పూరీథామ్ - శ్రీక్షేత్రం - పూరీ జగన్నాథ్ స్వామి క్షేత్రంలో జరుగు ఉత్సవాలు (puri utsavs)🛕🙏

10 Posts • 4K views
PSV APPARAO
11K views 2 days ago
#ఆషాఢంలో జరిగే అతిపెద్ద యాత్ర పూరీ జగన్నాథుడి రథయాత్ర - శ్రీక్షేత్రం - పూరిధామ్ #పూరీ జగన్నాథ్ మహాప్రభు టెంపుల్ రహస్యం #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #నేడు పూరీ జగన్నాథ్ స్వామి వారి నవ యవ్వన దర్శనం *పురుషోత్తమ క్షేత్రం* మన దేశంలోని పూరీ, బదిరీనాథ్, ద్వారక, రామేశ్వరంలలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చార్ ధాంగా పిలుస్తారు. వాటికి చాం హోదా కల్పించిన మహానుభావుడు ఆదిశంకరాచార్యులు. వీటిలో పూరీలోని జగన్నాధస్వామి ఆలయం అనేక విశిష్టతలతో విరాజిల్లుతోంది. ఒడిశా రాష్ట్రం లోని జిల్లా కేంద్రమైన పూరీలో వెలసిన ఈ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారయినా సందర్శిస్తే జన్మసార్థకమవుతుందని భక్తుల విశ్వాసం. ఈ ప్రఖ్యాత క్షేత్రాన్ని 'సర్వం జగన్నాథం' అని అభివర్ణిస్తుంటారు. చెన్నై- హౌరా మార్గంలో ఖుర్దారోడ్ అనే రైల్వే కూడలి ఉంది. అక్కడి నుంచి 44 కి.మీ. దూరంలో సాగర తీరాన పూరీ పట్టణం ఉంది. ఈ ఆలయం అత్యంత పురాతనమైంది. గతంలో పూరీని పురుషోత్తమ క్షేత్రం, శ్రీక్షేత్రం అనే పేర్లతో పిలిచేవారు. ఈ ఆలయ విమాన గోపురం 192 అడుగుల ఎత్తున ఉంటుంది. సుమారు 4 లక్షల చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి, చుట్టూ ఎత్తయిన ప్రాకారం కలిగి ఉంది. ఆలయ గోపురంపైగల సుదర్శన చక్రం, జండా భక్తులను ఆకర్షిస్తుంటాయి. ఎటువైపునుంచి చూసినా ఒకే విధంగా ఉంటాయి. ఆలయ గోపుంపై పక్షులు ఎగరవు. విమానాలు సరేసరీ, ప్రకృతి నియమా లకు విరుద్ధంగా బంగాళఖాతంలో ఎగిరే కెర టాలు కనుల విందు చేస్తుంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో 120 మేరకు ఆలయాలు, ఉపాల యాలున్నాయి. ప్రధానాలయంలో జగన్నాథుడు (శ్రీకృష్ణుడు), బలరాముడు, వారి సోదరి సుభద్ర దివ్య మంగళ విగ్రహాలు దర్శనమిస్తాయి. *రథయాత్ర:* ఆషాడ శుద్ధ విదియ రోజున పూరీక్షేత్రం రథ యాత్ర దేశం నలుమూలల నుంచి వచ్చే లక్షలాది భక్తజన సందోహంతో ప్రతిధ్వనిస్తుంది. ప్రపం చంలో ఏ హిందూ దేవాలయంలోనైనా సరే ఊరే గింపునకు మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. ఊరేగింపు నకు ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల జరుగుతుంది. అయితే ఈ సంప్రదాయాన్నింటికీ మినహాయింపు పూరీ జగన్నాథాలయం. ఏటా కొత్త రథాలను శోభాయాత్రకు వినియోగించడం పూరీ ప్రత్యేకత. జగన్నాథడు, బలరాముడు, వారి సోదరి సుభద్ర విగ్రహాలను ఏటా ఓసారి మందిరం నుంచి బయటకు తీసుకొనివచ్చి కొత్తర థాలపై అధిష్టింప జేస్తారు. జగన్నాథుని రథాన్ని 'నందిఘోష', బలరాముని రథాన్ని 'తాళధ్వజం', సుభద్ర రథాన్ని 'పద్మ ద్వజం' అని పిలుస్తారు. రథయాత్రను పూరీ సంస్థానాధీశ కుటుంబానికి