చొనుట, శయనము పడుకొనుట స్త్రీసుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములను చేయుట, వడ్డీవ్యాపారము చేయుట నిత్యకృత్యములు.  జనులాక్షేపింతురని సంధ్యావందనాదికమును చేసినట్లు నటించెడివాడను. మోసము ఆడంబరము తప్ప నాకు పూజాదులయందు శ్రద్దలేదు. ఇట్లు కొంతకాలము గడచెను. ఒక వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో నున్నవారికి వైశాఖవ్రతమును, ధర్మములను మున్నగువానిని వివరించుచుండెను. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణములవారు అందరును కొన్నివేల మంది వైశాఖ వ్రతము నాచరించుచు ప్రాతఃకాల స్నానము, శ్రీహరిపూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండిరి. జయంతుడు చెప్పుచున్న శ్రీహరికథలను మౌనముగ శ్రద్దాసక్తులతో వినుచుండిరి. నేను ఆ సభను చూడవలయునని వేడుక పడితిని. తలపాగా మున్నగువానితో విలాసవేషమును ధరించి తాంబూలమును నమలుచు సభలోనికి ప్రవేశించితిని. నా ప్రవర్తనచే సభలోనివారందరికిని యిబ్బంది కలిగెను.నేను ఒకరి వస్త్రమును లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు అటు నిటు తిరుగుచు హరికథా ప్రసంగమునకు శ్రవణమునకు ఆటంకమును కలిగించితిని. ఇట్టి దోషములచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని. మరణించితిని. మిక్కిలి వేడిగనున్న నీటిలోను, సీసముతోను నిండియున్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున నుండి, యెనుబదినాలుగు లక్షల జీవరాశులయందును జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన యీ మఱ్ఱిచెట్టుతొఱ్ఱలో ఆహారములేక బాధపడుచు పదివేల సంవత్సరములుంటిని. దైవికముగ నీవు చెప్పుచున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాపవిముక్తుడనై దివ్యరూపమునందితిని. నాకిట్టి భాగ్యమును కలిగించిన నీకు కృతజ్ఞుడనై యిట్లు నమస్కరించితిని. స్వామీ! మీరు నాకు యే జన్మలో బంధువులో తెలియదు. నేను మీకెప్పుడును యే విధముగను సాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగియుందురు కదా! స్వామీ! సజ్జనులు దయావంతులునగు వారు నిత్యము పరోపకారపరాయణులే కదా! స్వామీ! నాకు సదా ధర్మబుద్ది కలుగునట్లును,విష్ణుకథలను మరువకుండునట్లు అనుగ్రహింపుము. నేత్రదోషము కలవానికి కాటుక సాయపడినట్లుగా ధనమదము కలవారికి దరిద్రులు మంచినడవడికగల సజ్జనుల సహవాసము మాత్రము సదా ఉండవలయును అని ఆ దివ్యపురుషుడు శంఖమునిని బహువిధములుగ ప్రార్థించుచు నమస్కరించి యట్లే యుండెను. శంఖమునియు తనకు నమస్కరించి యున్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను.తన పవిత్రమైన చేతితో వానిని స్పృశించి వానిని మరింత పవిత్రునిగావించెను. ధ్యాన స్తిమితుడై కొంతకాలముండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలుగబోవు జన్మనిట్లు వివరించెను. ఓయీ! వైశాఖమాస మహిమను వినుటవలన శ్రీహరి మహిమను వినుటవలన నీ పాపములన్నియు పోయినవి. నీవు దశార్ణదేశమున వేదశర్మయను బ్రాహ్మణుడవుగా జన్మింతువు. వేద శాస్త్రదులను చక్కగా చదివియుందువు. పాపమును కలిగించు దారేషణ, ధనేషణ, పుత్రేషణలను విడిచి సత్కార్యముల యందిష్టము కలవాడై విష్ణుప్రియములగు వైశాఖ ధర్మములన్నిటిని  పెక్కుమార్లు చేయగలవు.సుఖదుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై, నిరీహుడవై గురుభక్తి, యింద్రియజయము కలవాడై సదా విష్ణుకధాసక్తుడవు కాగలవు.ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరి పదమును చేరగలవు.నాయనా భయపడకుము. నీకు నాయనుగ్రహమున శుభము కలుగగలదు. హాస్యముగ గాని, భయమునగాని, కోపమువలన గాని, ద్వేషకామముల వలన గాని, స్నేహము వలన గాని శ్రీహరి నామమునుచ్చరించిన సర్వపాపములును నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములును శ్రీహరి పదమును చేరుదురు సుమా. ఇట్టి స్థితిలో శ్రద్దాభక్తులతో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరి నామమునుచ్చరించినవారికి శ్రీహరి పదమేల కలుగదు? శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచినవారైనను శ్రీహరిపదమును చేరుదురు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించినవారు పూతనవలె శ్రీహరిస్థానమును చేరుదురు. సజ్జనసహవాసము సజ్జని సంభాషణ మున్నగునవి తప్పక ముక్తినిచ్చును. కావున ముక్తిని గోరువారు