పాలిటిక్స్
51 Posts • 67K views
P.Venkateswara Rao
435 views 5 days ago
#పాలిటిక్స్🚏 *సేమ్… అప్పటి చంద్రబాబు పసుపు- కుంకుమ బాటలోనే మోడీ, నితిశ్…❗* September 26, 2025🎯 పార్టీ నుంచి వోటరుకు ఇంత అని రేటు పెట్టి కొనుగోలు చేయడం పాత పద్ధతి… పక్కాగా ఖజానా నుంచే డబ్బులు బహిరంగంగానే చెల్లించి ప్రలోభపెట్టడం కొత్త పద్ధతి… ఈ పద్ధతి ప్రభావం పక్కాగా ఉండాలంటే ఎన్నికలకు కాస్త ముందుగా ప్రవేశపెట్టాలి… ఒకవేళ ఎన్నికల సంఘం అభ్యంతరపెట్టినా సరే, ఇది ఆల్రెడీ అమల్లో ఉన్న పథకం అని చెప్పేయాలి… మళ్లీ మధ్యలో నాయకులు, కార్యకర్తలు కమీషన్లు తినకుండా… నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయాలి… పెద్ద ఎత్తున ప్రచారం, మీడియాలో వార్తలు, హడావుడి… ప్రభుత్వం బాగా పనిచేస్తున్నదనే పేరు కూడా… అవును, చివరకు మోడీ, నితిశ్ కూడా ఇప్పుడదే బాట… బయటికి ఏం చెబుతున్నా… బీహార్‌లో గెలుపు కోసం నానా పాట్లూ పడుతున్నది అక్కడ ఎన్డీయే ప్రభుత్వం… ఆల్రెడీ పెన్షన్ల పెంపు, 125 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు వంటివి ప్రకటించగా… తాజాగా 7500 కోట్లు ఖర్చయ్యే మరో పేద్ద పథకాన్ని ప్రారంభించారు… ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన దీని పేరు… ఈరోజు మోడీ ప్రారంభించాడు… రాష్ట్రంలోని 75 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి నేరుగా పది వేల చొప్పున బదిలీ చేస్తుంది ప్రభుత్వం… ఎందుకయ్యా అంటే..? మహిళల స్వావలంబన, స్వయంఉపాధి కార్యక్రమాల కోసం అట… పది వేలతో స్వయంఉపాధి వ్యాపారాలు..!! అబ్బే, ఇంతేకాదు… ఈ డబ్బుతో ఎవరైతే ఆరు నెలల్లో సక్సెస్‌ఫుల్‌గా స్వయంఉపాధి కార్యక్రమాలు, వ్యాపారాలు చేపడతారో, డెవలప్ అవుతారో… సమీక్షించి వాళ్లకు 2 లక్షల వరకూ భవిష్యత్తులో రుణంగా అందిస్తారట… ప్రతి కుటుంబంలో ఓ మహిళకు ఈ పది వేల సాయం… ఇది మళ్లీ చెల్లించేపని లేదు… వన్ టైమ్ సాయం… ఇక కృతజ్ఙతతో ఎన్డీయేకు వోట్లేసి తమ బాధ్యత నెరవేర్చాలన్నమాట… కర్నాటక, తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాల్లో సూపర్ సిక్స్‌ల పేరిట వాగ్దానాలు చేసి… వాటి అమలుకు నానా తిప్పలూ పడుతున్నాయి ప్రభుత్వాలు… సిలిండర్లు, ఉచిత విద్యుత్తు, ఫ్రీ బస్సు ఎట్సెట్రా… మోడీ, నితిశ్ ఇంకాస్త జోరు చూపిస్తున్నారన్నమాట… జీవిక దీదీ స్వయంసహాయ సంఘాల్లోని మహిళలకు ఈ పదివేల పంపిణీ పథకం వర్తిస్తుందని చెబుతున్నారు… నిజానికి మోడీకి జనాకర్షక విధానాలు పెద్దగా నచ్చవు… ఫ్రీ పందేరాలు ఇష్టపడడు… కానీ బీహార్‌లో పరిస్థితి టైటుగా ఉంది… అక్కడ గెలవకపోతే ఆ ప్రభావం దేశమంతా పడే ప్రమాదం కూడా ఉంది… అందుకని ఇక గేట్లు తెరిచేశారన్నమాట… అన్నట్టు, బీహార్‌లో మహిళా వోటర్ల సంఖ్యే ఎక్కువ… మీకు గుర్తుందా..? సేమ్… 2019 ఎన్నికలకు ముందు అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలకు ఉచితంగా పదేసి వేలను పసుపు కుంకుమ పథకం కింద ఇచ్చాడు… మూడు విడతలుగా… ఇప్పడు మోడీ కూడా అదే బాట… ఐతే చెప్పుకోవాల్సింది