PSV APPARAO
575 views •
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఉత్తమగతికి సోపానం భీష్మ ఏకాదశి 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏 #జయ ఏకాదశి / భీష్మ ఏకాదశి విశిష్టత
*ఉత్తమగతికి సోపానం భీష్మ ఏకాదశి*
భీష్మ ఏకాదశినాడు చేయవలసిన విధివిధానాలు ఏమిటి అనే సందేహం వస్తుంది. సాధారణంగా ప్రతి ఏకాదశి నాడు చేసినట్టే ఉపవాస జాగరణాదులతో పాటు భీష్మ ఆరాధన కూడా చేయాలి. ఈ రోజు భీష్ముణ్ని ఆరాధిస్తే విష్ణువు సంతోషిస్తాడని పెద్దలు చెబుతారు. భగవంతునికి తన పూజ కన్న తన భక్తుల పూజ చేయడం ఎక్కువ ఇష్టమని అంటుంటారు. ఇక్కడ దానిని గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజున భీష్మారాధనతో మన లక్ష్యమైన ఉత్తమలోక ప్రాప్తి సాధించడంలో విజయులవుతారని అంటారు.
నేడు భీష్మ ఏకాదశి. భీష్ముడు విష్ణువులో ఐక్యమైన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి అయినందున ఈ ఏకాదశికి ముందు ఆయనకు గుర్తుగా భీష్మ అనే పేరు చేర్చారు. అంతేకాక ఆయన విష్ణు భక్తుడు. ఏకాదశి విష్ణువుకు ప్రీతికరమైన రోజు. అందువల్ల విష్ణు ప్రీతికరమైన ఆ రోజుకు ఆయన ప్రియ భక్తుడైన భీష్ముని పేరు పెట్టారు. నిజానికి ఈ ఏకాదశి పేరు జయ ఏకాదశి. దీనిని విష్ణు తిథి అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈరోజు ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయని దీనికి జయ ఏకాదశి అనే పేరు పెట్టారు. ఇంద్రుడు రాక్షసుల మీద ఈ తిథి నాడు యుద్ధానికి వెళ్లడం వల్ల ఆయన విజయం సాధించాడని, భృగు మహర్షి తన తపస్సులో విజయం సాధించి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాడని, అగస్త్యుడు మూడు గుక్కల్లో సముద్రాన్ని తాగి వేసినదీ ఈ తిథినాడేనని చెబుతారు. అయితే ఈ ఏకాదశినాడు చేయవలసిన విధి విధానాలు ఏమిటి అనే సందేహం వస్తుంది. సాధారణంగా ప్రతి ఏకాదశి నాడు చేసినట్టే ఉపవాస జాగరణాదులతో పాటు భీష్మ ఆరాధన కూడా చేయాలి. ఈ రోజు భీష్ముణ్ని ఆరాధిస్తే విష్ణువు సంతోషిస్తాడని పెద్దలు చెబుతారు. భగవంతునికి తన పూజ కన్న తన భక్తుల పూజ చేయడం ఎక్కువ ఇష్టమని అంటుంటారు. ఇక్కడ దానిని గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజున భీష్మా రాధనతో మన లక్ష్యమైన ఉత్తమ లోక ప్రాప్తి సాధించడంలో విజయుల వుతారని అంటారు.
ఇక్కడ భీష్ముని గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. భీష్ముడు అష్ట వసువులలో ఒకడనే విషయం తెలిసిందే. శాపవశాన గంగా దేవి కుమా రునిగా భూమిపై అవతరించాడు. ఆయన మహా వీరుడు. విష్ణువు అవతారమైన పరశురాముడే యుద్ధంలో ఆయనను ఓడించలేకపోయాడు. ఇక ఆయన పట్టుదలకు మారు పేరు. ప్రతిజ్ఞ చేశాడంటే ఇక వెనక్కు తగ్గేది లేదు. అందుకే తండ్రికి ఇచ్చిన మాట కోసం తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయాడు. ఆయన తాను పరమాత్మగా భావించే కృష్ణుని మాదిరి ధర్మ పక్షపాతి.
ఇక ఆయన నోటి నుంచే ఈనాడు ఎక్కువ మందికి సుపరిచితమైన అమోఘమైన విష్ణు సహస్రనామం వచ్చింది. అనుశాసనిక పర్వంలో భీష్మ యుధిష్ఠిర సంవాదంలో ఇది ఒక భాగమని విజ్ఞులు చెబుతారు. కృష్ణుని నవ్వు రాజిల్లెడి మోము చూస్తూ దైవ కృపతో ఆయన ఈ సహస్రనామాలు చెప్పాడని అంటారు.
