శ్రీశైలం న్యూస్

51 Posts • 26K views
Mohan
931 views 1 months ago
#శ్రీశైలం #శ్రీశైలం న్యూస్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #👉నేరాలు - ఘోరాలు🚨 శ్రీశైలంలో శివస్వాములపై లాఠీ ఛార్జ్.. భక్తుల ఆగ్రహం.. దర్శనానికి భారీగా భక్తులు వచ్చారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు శివస్వాములపై లాఠీ ఛార్జ్ చేశారు...🤯మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం శ్రీశైలం ఆలయంలో జనసమూహాన్ని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వేలాది మంది శివభక్తులు మల్లన్న దర్శనానకి వచ్చారు. ఉదయం నుంచి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఐదు గంటల నుంచే భక్తులు, శివస్వాములు క్యూలైన్లలో వేచి ఉన్నారు. గంటలు గడుస్తున్నా.. క్యూ లైన్‌లు ముందుకు జరగలేదు. దీంతో భక్తుల్లో అసహనం మెుదలైంది. కనీసం తాగేందుకు కూడా నీరు లేదని ఆగ్రహం వ్యక్తమైంది…దర్శనం కోసం ఎదురుచూసే కొందరు భక్తులు ఉక్కపోత, నీరసంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని భక్తులు ఆరోపించారు. ఆలయ ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాసేపటికే పరిస్థితి చేయిదాటి పోయింది. శివస్వాములు క్యూలైన్ల నుంచి బయటకు వచ్చి నిరసన తెలియజేశారు. దీంతో మల్లన్న ఆలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఎస్పీ సునీల్, ఏఎస్పీ యుగంధర్ బాబు రంగంలోకి దిగారు. భక్తుల ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పోలీసులు అదుపుచేసేందుకు స్వల్ప లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ఏఎస్పీ యుగంధర్ బాబు లాఠీతో భక్తులను బెదిరిస్తూ, వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసినట్టుగా వీడియోలో కనిపిస్తుంది. శివస్వాములపై పోలీసులు లాఠీలు లేపడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక చేసేదేమీ లేక చాలా మంది శివస్వాములు రాజగోపురం నుంచే స్వామివారిని దర్శనం చేసుకోకుండానే వెనక్కు తిరిగారు. ఆలయ అధికారుల ప్రకారం, వేలాది మంది భక్తులు, ముఖ్యంగా శివ దీక్ష తీసుకున్నవారు తెల్లవారుజాము నుండే ఆలయం చేరుకున్నారు. కొంతమంది భక్తులు ముఖ్యంగా శివ స్వాములు.. క్యూ లైన్లలో ఎక్కువసేపు వేచి ఉండటంతో ఆందోళనకు గురై ఆలయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిలో కొందరు బారికేడ్లను దాటి ఆలయ ద్వారాల వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
9 likes
7 shares