హోలీ పండుగ విశిష్టత? రంగుల నీళ్ళు చల్లుకోవడం వెనుక కారణం ఏమిటి?
5 Posts • 467 views
PSV APPARAO
545 views 2 days ago
#హోళికా దహనం ఎందుకు చేస్తారు? #హోలీ పండుగ విశిష్టత? రంగుల నీళ్ళు చల్లుకోవడం వెనుక కారణం ఏమిటి? #హోలీ (హోలిక/కామ దహనం) పండుగ విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #హోళికా పూర్ణిమ.. వసంతోత్సవం💐🎂 *పురాణకాల పర్వం హోలీ* హోలీ లేదా రంగుల పండుగగా మనం జరుపుకునే పండగ అసలు పేరు హోళికా పూర్ణిమ. ఇది రెండు రోజుల పండగ అయినందున కొన్ని ప్రాంతాల్లో మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో రెండో రోజు చేస్తారు. ఇది ఈనాడు రంగులు చల్లుకునే ఉత్సవంగానే మారిపోయింది గాని ఈ రోజున ఆచరించాల్సిన వేరే విధి విధానాలూ ఉన్నాయి, ఉదయాన్నే కట్టెలు, పిడకలు రాశిగా పోసి నిప్పును రాజేసి దానిపైకి హోళికా అనే శక్తిని అవహింపజేసి 'శ్రీ హోళికాయైనమః' అని పూజించి మూడు సార్లు అగ్నికి ప్రదక్షిణం చేస్తూ 'వందితాసి సురేంద్రేణ బ్రాహ్మణాశంకరేణ చ, అతస్త్వాం పాహినో దేవి భూతే భూతి ప్రదో భవ' అనే శ్లోకం చదవాలని పెద్దలు చెబుతారు. ఆ తర్వాతే రంగులను చల్లడం, రంగునీటితో ఉత్సవం జరుపుకోవడం చేయాలని శాస్త్ర వచనం. హోలీ పండగకు సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని నిప్పుల్లో పడేసి కాల్చాలనుకోవడం అందుకు ప్రహ్లాదుని అత్త హోళిక పూనుకోవడం ప్రహ్లాదునితో బాటు అగ్నిలో దూకడం కథ అందరికీ తెలసిందే. అయితే ఆమె కూడా పునీతురాలైంది కనుక హోలీ రోజు ఉదయాన్నే అగ్నిని రగిల్చి ఆమెను ఆవాహన చేయడం, హోళికాయైనమః అని స్మరించే ఆచారం వచ్చిందని అంటారు. మరో పక్క హోళిక మరణించిన తిథి ఇదే అయినందున ఈ రోజు హోలీ పండగ చేసుకుంటారని అంటారు. ఈ మంటనే చెడుపై మంచి విజయంగా కొందరు అభివ ర్ణిస్తారు. హోళిక చెడుకు సంకేతమని అగ్ని జ్ఞానాగ్ని అని వారి భావన. ఉత్తర భారతంలో కృష్ణుడు పెరిగిన ప్రదేశంగా భావించే వ్రజ భూమిలో మరో కథ ప్రచారంలో ఉంది. కృష్ణుడు నల్లగా ఉండడం, రాధ ఇతరులు తెల్లగా ఉండడం చూసి వారిని ఈ ఒక్క రోజు రంగులుల పూసుకుని నల్లగా మారాలని కోరాడని భావిస్తారు. ఈ ప్రాంతాల్లో హోలీని రెండు రోజుల పండగగా చేసుకుంటారు. మొదటి రోజును హోలికా దహన్ లేదా చోటీ హోలీ అని రెండో రోజును రంగ్ వాలీ హోలీ. ధులేటి, ధుళంది, ధూళి వందన్ వంటి పేర్లతో పిలుస్తారు. వీరు రెండో రోజుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దీనిని విభేదాలను మరిచి స్నేహం పెంపొందించుకునే సమయంగా కూడా భావిస్తారు. ఈ రోజు రంగులు చల్లుకోవడంలో తెలిసినవారు, కొత్తవారు అనే భేదం లేకుండా అందరినీ వర్థప్లావితం చేయడం జరుగుతుంది. ఈ రంగులు, రంగు నీరు చల్లుకోవడంతో బాటు నృత్యగానాదులతో ఊరేగింపులు నిర్వహించడం, దీనిలో పానీయాలు అందించడం కూడా జరుగుతూంటుంది. కొన్ని ప్రాంతాల్లో భంగు కలిపిన పానీయాలు తాగి మైమరచిపోతుంటారు. హిందువుల ప్రాచీన పండగ అయిన హోలీని