hindu temples

1K Posts • 504K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
815 views 22 days ago
నాగనాథస్వామి ఆలయం, తిరునగేశ్వరం......!! రాహువుకు చెందిన ఈ ఆలయం తమిళనాడులోని తొమ్మిది నవగ్రహ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం కుంబకోణం నగర౦ నుండి తూర్పు దిక్కున 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరునగేశ్వరంలో ఉంది. ఈ ఆలయం తన సహచరి గిరి గుజాంబిక (పార్వతి) తో కలసి ఉన్న నాగనాథస్వామి (శివుడు) కు చెందినది. ఈ దేవత రెండు ప్రక్కల సరస్వతి, లక్ష్మీదేవి ఉన్నారు. ఈ ఆలయంలో తన ఇద్దరు భార్యలు నాగకన్ని, నాగవల్లి లతో కూడిన రాహు భగవానుని సందర్శకులు చూడవచ్చు. రాహువు ఒక శాపం నుండి విముక్తి పొందటానికి ఈ ఆలయంలో శివుని పూజించాడు. ఇతర దేవాలయాలలో రాహువు సర్పముఖాన్ని కల్గి ఉండి నాగనాధ్ స్వామి ఆలయంలో మానవ ముఖాన్ని కల్గి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలో కొన్ని మండపాలు, బురుజుల గోపురాలు, ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. కోట గోడల్లా ఉండి, బయటి ప్రాకారాలతో కలసి ఉన్న 4 ప్రవేశ బురుజులను చూడవచ్చు. రాహుభగవానుని విగ్రహం నైరుతి మూలలో ఉంది. ఈ ఆలయంలో దక్షిణం వైపున 4 మండపాలతో కూడి చుట్టూ రథం రూపంలో 100 స్థూపాల మండప౦ ఉన్న ఒక చెరువును చూడవచ్చు. ఈ ఆలయ నిర్మాణం చోళుల శైలిని పోలి ఉంటుంది. క్షీరాభిషేకం సమయంలో రాహువు విగ్రహంపై పోసిన పాలు నీలిరంగులోనికి మారి ప్రతి ఒక్కరికి కనబడటం ఈ ఆలయం లోని ఒక ముఖ్య లక్షణ౦. మన పురాణాల్లో నాగపాములకు ప్రత్యేక స్థానం. నాగలోకం, నాగినీలు నాగదేవలు, నాగమణి ప్రస్తావన వినిపిస్తూనే ఉంటుంది. అయితే అవన్నీ ఒట్టి ట్రాష్ అంటూ కొట్టిపడేసే హేతువాదులు ఉన్నారు.. అయితే సైన్స్ కు అందని వింతలూ శాస్త్రజ్ఞులు చెందించని రహస్యాలు ఉన్న దేవాలయాలు భారత దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి రాహు ఆలయం. ఈ ఆలయంలో నాగదోషంతో బాధపడేవారు రాహుకాలంలో పాలు పోస్ట్.. నీలి రంగులోకి మారి.. కిందకు జారిపడిన తర్వాత మళ్ళీ తెల్లని పాల రంగులోకి మారతాయి.. నాగ దోష పరిహారం చేసే ఒకే ఒక్క ఆలయంగా ప్రసిద్దిగాంచినది ఈ ఆలయం ఈ ఆలయంలో ప్రధానంగా పూజలను అందుకుంటున్నది రాహువు. గర్భాలయంలో నాగరాజు రావుతో మండపంలో తన భార్యలైన నాగరాజ సింహ, చిత్రరేఖలతో రాహువు కొలువై ఉన్నాడు. ఈ గుడికి రాహు , నాగ దోషం ఉన్నవారు విశేష పూజలను నిర్వహిస్తారు. మరొక విశేషం ఏమిటంటే ‘ రాహుకాలం ‘ లో పాలాభిషేకం చెయ్యడం. రాహువు కి పాలాభిషేకం చెయ్యడం వలన తమకు ఉన్న ‘ రాహుగ్రహ ‘ దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఇలా రాహు కాలంలో రాహుభగవాన్ కి పాలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాలు కంఠం నుండి దిగగానే ” గొంతు వద్ద నీలం రంగు గా మారుతుంది. అనంతరం ఆ పాలు నేలపై పాడినప్పుడు తెల్లగా కావడం విశేషం. ఈ వింతను చూడడానికి రాహుకాలంలో భారీ సంఖ్యలో హాజరవుతారు. ఇలా పాలు నీలి రంగులోకి మారడానికి కారణం. నాగమణి అని పురాణాల కథనం. ఈ నాగమణి గురించి విష్ణు పురాణం, గరుడపురాణంలో కూడా ఈ నాగమణి ప్రస్తావన వుందంట. ఆలయానికి ఎలా వెళ్లంటే? మరి ఎంతో మహిమాన్వితమైన ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లాలంటే శనివారం ఉదయం 11కి లేదా ఆదివారం సాయంత్రం 4-6 మధ్యలో వెళ్ళాలి. హైదరాబాదునుండి అనంతపురం, బెంగుళూరు మీదుగా 16 గంటల పడుతుంది. చెన్నై మీదుగా ఒక రోజు పడుతుంది. #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి
23 likes
12 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
557 views 27 days ago