చెందిన వారు ప్రారంభిస్తారు. ఆ పిమ్మట “జై జగ న్నాథ్" అనే నినాదాలు మిన్నుముట్టగా తాళ్ళతో రథానికి కట్టి లాగుతారు. భక్తుల తొక్కిసలాటలో ఒకవేళ అనుకోని సంఘటనలు జరిగినా, రథం వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదు. జగన్నాథుని ఆలయం నుంచి 2.5 కి. మీ. దూరంలో ఉండే గుండిచారాణి గుడికి చేరుకొనేసరికి పన్నెండు గంటల సమయం పడుతుంది.. గుండిబా ఆల యానికి చేరిన తరువాత ఆ రాత్రి బయటే రథా లను ఉంచి మర్నాడు ఉదయం మంగళవాయి ద్యాలు మార్మోగగా ఆలయంలోకి తీసుకుని వెళ్తారు. నవరాత్రులు అక్కడ ఉంచిన పిమ్మట దశ మినాడు మారురథయాత్ర (తిరుగు ప్రయాణం) మొదలవుతుంది. దీని "బహుదా యాత్ర" అని పిలుస్తారు. ఆ పిమ్మట విగ్రహాలను మళ్లీ గర్భగు డిలోని రత్న సింహాసనంపై అధిరోహింపజేస్తారు. ఆ విగ్రహాలు విలక్షణం: పూరీ జగన్నాథుని రూపం విలక్షణంగా కన్పిస్తుంది. విగ్రహాలు కొండ్యతో నిర్మించినవే. విగ్రహాలు పెద్దపెద్ద కళ్ళలో ఉంటాయి. కాళ్ళు, చేతులు, చెవులు, పెద వులు లేకుండా ఉంటాయి. నడుం కింది భాగం. ఉండదు. అనకూడదుగాని దివ్యాంగుల తర హాలో దర్శనమిస్తారు. ఈ ఆలయానికి సంబం ధించిన స్థలపురాణం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. *స్థలపురాణం* ఇంద్రద్యుమ్నడనే మహరాజుకు విష్ణుమూర్తి కలలో కన్పించి చాంకీ నదీ తీరానికి 3 దారువులు (పెద్ద కర్రలు) కొట్టుకువస్తాయని, వాటిని విగ్రహా లుగా రూపొందించాలని సెలవిచ్చాడు. నదీ తీరంలో లభించిన దారువులతో విగ్రహాలుగా తీర్చిదిద్దేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే దేవ శిల్పి విశ్వకర్మ ఓ రోజున రాజువద్దకు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వస్తాడు. తాను విగ్రహా లను రూపొందిస్తానని చెబుతాడు. అయితే ఇందుకు ఓ షరతు విధిస్తాడు. శాస్త్ర సంప్రదా యాల మేరకు ఈ దారువులను 21 రోజులు తదేక దృష్టితో పనిచేస్తేగాని విగ్రహాలు తయారుకావని, అంచేతన నిష్టకు భంగపరచకూడదని పేర్కొ న్నారు. పైగా తలుపులు వేసుకొని పనిచేయాల్సి ఉంటుంది. ఇంద్రద్యుమ్నుడు అంగీకరించాడు. నీలాద్రి సమీపంలో తాను నిర్మించిన ఓ మంది రంలో ఆ వృద్ధ శిల్పికి ఆశ్రయం కల్పించాడు. అలా 17 రోజులు గడిచాయి. 18వ రోజున ఇంద్ర ద్యుమ్నుని కుటుంబ సభ్యులు వృద్ధ శిల్పికి అన్న, పానీయాలను అందించాలని కోరారు. వారి మాట కాదనలేక భోజన, ఫల, పానీయాలతో ఆలయా నికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టించి లోపలకు వెళ్లి చూడగా శిల్పి కనబడలేదు. అంగహీనమైన, అసంపూర్ణమైన విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారని స్పష్టమవు తోంది. ఇప్పటికీ జగన్నాథుడు అదే రూపంలో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. మరో విశేషమే మిటంటే ఆషాఢం అధిక మాసంగా వచ్చిన ఏడాది పాత విగ్రహాలను తొలగించి కొత్త విగ్రహా లను రూపొందించి ప్రతిష్ఠింప జేస్తారు. దీన్ని "నవకళేబర వత్సవమని” పిలుస్తారు. మూడేళ్ళకొ కసారి ఇలా జరుగుతుంది. ఇక ఇంద్రద్యుమ్నుని వారసుడైన యయాతికేసరి స్వామిగారికి గుడి కట్టించినట్టు తాళపత్ర గ్రంథాలవల్ల తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని క్రీ.