గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి

19 Posts • 6K views
ప్రభుత్వ ఆసుపత్రుల్లో శుభ్రతకు పెద్ద పీట వేయాలి! లేదా ఇటీవలి కాలంలో అపరిశుభ్రతకు నిలయాలుగా మారుతున్న కొన్ని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రులు! మన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి పట్ల ఎంతో శ్రద్ధాశక్తులు కనబరుస్తూ అక్కడి పరిసరాల పరిశుభ్రతను,మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు తగిన బడ్జెట్ ఏర్పాటు చేసి ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికి ప్రభుత్వ అసువత్రిలోని కొంతమంది సిబ్బంది నిర్లక్ష్య వైఖరి మూలాన అక్కడి రోగుల వార్డులు ఎలుకలకు,దోమలకు,పాములకు, విష సర్పాలకు నిలయాలుగా మారుతూ అక్కడికి వైద్య నిమిత్తమై వస్తున్న రోగులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వార్డులు ఓక నరకకూపంగా మారుతుండటం కడు శోచనీయం.' వైద్యో నారాయణో హరి ' అంటారు కదా,ప్రయివేటు వైద్యశాలల్లో చికిత్స శక్తికి మించిన పని కావడంతో బీద,బిక్కి,నిరుపేదలు తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యం చేయించుకునే నిమిత్తమై ప్రభుత్వ ఆసుపత్రులకు నిత్యం ఎంతో దూర ప్రాంతాల నుంచి వందలాది మంది వస్తూ వుంటారు. మరీ వారికి లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్న డాక్టర్లు,వేలాది రూపాయల జీతాలు తీసుకుంటున్న దిగువ స్థాయి ఆరోగ్య సిబ్బంది వంటివారు తమ వృత్తికి తగిన న్యాయం చేస్తూ రోగుల వార్డులు పరిశుభ్రంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకునే గురుతర బాధ్యత ముమ్మాటికీ వారి భుజస్కందాలపై వుంది.ఇందులో భాగంగా అక్కడి బాత్రూంలలో గాని,వార్డులలో గాని ఎక్కడైనా పెద్ద పెద్ద రంద్రాలు వుంటే తక్షణమే వాటిని పూడ్చివేయడంతో పాటు అక్కడి బండ సట్టం మరీ పాతపడిపోయి చీలికలు వచ్చి వుంటే తక్షణమే వాటి మరమ్మత్తులపై దృష్టి పెట్టాలి.అప్పుడే అక్కడి వార్డులలో పాములు, ఎలుకలు,దోమలు వంటివి చొరబడకుండా రోగులు తగిన రక్షణలో ఉండగలుగుతారు.ఎందుకంటే అక్కడికి వచ్చే రోగులు ఎంతో అపాయకరమైన పరిస్థితుల్లో,ఆందోళనతో ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తూ వుంటారు.అలాంటి రోగులు వారి తరపున సహాయకారిగా ఉండేందుకు వచ్చే వారి కుటుంబసభ్యులకు తగిన సౌకర్యాలు కనీసం ఓక మోస్తారులో నైనా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వ ఆసుపత్రులలోని సిబ్బంది పై ఎంతైనా వుంది. ఏదిఏమైనా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలు అనేవి సామాన్యులకు,నిరుపేదలకు ఓక దేవాలయాల వంటివి కాబట్టి అక్కడికి విచ్చేసే రోగుల పట్ల భగవంతుడు భక్తులకు అనుగ్రహమిచ్చినట్లు,అక్కడి డాక్టర్లు,మిగతా ఆరోగ్య సిబ్బంది వారి పట్ల ఎంతో ప్రేమానురాగాలతో,అప్యాయతతో నడుచుకొని,వారు చేరిన వార్డులలో ఎలాంటి అపరిశుభ్రత వాతావరణం లేకుండా యుద్ధ ప్రాతిపదికన తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఏమైనా ' ఆరోగ్యమే మహాభాగ్యం ' అంటారే అలా ఆనారోగ్యంపాలైన తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలకు వచ్చే నిరుపేద రోగుల పట్ల కాస్త కనికరం చూపి అక్కడి పరిసరాలలో దుమ్ము,దూళి పేరుకుపోకుండా,విష పురుగులు,తేళ్లు వంటివి సంచరించకుండా అత్యంత అప్రమత్తత తో వ్యవహారించాల్సిన తక్షణ కర్తవ్యం,బాధ్యత ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పై ఎంతైనా వుంది.నిరుపేద రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులు అనేవి తమ ప్రాణాలు నిలబెట్టే ఓక రక్షణ కవచంలా ఉండాలి కాని, భయబ్రాంతులు కలిగించేలా చెత్త,చెదారంతో, అపరిశుభ్రతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎలాంటి పరిస్థితుల్లో మారకూడదు.ఇలా అపరిశుభ్రతకు నిలయాలుగా దురదృష్టవశాత్తు మన ప్రభుత్వ ఆసుపత్రులు మారితే పేద,నిరుపేద రోగులకు వచ్చిన జబ్బు మాట దేవుడెరుగు లేని కొత్త జబ్బులు కొని తెచ్చుకున్న వారవుతారు.కాబట్టి ప్రభుత్వ దవఖాన రోగులకు వచ్చిన చికిత్సకు మెరుగైన వైద్యం చేసి వారి జబ్బు నయం అయ్యేలా చూడాలి కానీ వారికి సకాలంలో వైద్యం అందించకుండా వారికి వచ్చిన జబ్బు మరింత ముదిరిపోయేలా,వారిని మరింతగా శిక్షించేలా బాధపెట్టేలా వైద్యం ఉండకూడదు.అంటే ' కొండ నాలుక కు మందు వేస్తే వున్న నాలుక ఊడి పోయిందంట ' అలాంటి దారుణ పరిస్థితులు పేద,నిరుపేద రోగులకు తలెత్తకుండా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది వారు తగు జాగ్రత్తలు తీసుకోని లక్షలాది రూపాయల జీతం తీసుకుంటున్న తమ పవిత్ర వైద్య వృత్తికి తగు న్యాయం చేకూర్చాల్సిన కనీస బాధ్యత వారి భుజస్కంధాలపై ఎంతైనా ఉంది. - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి
9 likes
1 comment 9 shares