గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
302 Posts • 7K views
#భగవద్గీత #🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸 🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸 #జై శ్రీకృష్ణ భగవద్గీత శ్లోకములు🙏 #గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు... ఓం శ్రీ గురుభ్యోనమః🙏 ఓం వ్యాసదేవాయనమః🙏 *పూజ్య శ్రీ గురుదేవుల వారి అనుగ్రహంతో* ఈరోజు *సాయంత్రం 6:00* గంటలకు* ఈ క్రింది లింక్ ద్వారా https://join.freeconferencecall.com/bhagavadgitasatsang *పూజ్య శ్రీ గురుదేవులవారు అందించిన *కర్మ యోగం 4* సత్సంగ బోధ మనమందరం శ్రద్ధగా శ్రవణం చేద్దాము. మన పట్ల ప్రేమతో కరుణతో ఇంతటి అనుగ్రహాన్ని అందిస్తున్న పూజ్య శ్రీ గురుదేవులవారికి అమ్మకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ చేసుకుందాము.🙏 .... జై గురుదేవ్🙏
15 likes
9 shares
#భగవద్గీత #🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸 🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸 #జై శ్రీకృష్ణ భగవద్గీత శ్లోకములు🙏 #గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు... 🌸ఓం వ్యాసదేవాయ నమః🌸 *🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి🌹* *50. ఓం పరమజ్ఞాన ప్రదాయై నమః* నేను దేహాన్ని కాదని తెలిపి, పరాభక్తిని ప్రసాదించినప్పుడు ఇక్కడ నేను ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. తనను మించినది మరేదీ లేనిది పరమజ్ఞానం. దేనిని తెలుసుకొన్న పిదప మరల ఈ ప్రపంచంలో తెలుసుకోదగినది మరొకటి లేదో అదే పరమజ్ఞానం. దానిని గూర్చి పరమాత్మ భగవద్గీత 7వ అధ్యాయం విజ్ఞాన యోగంలో వివరించారు. పరమాత్మ కంటె వేరైనది ప్రపంచంలో లేనే లేదు. అంతా పరమాత్మ స్వరూపమే. పంచభూతాల సారం పరమాత్మే. సమస్త ప్రాణికోటులకు బీజ భూతుడు పరమాత్మే. (బీజం మాం సర్వభూతానాం విద్ధి). మాయచే ఆవరింపబడిన వారు  ఈ సత్యాన్ని తెలుసుకోవటం లేదు. భగవంతుని సేవించే వారు నాలుగు విధాలు. 1. ఆర్తుడు (ఆపదలో    ఉన్నవాడు), 2. జిజ్ఞాసువు (పరమాత్మను తెలుసుకొనగోరే వాడు), 3. అర్థార్థి (సంపద కోరుకొనేవాడు), 4. జ్ఞాని (ఆత్మ జ్ఞానం గలవాడు). ఈ నలుగురిలో ఆత్మజ్ఞానం గలవాడు శ్రేష్ఠుడు. జ్ఞానియే తనకు మిక్కిలి ఇష్టుడని పరమాత్మ చెపుతున్నారు. జ్ఞానికి నిత్య యుక్తత్వం, ఏకభక్తి ఉంటాయి. సర్వ కాల సర్వావస్థలలో పరమాత్మతో కూడి ఉండుటయే నిత్య యుక్తత్వం. ఏకైక పరమాత్మయందు మాత్రమే భక్తి కలిగి ఉండుట ఏకభక్తి. ఇంద్రియ నిగ్రహం, వాసనా క్షయం, ఆత్మానాత్మ వివేకం, నిది ధ్యాసన మొదలైనవి జ్ఞానయజ్ఞం అవుతాయి. ఈ జ్ఞానయజ్ఞం ద్వారా జ్ఞానం యోగంగా మారుతుంది. జ్ఞానం కర్మలన్నింటిని భస్మీపటలం చేస్తుంది.   న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే । 4.38 జ్ఞానం కన్న పవిత్రమైనది మరి లేదు. ఇట్టి పవిత్రమైన పరమజ్ఞానం నాకు ప్రసాదిస్తున్న గీతామాతకు వినమ్రతతో వందనం చేస్తున్నాను. జై గురుదేవ్ 🙏
14 likes
15 shares
