సీత రాముడు🙏

13 Posts • 32K views
*శ్రీ రామ నామం* ఏ నామం అయినా పలికితే ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు. అదే శ్రీ రామ అనే నామంలో రాముడు ఒక్కడే పలుకుతాడు అనుకోవడం పొరపాటు. *శ్రీ రామ* అనే నామం జపిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట.అదెలాగో చూద్దాం. 1⃣ రామ అంటే *రాముడు* పలుకుతాడు తెలిసిందే 2⃣ రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందర వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది నిస్సందేహంగా ఆ *హనుమంతుడే* 3⃣ *శ్రీ* అంటే *లక్ష్మి* 4⃣ *రా* అంటే *విష్ణువు* (ఓం నమో నారాయణాయ అనే నామం లో నుంచి రా అనే జీవ అక్షరం తీసుకున్నారు) 5⃣ *మ* అంటే *శివుడు* (ఓం నమః శివాయ అనే నామం లో నుంచి మ అనే జీవ అక్షరం తీసుకున్నారు) 6⃣ శివుడు హనుమంతుడి రూపం లో భూలోకానికి రామ సేవ కోసం వస్తున్నప్పుడు పార్వతీ దేవి నాకు ఆ అదృష్టం కావాలి అన్నారట. అపుడు శివుడు ఇలా అన్నాడు ఈ అవతారం లో హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని పటిస్తాడు కనుక నిన్ను తీసుకెళ్లడం కుదరని పని. అపుడు పార్వతీ దేవి అయితే నేను మీ తోక రూపంలో వస్తాను అని హనుమంతుడి తోక లో ప్రవేశించింది అట. మరి రామ అన్నపుడు హనుమ వస్తే *పార్వతీ* కూడా వచ్చింది కదా. రాముడు, హనుమంతుడు, లక్ష్మి, విష్ణువు, శివుడు, పార్వతీ ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదించగలరు. గమనించండి. *శ్రీ రామ శ్రీ రామ* అని అంటూనే వుందాము. మన ఈ మానవ జన్మ తరింద్దాము.🕉👏🌷 ఓం జై శ్రీరామ్ 🕉🌷👏🕉🕉 #🚩జై శ్రీరామ 🕉️ #జై శ్రీరామ #🏹 జై శ్రీ రామ్! #🙏రామ నవమి శుభాకాంక్షలు🌸 #🙏సీతారాములు
6 likes
4 shares
సీతాదేవి గుణగుణాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.............!! స్త్రీ పాత్ర ‘సీత' లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు ఊహించలేము. కాబట్టే రామాయణ ఇతిహాసంలో ఆమె పాత్రపై ఎందరో మహానుభావాలు మరియు మేథావులు పరిశోధనలు కూడా చేశారు. సీతలోని సుగుణాలు నేటి మగువలకు ఎంతో ఆదర్శం. ఆమె చరితం ఓ స్ఫూర్తిదాయకమైన కథాసాగరం. రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సీత గుణగుణాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి... * ధర్మమూర్తి సీత ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గృహిణిగా మారిన మహాసాధ్వి ‘సీతాదేవీ'. రాముడు తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి అరణ్యవాసానికి వెళ్లినప్పడు తన భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్దమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. * దయాశీలి పేదవారిని ఆదరించి అన్నం పెట్టాలన్న దయాగుణం గల స్త్రీమూర్తి సీత. అదే