హిందూ పురాణ కథలు
147 Posts • 9K views
#పురాణ గాథలు/కథలు #హిందూ పురాణ కథలు *అచ్యుతమ్.!* *నైమిశారణ్యములో ‘ద్వాదశ వార్షిక బ్రహ్మసత్రము’ అను దీర్ఘ సత్రయాగము జరుగుతోంది. ఆ యాగం జరుపుతున్న మహామునులు యాగ విరామ కాలంలో, ఏకాంతముగా ఏకాగ్ర మనస్సుతో కూర్చుని వున్న సూతుని సన్నిధి కి వెళ్లి* *"అనఘా! మీరు మా కింతవరకు కొన్ని పురాణములు ప్రవచించారు. అవి అమృతోపమాయమైనవి. ఇంకా వినాలని మాకు వేడుకగ వుంది. భగవానుడు ఏ విధముగ ఏ కారణమున మత్స్యరూపమును ధరించి సృష్టి చేసాడు? ఇది అంతా మాకు చెప్ప వేడుచున్నాము" అని పలికారు.* *ఆ మాటలు విన్న సూతుడిలా చెప్ప నారంభించాడు* *“శౌనకాది మహామునులారా! బ్రాహ్మణోత్తములారా! సాక్షాత్‌ శ్రీ మహా విష్ణువే చెప్పిన మత్స్యపురాణము మీకు ఇప్పుడు చెప్పుచున్నాను వినుడు. ఇది బహు పుణ్యకరము. పవిత్రమైనది. ఆయువును వృద్ధి చేయునది. కనుక శ్రద్ధతో వినండి" అని మొదలు పెట్టాడు.* *"పూర్వము మనువు అను రాజుండెడివాడు. ఇతడు సూర్యుని కుమారుడు. ఆయనకు ఆత్మ సంస్కారమునకు కావలసిన గుణములన్నియు కలవాడు. క్షమాగుణము కలవాడు. అతడు తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి మలయ పర్వతం మీద ఒక ప్రదేశంలో బ్రహ్మను గూర్చి గొప్ప తపస్సు చేసాడు.* *వేల ఏండ్లు గడచిన తరువాత బ్రహ్మ ప్రత్యక్షమై వరము కోరుకొమ్మని మనువుతో పలికాడు.* *మనువు బ్రహ్మకు నమస్కరించి...* *''అన్నిటికంటె ఉత్తమ మయిన ఒకే ఒక వరం నేను మిమ్ము వేడుచున్నాను. ప్రళయము సంభవించినప్పుడు స్థిరములు చరములునగు ప్రాణులను రక్షించుటకు నేను శక్తిగలవాడను కావలయును" అని అడిగాడు.* *విశ్వమునకు ఆత్మరూపుడు అగు బ్రహ్మ ‘అట్లే కానిమ్మని’ పలికి అక్కడే అంతర్ధానం అయ్యాడు. దేవతలు పూలవాన కురిపించారు.* *ఒకానొక రోజు మనువు తన ఆశ్రమంలో పితృతర్పణము చేస్తుండగా ఒక ఆడ చేప నీళ్లతో పాటు అతని రెండు చేతులలో పడింది. ఆ రాజుకు ఆ చేప రూపమును చూచి దయ కలిగి దానిని రక్షించాలని తన కమండలము లోని జలములలో వేసాడు.* *ఆ మత్స్యము ఒక రాత్రిలో పన్నెండు అంగుళముల పొడవు పెరిగి తల పైకెత్తి మనువును చూచి...* *"రక్షించుము రక్షించుము" అని పలికింది.* *మనువు ఆ చేపను బయటకు తీసి వెడల్పైన మూతిగల మట్టిపాత్రలో వేసాడు. అక్కడ అది ఒక రాత్రిలో మూడు మూరలంతగా పెరిగింది. మరల ఆ చేప సహస్ర కిరణాత్మజుడగు మనువుతో అర్తనాదముతో* *"నేను నిన్ను శరణు పొందితిని. రక్షించు రక్షించు" అంది.* *ఆ రవినందనుడు దానిని బావిలో పడేసాడు. మర్నాటికి అది అక్కడ రెండు యోజనములంత (1600 మూరలు) పెద్దది అయ్యింది. మరల అది దీనముగా* *"రక్షించు రక్షించు” అని ఆ రాజుతో పలికింది.