ఏమిటంటే..? ఇలాంటి నగదు పంపిణీలను ప్రభుత్వం ఏ పేర్లతో ప్రవేశపెట్టినా చంద్రబాబు ఘోరంగా ఓడిపోయాడు… జగన్ అయితే చెప్పనక్కర్లేదు… బటన్లు నొక్కుతూ ఎడాపెడా భిన్న వర్గాలకు నగదు పంపిణీ చేస్తూ పోయాడు… ఈసారి జగన్ చంద్రబాబును మించిన దారుణ వోటమిని ఎదుర్కున్నాడు… ఎన్నికలకు ముందు జరిగే ఏ వోటర్ల ప్రలోభ పథకమైనా ఎదురుతన్నడం ఖాయమని గత అనుభవాలు చెబుతున్నాయి… ప్చ్, నితిశ్, మోడీలకు ఇది తెలిసినట్టు లేదు..!!
15 likes
10 shares
P.Venkateswara Rao
642 views 1 months ago
#పాలిటిక్స్ 🏛️ #👉నేరాలు - ఘోరాలు🚨 #🗞ప్రభుత్వ సమాచారం📻 *నిన్న చట్టం… నేడు ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే బెట్టింగ్ మాఫియా బద్దలు…❗* August 23, 2025🎯 కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర ‘పప్పీ’ అరెస్టు: అక్రమ బెట్టింగ్ వ్యవహారంలో ఈడీ మెరుపుదాడులు… ఆన్‌లైన్ బెట్టింగ్ బిల్లుపై నిన్ననే కదా రాష్ట్రపతి సంతకం చేసింది… వెంటనే ఈడీ విరుచుకుపడింది ఓ పెద్ద నెట్‌వర్క్‌పై… అక్రమ బెట్టింగ్, మనీలాండరింగ్ నెట్వర్క్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర ‘పప్పీ’ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సిక్కింలో అరెస్టు చేశారు… శనివారం దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు ఈడీ విస్తృతంగా సోదాలు నిర్వహించిన తర్వాత ఈ అరెస్టు జరిగింది… ఈ దర్యాప్తులో భారీ ఎత్తున అక్రమ బెట్టింగ్ నెట్వర్క్, దుబాయ్‌లోని అంతర్జాతీయ క్యాసినోలు, గేమింగ్ కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైంది… అబ్బో, చాలా బిగ్ షాట్… ఈడీ దాడులు, కీలక ఆధారాలు: ఆగస్టు 22, 23 తేదీలలో సిక్కిం, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా సహా పలు రాష్ట్రాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. గోవాలోని ‘పప్పీస్ క్యాసినో గోల్డ్’, ‘ఓషన్ రివర్స్ క్యాసినో’, ‘పప్పీస్ క్యాసినో ప్రైడ్’, ‘ఓషన్ 7 క్యాసినో’ మరియు ‘బిగ్ డాడీ క్యాసినో’ అనే ఐదు క్యాసినోలను అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు… దర్యాప్తు సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర ‘కింగ్567’, ‘రాజా567’ వంటి పలు బెట్టింగ్ వెబ్‌సైట్‌లను నడుపుతున్నాడు. అతని సోదరుడు కేసీ తిప్పేస్వామి దుబాయ్ కేంద్రంగా కాల్ సెంటర్ సేవలు, గేమింగ్ కార్యకలాపాలకు సంబంధించిన మూడు సంస్థలను నిర్వహిస్తున్నాడు… సోదాల్లో పట్టుబడిన వాటి వివరాలు: దాడుల్లో భాగంగా అధికారులు భారీ మొత్తంలో నగదు, ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో: ₹12 కోట్ల నగదు, ఇందులో కోటి రూపాయల విలువైన విదేశీ కరెన్సీ ఉంది. ₹6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు. సుమారు 10 కిలోల వెండి ఆభరణాలు. ఒకే నంబరు (0003) ఉన్న మూడు విలాసవంతమైన వాహనాలు. MGM, బెల్లాజియో, మెట్రోపాలిటన్, మెరీనా, క్యాసినో జ్యువెల్ వంటి అంతర్జాతీయ క్యాసినోల మెంబర్షిప్ కార్డులు. తాజ్, హయాత్, ది లీలా వంటి లగ్జరీ హోటళ్ల మెంబర్షిప్ కార్డులు. పలు అధిక విలువ గల క్రెడిట్, డెబిట్ కార్డులు. దర్యాప్తు సంస్థ వర్గాల ప్రకారం, ఈ ఆధారాలు నగదు, నిధుల “సంక్లిష్టమైన కార్టెల్” ను సూచిస్తున్నాయి. గ్యాంగ్టక్‌లో ఒక ల్యాండ్ బేస్డ్ క్యాసినోను లీజుకు తీసుకునే ప్రయత్నాలు జరిగినట్లు కూడా ఆధారాలు లభ్యమయ్యాయి. వీరేంద్ర సోదరుడు కేసీ నాగరాజ్, మేనల్లుడు పృథ్వీ ఎన్ రాజ్లకు సంబంధించిన 17 బ్యాంకు ఖాతాలు, రెండు లాకర్లను ఈడీ స్తంభింపజేసింది. వారి ఆస్తుల పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. అరెస్టు, తదుపరి చర్యలు: 50 ఏళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేను గ్యాంగ్టక్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ కోసం బెంగళూరుకు తరలించడానికి కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ మంజూరు చేసింది… ఇంకా బీజేపీ రాజకీయ దురుద్దేశంతో పన్నిన కుట్ర అని ఎవరూ ఆరోపించలేదు, చూడాలి…
18 likes
5 shares
P.Venkateswara Rao
3K views 1 months ago
#పాలిటిక్స్🏛️ *దేశంలోనే మన తెలుగు సీ ఎంలు నెంబర్ వన్...❗* AUGUST 23, 2025🎯 ప్రజలను పరిపాలించే నాయకుల్లో కొందరు కొన్ని విషయాల్లో నెంబర్వన్గా ఉంటారు. దేశంలోనే టాప్ పొజిషన్లో ఉంటారు. పాలితులు అంటే సామాన్య జనాల కంటే పాలకులు సంపదలోగాని, నేరాల్లో గాని టాప్ ఉంటారు. రాజకీయాలకు సంపదకు, నేరాలకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఈ కాలంలో చాలా కొద్దిమంది నాయకులు ఇందుకు మినహాయింపుగా ఉంటారు. ఏమీ లేనివాడు కూడా రాజకీయాల్లో చేరాక దండిగా డబ్బు సంపాదించుకుంటాడు. క్రిమినల్ కూడా మారతాడు. రాజకీయ నాయకులకు సంపద ఉండాలి. దాదాగిరి ఉండాలి. లేకపోతే రాజకీయాల్లో మనుగడ సాగించడం కష్టం. ఎన్నికల్లో డబ్బు దండిగా ఖర్చు చేసినా ఆ తరువాత దానికి రెండుమూడింతలు ఎక్కువగా సంపాదించుకుంటారు. పొలిటీషియన్స్కు సంపద, నేర చరిత్ర రెండూ ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా. ఈ రెండు విషయాల్లో ప్రస్తుత తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, ఆయన రాజకీయ శిష్యుడిగా పాపులరైన రేవంత్రెడ్డి ఇద్దరూ దేశంలోనే నెంబరవన్ ఉన్నారు. చంద్రబాబు సంపదలో నెంబర్వన్గా కాగా, రేవంత్రెడ్డి క్రిమినల్ కేసుల్లో నెంబర్వన్గా ఉన్నాడు. ముఖ్యమంత్రుల వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల సంపద, నేర చరిత్ర వివరాలను తెలియజేసింది. నేషనల్ ఎలక్షన్ వాచ్ తో కలిసి నివేదిక రూపొందించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అత్యధికంగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. కేసుల విషయంలో దేశంలోనే రేవంత్ రెడ్డి నెంబర్ వన్ గా నిలిచాడు. ఆయన మీద మొత్తంగా 89 కేసులు ఉండగా, వీటిలో 72 కేసులు ఇండియన్ పీనల్ కోడ్ కింద నమోదైన తీవ్రమైన కేసులని ఈ నివేదిక పేర్కొన్నది. నేరపూరిత బెదిరింపు, రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, మోసం చేయడం, ఆస్తిని అప్పగించడానికి ప్రేరేపించడం, ఖాతాల తప్పుడు సమాచారం ఇవ్వడం, మతవిశ్వాసాన్ని అవమానించడం లేదా మతాన్ని రెచ్చగొట్టడం ఆరోపణలతో రేవంత్ రెడ్డిపై కేసులు ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. 