భీష్ముడు మనకు ఎన్నో విషయాలు చెప్పారు. ధర్మంగా ఉండాలని, ఆడిన మాట తప్పకూడదని. శంతనునికి పిండాలు సమర్పించేసందర్భంలో ఆయన శాస్త్ర వాక్యానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి శంతనుని చేతిలో పిండం పెట్టక పోవడం ఆయన ధర్మనిరతికి సంకేతం. అంతేకాక తన ప్రతిజ్ఞతో, మానవుడై నవాడు ప్రతిజ్ఞ చేస్తే ఎలా దానిని నిలబెట్టుకోవాలో తన జీవితంతో చేసి చూపారు. అయితే తప్పుడు ప్రతిజ్ఞలు చేసి వాటిని నిలబెట్టుకోవడం కాదు. ఆ ప్రతిజ్ఞ కూడా ఒక ధర్మం కోసం చేశాడు. తన తండ్రి సుఖం కోసం ఆయన ఆ ప్రతిజ్ఞ చేశాడు. ఇవి కాక ఆయన చేసి చూపిన మరో బోధ ఎట్టి పరిస్థితిలోనూ బేలతనం పనికి రాదని, యుద్ధంలో ధర్మం పాండవుల పక్షాన ఉన్నాడని ఆయనకు తెలుసు. విష్ణు స్వరూపుడైన కృష్ణుడు అటు వైపున్నాడని తెలుసు. తాము ఓటమి పాలవుతామని తెలుసు. (ఈ విషయం చాలా మార్లు దుర్యోధనునికి తెలిపాడు) అయినా భీరువులా చేతులు ముడుచుకు కూర్చోలేదు. తన వంతు కృషిగా యుద్ధం చేశాడు. ఇది కూడా కృష్ణుడు గీతలో చెప్పిందే. ఫలితం ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నిర్వహించు అనే నీతి దీనిలో మనకు కనిపిస్తుంటుంది.
భీష్మస్తుతిలో కూడా ఆయన మనకు ఒక సందేశం చెప్పారు. కాలం ఎంత బలీయమైనదో వివరించారు. ఎంతటి వారికైనా కష్టాలు తప్పక పోవచ్చనే విషయం ఆయన ఆ సందర్భంగా చెప్పారు. భీష్మ స్తుతిలోని ఈ పద్యం ఆ విషయం చెబుతుంది. అది
'రాజట ధర్మజుండు, సురరాజసుతుండట
ధన్వి శాత్రవోద్వేజకమై గాండీవము
విల్లుట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట
యుగ్ర గదాధరుడైన భీముడయ్యాజికి
దోడు వచ్చునట యాపద గల్గుటిదేమి చోద్యమో
ఉప పాండవులను అశ్వత్థామ చంపి వేసిన విషయానికి సంబంధించినదీ శ్లోకం. దీని అర్థం ప్రస్తుతం రాజు ధర్మరాజు, సాక్షాత్తు దేవతల రాజైన ఇంద్రుని కుమారుడు (అర్జునుడు) ధర్మజునికి తమ్ముడు. అతని చేతిలో ఉన్నది చూచినంతనే శత్రువులు భయకంపితమయ్యే గాండీవం. ఇకసారధి అంటారా అన్నిటినీ నడిపే సమర్థుడైన చక్రి, ఉగ్ర గదాధరుడైన భీముడు (ఏనుగులను తొండం పట్టి ఆకాశ వీధిలోకి ఎగరేసే వాడంటారు మరో చోట) అతనికి తోడుగా ఉంటాడట. ఇటువంటి బలవంతుల మధ్య ఉన్న ఉప పాండవులు చనిపోయారే కాలం ఎంత బలవత్తరమైనదో కదా అని ఆ విషయాన్ని ఆయన వివరించాడు. అంటే కాలం ఎవరికీ బంధువు కాదు. దానికి స్వపర భేదా లుండవు అనేది ఆయన మనకు బోధించాడు.
ఇక కృష్ణునిపై ఆయనకున్న భక్తి అసమానం. చక్రం పట్టిస్తానన్న తన శపథం నెరవేర్చేందుకు ఆయన చక్రం పట్టాడని ఆయనకు తెలుసు. అయితే చక్రం పట్టడం కూడా ఆయన మరో భక్తునికి ఆపద తప్పించడానికనే విషయం గ్రహించారు. ఒక భక్తుని శపథం నెరవేర్చేందుకు చక్రం పట్టాడు. మరొక భక్తుణ్ని భీష్ముడి వాడి బాణాల నుంచి కాపాడేందుకు చక్రం పట్టాడు. పర మాత్మకు భక్తుల పట్ల ఉన్న ప్రేమను ఈ ఘట్టం వెల్లడిస్తుంది. ఎన్నో విధాలుగా భీష్ముడు మనకు ఆదర్శప్రాయుడు.
ఈ భీష్మ ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా అంటుంటారు. భీమ అనేది గట్టితనం అనే అర్థాన్ని సూచిస్తుందని, ఈ ఏకాదశిని అంత గట్టిగా ఆచరిం చాలన్నదే దాని ఉద్దేశమని కొందరి అభిప్రాయం.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
16 likes
11 shares