* *అతడు దానిని బావినుండి తీసి గంగా నదిలో వేయగా అది అచ్చటను అట్లే ఆ నది నిండుగా సరిపోవునంతగా పెరిగింది. అప్పుడా రాజు దానిని సముద్రములో పడేసాడు. వెంటనే అది సముద్రమంతటా వ్యాపించి కనబడింది. అది చూచి మనువు భయపడి* *"ఎవరు నీవు? రాక్షస రాజువా? లేక వాసుదేవుడవా? అట్లు కానిచో నీవు ఈ విధముగా అతి తక్కువ కాలములోనే ఎట్లు నీ పరిమాణమును పెంచుకొనుచున్నావు? రెండు లక్షల యోజనములంత శరీరము ఎవ్వనికుండును? కేశవా! నీవు మత్స్యరూపుడవై నన్ను శ్రమపెట్టుచున్నావు. హృషీకేశా! జగన్నాథా! జగద్దమా! నీకు నమస్కారము” అన్నాడు.* *మనువు ఇలా పలుకగానే మత్స్యరూపుడు అగు ఆభగవానుడు జనార్దనుడు* *"బాగుబాగు! అనఘా! నీవు సత్యము గ్రహంచితివి. అచిరకాలముననే ఈ భూమి పర్వతములతోటి, మహా వనముల తోటి నీట మునుగును. ఇదిగో! ఈ నౌకను జీవ సమూహములను రక్షించుటకై నేను దేవతల సమూహము చేత నిర్మింపజేసితిని.* *స్వేదజములు (చెమటనుండి పుట్టునవి), అండజములు, ఉద్భిజ్జములు, జరాయు జములు, ఉష్ణమునుండి పుట్టు దోమలు, గ్రుడ్ల నుండి పుట్టు పక్ష్యాదులు - నేలను చీల్చుకొని పుట్టు మొక్కలు చెట్లు, మావినుండి పుట్టు మనుష్యులు మొదలగు ప్రాణులు అన్నింటికి ఏ కీడును గలుగకుండ కాపాడుము.* *ఈ ప్రళయ కాలము ముగిసిన తరువాత స్థిర చర రూపమయిన ఈ జగత్తున కంతటికి నీవు ప్రజాపతి వై కృతయుగారంభమున సర్వజ్ఞుడు భగవానుడు ఋషి మన్వంతరమునకు అధిపతి అయి నీవు దేవతలచేతను పూజింపబడెదవు" అన్నాడు.* *"భగవాన్! ఎన్ని సంవత్సరముల తరువాత ప్రళయము సంభవించును? నేను ఆ ప్రాణులను ఎటుల రక్షింపగలను? తిరిగి నేను ఏవిధముగా నిన్ను కలియగలను?" అని మనువు భగవానుని ప్రశ్నించెను.* *"ఇప్పటినుండి నూరుసంవత్సరముల వరకు కరువు ఏర్పడుతుంది. సూర్యుని కిరణాలు నిప్పులు ప్రసరిస్తాయి. బడబాగ్ని విజృంభిస్తుంది. మేఘాలు వర్షపు నీటితో భూమిని ముంచి వేస్తాయి. ఆసమయంలో నీవు ఈ నావను తీసుకొని, నా మత్స్యరూపుడనైన నా కొమ్ముకు కట్టినట్లయితే, నా ప్రభావం వలన ఈ నావలో ఉండే మునులు, మహర్షులు, సాధుజనులు, తదితర ప్రాణికోటి అంశములతో బాటు నీవు కూడా జీవించి ఉంటావు" అని చెప్పి భగవానుడు అంతర్ధానం అయ్యాడు.* *ఆ విధంగా కృత యుగ ప్రారంభానికి ముందు జరిగే జల ప్రళయం నుండి మనువును సప్త ఋషులను పునః సృష్టికి కావలసిన అన్నింటిని మత్స్యరూపంలో భగవానుడు కాపాడాడు.* *ఈ పోస్ట్ నచ్చితే షేర్ చేయండి.* *┈┉━•❀꧁హరేకృష్ణ꧂❀•━┉┈* *ఆధ్యాత్మిక అన్వేషకులు* 🍁🚩🍁 🙏🕉️🙏 🍁🚩🍁
9 likes
10 shares