సజ్జనులను సర్వాత్మనా సేవింపవలయును. శ్లోకమున దోషములున్నను శ్రీహరినామములున్నచో సజ్జనులు ఆ శ్రీహరినామములనే తలచి ముక్తినందుదురు. ముక్తినిత్తురు అనగా విష్ణునామ మహిమ గమనింపదగినది సుమా! శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు. అధిక ధనమును రూపయౌవనములను కోరడు. శ్రీహరిని ఒకమారు స్మరించినను సర్వోత్తమమగు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్తసులభుని దయాళువును విడిచి మరియెవరిని శరణు కోరుదుము. కావున దయానిధి జ్ఞానగమ్యుడు, భక్తవత్సలుడు, మనఃపూర్వకమగు భక్తికే సులభుడు అవ్యయుడునగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము. నాయనా వైశాఖ మాసమునకు చెందిన ధర్మములన్నిటిని యధాశక్తిగ నాచరింపుము. జగన్నాధుడగు శ్రీహరి సంతసించి నీకు శుభములనిచ్చును అని శంఖుడు దివ్యరూపధారి నుద్దేశించి పలికెను. ఆ దివ్య పురుషుడు కిరాతుని జూచి యాశ్చర్యపడి మరల శంఖునితో నిట్లనెను. శంఖమహామునీ! దయాస్వభావముగల నీచే ననుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ యనుగ్రహమున నుత్తమ గతిని పొందగలను. అని పలికి శంఖుని యనుజ్ఞ నంది స్వర్గమునకు పోయెను. కిరాతుడును శంఖమునికి వలయు నుపచారములను భక్తియుక్తుడై ఆచరించెను. శంఖమునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములగు  శ్రీహరి కథలను చెప్పుచు గడిపెను. బ్రహ్మముహూర్తమున లేచి కాలకృత్యముల నెరవేర్చి సంధ్యావందనాదికమును శ్రీహరి పూజను చేసెను. పరిశుద్దుడగు కిరాతునకు తారకమగు 'రామా యను రెండక్షరముల మంత్రము నుపదేశించెను. నాయనా! శ్రీహరి యొక్క ఒకొక్క పేరును అన్ని వేదములకంటె నుత్తమము అట్టి భగవన్నామములన్నిటి కంటె సహస్రనామములుత్తమములు. అట్టి సహస్రనామములకును రామనామమొక్కటియే  సమానము. కావున రామనామముచే నిత్యము జపింపుము. వైశాఖధర్మములను బ్రదికియున్నంతవరకు నాచరింపుము. దీని వలన వాల్మీకుడను మునికి పుత్రుడవుగ జన్మించి వాల్మీకియని భూలోకమున ప్రసిద్దినందగలవు. అని శంఖుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగ ప్రయాణమయ్యెను. కిరాతుడును శంఖునకు ప్రదక్షిణ నమస్కారముల నాచరించి కొంతదూరమనుసరించి వెళ్లెను. వెళ్లుచున్న శంఖమునిని విడుచుట బాధాకరముగ నుండెను. మునిని విడువలేక బిగ్గరగా దుఃఖించెను. అతనినే చూచుచు వానినే తలచుచు దుఃఖాతురుడై యుండెను. అతడు ఆ యడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రములను నిర్మించెను. మహిమాన్వితములగు వైశాఖ ధర్మముల నాచరించుచుండెను. అడవిలో దొరకు వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుచుండెను. పాదుకలు, చందనము, గొడుగులు, విసనకఱ్ఱలు మున్నగువాని నిచ్చుచు బాటసారుల ననేకవిధములుగ సేవించుచుండెను. ఇట్లు బాటసారులకు సేవచేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్లు జపించుచు కాలాంతరమునకు మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించెను. కృష్ణుడను ఒక ముని జితేంద్రయుడై సర్స్తీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్యస్మృతిని విడిచి మిక్కిలి తీవ్రమగు తపము నాచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒకపుట్టగా నయ్యెను. పుట్టలు కట్టినను బాహ్యస్మృతిని విడిచి తపము నాచరించుచుండుట వలన వానిని వల్మీకముని అని పిలువసాగిరి. కొంతకాలమునకతడు తపమును మానెను. వానిని జూచి నాట్యకత్తెయొకతె  మోహించి వానిని వివాహమాడెను. వారిద్దరికిని పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యెను. అతడే దివ్యమైన రామకథా గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వకర్మబంధములను పోగొట్టునదై ప్రశాంతులను ముక్తులను చేసినది. శ్రుతకీర్తి మహారాజా! వైశాఖమహిమను వింటివా! దుష్టుడగు కిరాతుడు శంఖుని పాదులను మున్నగువానిని దుర్బుద్ధితో నపహరించియు వైశాఖమహిమవలన శంఖునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకియై జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు దెలిపి చిరస్మరణీయుడయ్యెను. మహర్షి అయ్యెను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు నీ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మనందురు. ముక్తిని పొందుదురు. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు శంఖవ్యాధ సంవాదమును వివరించెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను. *వైశాఖ పురాణం 26వ అధ్యాయం సమాప్తం.* *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*
