గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
284 Posts • 6K views
#భగవద్గీత #🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸 🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸 #🙏 గురుమహిమ #గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు... #జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev *🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸 *🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి🌹* *19. ఓం తత్త్వ ప్రబోధిన్యై నమః* జగత్తు యొక్క తత్త్వాన్ని శ్రీమద్భగవద్గీత తెలుపుతుంది. దృశ్యమాన జగత్తు మొత్తం, అందలి సమస్త రూపాలు నశించిపోయేవే అని తెలుపుతుంది. అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తాః శరీరిణః । అనాశినో-ప్రమేయస్య తస్మాత్‌ యుధ్యస్వ భారత ॥ 2.18 దేహి యొక్క దేహం అంతమై పోయేదే. కాని దేహి నాశరహితుడు, నిత్యుడు. నామ రూపాత్మకమైన చరాచర జగత్తు, అందలి సమస్తం ఎప్పుడో ఒకప్పుడు నశించేదే. అయితే మరి నిత్యమైనది ఏది? ఆత్మ స్వరూపుడుగా దేహి నిత్యుడు, దేహములు అనిత్యాలు. ఎప్పుడయితే దేహం యొక్క అనిత్యత్వాన్ని గుర్తిస్తామో అప్పుడు దేహ భ్రాంతి తొలగిపోతుంది. దేహం పట్ల మమకారం నశిస్తుంది. దేహం నశించినా ఆత్మ నశించదు అని, అది పరమాత్మ స్వరూపమే అని భగవద్గీత తెల్పుతుంది. ఆత్మ నాశనం లేనిది. నిత్యమైనది. న జాయతే మ్రియతే వా కదాచిత్‌ । 2.20 ఆత్మ ఎప్పుడూ పుట్టటం లేదు. చనిపోవటం కూడా లేదు. నేను ఆత్మ స్వరూపుడిని, నాశనం లేనివాడిని. నాకు, పరమాత్మకు భేదం లేదు. ఈ ఆత్మతత్త్వాన్ని బోధిస్తున్న గీతామాతకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.   జై గురుదేవ్ 🙏
9 likes
6 shares
#భగవద్గీత #🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸 🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸 #🙏 గురుమహిమ #గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు... #జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev *🌸ఓం వ్యాసదేవాయ నమః🌸* *🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి*🌹 *21. ఓం పరమ పవిత్రాయై నమః* లోకంలో జ్ఞానంతో సమానంగా పవిత్రమైనది మరి లేదు. ‘న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే’. జ్ఞానం మనలోని అజ్ఞానరూపమైన మాలిన్యాన్ని  పోగొట్టి, ఆత్మానురూపమైన అనుభూతి కలిగిస్తుంది. అయితే ఏది పవిత్రజ్ఞానం? రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్‌ । 9.2 విద్యలలోకెల్లా తలమానికం అయిన రాజవిద్య బ్రహ్మజ్ఞానం. అది రాజగుహ్యం, అనగా రహస్యాలలోకెల్లా రహస్యమైనది. పవిత్రమైనది. యజ్ఞ, దాన, తపః కర్మలు బుద్ధిమంతులను పవిత్రుల్ని చేస్తాయి అని భగవద్గీత తెలియజేస్తుంది. ద్రవ్యంతో చేసే యజ్ఞం కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞం ఎంతో శ్రేష్ఠమైనది. పరమ పవిత్రమైన, శ్రేష్ఠమైన ఈ జ్ఞానయజ్ఞం ఎలా చేయాలి? గీతలోని పవిత్ర సంవాదాన్ని ఆరాధనాపూర్వకంగా పఠిస్తూ, అర్థం చేసుకొని, ఆచరించేవారు జ్ఞాన యజ్ఞంతో నన్ను ఆరాధించినట్లే అని ఆ తండ్రి తెలియజేశారు. భగవద్గీత భగవంతుని వాక్కు కనక మిక్కిలి పవిత్రం అయినది. అది జ్ఞానగంగ. పవిత్ర గంగానది తన యందు మునిగిన మానవుల పాపాలను ప్రక్షాళన చేస్తున్నట్లే గీతాగంగ తన బోధలో మునిగిన వారిని పవిత్రులుగా చేస్తుంది. అట్టి పరమ పవిత్ర స్వరూపిణి అయిన శ్రీమద్భగవద్గీతామాతకు పూజ్యభావంతో ప్రణమిల్లుతున్నాను. జై గురుదేవ్ 🙏
13 likes
9 shares