ఒక బ్రాహ్మణుడు ఒక సంపన్నుని గృహం లో భాగవత ప్రవచనం ఇస్తున్నారు..అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి, ఒక మూల దాక్కున్నాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతోంది. తల్లి యశోద, కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించేదో చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి, బాల కృష్ణుడు కనిపిస్తే నగలు దొంగలిద్దాము అని అనుకున్నాడు. దానికోసం ఆ బ్రాహ్మణుడి వెంట పడ్డాడు. బ్రాహ్మణుడు భయపడి ‘నా దగ్గర ఏమీ లేదు ‘ అని అన్నారు. దొంగ, మీ దెగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశ పడటంలేదు. మీరు చెప్పిన, నగలు ధరించిన కృష్ణుడు, ఆవులు దగ్గర ఉండే కృష్ణుడు, ఎక్కడ ఉంటాడో చెప్పండి’ అని అన్నాడు. బ్రాహ్మణుడు ఆలోచించి, “బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజూ ఇద్దరు పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు , తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో , పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండే వాడే, నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు”అని ఆ దొంగ నుండి తప్పించుకోటానికి చెప్పాడు దొంగ బ్రాహ్మణుడి మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు.యమునా నది తీరం వద్ద కూర్చుని, ఆ ఇద్దరి పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది , ఇద్దరు పిల్లలు వస్తున్నారు.ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి, పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ. బాల కృష్ణుడిని చూడగానే, దొంగ మనసులో ఆనందం కలిగి, అతని కళ్ళమ్మట నీళ్లు కారుతూ, ‘ఏ తల్లి కన్న బిడ్డో, ఇంత అందంగా ఉన్నాడు ‘ అని అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది.. తరువాత చూస్తే, దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది. అది తీసుకుని,ఆ దొంగ బ్రాహ్మణుడి దెగ్గరకి వెళ్లి, జరింగింది అంతా చెప్పాడు. ఆనందభాష్పాలతో ఆ బ్రాహ్మణుడు కృష్ణుడిని చూసిన చోటు, తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే, దొంగకి కనిపించిన బాల కృష్ణుడు, బ్రాహ్మణుడికి, కనిపించలేదు. అప్పుడు బ్రాహ్మణుడు నిరాశతో కృష్ణిడిని ,నీవు ఒక దొంగని అనుగ్రహించావు , నాకు కూడా దర్శనం ఇవ్వవా?” అని బాధపడ్డాడు. అప్ప్పుడు అపారమైన కరుణ గల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు ‘ నీవు భాగవత పురాణమును కేవలము ఒక కథగా చదివావు , కాని , దొంగ, నువ్వు చెప్పిన కథని, మాటలని మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం ,సమర్పణ శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను.” #నీతి : పురాణాలను చదవడమే కాకుండా, దానిలో ఉన్నవి అనుభవించడం నేర్చుకోవాలి. బాలం ముకుందం మనసా స్మరామి ##పురాణాలూ_కథలు #తెలుసుకుందాం #ఓం నమో భగవతే వాసుదేవాయ #ఓం నమో భగవతే వాసుదేవాయ🌷🌷 #హరే కృష్ణ
8 likes
7 shares