#ఈ రోజు 🌧️🌛🌔🌠 🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏 🌺పంచాంగం🌺 శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, 🕉 🕉️ 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻 బుధవారం,మే.13,2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు వైశాఖ మాసం - బహుళ పక్షం తిథి:ఏకాదశి ఉ9.05 వరకు వారం:బుధవారం(సౌమ్యవాసరే) నక్షత్రం:ఉత్తరాభాద్ర రా8.44 వరకు యోగం:విష్కంభం సా5.44 వరకు కరణం:బాలువ ఉ9.05 వరకు తదుపరి కౌలువ రా8.27 వరకు వర్జ్యం:ఉ6.31 - 8.05 దుర్ముహూర్తము:ఉ11.29 - 12.21 అమృతకాలం:మ3.59 - 5.34 రాహుకాలం:మ12.00 - 1.30 యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00 సూర్యరాశి:మేషం చంద్రరాశి:మీనం సూర్యోదయం:5.32 సూర్యాస్తమయం:6.19 మతత్రయ ఏకాదశి గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻 *_నేటిమాట_* *" సమ బుధ్ధి, సమదృష్టి అంటే ఏమిటి??? - - భక్తుని ప్రార్థన ఎలా ఉండాలి "* *ఒక చిన్న ఉదాహరణ!!!* ఒక గ్రామంలో ఒక ఆసామి కూతురు వివాహం ఎంతో వైభవంగా నిర్వర్తిస్తున్నాడు, ఇంతలో ఆకాశం మేఘా వృతమైంది... అతడు ఆందోళన చెంది, "ఓ భగవంతుడా! దయచేసి వర్షం రాకుండా చూడు" అన్నాడు... అదే ఊరిలో ఉన్న రైతు, ఆమబ్బులను చూసి ఆనంద పడుతూ, " ఓ భగవంతుడా! మంచి వర్షం కురిపించు", పంట నా చేతికందిన అప్పుల బాధ నుండి విముక్తి నవుతాను " అని ప్రార్ధించాడు.... ఇప్పుడు చెప్పండి భగవంతుడు ఎవరి ప్రార్థన ని మన్నించాలి?" అని ఒక సందేహం... " తండ్రి ప్రార్థన నే మన్నించాలి " అన్నారు కొందరు, రైతు ప్రార్థన మన్నిస్తే అందరికీ తిండి దొరుకుతుంది కనుక, రైతు ప్రార్ధన నే మన్నించాలన్నారు, మరి కొందరు... అప్పుడు భగవంతుడు.., " చూడండి, మీరందరూ తప్పే చెప్పారు. ఓ భగవంతుడా! అందరికీ ఆనందం కలిగేలా క్షేమం కలిగేలా అనుగ్రహించు, అని ప్రార్ధించాలి... ఎందుకంటే, భగవంతుడి, సంకల్పమే నెరవేరు తుంది కనుక.... మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే ... *" సమస్త లోకాః సుఖినో భవంతు "* అన్నది అన్నిటి కన్నా ఉత్తమమైన ప్రార్థన... *ఎల్లప్పుడూ సమాజ సంక్షేమము కోసం ప్రార్థిస్తూ ఉండటంవలన, సమాజంలో భాగమైన మనం కూడా, ఆనందంగా ఉండ గలుగుతాము "* కనుక స్వార్ధ రాహిత్యంతో, సమ బుధ్ధి తో, అంతా భగవత్ సంకల్పానికి వదిలివేయడం ఉత్తమమైన ప్రార్ధన... " భక్తులమైన మనం చేయు ప్రార్థనలు, నిస్వార్ధ, నిర్మల నిష్కామ మైనవిగా ఉండవలెను. " ఇదే ప్రార్థనలో ప్రధానమైన అంశము...🙏 *_🌺శుభమస్తు🌺_* 🙏సమస్త లోకాః సుఖినోభవంతు🙏
#🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌
🧐ఆసక్తికరమైన పోస్ట్💥👌 - ఆంజనేయ స్వామి జీవితచరిత్ర జైశ్రీరామ్ چ865 హనుమన్జయంతి ఆంజనేయ స్వామి జీవితచరిత్ర జైశ్రీరామ్ چ865 హనుమన్జయంతి - ShareChat
#మా ఇంటివంటలు ☕☕🏠 12-05-2026
మా ఇంటివంటలు ☕☕🏠 - ShareChat
#🚩శ్రీ హనుమాన్ చాలీసా📿
🚩శ్రీ హనుమాన్ చాలీసా📿 - ShareChat
00:53
#ఈ రోజు 🌧️🌛🌔🌠 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌿పంచాంగం🌿 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 11 - 05 - 2026, వారం ... ఇందువాసరే ( సోమవారం ) శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళ పక్షం, తిథి : *నవమి* ఉ10.16 వరకు, నక్షత్రం : *శతభిషం* రా8.55 వరకు యోగం : *ఐంద్రం* రా9.04 వరకు కరణం : *గరజి* ఉ10.16 వరకు, తదుపరి *వణిజ* రా10.06 వరకు, వర్జ్యం : *తె3.21 - 4.58* దుర్ముహూర్తము : *మ12.21 - 1.12* మరల *మ2.54 - 3.45* అమృతకాలం : *మ1.32 - 3.11* రాహుకాలం : *ఉ7.30 - 9.00* యమగండం : *ఉ10.30 - 12.00* సూర్యరాశి : మేషం, చంద్రరాశి : కుంభం సూర్యోదయం : 5.34, సూర్యాస్తమయం : 6.18, *_నేటి మాట_* *మానవ జీవిత - లక్ష్యం ఏమిటి??