శ. 1140 ప్రాంతంలో చాడగంగ దేవుడు, అతని కుమా రుడు అనంగ మహాదేవుడు పరిపూర్ణ స్థాయిలో, అద్భుత కళానైపుణ్యంతో నిర్మింపజేసారు. కాగా గుడించా మందిరం గూర్చి ఓ మాట చెప్పాలి. ఇంద్రద్యుమ్నుని భార్య గుడించా. జగన్నాథ, బల భద్ర, సుభద్రల విశ్రాంతి కోసం ప్రధానాలయానికి సమీపంలో ఓ మందిరం నిర్మించింది. అదే గుడించా మందిరం. రథయాత్రలో భాగంగా అక్కడకు తీసుకువెళ్ళే మూడు విగ్రహాలను ఈ గుడిలోని రత్నపీఠంపై కూర్చొండపెట్టి గుడించా దేవి పేరిట ఆతిథ్యమిస్తారు. ఓ విధంగా చెప్పా లంటే గుడించా మందిరం జగన్నాథుని విడిది. గృహం అన్నమాట. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩* _ఆధ్యాత్మికం ఆనందం_
94 likes
85 shares
PSV APPARAO
797 views 6 days ago
#పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #పూరీ జగన్నాధ్ స్వామి ఇప్పటికీ అంతుచిక్కని ఆలయ విశేషాలు #పూరీ జగన్నాథ్ మహాప్రభు టెంపుల్ రహస్యం #🙏జయ జగన్నాథ✨ *జగన్నాథ ఆలయంలోని మూడో మెట్టు రహస్యం* భగవాన్ శ్రీ జగన్నాథుడిని శ్రీమహావిష్ణువు అవతారంగా భావిస్తారు. ఆయనకు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా పూజలు జరుగుతాయి. పూరీలోని జగన్నాథ ఆలయం చార్ ధామ్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం ద్వారా భక్తులకు పాప విముక్తి లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ ఆలయంలో మొత్తం 22 మెట్లు ఉన్నాయి. అయితే వాటిలో కింద నుంచి మూడో మెట్టుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఏ భక్తుడూ ఈ మెట్టుపై నేరుగా పాదం పెట్టరు. దానిని గౌరవంగా దాటి వెళ్తారు. ఈ మెట్టును "యమ శిల" అని పిలుస్తారు. 📿🪔📿 *యమధర్మరాజు మరియు మూడో మెట్టు మధ్య ఉన్న సంబంధం* 📿🪔📿 పురాణ కథనం ప్రకారం, ఒకసారి యమధర్మరాజు భగవాన్ జగన్నాథుడిని దర్శించేందుకు పూరీకి వచ్చారు. అప్పుడు ఆయన, "ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత ఎవరూ యమలోకానికి రావడం లేదు. ఎందుకంటే వారి పాపాలన్నీ నశించిపోతున్నాయి" అని జగన్నాథుడితో అన్నారు. అప్పుడు భగవంతుడు చిరునవ్వుతో, "అలా అయితే ఈ ఆలయంలోని మూడో మెట్టును నీ స్థానంగా ప్రకటిస్తాను" అని చెప్పారు. అనంతరం దర్శనం ముగించుకుని ఈ మూడో మెట్టుపై పాదం పెట్టే భక్తుల పాపాలు అక్కడే నిలిచిపోతాయని, కానీ ఆ పాపాలు యమలోకానికి చేరవని వరమిచ్చారు. అప్పటి నుంచి ఈ మూడో మెట్టు యమధర్మరాజుకు ప్రతీకగా మారి *"యమ శిల"* గా ప్రసిద్ధి చెందింది. ఈ విశ్వాసం కారణంగా, జగన్నాథుడి దర్శనం అనంతరం ఏ భక్తుడూ ఈ మూడో మెట్టుపై పాదం పెట్టరు. ఇది కేవలం మత విశ్వాసమే కాదు, శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచార సంప్రదాయం కూడా. ఈ మెట్టును గౌరవించడం అంటే యమధర్మరాజుకు గౌరవం తెలిపినట్టేనని భావిస్తారు. అందువల్ల భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ మెట్టును దాటి వెళ్తారు. 