Sekhar Digitals & Reporter 9603197203
ShareChat
click to see wallet page
@sekhar9603197203
sekhar9603197203
Sekhar Digitals & Reporter 9603197203
@sekhar9603197203
Reporter & Digital's Studio
#🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ *బ్రహ్మసమేధ్యం పంచాయతీ మరుగుదొడ్లు సొమ్ము దుర్వినియోగం పై డి ఎల్ పి ఓ విచారణ.* *మరోసారి విచారణ చేస్తాం డి.ఎల్ పి.ఓ బొజ్జిరాజు* మండలంలోని బ్రహ్మసమేధ్యం పంచాయతీలో మరుగుదొడ్ల *సొమ్ము దాదాపు 55 లక్షలు దుర్వినియోగం పై* జిల్లా పంచాయతీ అధికారి శాంతలక్ష్మి ఆదేశాల మేరకు అమలాపురం డివిజనల్ పంచాయతీ అధికారి బొజ్జి రాజు విచారణ చేపట్టారు .పంచాయతీలో మరుగుదొడ్లు సొమ్ము దుర్వినియోగంపై స్థానిక సర్పంచ్ మల్లాడి ఏడుకొండలు ఈ ఏడాది ఫిబ్రవరి లో జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయడం తెలిసిందే . ఈ నేపథ్యంలో పంచాయతీలో విచారణకు వచ్చిన డివిజనల్ అధికారి ముందు నిందితుడైన పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ ఇసుకపట్ల నాగేంద్ర హాజరు కాలేదు. నాగేంద్ర కు ఫోన్ చేసినా ఫోను పని చేయడం లేదని డివిజన్ అధికారి బొజ్జిరాజు తెలిపారు. పంచాయతీలో పూర్తి రికార్డులు అందుబాటులో లేవని, అప్పట్లో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి కె శ్రీనివాస్ తన స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉందని, బ్యాంకు విత్ డ్రా స్టేట్మెంట్లు సమర్పించాలని ఆదేశించినట్లు డిఎల్పిఓ తెలిపారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మరోసారి విచారణ చేపడతామన్నారు. ఇప్పటికే నిందితుడు నాగేంద్ర ని కాట్రేనికోన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చినా శనివారం హాజరు కాకపోవడం వల్ల విచారణ ముందుకు సాగనట్లు తెలిసింది. అయితే ఈ నిధులు *దుర్వినియోగం 55 లక్షల రూపాయలు కాగా ఇప్పటికి రు.41,30,000 తిరిగి వసూలు చేశారు. ఇంకా మరుగుదొడ్లు సొమ్ము 14 లక్షలు 25000 వసూలు కావాల్సి ఉంది.* ఈ వసూలు కావలసిన సొమ్ము ఎవరి వద్ద ఉందనేది ప్రశ్నార్ధంగా మిగిలింది. అయితే అప్పటి పంచాయతీ కార్యదర్శి కె.శ్రీనివాస్, కంప్యూటర్ ఆపరేటర్ నాగేంద్రలు ప్రమేయంతోనే నిధులు దుర్వినియోగమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. పంచాయతీ రికార్డులు, బ్యాంకు సమాచారం వచ్చిన తర్వాతే శాఖాపరమైన చర్యలు జిల్లా పంచాయతీ అధికారులు తీసుకుంటారని తెలిసింది .జిల్లా పంచాయతీ అధికారి ముగ్గురు అధికారులతో విచారణ టీం ను గతంలోనే ఏర్పాటు చేశారు. డిఎల్పిఓ బొజ్జి రాజు ఆధ్వర్యంలో శనివారం జరిగిన విచారణ లో మలికిపురం డిప్యూటీ ఎండిఓ సూరప రాజు, బ్రహ్మసమేధ్యం పంచాయతీ అప్పటి కార్యదర్శి కె శ్రీనివాస్ .పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫిర్యాదుదారు మాజీ సర్పంచ్ మల్లాడి ఏడుకొండలు విచారణకు హాజరై తను వాదన వినిపించారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🏛️రాజకీయాలు - Ilile @00 Ilile @00 - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు *​కాట్రేనికోన సంతలో 'వన్య' రోదన..* *అటవీ అధికారుల నివేదికల్లో అంతా 'సున్నా'..!!!* ​ఉడుములు, పక్షుల విక్రయాలు బహిరంగం - ఫిర్యాదులకూ తప్పుడు సమాధానాలే దిక్కా..?? *✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️* చట్టం తన చుట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కాట్రేనికోన మండల అటవీ శాఖ అధికారులు. ఒకవైపు ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణ కోసం కోట్లు ఖర్చు చేస్తూ చట్టాలను కఠినతరం చేస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు వేటగాళ్లతో చేతులు కలిపి వన్యప్రాణుల పాలిట యముళ్లుగా మారుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.