ధర్మ ద్వజం
179 Posts • 33K views
PSV APPARAO
714 views 25 days ago
#ధర్మధ్వజం (హిందు చైతన్య వేదిక) భక్తిసమాచారం ప్రతి రోజు మీకోసం #ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి? #ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత #ధర్మ ద్వజం #ధర్మద్వజం *🚩 డిసెంబర్ 30,2025 ముక్కోటి ఏకాదశి🚩* ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం చేస్తే కలిగే పుణ్య ఫలం ఏమిటి? అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విశ్వము దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు. ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్షించాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? - ఈ లోకంతో భవ బంధనాలనుంచి విముక్తి. మోక్షము అంటే "ముచిల్ మోక్షణే" అని అర్థం. బంధనాలనుంచి ముక్తిని పొందడము, విముక్తిని కలిగించుకోవడము అని అర్థం. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలది, ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది. *_🙏🙏🙏🙏🙏🙏_*
2 likes
4 shares
PSV APPARAO
563 views 3 months ago
#హిందువులపై దాడులు #హిందువులకు చెప్పబడిన పచ్చి అబద్దం “మోప్లా తిరుగుబాటు" (1921 సెప్టెంబర్ 25) ☹️🇮🇳😩 #ధర్మధ్వజం (హిందు చైతన్య వేదిక) సమాచారం ప్రతి రోజు మీకోసం #ధర్మ ధ్వజం చరిత్ర చెప్పని నిజాలు #ధర్మ ద్వజం హిందువులకు చెప్పబడిన పచ్చి అబద్దం “మోప్లా తిరుగుబాటు (1921 సెప్టెంబర్ 25)” అసలు మోప్లా తిరుగుబాటు వెనుక కధ ఏమిటి ? 1921 సెప్టెంబర్ 25, 100 సంవత్సరాల క్రితం జరిగిన భయంకర మోప్లా దారుణ మారణకాండ లో వేలాది హిందువుల ను పశువులను నరికి చంపినట్లు నరికి, ఆడవారిని యధేచ్చగా మానభంగాలు జరిపి, తర్వాత నిర్ధాక్షిణ్యంగా చంపేసిన జిహాదీ మతోన్మాద దారుణ నరసంహారం గురించి –మనకు చెప్పబడిన పచ్చి అబద్దం “మొఫ్లా తిరుగుబాటు” మరి ఈ మోప్లాలు ఎవరి మీద తిరుగుబాటు చేసారు ? బ్రిటీష్ వారి మీదా ? కాదు. మరి అలాంటప్పుడు “మోప్లా తిరుగుబాటు” ఎలా అయ్యింది. మోప్లా ముస్లిములు ఊచకోత కోసింది బ్రిటీష్ వారిని కాదు. తమతో పాటు నివసిస్తున్న హిందువుల మీద. ఖిలాఫత్ ఉద్యమాన్ని అణచివేసిన బ్రిటీష్ వారిని ఏమి చేయలేక ఆ కసిని హిందువుల మీద చూపారు. మలబార్ లో ఖలిఫా రాజ్యాన్ని స్థాపిస్తామన్న నినాదంతో హింసాకాండను మారణకాండను జరిపారు. అంతేకాదు ఈ ఖిలాఫత్ ఉద్యమం భవిష్యత్ లో భారత్ లో మతరాజకీయాలకూ, పాకిస్థాన్ సృష్టికీ విత్తనాలు నాటింది. ఈ తరం వారికి ఈ చరిత్ర ఎలానూ తెలియదు, ఆఖరుకి పాత తరాల వారికి కూడా పూర్తిగా తెలియనివ్వని మహాత్ముని ఆధీన కాంగ్రెస్ , డా. అంబేద్కర్ , సరోజిని నాయుడు వంటి వారి గొణుగుళ్ళు తప్ప అసలు విషయం తెలియనివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంతకీ అసలు ఈ మోప్లా అల్లర్లు లేదా మోప్లా మారణకాండ లేదా మోప్లా తిరుగుబాటు వెనుక కధ ఏమిటి ? టర్కీ సుల్తాన్ యావత్ ఇస్లామిక్ ప్రపంచానికి ఖలీఫా గా చలామణీ అయ్యేవారు. టర్కీలో ఉదారవాద కెమల్ పాషా నాయకత్వంలో బ్రిటీష్ వారి పూర్తి మద్దత్తు తో ఖలీఫాను గద్దె దించేసారు. ప్రపంచవ్యాప్తంగా కాకపొయినా ముస్లిములు ఖలీఫా పున:ప్రతిష్ట చేయాలని ఉద్యమించారు.. దానినే ఖిలఫత్ ఉద్యమం అని పిలిచేవారు. అయితే ఈ ఉద్యమంలో టర్కీ ప్రజలు తిరుగుబాటుదారు కెమల్ పాషా కు అనుకూలంగా ఉన్నారు.