దక్షిణాసియాలోని చాలా ప్రాంతాల్లో హిందుయేతరులు సరదా పండగగా కూడా చేసుకుంటూంటారు. ముఖ్యంగా భారత్, నేపాల్, ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో హిందువులు ఉన్న తావుల్లో జరుపుకోవడం జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఈ పండగను యూరప్, అమెరికాల్లో సైతం నిర్వహిస్తున్నారు. అక్కడ ఈ పండగను వసంత రుతువులో వచ్చే రంగుల పండగగా అక్కడి భారతీయులు భావిస్తారు. అంతేకాక ఈ రోజు ఇతర దేశాల వారి పండగలు ఉండడంతో ఇది వాటితో కలిసి అంతర్జాతీయ పండగగా పేరు పొందింది. _లక్ష్మీ జయంతి_ ఈ రోజును లక్ష్మీ జయంతిగా పరిగణిస్తారు. లక్ష్మీదేవి ఈ రోజే క్షీర సాగరం నుంచి ఆవిర్భవించిందని చెబుతారు. ఈ రోజు లక్ష్మీదేవిని షోడషోపచారాలతో పూజించి లక్ష్మీ అష్టోత్తర శత నామాలు, కనకధారా స్తవం వంటివి పారాయణ చేయడం వల్ల సమస్త సంపదలు సిద్ధిస్తాయని అంటారు. _డోలోత్సవం_ ఈ రోజు డోలోత్సవం చేస్తారు. ఈ రోజు బాలకృష్ణుని లేదా రాధాకృష్ణులను ఊయలలో ఉంచి ఆరాధించాలి. దీనివల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. _మదన పూర్ణిమ_ ఈ రోజునే మదన పూర్ణిమ అని కూడా చెబుతారు. శివుడు మన ధుణ్ని దగం చేయగా అతని భార్య తపస్సు చేసి శివుని అనుగ్రహంతో తన భర్తను అనంగునిగా పొందిందని కథ. అది జరిగింది ఈ రోజునేనని దానిని పురస్కరించుకుని ఈ రోజును మదన పూర్ణిమగా పేర్కొంటారని చెబుతారు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
14 likes
6 shares
PSV APPARAO
477 views 2 days ago
#హోళికా పూర్ణిమ.. వసంతోత్సవం💐🎂 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #హోలీ (హోలిక/కామ దహనం) పండుగ విశిష్టత #హోలీ పండుగ *శ్యామకేలీ* *పండుగ ప్రారంభించిన కృష్ణుడు* కృష్ణుడు అల్లరిబాలుడు అతడు బృందావనంలోని గోపాలు లతో కలిసిమెలసి తిరిగేవాడు. ఆ పరమాత్ముడినే సహచరుడిగా పొందగలిగినవారు గత జన్మలో చేసిన పుణ్యం ఎటువంటిదో కదా?! కృష్ణుడు హాని కలిగించని అల్లరి చేష్టలతో స్నేహితుల్ని ఆటపట్టించేవాడు. గోపబాలురు కూడా కృష్ణుడి అన్నగారైన బలరాముడితో కలిసి 'నల్లనయ్యా' అంటూ ఆటపట్టించేవారు. అంతేకాదు అతడి స్నేహితురాలు 'రాధ' తెల్లగా ఉండగా, తను మాత్ర మే నల్లగా ఉన్నాడని ఉడికించేవారు. ఒకసారి స్నేహి తుల అల్లరికి ఉడుకున్న కృష్ణుడు ఏడుస్తూ యశోదమ్యను చేరి 'రాధ తెల్ల గా ఉంటే, తనెందుకు నల్లగా ఉన్నాడో చెప్పమని' ఆమెను నిలదీశాడు. ఆ సమయంలో యశోదమ్మకు ఎం చెప్పాలో తోచక నవ్వుతూ నువ్వూ రంగు తీసుకెళ్ళి రాధ ముఖా నికి పులుము అంటూ ఆటపట్టిస్తూ సలహా ఇచ్చింది. కృష్ణుడికి ఆ సలహా ఎంతగానో నచ్చింది. కృష్ణుడు రకరకాల రంగులను వెంట తీసుకుని రాధ ఇంటికెళ్ళి ఆమె ముఖానికి అద్దాడు. అలా కృష్ణుడు మొదటిసారి రంగులతో ఆట మొదలుపెట్టాడు. ఆయన మొదలు పెట్టాకే నేడు మనం 'హోలీ పండుగ'గా జరు పుకుంటున్నాం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
9 likes
17 shares