#భగవద్గీత #🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸 🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸 #🙏 గురుమహిమ #గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు... #జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev *🌸ఓం వ్యాసదేవాయ నమః🌸* *🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి*🌹 *20. ఓం సాధు గమ్యాయై నమః* సద్భావమే సాధుభావం. సాధువు అనగా సజ్జనుడు. సాత్త్విక జీవనం,   ఉదార ప్రవర్తన గలవాడు సాధువు. (సాధువు అంటే సన్న్యాసి అని కాదు.) ఏ సాధు సత్పురుషులు ఏయే సాధనలు ఎలా చేసుకున్నా గీతామాతను చేరి, గీతాజ్ఞానం పొంది, తమ గమ్యాలకు చేరాల్సిందే. సాధు సత్పురుషులకు పరమగమ్యం శ్రీమద్భగవద్గీతే. గీతామృతమే వారిని అలా తీర్చి దిద్దుతుంది. అపి చేత్‌ సుదురాచారో భజతే మామనన్యభాక్‌ । సాధురేవ స మంతవ్యః సమ్యగ్‌ వ్యవసితో హి సః ॥ 9.30 మిక్కిలి దుష్కర్ముడు అయినప్పటికి అనన్యభక్తి గలవాడై నన్ను భజించినచో, అతడు స్థిరమైన మనోనిశ్చయం చేత సత్పురుషుడే అవుతాడు. అసాధువులను, దుష్టులను కూడా సత్పురుషులుగా మార్చగల మహా మహిమాన్విత గీతామాత. సత్పురుషులను మహాత్ములుగా, మహర్షులుగా తీర్చిదిద్దగల శక్తిసమేత భగవద్గీత. సాధు సత్పురుషులకు గమ్యస్థానమైన భగవద్గీతకు వినమ్రతతో వందనం చేస్తున్నాను. జై గురుదేవ్ 🙏
15 likes
10 shares
#భగవద్గీత #🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸 🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸 #🙏 గురుమహిమ #గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు... #జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev **ఓం శ్రీ గురుభ్యోనమః*🙏 *భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రం*! *ఆచరణాత్మక ఆధ్యాత్మిక ప్రభోధక్షేత్రం*! జయతి పరాశరసూనుః సత్యవతీ హృదయానందనో వ్యాసః యస్యాస్య కమల గలితం భారతమమృతం జగత్ పిబతి ॥ ఎవని ముఖపద్మం నుండి జాలువారిన సారస్వతామృతాన్ని జగత్తు ఆస్వాదిస్తున్నదో, అట్టి సత్యవతీ హృదయానందకరుడైన పరాశర తనయునికి జయమగు గాక! ధర్మం శాశ్వతమైనది, సమస్త విశ్వాన్నీ ధరించేది,ఆధారమైనది. *‘ధర్మో రక్షతి రక్షితః’* అన్నారు. ప్రపంచాన్ని నడిపేది, రక్షించేది ధర్మమే *‘ధర్మస్తు సాక్షాత్‌ భగవత్‌ ప్రణీతమ్‌’* - భగవంతుడు నిర్దేశించినదే నిజమైన ధర్మం. సాక్షాత్తు పరమాత్మ నుండి వెలువడిన వేదాలే ధర్మానికి మూలం. వేదార్థమైన జ్ఞానాన్ని, ధర్మాన్ని లోకాలలో ప్రతిష్ఠింప చేయటానికి పరమాత్మ వ్యాసావతారులై వేద విజ్ఞానాన్ని మానవాళికి అందచేశారు. ఈ ధర్మాన్నీ యుగాలకు, కాలానికి కాదు, ఆయా కాలాలలో ఉన్న మానవుని స్థితిని అనుసరించి వారికి తగ్గ ధర్మం నిర్దేశించబడింది. కలి అంటే చీకటి. ఈ కలి యుగంలో అజ్ఞానంతో మనిషి లోభంలో కూరుకు పోయి పతనమవుతాడని, లోభం నుండి బయట పడటానికి ధర్మాచరణే ఉత్తమ మార్గమని తెలియ చేశారు. మనకు పంచమవేదమైన మహాభారతం లో వ్యాస భగవానుల వారుల అన్ని ధర్మములను అందించారు. మనిషిని తరింపచేసే చతుర్విధ పురుషార్థాలను తెలియచేసి, అర్థ, కామములు రెండూ ధర్మాన్ని అనుసరించి ఉన్నట్లయితే మోక్షాన్ని తేలికగా చేరతారని తెలియచేసారు. *‘సత్య ధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం’* సత్య ధర్మాలను ఆచరించు వారిని మృత్యువు కూడా భయ పెట్టజాలదు. మనపై ఇంతటి అవ్యాజమైన ప్రేమ, కరుణ తో అనేక ధర్మాలను, జ్ఞానాన్ని అందించిన *"భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారి సనాతన ధర్మక్షేత్రము" యొక్క ముఖ్యమైన ఉద్దేశం.* మనిషికి తనలో ఉన్న దివ్యత్వాన్ని అనుభవానికి వచ్చేలా చేసి ప్రతిక్షణము ప్రతి పనిలోనూ దివ్య ప్రేమ అభివ్యక్తం అయ్యేలా మనిషిని మార్చటమే! మన రాబోయే తరాలకు ఈ అమూల్యమైన సంపదను అందించటమే వ్యాస ధర్మక్షేత్ర లక్ష్యం. మనకు అందిన ఈ లక్ష్యం, భగవంతుని సేవ అనే అపూర్వ అవకాశంలో భాగస్వాములమౌదాము. *ఋషి ఋణం నుండి మనం విముక్తలం అవుతూ అందరికి కూడా తెలియ చేద్దాము* తండ్రి🙏వ్యాస దేవా🙏 కృతజ్ఞతలు జై గురుదేవ్🙏
38 likes
44 shares