​ప్రతి శనివారం కాట్రేనికోన మార్కెట్‌లో జరిగే సంత వన్యప్రాణుల మాంసం విక్రయాలకు అడ్డాగా మారింది. కందికుప్ప రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల నుంచి వేటగాళ్లు అరుదైన ఉడుములు, వివిధ రకాల అడవి పక్షులను పట్టుకొచ్చి బహిరంగంగానే విక్రయిస్తున్నారు. అయినా ఫారెస్ట్ అధికారులు చోద్యం చూస్తున్నారు.సంతకు వచ్చే వందలాది మందికి ఈ దృశ్యాలు కనిపిస్తున్నా, అదే మార్గంలో వెళ్లే అటవీ శాఖ అధికారులకు మాత్రం ఏమీ కనిపించకపోవడం వెనుక పెద్ద 'మతలబు' ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.​వన్యప్రాణుల వేటపై స్పందించని అధికారుల తీరును నిరసిస్తూ బాధ్యతాయుతమైన పౌరులు జిల్లా గ్రివియన్స్ లో సాక్షాత్తూ కలెక్టరుకు ఫిర్యాదులు చేశారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావడంతో క్షేత్రస్థాయి అధికారులు రంగంలోకి దిగి వేటగాళ్లను పట్టుకోవాల్సింది పోయి, 'అక్కడ పక్షుల అమ్మకాలే జరగడం లేదు' అంటూ పచ్చి అబద్ధాలతో కూడిన తప్పుడు నివేదికలు ఇచ్చి ఫిర్యాదులను ముగించేశారు .కలెక్టరుకు ఇచ్చే నివేదికల్లోనూ తప్పుడు సమాచారం ఇస్తున్నారంటే, అటవీ శాఖలో వ్యవస్థ ఎంతలా దెబ్బతిన్నదో అర్థం చేసుకోవచ్చు. అధికారుల అండదండలతోనే వేటగాళ్లు బరితెగించి రిజర్వ్ ఫారెస్ట్ సంపదను హరించివేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.​ వన్యప్రాణుల మాంసంతో మార్కెట్ ప్రాంతంలో రక్తసిక్తం అవుతోంది.కళ్ళముందే వన్యప్రాణుల వినాశనం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. తప్పుడు నివేదికలు ఇచ్చి వ్యవస్థను పక్కదారి పట్టిస్తున్న వారిపై విచారణ జరిపించి, కందికుప్ప రిజర్వ్ ఫారెస్ట్,వన్యప్రాణులను కాపాడాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.కాట్రేనికోన సంతలో ఉడుములు, వివిధ రకాల పక్షుల అమ్మకాలను అడ్డుకోవడంలో అటవీ శాఖ విఫలమైంది. ఇక్కడ వన్య ప్రాణుల విచ్చలవిడి అమ్మకాలపై స్థానికులు కముజు సర్వేశ్వరరావు మరికొందరు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులకు తప్పుడు నివేదికలు ఇస్తూ కాలక్షేపం చేస్తున్న అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర అసహనం నెలకొంది. ఇకనైనా జిల్లా అటవీ శాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులైన స్థానిక అధికారులు పై చర్య తీసుకుని పక్షుల విక్రయాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
#📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ #☀️వేసవి స్టేటస్🌴 *కాలువలో సీసాలు.. కర్షకులకు పాట్లు...* పంటకాలువలో పూడికలను ఉపాధి హామీ పథకం వేతనదారులు ఇటీవల తొలగించారు.. *అనంతరం పొడవునా గాజు, ప్లాస్టిక్ సీసాలు, వ్యర్థాలు ఇలా దర్శన మిచ్చాయి..* ఎగువన ఉన్న నివాసాల వారు, మందుబాబులు వీటిని వేయడం వల్ల అవి శివారుకు చేరి జలాలు కలుషితంగా మారుతున్నాయి. *దీంతో కర్షకులు, కూలీలకు పాట్లు తప్పడం లేదు. అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు..* __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰ఈరోజు అప్‌డేట్స్ - ShareChat
#📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ పోలీస్ కార్యాలయం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా...... *అంబాజీపేట పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐపీఎస్.* డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాహుల్ మీనా ఐపీఎస్ ఈరోజు అంబాజీపేట పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీలలో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు ఘనంగా 'గార్డ్ ఆఫ్ ఆనర్' ను సమర్పించారు. *తనిఖీలో ముఖ్యాంశాలు*: 👉పరిసరాల తనిఖీ అంబాజీపేట పోలీస్ స్టేషన్ కార్యాలయ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఎస్పీ , స్టేషన్ ప్రాంగణం పరిశుభ్రంగా ఉండాలని, ప్రజలు ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చినప్పుడు వారికి స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని సూచించారు. 👉 కేసుల సమీక్ష: ఎస్పీ గారు అంబాజీపేట పోలీస్ స్టేషన్ కార్యాలయ రికార్డులను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిపై అధికారులతో చర్చించారు. కేసుల దర్యాప్తులో వేగం పెంచి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఆదేశించారు. 👉 అంబాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లైవ్ ఇష్యూస్ ను ఇతర డిపార్ట్మెంట్లతో కలుపుకుని, శాంతి కమిటీనల ను ఏర్పాటు చేసుకుని ఇరు వర్గాల ప్రజలతో చర్చించుకుని సమస్యను పరిష్కరించాలని సూచించినారు. 👉 అంబాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటిని ఇతర డిపార్ట్మెంట్ల తో కలిపి పరిశీలించి ఆ ప్రదేశంలో కావలసిన లైట్స్ ,రేడియం స్టిక్కరింగ్ మరియు స్పీడును నియంత్రించే అవరోధాలను ఏర్పాటుచేసి రోడ్ యాక్సిడెంట్ తగ్గించడానికి కృషి చేయాల్సిందిగా సూచించినారు *సిబ్బందితో ముఖాముఖి*: 👉 పి. గన్నవరం ఇన్స్పెక్టర్ ,అంబాజీపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు ఇతర సిబ్బందితో ఎస్పీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజలకు అందుబాటులో ఉండటంపై దిశానిర్దేశం చేశారు. 👉 ఈ కార్యక్రమంలో కొత్తపేట SDPO సుంకర మురళీమోహన్ ఎస్.బి. సీఐ పుల్లారావు, పి. గన్నవరం సీఐ ఆర్ భీమ రాజు , అంబాజీపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ, అయినవల్లి ఎస్ఐ లు , స్టేషన్ సిబ్బంది ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰జాతీయం/అంతర్జాతీయం - Pant [ap ~ 6 AP கடக POL Pant [ap ~ 6 AP கடக POL - ShareChat
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #📰జాతీయం/అంతర్జాతీయం *ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబరులో నోటిఫికేషన్..!!!* ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబరులో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది... డిసెంబరులోగా ఎన్నికలు పూర్తిచేసి, కొత్త ఏడాది నాటికి నూతన పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది.. జూలైలో బీసీ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఇప్పటికే 13,291 పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు సిద్ధమవ్వగా, పురపాలికల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 1.36 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.. __________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🏛️పొలిటికల్ అప్‌డేట్స్ - ५ ఠవ్యాలయం ಏಂದಾಯತ ५ ఠవ్యాలయం ಏಂದಾಯತ - ShareChat
#📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ కాట్రేనికోన మండలం - కుండలేశ్వరం శివారు, *కోమటిచెరువు గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం.* ఒక నివాస గృహం ఆవరణలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభం. అధికారులకు తెలియజేసిన పట్టించుకోని అధికారులు.. *పొంచి ఉన్న ప్రమాదంతో భయాందోళనలో కుటుంబ సభ్యులు..* __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰జాతీయం/అంతర్జాతీయం - ShareChat
#📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు *​శేఖర్ న్యూస్ లో వార్తకు స్పందన* *​యూనియన్ బ్యాంక్ సిబ్బంది నిర్వాకం - రంగంలోకి ఆర్బిఐ...* *​ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని బాధితురాలిపై ఒత్తిడి..!!!* కాట్రేనికోన యూనియన్ బ్యాంక్ శాఖలో మహిళా కస్టమర్ల పట్ల సిబ్బంది అనుసరిస్తున్న తీరు, *స్త్రీనిధి రుణాల మంజూరులో చేస్తున్న జాప్యం పై* ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. గత నెల 8వ తేదీన *‘శేఖర్ న్యూస్’ ప్రచురితమైన" స్త్రీనిధి రుణాలు మంజూరులో యూనియన్ బ్యాంకు కొర్రీలు " కథనం పై స్పందించిన* బ్యాంక్ జనరల్ మేనేజర్ విచారణకు ఆదేశించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.​​కాట్రేనికోనకు చెందిన డ్వాక్రా సంఘం అధ్యక్షురాలు ఎం. అనంతలక్ష్మి తనకు మంజూరైన స్త్రీనిధి రుణాన్ని పొందేందుకు బ్యాంకుకు వెళ్లగా, అక్కడి సిబ్బంది సాయి కిరణ్, ప్రవీణ్ లు కావాలనే అడ్డుకున్నారని ఆరోపించారు. కేవలం రుణమే కాకుండా, ఏటీఎం కార్డు, చెక్ బుక్ జారీలో కూడా తీవ్ర జాప్యం చేస్తూ, తనను అవమానకరంగా మాట్లాడారని ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.​​జి.ఎం ఆదేశాల మేరకు బ్రాంచ్ మేనేజర్ మోహన్ సిబ్బందికి సమావేశం నిర్వహించి, కస్టమర్లతో గౌరవంగా మెలగాలని హెచ్చరించారు. అయితే, ఫిర్యాదుదారు సమక్షంలో విచారణ జరపకుండానే ఈ వ్యవహారాన్ని సర్దిచెప్పేందుకు బ్యాంక్ అధికారులు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది.​బ్రాంచ్ అధికారులు విషయాన్ని అణిచివేసే ప్రయత్నం చేసినప్పటికీ, బాధితురాలు ఏమాత్రం తగ్గకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబుడ్స్‌మన్ కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి విచారణ సెగ తగలడంతో బ్యాంకు సిబ్బంది ఇప్పుడు బాధితురాలి చుట్టూ తిరుగుతున్నారు..*"ఏ విచారణ చేయకుండానే నా ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని బ్యాంక్ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు.* తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గేది లేదని బాధితురాలు అంటోంది.​​ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, విచారణను నిష్పక్షపాతంగా జరిపి, బాధ్యులైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰ఈరోజు అప్‌డేట్స్ - 0 0 0 0 - ShareChat
#🏛️రాజకీయాలు #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ *రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్‌* శుభకార్యాలకు 36 రోజుల పాటు బ్రేక్‌ పడనుంది. ఈ నెల 18 నుంచి వచ్చేనెల జూన్‌ 18 వరకు అధిక జ్యేష్ఠ మాసం(మూఢమి) కావడంతో వివాహాలకు బ్రేక్‌ పడనుంది. ఈ క్రమంలో ఈనెలలో ఆఖరి ముహూర్తమైన 13న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరగనున్నాయి. మళ్లీ జూన్‌ 19 నుంచి వివాహాధి శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి. __________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🏛️రాజకీయాలు - వెళ్లిక్ుశుభకార్యాలకుబ్రేక వెళ్లిక్ుశుభకార్యాలకుబ్రేక - ShareChat
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు *'స్థానిక' ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి* *రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిలచంద్ర పునేఠ..* మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీకి ముందు చేప ట్టాల్సిన ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్నికల ముందస్తు కార్యక్రమాల పురోగతిపై ఆయన అధికారులతో ఎస్ఈసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన కొనసాగుతోందని,ఈ డీలిమిటేషన్ ప్రక్రియకు జూన్ 26వరకు గడువు ఉందని మున్సిపల్ శాఖ అధికారులు చెప్పారు. గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణ పూర్తయిందని, మున్సిపాలిటీల్లోనూ ప్రచురణ చేపట్టాలంటే వార్డుల పునర్విభజన పూర్తి కావాల్సి ఉందని వివరించారు. బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు అవసరమైన డెడికేషన్ కమిషన్ పరిశీలన కొనసాగుతోందని అధికారులు తెలిపారు.. __________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰ఈరోజు అప్‌డేట్స్ - 4 గామపంచాయతికార్యాందుము  35 4 గామపంచాయతికార్యాందుము  35 - ShareChat