వారికి ఖలీఫా తిరిగిరావటం ఇష్టం లేదు. అనేక ఇస్లామిక్ దేశాలు సౌదీ అరేబియా తో సహా ఖలీఫా కు వ్యతిరేకం. బ్రిటీష్ ఆ ఉద్యమాన్ని అణచి వేసింది. ఆ సరికి ప్రపంచమంతా ఖిలాఫత్ ఉద్యమం చల్లారిపోయింది, ఒక్క భారత్ లో తప్ప. ఎందుకంటే అప్పటికే భవిష్యత్ లో జాతికి పిత కాబోతున్న, సమీప భవిష్యత్ లో మహాత్ముడనే బిరుదాంకితుడు కాబోతున్న గాంధీగారు ఖిలాఫత్ వుద్యమాన్ని హెర్కులస్ లాగా భుజాన మహా తమకం గా మోస్తున్న రోజులు. అప్పటికి పదహరణాల జాతీయవాదిగా ఉన్న మహమ్మదాలీ జిన్నా గారు సైతం, మతాన్నీ రాజకీయాన్ని మెలివేసి కలిపే ప్రమాదకరమైన చెత్త విధానాన్ని తీవ్రంగా నిరసించాడు. గాంధీ కి దగ్గర అయిన సరోజిని నాయుడు, అని బిసెంట్, వగైరాలతో పాటు గాంధీని పెద్దగా లెక్క చేయని డా.అంబేద్కర్ పూర్తిగా వ్యతిరేకించాడు. అయినా ఫ్యూచర్ జాతిపిత తలకు ఎక్కలేదు. ఈ లోపు ఖిలాఫత్ పూర్తిగా చల్లారిపోయుంది. కేరళలో మల్లప్పురం జిల్లాలో ముస్లిములు మెజారిటీ. వాళ్ళల్లో మోప్లాలు ఒక పిడివాద కౄర ఇస్లామిక్ తెగ. వీళ్ళు ఎక్కడ నుండో పారిపోయి భారత్ కు వలస వచ్చినవారు. పిచ్చి హిందువులు వారిని మాపిళ్ళయ్ లు (అల్లుళ్ళు) గా అక్కున చేర్చుకుని ఆదుకున్నారు. అంటే ఇప్పుడు మనం బంగ్లాదేశీ ముస్లిములకూ, అతి కిరాతక రోహింగ్యాలకు ఆశ్రయమిస్తున్నట్లన్న మాట. ఖిలాఫత్ ఎప్పుడైతే విఫలమయిందో మోప్లాలలో హింసోన్మాదం ప్రజ్వరిల్లింది. తమ ప్రాంతంలో ఉన్న హిందువులను వేల సంఖ్యలో ఊచకోత కోసారు. స్త్రీలను చెరబట్టి మానభంగం చేసి మరీ చంపారు. పిల్లలని వృద్దులనీ చూడకుండానరికి వేసారు. ఏ నూతి లో చూసినా శవాలే. ఏ కాలవలో , చెరువులో చూసినా శవాలే. ఇళ్ళ దోపిడీలూ మామూలే. హిందూదేవాలయలను పగలగొట్టారు, దేవాలయాల్లో ఆవులను నరికి చంపి ఆ మాంసాన్ని హిందువులకు తినిపించారు. బలవంతంగా మతం మార్చారు. మారనివారు ఇతర ప్రాంతాలకు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు. బ్రిటీష్ ప్రభుత్వం ఈ హింసాకాండను అతి కష్టం మీద అణచివేసారు, హిందువులు వదిలేసిపారిపోయిన ఆస్తులు మోప్లా ముస్లిములు లాగేసుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, కాశ్మీర్ లాంటి చోట జరగబోయే భావి హింసకు ఇది నాందీ అన్నమాట. ప్రపంచమంతా ఈ ఘోరకలిని ఖండించింది, ఒకే ఒక్కడు తప్ప. భావిభారత జాతిపితాశ్రీ గారు ఈ మారణకాండలో మోప్లా ముస్లిముల వీరత్వం చూసారు. మోప్లాలలో మత నిష్టా గరిష్ట అంకితభావం వీక్షించారు. మోప్లా ముస్లిములు తమ మత గ్రంధంలో ఏమి చెప్పబడి ఉన్నదో దానినే వీరోచితంగాపాటించారు తప్ప అందులో వారి తప్పేముంది అంటూ ఎంతో అమాయకంగాఈ సమాజాన్ని ప్రశ్నించారు. మరి రేపోమాపో “మహత్మ” భుజకీర్తులు తగిలించుకోబోతున్న అంత మహావ్యక్తి చెప్పిన తర్వాత కాంగ్రెస్ మాత్రం అదే ప్రచారం చేయక చస్తుందా ? అందుకే “మోప్లా మారణకాండ” కాస్త “మోప్లా తిరుగుబాటు” గా జనం లోకి ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు కమ్యూనిస్ట్ కేతిగాళ్ళు ఈ మారణకాండకు మరింత మేకప్ చేసి చెమ్కీలు అద్ది “మోప్లా రైతుల విప్లవ పోరాటం” గా గ్రాఫిక్స్ సృష్టించే ప్రయత్నంలో ఉన్నారు. మనము నాజూకు నాగరీకులము. ఇలాంటి అల్పమైన విషయాలు మనకు అనవసరము. ఎక్కడో ఏదో జరిగితే మనకేల ? మనము ప్రస్తుతానికి పచ్చగానే ఉన్నాము. మన పెళ్ళాం బిడ్డలు హాయిగానే ఉన్నారు. మన కులనాయకులు వర్ధిల్లుతూనే ఉన్నారు. మన కులపార్టీలు శక్తివంచన లేకుండా కులసంక్షేమం కోసమూ, గాంధేయ బ్రాండ్ సెక్యులర్ విలువల కోసమూ నిరంతరమూ కృషి చేస్తూనే ఉన్నాయి. అంతకంటే ఇంకేమి కావాలి !
12 likes
14 shares