భావనతో తనింటికి మారువేషంలో బిక్షాటన వచ్చిన రావణుడికి లక్ష్మణరేఖ దాటి మరీ భిక్షం వేసిన దయామూర్తి ఆమె. తన రక్షణ కోసం పెట్టుకున్న నియమం కన్నా దానమే గొప్పదన్న నీతిని ఆమె ఈ సందర్భంలో వెల్లడిస్తున్నది. * ధైర్యశాలి పాతివ్రత్య నిరూపణ కోసం సీతను అగ్నిప్రవేశం చేయమని రాముడు అడిగినప్పుడు ధీరత్వంతో ఆ పనికి సిద్ధమైన ధైర్యశాలి సీత. రాముని మాటలు ఆమె గుండెను గాయపరిచినా సహనంతో భరించింది. తానే తప్పు చేయలేదన్న ఆమె ఆత్మవిశ్వాసం చివరికి నిందారోపణ చేసిన వారిని సైతం తలదించుకునేలా చేసింది. * అభిమానవతి సీతకు ఆత్మాభిమానం ఎక్కువ. చిత్రకూటానికి సీతారాములు వచ్చారని తెలిసి, ఆమె తండ్రి జనకుడు వారిని కలిసి వనవాసం పూర్తయ్యేదాకా మిథిలా నగరానికి వచ్చి తనతో పాటు ఉండమని కోరినప్పుడు, ఆ మాటలను సున్నితంగా తిరస్కరించిన ఆత్మాభిమాని సీత. మెట్టినింటి కొచ్చాక ఎన్ని విషమ పరిస్థితులు ఎదురైనప్పటికీ తమే పరిష్కరించు కోవాలి గానీ, పుట్టింటి వారిని ఇబ్బంది పెట్టకూడన్న అభిమానవతి సీత. * వివేకవంతురాలు రావణాసురుడు తనను అపహరించి తీసుకెళ్లిపోతున్నప్పుడు, రాముడికి తన ఆనవాళ్లు చిక్కడం కోసం బంగారునగలను నేల మీద జారవిడిచిన వివేకవంతురాలు సీత. * ప్రేమమూర్తి సీతకు రామునిపై ఎంతటి ప్రేమానురాగాలంటే..ఆ ప్రేమలో తనను తానే మైమరిచిపోయేది. రావణుడి చెరలో బందీగా ఉండి కూడా నిత్యం శ్రీరామనామస్మరణ చేస్తూ అనుక్షణం పతి క్షేమాన్ని కోరేది. * చైతన్యశీలి సీత ఎంత చైతన్యశీలి అంటే అపాయంలో కూడా భయంతో ఆమె శత్రువులకు లొంగలేదు. రావణడు సీతను బెదిరించి, తన వశం కావాలని ఆదేశించినప్పుడు, ఒక గడ్డిపరకను అడ్డంగా పెట్టుకొని నువ్వు నాకు దీనితో సమానం అని చెప్పకనే చెప్పి అతని ధర్మహీనతను ప్రశ్నించిన ప్రజ్ఝావంతురాలామె. * క్షమాగుణం రాక్షస సంహారం తర్వాత సీతను అవోకవనం నుంచి విడిపించి తీసుకువెళ్తున్న సమయంలో, తను బందీగా ఉన్నప్పుడు ఆ వనంలో తనను మాటలతో హింసించిన రాక్షసులకు ఏ కీడు తలపెట్టవద్దని, వారు స్వామిభక్తితో తమ బాధ్యతను మాత్రమే నిర్వర్తించారని హనుమంతునితో చెప్పిన క్షమాగుణం సీత సొంతం. * ఆదర్శమూర్తి అడవిలో ఆశ్రమవాసిగా కాలం గడుపుతూ కూడా తన కుమారులను ప్రయోజకుల్ని చేయాలని ఎల్లవేళలా తపిస్తూ, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడం ఆమె ఉత్తమ పెంపకానికి నిదర్శనం. #తెలుసుకుందాం #🙏సీతారాములు #🏹 జై శ్రీ రామ్! #జై శ్రీరామ #🙏రామ నవమి శుభాకాంక్షలు🌸
7 likes
9 shares