31 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. ఇందులో 10 మందిపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచం, నేరపూరిత బెదిరింపులు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. చాలా మంది సీఎంల మీద పబ్లిక్ లో గొడవలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. కాగా, రేవంత్ రెడ్డి తర్వాత 47 కేసులతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెండోస్థానంలో ఉన్నాడు. చంద్రబాబు మీద 19 కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంపదకు సంబంధించిన రికార్డు ని క్రియేట్ చేశాడు. దేశంలోనే ధనికులైన ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించాడు. మొత్తం 31 మంది సీఎంల అధికారిక ఆస్తుల వివరాలను లెక్కించారు. ఇందులో చంద్రబాబు కి అత్యధికంగా రూ.931 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయి. ఇది ఒక కార్పొరేట్ దిగ్గజం ఆస్తులకు సరిపోతుంది. చంద్రబాబు గత కొన్నేళ్లుగా టెక్నాలజీ, వ్యవసాయం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, కుటుంబ వ్యాపారాలు విస్తరించడం వల్ల ఆయన ఆస్తులు విపరీతంగా పెరిగినట్టు సమాచారం. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు - లోకేష్, భువనేశ్వరి వ్యాపారాల ద్వారానే ఎక్కువ ఆస్తులు సొంతం చేసుకున్నారని రాజకీయ వర్గాల విశ్లేషణ. బాబు తర్వాత రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండ్ నిలుస్తున్నారు. ఆయన ఆస్తులు రూ.332 కోట్లు మాత్రమే. ఇక మూడో స్థానంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.51 కోట్లు మాత్రమే. అధికారికంగా ప్రభుత్వానికి సమర్పించిన లెక్కల ఆధారంగా ఈ నివేదిక తయారు చేశారు. మొత్తం 31 ముఖ్యమంత్రుల ఆస్తి కలిపి రూ.1,630 కోట్లు ఉంది. వీరందరి ఆస్తి కలిపితే సగటున రూ.52.59 కోట్లు ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది. సీఎంల సగటు ఆదాయం ఏడాదికి రూ.13,64,310. ఇది దేశ సగటు తలసరి ఆదాయం కంటే 7.3 రెట్లు అధికం. ముఖ్యమంత్రులు అందరిలో తక్కువ ఆస్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఉంది. ఆమెకు రూ.15 లక్షలు మాత్రమే. దీనిని బట్టి మన సీఎంల రేంజ్ అర్థం అవుతుంది. మొదట నుంచి ఆదాయపు వివరాలను బహిర్గతం చేయటం చంద్రబాబుకి అలవాటు. దీంతో అధికారిక ఆస్తుల్లో ఆయన నెంబర్ వన్ గా నిలిచారు. ఇక ఆస్తుల విషయంలో చంద్రబాబుతో పోలిస్తే రేవంత్రెడ్డికి బాగా తక్కువ. ఆయనకు సుమారు 30 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఒకప్పుడు రెండెకరాలు ఉన్న చంద్రబాబు ఇప్పుడు సంపద విషయంలో అందనంత ఎత్తులో ఉన్నాడు. ఈ విధంగా ఇద్దరు నాయకులు రికార్డు సృష్టించారు.
26 likes
1 comment 40 shares