విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News )

478 Posts • 260K views
PSV APPARAO
1K views 1 months ago
#సింహాచలం న్యూస్ సింహాద్రి అప్పన్న ఆధ్యాత్మిక సమాచారం 🙏 #సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న క్షేత్రంలో ఉత్సవాలు #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #🦁🙏 సింహాద్రి అప్పన్న చందనోత్సవం🌹🦁🐯 #🛕🎎సింహాద్రి అప్పన్న చందనోత్సవం 🙏🌺🌠🌦️ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి చందనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు: భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు. చందనోత్సవానికి సర్వం సిద్ధం. కలెక్టర్: అభిషిక్త్ కిషోర్. విశాఖపట్నం/సింహాచలం. ఏప్రిల్ 18. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి అత్యంత ప్రతిష్టాత్మకమైన చందనోత్సవం వేడుకలకు జిల్లా యంత్రాంగం, దేవస్థానం మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయన సింహాచలం దేవస్థానం లో చందనోత్సవం ఏర్పాట్లను GVMC కమిషనర్, జాయింట్ కలెక్టర్ ఉద్యాధరీ , VMRDA కమిషనర్ తేజ్ భరత్,EO J. వెంకట రావు తో కలసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మీడియా తో మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చందనోత్సవం రోజున తెల్లవారుజామున 4 గంటలకు తొలి పూజ అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. సాయంత్రం 6:00 గంటల కల్లా దర్శనాల ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా ₹300, ₹1000 మరియు ₹1500 కేటగిరీలలో సుమారు 40,000 టికెట్లను విక్రయించడం జరిగిందాని, మిగిలిన భక్తులందరికీ ఉచిత దర్శనం కల్పించనున్నామని వెల్లడించారు. కొండ పైకి భక్తులను తరలించడానికి 100 ప్రత్యేక బస్సులను ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు . ప్రైవేట్ వాహనాలను కొండ పైకి అనుమతించమని. భక్తులు తమ వాహనాలను ఫుట్ హిల్స్ వద్ద కేటాయించిన 32 పార్కింగ్ ప్రదేశాలలో నిలిపివేసి, దేవస్థానం బస్సుల ద్వారా కొండ పైకి చేరుకోవాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్ల దూరాన్ని తగ్గించారనీ,. ఎండ, వానల నుండి రక్షణ కోసం క్యూ లైన్ల పొడవునా( కెనోపి )నీడ (Canopy) ఏర్పాటు చేశా మ న్నారు .తిరుమల, విజయవాడ దేవస్థానాల నుండి వచ్చిన అనుభవజ్ఞులైన సిబ్బందితో క్యూ లైన్లను వేగంగా కదలడానికి చర్యలు చేపట్టామన్నారు. భక్తులు తమ మొబైల్ ఫోన్లను కొండ పైకి తీసుకురావడానికి అనుమతి లేదన్నారు. భక్తులు తమకు కేటాయించిన నిర్ణీత సమయ స్లాట్ (Slot) లలోనే దర్శనానికి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నకిలీ టికెట్ లు తెస్తే చట్టపరంగా చర్యలు తీసు కుంటామన్నారు. భక్తుల సౌకర్యార్థం శాశ్వత ప్రాతిపదికన షెడ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు మరియు రాంపులను నిర్మించా మన్నారు . ఉచిత ప్రసాదం, మంచినీరు మరియు అన్నదాన వితరణ చేసే సంస్థలకు ప్రత్యేక డ్యూటీ పాస్‌లను జారీ చేశామని తెలిపారు.. ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన అతి కొద్ది మందికి (సుమారు 500 మందికి) మాత్రమే ఉదయం 5:00 గంటల లోపు అంతరాలయ దర్శనానికి అనుమతి ఉంటుందనీ. ఆ తర్వాత అందరికీ సాధారణ దర్శనాలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ మరియు దేవస్థానం సిబ్బంది ఒకే టీమ్‌గా పనిచేస్తూ ఉత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారని, భక్తులు అధికారులకు సహకరించాలని కోరారు.