#రైతులు #రైతులు #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ *అన్నదాత కంట కన్నీరు..!!* *చేతికొచ్చిన పంట నీటిపాలు.!* *కళ్ళముందే ధాన్యం మొలకలు..* *దిక్కుతోచని స్థితిలో రైతులు...* *✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️* ప్రకృతి ప్రకోపానికి తోడు అధికారుల నిర్లక్ష్యం తోడై కాట్రేనికోన మండలంలోని రైతాంగం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. చేతికొచ్చిన వరి పంట నీట మునిగి, కళ్లముందే ధాన్యం మొలకలు వస్తుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు.​మండలంలోని చెయ్యేరు, లక్ష్మీవాడ, పెనుమల్ల, బంటుమిల్లి, ఉప్పూడి, కాట్రేనికోన, నడవపల్లి, కందికుప్ప, పల్లంకుర్రు తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది. ఇంత జరుగుతున్నా, గ్రామ స్థాయిలో వ్యవసాయ అధికారులు కనీసం పంటను పరిశీలించిన దాఖలాలు లేవని రైతులు మండిపడుతున్నారు. లక్ష్మీవాడ గ్రామంలో తాను పండించిన రెండు ఎకరాల వరి పంట ఇటీవల కురిసిన వర్షాలకు నీట మునిగి మొలకలు వచ్చి నష్టపోయానని స్థానిక రైతు కాండ్రేగుల సింహాద్రి రావు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పంట నష్టంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సర్వే (ఎన్యూమరేషన్) ప్రారంభం కాలేదు. అధిక తేమ కారణంగా ధాన్యం రంగు మారి, మొలకలు వస్తుండటంతో బహిరంగ మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు అడుగుతున్నారు.​ప్రభుత్వ ధాన్య కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్ముకుందామన్నా రైతులకు కష్టాలు తప్పడం లేదు..​"ధాన్యం అమ్మాలంటే నిబంధనలు రైతులకు సౌకర్యంగా ఉండటం లేదంటున్నారు . గోనె సంచులు, జట్టు కూలీలు , వాహనాలను తామే సమకూర్చుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడి పెట్టి నష్టపోయిన మాకు, మళ్లీ చేతిలో నగదు లేక ఇబ్బంది పడుతున్నాం" అని పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఈ బాధలు పడలేక బయట వ్యాపారులకు అయినకాడికి అమ్మేసికుంటున్నారు.వ్యవసాయ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి, నష్టపోయిన ప్రతి ఎకరాను నమోదు చేయాలని రైతులు కోరుతున్నారు.తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని ఎటువంటి కోతలు లేకుండా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటున్నారు.​ ఉచితంగా గోనె సంచులు సరఫరా చేసి, ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు. తడిసిన ధాన్యం ను ​ఒబ్బిడి చేసుకోవడానికి కూడా వీలులేని పరిస్థితుల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోకపోతే, అప్పుల ఊబిలో కూరుకుపోతామని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి కాట్రేనికోన రైతులకు అండగా నిలవాలని కోరుతున్నారు. మండల వ్యవసాయ అధికారిని మృదులను వివరణ కోరగా ఇటీవల మండలంలో కురిసిన వర్షాలకు *135 ఎకరాలు వరి పంట పనల పై మునిగి దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు. రాశుల్లో 250 పనులు ధాన్యం తడిసిందన్నారు.* ప్రభుత్వం నుండి దెబ్బతిన్న వరి పంటను గుర్తించి నష్టాలు అంచనాకు ఆదేశాలు ఏమీ రాలేదని వ్యవసాయ అధికారిని తెలిపారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
రైతులు - ShareChat