* _ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయి కి చేరడమే, మన లక్ష్యం_ మన నిత్య జీవితంలో, దివ్యమైన స్థానములను చేరవలెనన్న, ఉన్నదానిని నెట్టుతూ ( లెక్క చేయకుండాా) పోవాలి. జలంలో ఈదినట్లు, ఒడ్డుకు చేరాలంటే, ముందున్న జలాన్ని వెనుకకు నెట్టాలి కదా! ఈనాడు మనం, లౌకిక విషయాలలో నే, సంతృప్తి పడిపోతున్నాం, అనుభవించిన వే అనుభవిస్తున్నాం , అందువల్ల ఉన్నతమైన భావాలను అర్ధం చేసుకోలేక పోతున్నాం, దీనికి చక్కని ఉదాహరణ... సముద్రము, ఎన్ని నదులొచ్చినా అది తనలో చేర్చుకుంటుంది. కానీ తానే మైనా ఉన్నత స్థాయికి వెడుతోందా? లేదు లేదు ఉన్నచోటనే ఉంటుంది అందుచేతనే ఉప్ప గా మారిపోతుంది. కానీ, అదే సముద్రము నుండి, కొంత నీరు ఆవిరిగా మారి, పైకి పోయి, అక్కడ తీయగా మారుతుంది, అక్కడ అది ఊరకే ఉండడం లేదు. చక్కగా గర్జిస్తుంది... ఏమని? -- " నేను నిన్ను వదలటంచేతనే ఉన్నత స్థాయికి చేరుకున్నాను" అంటున్నది. ఆ మధురమైన జలము, అక్కడ తన కాలాన్ని వ్యర్థము చేయక, వర్షం రూపంగా కురిసి, దేశాన్ని సస్య శ్యామలం గావిస్తున్నది, సముద్రములో ఎంత నీరున్నప్పటికీ, అది పంటలను పండించటంలేదుకదా! కనుక, మనం ఉన్నత స్థాయికి ఎదగాలి, అప్పుడే పరోపకార సంబంధమైన చర్యలలో ప్రవేశించడానికి వీలౌతుంది, అప్పుడే మానవ జీవితానికి ఒక సార్థకం ఏర్పడుతుంది. *_🌿శుభమస్తు🌿_* 🙏సమస్త లోకాః సుఖినోభవంతు🙏
#ఈ రోజు 🌧️🌛🌔🌠 🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🥀పంచాంగం🥀 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తూ 卐ఓం శ్రీ గురుభ్యోనమః卐 *మంగళవారం, మే 12, 2026* *శ్రీ పరాభవ నామ సంవత్సరం* *ఉత్తరాయణం - వసంత ఋతువు* *వైశాఖ మాసం - బహుళ పక్షం* తిథి : *దశమి* ఉ9.54 వరకు వారం : *మంగళవారం* (భౌమ్యవాసరే) నక్షత్రం : *పూర్వాభాద్ర* రా9.03 వరకు యోగం : *వైధృతి* రా7.35 వరకు కరణం : *భద్ర* ఉ9.54 వరకు తదుపరి *బవ* రా9.30 వరకు వర్జ్యం : *లేదు* దుర్ముహూర్తము : *ఉ8.06 - 8.57* మరల *రా10.48 - 11.33* అమృతకాలం : *మ1.00 - 2.37* రాహుకాలం : *మ3.00 - 4.30* యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30* సూర్యరాశి: మేషం || చంద్రరాశి: కుంభం సూర్యోదయం: 5.33 || సూర్యాస్తమయం: 6.19 *_నేటి విశేషం_* *హనుమాన్ జయంతి* *జననం* పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది, అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో , కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న వానరాన్నిని చూసి , ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా , చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది , కోపంతో అంజనను , ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా , ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు. అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి , వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం *'కేసరి'* అని , వానారములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది. అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన , ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు. ఇంకో వైపు దశరధుడు , అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తిచెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు , అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని(తీపి ఆహారము) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు , అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు , గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది. ఆమె వానర ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని , కేసరినందనుడని , వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను , తన తండ్రిఅయిన కేసరి , తల్లి , అప్సర అంజన యొక్క శక్తి , వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగివెళ్ళింది. భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు , బుద్ధిశాలి , కపిశ్రేష్టుడు , సర్వశాస్త్ర పారంగతుడు , స్వామిభక్తి పరాయణుడు , రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం , రామాయణం , పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది. హనుమాన్ , ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు , రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ , మన జన్మ యొక్క రహస్యం , శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది. జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి , వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు. *ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది:* హనుమంతుడు కూడా దుష్టశిక్షణ , శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది. 