13 likes
20 shares
PSV APPARAO
687 views 1 months ago
#శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారు (పెద్ద వాల్టెర్-విశాఖపట్నం) ఓం ఐం హ్రీం శ్రీం పోలమాంబాయే నమః #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #విశాఖ భక్తి సమాచారం 🙏🕉️🙏 ఆధ్యాత్మిక నగరం భక్తి విశేషాలు *ఈరోజు శ్రీ పోలమాంబ అమ్మవారి దివ్య స్వరూపం దర్శనం! 🌺* "శ్రీ పోలమాంబ అమ్మవారిని పరోక్షంగా దర్శనం చేసుకోండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ...ముక్తిని ప్రసాదించే ఈ దివ్య దర్శనాన్ని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. 👉 అమ్మవారి నిత్య దర్శనం కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి: https://whatsapp.com/channel/0029VakZTwH3bbV6Ce1pnN1c *సర్వేజనా: సుఖినోభవంతు!"*
17 likes
12 shares
PSV APPARAO
715 views 2 months ago
#శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారు (పెద్ద వాల్టెర్-విశాఖపట్నం) ఓం ఐం హ్రీం శ్రీం పోలమాంబాయే నమః #విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) తేదీ:18-03-2026 /బుధవారం *ఈరోజు శ్రీ పోలమాంబ అమ్మవారి దివ్య స్వరూపం దర్శనం! 🌺* "శ్రీ పోలమాంబ అమ్మవారిని పరోక్షంగా దర్శనం చేసుకోండి. అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ... ముక్తిని ప్రసాదించే ఈ దివ్య దర్శనాన్ని మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. 👉 అమ్మవారి నిత్య దర్శనం కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి: https://whatsapp.com/channel/0029VakZTwH3bbV6Ce1pnN1c *సర్వేజనా: సుఖినోభవంతు!"*
13 likes
12 shares
PSV APPARAO
606 views 2 months ago
#విశాఖపట్నం సమాచారం 📷స్థానిక వార్తలు 📺 లోకల్ న్యూస్ ✍️ ( Visakhapatnam Local News ) #విశాఖపట్నం #విశాఖపట్నం #విశాఖపట్నం #విశాఖపట్నం న్యూస్ మందుగుండు సామాగ్రి పేలి గోపాలపట్నం పరిధిలో భారీ పేలుడు భయాందోళనలు పరుగులు తీసిన స్థానికులు భయం గుప్పెట్లో రాజిక వీధి ప్రజలు సంఘటన స్థలాన్ని పరిశీలించిన గోపాలపట్నం సిఐ, ఎస్ఐ మంట లారిపోయిన స్థానిక యువత విశాఖ పశ్చిమ, విశాఖ, పశ్చిమ నియోజకవర్గం, గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగిన భారీ పేలుడు స్థానికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 89వ వార్డు ఆదర్శనగర్, ఎర్రచెరువు రజక కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం, రజక వీధిలో ఉన్న ఒక భవనంలో కొంతకాలంగా అనుమతి లేకుండా మందుగుండు సామగ్రి తయారీ జరుగుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఆదివారం అకస్మాత్తుగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు శబ్దం దూర ప్రాంతాల వరకు వినిపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు సంభవించిన వెంటనే ఆ భవనంలో మంటలు చెలరేగాయి. అయితే అక్కడున్న స్థానిక యువకులు ధైర్యంగా ముందుకు వచ్చి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. వారి సహకారంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే గోపాలపట్నం పోలీస్ స్టేషన్ సీఐ సన్యాసి నాయుడు, ఎస్సై రామారావు తమ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు పరిసర ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేస్తూ పేలుడు ఎలా జరిగింది, ఏ రకమైన మందుగుండు సామగ్రి అక్కడ తయారు చేస్తున్నారు అనే అంశాలపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో, ఆ భవనంలో అనధికారికంగా మందుగుండు సామగ్రి తయారీ జరుగుతున్న అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భవన యజమాని వివరాలు సేకరిస్తూ, అక్కడ నిల్వ ఉంచిన పదార్థాలు ఏమిటి అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. భవనంలో ఇంకా ప్రమాదకర పదార్థాలు ఉన్నాయా అనే దానిపై కూడా జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆదర్శనగర్, ఎర్రచెరువు రజక కాలనీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు భయాందోళనలో ఉండగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి భద్రతా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
8 likes
12 shares