పుణ్య క్షేత్రం
5 Posts • 519K views
#పుణ్య క్షేత్రం #హిందూ పుణ్యక్షేత్రాలు.. 🙏 #చూడాల్సిన పుణ్యక్షేత్రాలు. పురాతన కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, తెలంగాణ. -------- • తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కీసర గుట్టలో రామునిచే ప్రతిష్టించబడిన శివాలయం ఉంది. • సామాన్య శంకం పూర్వం 100వ శతాబ్దం నుంచే ఈ ప్రాంత చరిత్ర ఉంది. ఇక్కడ 5వ శతాబ్దానికి చెందిన తెలంగాణ రాష్ట్ర మొదటి శాసనం దొరికింది. • ఈ ఆలయంలో శివ లింగాన్ని రాముని చేత ప్రతిష్టించబడింది. ఈ ఆలయానికి పురాణ కథ ఉంది. ఆంజనేయునికి వరం ఇచ్చినా రాముడు ఆయన తండ్రి పేర కీసరగుట్టగా ఈ ప్రాంతానికి పేరు పెట్టారు. • ఇక్కడి రాతి బండపై అనేక శివ లింగాలు ఉన్నాయి. మెట్ల మార్గం ఉంది. ప్రాచీన కట్టడాలు అనేకం ఇక్కడ ఉన్నాయి. • ఇక్కడ శివుడు ప్రధాన దైవం కాగా, అనేక ఇతర ఆలయాలు ఉన్నాయి. పార్వతి, వినాయక, భారీ నంది, వీరభద్ర తదితర విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. • పురావస్తు తవ్వకాలలో ఇక్కడ అనేక కట్టడాలు, విగ్రహాలు బయట పడ్డాయి. ఇక్కడ ఒకనాడు జైనం, బౌద్ధం మతాలు విరాజిల్లాయి. • ఇక్కడ ముఖద్వారం, భారీ ఆంజనేయుడు విగ్రహం, ఆలయం బయట శివ మూర్తి, నంది విగ్రహం, తదితర నిర్మాణాలు ఉన్నాయి. • ఈ ప్రాంతం విష్ణుకుండిని కాలానికి సంబంధించింది(సా.శ 4-7 శతాబ్దం). ఇక తానీషా కాలంలోనూ ఈ ఆలయం అభివృద్ధి చెందింది. ఇక్కడి పరిసరాల్లో అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. • తెలంగాణలో ప్రముఖ పురాతన ఆలయాల్లో ఒకటి అయిన కీసరగుట్టలో మహా శివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
12 likes
13 shares