1. ప్రసన్నాంజనేయస్వామి. 2. వీరాంజనేయస్వామి. 3. వింశతిభుజాంజనేయ స్వామి. 4. పంచముఖాంజనేయ స్వామి. 5. అష్టాదశ భుజాంజనేయస్వామి. 6. సువర్చలాంజనేయ స్వామి. 7. చతుర్భుజాంజనేయ స్వామి. 8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి. 9. వానరాకార ఆంజనేయస్వామి తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయి.....!!! దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి. *ఆయన అష్టసిద్ధులు* 1. అణిమాసిద్ధి : శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి. 2. మహిమాసిద్ధి : శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి. 3. లఘిమాసిద్ధి : శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి. 4. గరిమ : శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి. 5. ప్రాప్తిసిద్ధి : ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి.. దేనినైనా పొందగలిగే శక్తి. 6. పరకామ్యసిద్ధి : ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగిఉండే శక్తి. 7. వశిత్వసిద్ధి : అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని కలిగిఉండే శక్తి. 8. ఈశిత్వసిద్ధి : దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి. *శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి ?* హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. *'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా'* అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు , పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం. *'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'* శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం శ్లో|| మర్కటే శ మహొ త్సాహ - సర్వశోక వినాశన శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో|| అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం , అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి ''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు'' అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిర స్స్నానం , నేలపడక , సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి. *ఆచరణ:* భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి. *అభిషేకం* పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు , కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం , నిత్యమూ చేయగలగటం మరీ మంచిది. *ఆచరణ :* మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి *మంగళ వార సేవ* మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదురనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం , అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది. *శనివార సేవ* హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన , సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు , వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కలిగించాలి. *పంచ సంఖ్య* హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెసే ప్రదక్షిణాలు , నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి ఏవయినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం. *హనుమజ్జయంతి* హనుమంతుడు వైశాఖ మాసంలో , కృష్ణ పక్షంలో , దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం , శనివారం , కర్కాటక లగ్నంలో , వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ , కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమజ్జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు. *విశేషార్చనలు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.* *ఆచరణ :* సంవత్సరంలో ఈ ఒక్క జయంతినాడయినా భక్తులు మారేడుదళం , సింధూరం మల్లెపూలు లేదా తములపాకులు , తులసిదళం , ప్రోత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి. *_🥀శుభమస్తు🥀_* 🙏సమస్త లోకాః సుఖినోభవంతు 🙏