శని దోషాలను హరించే తిరునల్లారులో... దాగివున్న మహా నిధి "మరకత లింగం" ​హృదయంలో ఈశ్వరుడి ధ్యానంతో... ​పుదుచ్చేరి, కారైకాల్ సమీపంలో ఉన్న తిరునల్లారు దర్భారణ్యేశ్వర స్వామి దేవాలయం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది శనీశ్వర భగవానుడే. కానీ, ఈ ఆలయంలోని ప్రధాన మూలవిరాట్ అయిన దర్భారణ్యేశ్వరుని సన్నిధికి సమీపంలో, ముచుకుంద చక్రవర్తిచే ప్రతిష్ఠించబడిన ఒక అరుదైన "మరకత లింగం" (త్యాగరాజ సన్నిధి) ఉందనే విషయం చాలామందికి తెలియదు. ​ఈ లింగానికి సంబంధించిన ఆధ్యాత్మిక రహస్యాలు ఇవిగో. ​ఇంద్రుడు ఇచ్చిన కానుక: దేవేంద్రునిచే పూజించబడి, ఆ తర్వాత ముచుకుంద చక్రవర్తికి బహుకరించబడిన అత్యంత పవిత్రమైన విడంగ లింగాలలో (స్వయంభూ లింగాలు) ఇది ఒకటి. ​అభిషేక అద్భుతం: ఈ మరకత లింగానికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో విశేష అభిషేకాలు జరుగుతాయి. ముఖ్యంగా, ఈ లింగానికి చేసే 'పన్నీటి అభిషేకం' ఎంతో ప్రసిద్ధి చెందింది. మరకత శిలపై పన్నీరు జారి పడేటప్పుడు కలిగే ఆధ్యాత్మిక వైబ్రేషన్స్ (కంపనాలు) మానసిక ఒత్తిడిని, ఆందోళనలను దూరం చేసే శక్తిని కలిగి ఉంటాయి. ​ప్రదోష పూజ మహిమ: ప్రదోష రోజుల్లో ఈ మరకత లింగాన్ని దర్శించుకోవడం వల్ల కోటి పుణ్యాలు లభిస్తాయని చెబుతారు. ఏల్నాటి శని, అష్టమ శని వంటి శని దోషాల తీవ్రతను తగ్గించి, శుభప్రదమైన జీవితాన్ని ప్రసాదించే శక్తి ఈ పూజకు ఉంది. ​బుధ-శని కలయిక ఫలితం: తిరునల్లారు ప్రధానంగా శని క్షేత్రం అయినప్పటికీ, బుధునికి సంబంధించిన రత్నమైన మరకత (పచ్చ) లింగం ఇక్కడ కొలువై ఉండటం ఒక అరుదైన ఆధ్యాత్మిక కలయిక. ఈ లింగాన్ని పూజించడం వల్ల వ్యాపారంలో అడ్డంకులు తొలగి, భారీ లాభాలు చేకూరుతాయని, అలాగే బుద్ధి కుశలత (తెలివితేటలు) పెరుగుతాయని నమ్మకం. ​తిరునల్లారు వెళ్లే భక్తులు కేవలం శని భగవానుడిని మాత్రమే దర్శించుకుని తిరిగి రాకుండా, గర్భగుడిలో కొలువై ఉన్న ఈ దివ్యమైన మరకత లింగాన్ని కూడా దర్శించుకుని, స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి! #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳
13 likes
11 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2K views 1 months ago
శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఏ దేవాలయానికి వెళ్లకూడదంటారు.. ఎందుకు? తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు దర్శనం పూర్తికాగానే తిరుమల దగ్గరలో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకొంటారు. అవి పాపనాశనం, కాణిపాకం.. చివరగా శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి దర్శించుకున్న తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదంటారు. అలా వెళితే అరిష్టం అని హిందు సాంప్రదాయంలో చెప్పబడింది. శ్రీకాళహస్తి దేవాలయమే ఎందుకు చివరగా దర్శించుకోవాలి. మరే గుడికి ఎందుకు వెళ్లకూడదు. వెళ్తే ఏమవుతుంది? శ్రీకాళహస్తి దర్శనం తరువాత నేరుగా ఇంటికే ఎందుకు వెళ్ళాలి? పంచ భూతాల నిలయమైన ఈ విశ్వంలో (గాలి, నింగి, నేల, నీరు, నిప్పు) వాటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిసాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి లోని శ్రీకాళహస్తీశ్వరగా వెలసిన వాయులింగం. అయితే ఇక్కడి గాలిని తగిలిన తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదు అనేది ఇక్కడి ఆచారం. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా తొలగుతాయని చెబుతారు. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణేశ్వరుని దర్శనంతో కాలసర్పదోషం తొలుగుతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న వారు నేరుగా ఇంటికే వెళ్లాలని చెబుతారు ఇక్కడి పూజారులు. కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లినా దోష నివారణ జరగదని ఇక్కడి విశ్వాసం. గ్రహణాలు, శని బాధలు పరమశివుడికి ఉండవని మిగతా అందరు దేవుళ్ళకు శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని పురాణాలలో ఉంది. ఇందుకు నిదర్శనంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దేవాలయంతో సహా మిగిలిన అన్ని దేవాలయాలు దేశవ్యాప్తంగా గ్రహణ సమయంలో మూసివేస్తారు. గ్రహణ అనంతరం సంప్రోక్షణ జరిపిన తరువాతే పునఃదర్శనం ప్రారంభమవుతుంది. కానీ మూసివేయని ఒకే ఒక్క దేవాలయం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరునిది. ఇక్కడి దేవుడికి గ్రహణ ప్రభావం ఉండదని పురాణాల్లో చెప్పబడింది. గ్రహణ సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. గ్రహణ సమయంలో భక్తుల దోష నివారణ పూజలు ఎక్కువగా చేస్తారు. అందుకే ఇక్కడి దేవుడి దర్శనం చేసుకున్నాక ఇక ఏ దేవాలయానికి వెళ్లనవసరం లేదన్నమాట. #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి
15 likes
15 shares