#భగవద్గీత #🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸 🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸 #జై శ్రీకృష్ణ భగవద్గీత శ్లోకములు🙏 #గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు... 🌸ఓం శ్రీ గురుభ్యోనమః🌸 🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸 పూజ్య శ్రీ గురుదేవుల వారి అనుగ్రహంతో భగవాన్ శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రానికి రోజు చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది వచ్చినవారు ఎంతో భక్తి, విశ్వాసంతో ధర్మ క్షేత్రంలోని తత్వ దర్శినిలో నిత్యము జరిగే అష్టోత్తర శతనామావళితో శ్రీమద్భగవద్గీత ఆరాధన లో పాల్గొని, ఆరాధన అనంతరం ఇంతటి అనుగ్రహాన్ని అందించిన భగవంతునికి కృతజ్ఞత పూర్వక ప్రార్థన చేసుకోవడం జరిగుతుంది.ఆరాధన, ప్రార్ధన చేసుకుంటూ ఉన్నప్పుడు భక్తులు ఎంతో శాంతిగా, తృప్తిగా ఉంది అని వ్యక్తం చేయడం జరుగుతుంది. భక్తులు ధర్మక్షేత్రాన్ని దర్శించిన తర్వాత వారి అనుభవాన్ని ఈ విధంగా తెలియజేయడం జరిగింది👇 వారి అనుభవాన్ని ఈ వీడియో ద్వారా విందాము. సనాతన ధర్మాన్ని ప్రపంచానికి తెలియచేస్తూ, లోక కళ్యాణం కోసం, ధర్మ క్షేత్రాన్ని అందించిన సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపులైన పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం 🙏
15 likes
7 shares
#భగవద్గీత #🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸 🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸 #జై శ్రీకృష్ణ భగవద్గీత శ్లోకములు🙏 #గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు... 🌸ఓం వ్యాసదేవాయ నమః🌸 *🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి🌹* *49. ఓం పరాభక్తి ప్రదాయై నమః* 1. పరాభక్తి 2. అపరాభక్తి అనే రెండు భక్తి పద్ధతులు మన ముందున్నాయి. అపరా భక్తిపరుడు ఒక మూర్తి లేదా విగ్రహాన్ని ఆరాధిస్తూ తన భక్తిని వెల్లడిస్తాడు. యజ్ఞ యాగాదులు, పూజా పురస్కారాల వంటి రకరకాల పద్ధతులను పాటిస్తాడు. అది సగుణోపాసన. దేహాభిమానం గల వారికి, ఇంద్రియ నిగ్రహం అంతగా లేనివారికి సగుణోపాసన మిక్కిలి సులభంగా ఉంటుంది. ఇది అపరాభక్తి. నిర్గుణ పరమాత్మయందే మనస్సుని, బుద్ధిని స్థిరంగా నిలపటం పరాభక్తి. అపరాభక్తి కంటె పరాభక్తి క్లేశంతో కూడుకొన్నది. అవ్యక్త (నిర్గుణ) పరబ్రహ్మమునందు ఆసక్తి గలవారికి సగుణోపాసకుల కంటె ప్రయాస అధికం. దేహాభిమానం గలవారికి నిర్గుణ ఉపాసనామార్గం కష్టంగా ఉంటుంది అంటున్నారు పరమాత్మ. నిర్గుణ ధ్యానం కష్టమే గానీ మోక్షం పొందాలి అనుకొన్నప్పుడు సగుణ ధ్యానంతో అది సాధ్యం కాదు. నిర్గుణధ్యానం ద్వారానే మోక్షం పొందటం కుదురుతుంది. అనన్యభావంతో ఎవరైతే తనను ధ్యానిస్తున్నారో వారిని ఆ భగవానుడే ఉద్ధరిస్తున్నారు. ఎవరు సమస్తకర్మలను నా యందు సమర్పించి, నన్నే పరమగతిగా తలచినవారై, అనన్య చిత్తంతో నన్నే ధ్యానిస్తూ ఉపాసిస్తున్నారో, నాయందు చిత్తమును చేర్చిన అట్టివారిని ఈ సంసార సాగరం నుండి నేను శీఘ్రంగా, చక్కగా ఉద్ధరిస్తున్నాను అంటున్నారు పరమాత్మ. అట్టి పరాభక్తిని ప్రసాదిస్తున్న గీతామాతకు భక్తితో ప్రణామం చేస్తున్నాను. జై గురుదేవ్ 🙏
20 likes
8 shares