#ఈ రోజు 🌧️🌛🌔🌠 11-05-2026.. సోమవారం *రేపు అనగా 12తేదీ*… *శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత* ➖➖➖✍️ ``` *హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది. ఎలా అంటే, ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి చేయగా, మరికొందరు వైశాఖమాసం దశమినాడు హనుమజ్జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి జరుపుకుంటారు. *పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి, శనివారం జన్మించారని తెలిపారు... అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు... అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్‌ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు... *చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు.. ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా 60 అడుగుల శోభా యాత్రగా ఊరేగిస్తారు. చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుండి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు, ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు... *వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించ గలడు. పర్వతాన్ని ఎత్తి, చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్రశక్తులను తరిమికొట్టగలడు. శ్రీరాముని నమ్మినబంటు అయిన హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడంవల్ల ధైర్యం,స్థైర్యం కలుగుతాయి. భయాలూ భ్రమలూ పోతాయి. చింతలు, చిరాకులు తీరతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి, కీర్తిప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనా దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు. ఇక హనుమజ్జయంతి విశేష దినాన మరింత భక్తిశ్రద్దలతో హనుమంతుని అర్చిస్తారు. *’కలౌ కపి వినాయకౌ’: అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు.. వినాయకుడు, హనుమంతుడు.``` *హిందూమతంలో ప్రాముఖ్యత: *హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః* *రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః* *ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః* *లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా* *ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః* *స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః* *తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్*``` *హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎఱ్ఱని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది.``` *హనుమంతుని నైజం:* *యత్ర యత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్* *బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్* ``` *శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను. *కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ(11) రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. పరమశివుని అంశతో జన్మించారు. సప్త(7) చిరంజీవులలో ఒకరు. ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాసమానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు. *హనుమతుడికి 5సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. చైత్ర పౌర్ణిమ నుండి వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల (మండలం) పాటు ప్రతిరోజు 1,3,5,11 లేక 41.....(మీకు వీలైనన్ని సార్లు)హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతానం కలగాలని కోరుకునే దంపతులు ఇద్దరూ, ఈ 40(మండలం) రోజుల పాటు కఠిన బ్రహ్చర్యం పాటిస్తూ, నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి, రోజూ స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి, నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలిగి తీరుతుంది.✍️``` . *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* 🌷🙏🌷``` 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏. సేకరణ