🪔📿🪔 *ఆలయంలో ఇప్పటికీ కొట్టుకుంటున్న భగవంతుని హృదయం* 🪔📿🪔 శ్రీకృష్ణుడు భూమిపై తన అవతారాన్ని ముగించిన తర్వాత ఆయన శరీరం పంచభూతాల్లో లీనమైందని పురాణాలు చెబుతాయి. అయితే ఆయన హృదయం మాత్రం దహనం కాలేదని విశ్వసిస్తారు. అదే దివ్య హృదయాన్ని నేటికీ జగన్నాథ స్వామివారి విగ్రహంలో అత్యంత రహస్యంగా ప్రతిష్ఠించి ఉంచారని నమ్మకం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే నవకలేబర సమయంలో స్వామివారి చెక్క విగ్రహాన్ని మార్చినా, అందులోని 'బ్రహ్మ పదార్థం' లేదా 'రహస్య హృదయం' మాత్రం ఎప్పటికీ మార్చబడదని విశ్వాసం. 🏮📿🏮 *సముద్ర అలల శబ్దం ఎందుకు వినిపించు?* 🏮📿🏮 ఆలయ ప్రధాన ద్వారం అయిన సింహద్వారం వెలుపల నిలబడి ఉంటే సముద్ర అలల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. కానీ ఆలయంలోకి అడుగుపెట్టగానే ఆ శబ్దం ఒక్కసారిగా పూర్తిగా వినిపించకుండా పోతుంది. ఇది నేటికీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచే రహస్యాల్లో ఒకటిగా భావిస్తారు. 🪔🚩🪔 *గాలికి వ్యతిరేకంగా ఎగిరే జెండా, 18 ఏళ్లుగా మారని సంప్రదాయం* 🪔🚩🪔 జగన్నాథ ఆలయ శిఖరంపై ఎగిరే జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతుందని చెబుతారు. ఇది ప్రకృతి నియమాలకు సవాల్ విసిరే అద్భుతంగా భావిస్తారు. ఇంకా ఒక విశ్వాసం ప్రకారం, ఏదైనా రోజు ఆలయ జెండాను మార్చకపోతే ఆలయం 18 సంవత్సరాల పాటు మూసివేయాల్సి వస్తుందని నమ్మకం. అందువల్ల ప్రతిరోజూ జెండాను మార్చే సంప్రదాయం కొనసాగుతోంది. 🛕🪔🛕 *ఏడు పాత్రల అద్భుతం* 🛕🪔🛕 జగన్నాథ ఆలయ వంటశాల ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలలలో ఒకటిగా గుర్తించబడింది. ఇక్కడ ఏడు మట్టి పాత్రలను ఒకదానిపై ఒకటి పేర్చుకుని వంట చేస్తారు. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అత్యంత పైభాగంలో ఉన్న పాత్రలోని ఆహారమే ముందుగా ఉడుకుతుంది. తరువాత దాని కింద ఉన్న పాత్రలు వరుసగా ఉడుకుతాయి. సాధారణంగా అలా జరగకూడదు. కానీ ఈ అద్భుతానికి ఇప్పటివరకు స్పష్టమైన శాస్త్రీయ వివరణ లభించలేదు. 🪔🌕 *సుదర్శన చక్రం మరియు అదృశ్య నీడ* 🌕🪔 జగన్నాథ ఆలయ శిఖరంపై ప్రతిష్ఠించిన సుదర్శన చక్రంను ఏ దిశ నుంచి చూసినా అది మన వైపే తిరిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ చక్రం ప్రతి కోణంలోనూ ఒకే విధంగా కనిపించడం కూడా ఆలయంలోని మరో విశేషం. అలాగే, ఆలయ శిఖరం ఎంతో ఎత్తుగా ఉన్నప్పటికీ దాని నీడ భూమిపై స్పష్టంగా కనిపించదని విశ్వసిస్తారు. ఈ అద్భుతం నేటికీ భక్తులను మాత్రమే కాదు, శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
12 likes
8 shares