రామ నామం విశిష్టత.......!! శ్రీరామ జయరామ జయ జయరామ..!! శ్రీరాముడి కంటే శ్రీరామ నామం గొప్పది అనడం వెనక ఆంతర్యము.. "రామ"..! ఈ మంత్రానికి అత్యంత శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. ఈ మంత్ర జపం వల్ల.. అన్ని సమస్యలు దూరమవుతాయని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ నామంలో కలిగిన రాముడి కంటే..కూడా రామ నామమే గొప్పదని చాలా కథలు మనకు చెబుతూ ఉంటాయి. అసలు రాముడితో పుట్టిన రామ నామం రాముడి కంటే ఎందుకు గొప్పది అయింది.. రామ నామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు.. జీవితం సాఫీగా సాగుతుందని వివరిస్తుంది. చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం సహాయపడుతుంది. కాబట్టి అత్యంత శక్తివంతమైన రామనామాన్ని జపిస్తూ ఉండాలి. వాలి అపహరణ నుండి సుగ్రీవుడు తన భార్యను ఎలా రక్షించుకొన్నాడు భగవన్నామ స్మరణకు మించిన సాధన కలియుగంలో మరొకటి లేదని శాస్త్రాలు చెబుతాయి. అలాగే ప్రతి దేవుడి నామస్మరణలో అద్భుతమైన శక్తి, మహిళ ఉంటుంది. మన హిందువులకు ఉన్న ఏడుకోట్ల మహామంత్రాలలో రెండు అక్షరాల రామ మంత్రానికి ఉన్న విశిష్టత మరే మంత్రానికి లేదు. ఇంతటి మహిమాన్విత శక్తి కలిగిన రామ నామం విశిష్టత, రామ నామం గొప్పదనం, రామనామం శక్తి సామర్థ్యాలను తెలుసుకుందాం.. రామ నామం పుట్టుక.. తారక మంత్రంగా పిలిచే రామ మంత్రం.. రెండు మహా మంత్రాల నుంచి పుట్టింది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో రా..అనే అక్షరం జీవాక్షరం. అలాగే ఓం నమ: శివాయ అనే పంచాక్షరి మంత్రంలో మ..అనేది జీవాక్షరం. అంటే.. ఈ రెండు మంత్రాలలో జీవాక్షరాలు తొలగిస్తే.. అర్థం ఉండదు. అందుకే.. ఈ రెండు మంత్రాల నుంచి తీసిన రా, మ అనే అక్షరాల ద్వారా రామ అనే నామం వచ్చింది. ఈ రెండు అక్షరాలు లేకపోతే.. ఆ రెండు మహామంత్రాలకు విలువ ఉండదు. అందుకే ఈ రెండు జీవాక్షరాల సమాహారంగా రామ అనే నామం లేదా మంత్రం పుట్టింది. శివకేశవ మంత్రం.. ఓం నమో నారాయణాయలో రా, ఓం నమ: శివాయలో మ అనేవి జీవాక్షరాలు. అందుకే శివకేశవుల అత్యంత శక్తి కలవడం వల్ల రామ అనే మంత్రం అత్యంత శక్తివంతమైంది. అందుకే ఈ మంత్రాన్ని హరిహరతత్వం కలిసిన మహామంత్రమని పిలుస్తారు. రాముడి కంటే రామనామం గొప్పది. లంకపై దండెత్తడానికి రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తారనే సంగతి అందరికీ తెలుసు. అయితే.. రాయిపై రామ అని రాసి నీటిలో వేయడం వల్ల ఆ రాయి పైకి తేలుతూ ఉంది. ఇదంతా చూస్తున్న శ్రీరాముడికి.. తన పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా.. తానే రాయి వేస్తే అనే ఆలోచన వచ్చింది. తనకు వచ్చిన ఆలోచనతో రాముడు ఒక రాయి తీసి సముద్రంలోకి విసిరాడు. కానీ.. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. రాముడు ఆశ్చర్యపోయాడు. తాను వేసిన రాయి మునిగిపోవడంతో రాముడు వెంటనే తన పక్కన ఉన్న హనుమంతుడిని అడిగాడు. అప్పుడు హనుమంతుడు.. రామ అనే మంత్రం రాసిన రాళ్లే పైకి తేలుతాయి. మీరు వేసిన రాయిపై రామనామం లేదు కదా.. అందుకే మునిగిపోయిందని హనుమంతుడు వివరించాడు. ఇలా రాముడి కంటే.. రామ నామం ఎంతో బలమైనది, శక్తివంతమైనది, విశిష్టమైనదని భావించడం మొదలుపెట్టారు. రామ నామం అర్థం.. రామ అనే మంత్రంలో ర, అ, మ అనే అక్షరాలున్నాయి. ర అంటే అగ్ని, అ అంటే సూర్యుడు, మ అంటే చంద్రుడు అని అర్థం. అంటే రామ అనే మంత్రంలో ఈ లోకానికి మూలమైన మూడు శక్తులున్నాయని వివరిస్తుంది. రామ నామ జపం విశిష్టత.. రామ అనే పలికేటప్పుడు రా అనే అక్షరాన్ని నోరు తెరుచుకుని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నికి ఆహుతి అవుతాయి. అలాగే మ అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయటి పాపాలని మనలోకి ప్రవేశించవని వివరిస్తుంది. విష్ణుసహస్రనామం.. రామ రామ రామ అని మూడు సార్లు జపం చేస్తే.. విష్ణు సహస్ర నామం చేసినంత ఫలితం లభిస్తుందట. రామ నామ మంత్రం.. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే 13 అక్షరాల నామమంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందట. సమర్థరామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి.. రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ నామజపం మంచి ఫలితాన్నిస్తుంది. శనీశ్వరుడినే జయించిన రామనామం.. పూర్వం ఒకసారి హనుమంతుడిని కష్టాలపాలు చేయాలని శనీశ్వరుడు అతని దగ్గరకు వచ్చాడు. అప్పుడు హనుమంతుడు రామనామం జపిస్తున్నాడు. శనీశ్వరుడు హనుమంతుడికి విషయం చెప్పగా.. తాను రామనామ జపంలో ఉన్నానని... అది పూర్తయిన తర్వాత రమ్మని చెప్పాడు. శనీశ్వరుడు ఎంతసేపు నిరీక్షించినా.. రామనామ జపం పూర్తవలేదు. దీంతో.. శనీశ్వరుడు.. రామనామం జపించేవాళ్ల దరిచేరడం కష్టమని వెనక్కి వెళ్లిపోయాడు. కాబట్టి రామ నామాన్ని జపించేవాళ్లకు శనిబాధలు ఉండవు. శ్రీరాముని యొక్క శ్రీ రామ నామం జపించడం కానీ శ్రీ రామకోటి ని రాయడం కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. మన పురాణాల్లో " ఆది కావ్యం గా "చెప్పబడుతున్న వాల్మీకి మహర్షి యొక్క "శ్రీరామాయణం" లో చెప్పబడింది. రామ నామం యొక్క గొప్పదనం శ్రీ రామాయణం లో అడుగు అడుగున చెప్పబడుతుంది. అసలు శ్రీ రాముని కంటే ముందు రామ నామం ఆవిర్భవించింది. అంత గొప్పది శ్రీరామ నామం . ఈ నామాన్ని చిన్నపిల్లల నుంచి వృద్ధులు వరకు జపించవచ్చు స్మరించవచ్చు రాయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సకల చరాచర సృష్టికి ఆది దేవుడు అయినా "శివపరమాత్ముడు" నిత్యం రామనామం జపిస్తారు అంత గొప్పది. " రామ నామం" అందుచేత యావన్మంది భక్తకోటి రామ నామం యొక్క గొప్పతనం తెలుసుకొని రామకోటి రాయండి. జపించండి మీకు శ్రీరాముని యొక్క కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి. #🙏రామ నవమి శుభాకాంక్షలు🌸 #🚩జై శ్రీరామ 🕉️ #జై శ్రీరామ #🏹 జై శ్రీ రామ్! #🙏సీతారాములు
13 likes
13 shares