endharo mahanubhavulu
53 Posts • 9K views
పద్మశ్రీ మంగళా కపూర్. "మీరు నా ముఖాన్ని, నా శరీరాన్ని కాల్చవచ్చు. నన్ను బాధపెట్టవచ్చు. కానీ మీరు నా ధైర్యాన్ని నా నుండి తీసివేయలేరు. నా స్వంత బలం ధైర్యం మీకు భయంగా మరియు నా విజయానికి మార్గంగా మారుతుంది." ఇదే ఆత్మ విశ్వాసంతో ఇదే అభిరుచితో, యాసిడ్‌తో ముఖం కాలిపోయిన కాశీకి చెందిన 12 ఏళ్ల బాలిక ముందుకు సాగింది. ఆమె తన ముఖానికి 37 కి పైగా ఆపరేషన్లు చేయించుకోవలసి వచ్చింది. తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ప్రజలు ఆమెను 'నక్కి' లాగా ఎగతాళి చేసేవారు. చుట్టూ జనం ఉన్నారు, కానీ ఆమె లోపల నుండి వచ్చే అరుపులు వినడానికి ఎవరూ రాలేరు. నేడు, అదే చిన్న అమ్మాయి చాలా మంది మహిళలకు ప్రేరణగా మారింది. విధి ఆమె ముందు ఒక భయంకరమైన పరీక్ష పెట్టింది. ఒక వైపు శరీరంపై గాయాలు… జీవితంపై సందేహాలు… కానీ ఆమె మనసులో మాత్రం ఒకే ప్రశ్న..! “ఇంతటితో నా కథ ఆగిపోవాలా?” అక్కడే పుట్టింది ఓ అసాధారణ సంకల్పం. ఆ బాధను సంగీతంగా మార్చుకున్న మహిళే ప్రొఫెసర్ మంగళ కపూర్ గారు. యాసిడ్‌ అటాక్‌ లాంటి దుర్ఘటనను జయించి, భారత శాస్త్రీయ సంగీతంలో తనకంటూ ఓ స్థానం సంపాదించారు. బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా తరతరాల విద్యార్థులకు సంగీతాన్ని మాత్రమే కాదు, జీవితం ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పించారు. నేడు 2026లో పద్మశ్రీ పురస్కారం లభించింది. అది కేవలం గౌరవం కాదు… ఓ మహిళ ధైర్యానికి, ఓ జీవన పోరాటానికి దక్కిన జాతీయ వందనం. అందంగా ఉండటమే కాదు… ధైర్యంగా నిలబడగలగటమే నిజమైన అందం. మంగళ కపూర్ గారు బాధను బలంగా మార్చుకున్న సజీవ ఉక్కు మహిళ. వీరిని ఎంత అభినందించినా తక్కువే.🙏🇮🇳💐💐👏👏 #endharo mahanubhavulu #mahanubhavulu #మహానుభావులు
19 likes
8 shares
మా ఇంట్లో ఏసీ ఉండదు... అరట్టై శ్రీధర్‌ వేంబు ఆయన సంపద రూ.50 వేల కోట్ల రూపాయలు గూగుల్, మైక్రోసాఫ్ట్, సేల్స్‌ఫోర్స్‌... నిత్యం ఈ టెక్‌ దిగ్గజాలతో పోటీపడుతుంటారు శ్రీధర్‌ వేంబు. తాజాగా ‘అరట్టై’తో వాట్సాప్‌కీ సవాలు విసిరి... ‘మెటా’తోనూ ఢీ అంటే ఢీ అంటున్నారు! ఆయన సంపద కూడా ఆ స్థాయిలోనే ఉంది... రూ.50 వేల కోట్ల రూపాయలు మరి! ఈ విజయాలన్నింటినీ తమిళనాడులోని ఓ మారుమూల పల్లెటూరిలో ఉంటూనే సాధిస్తున్నారాయన. మన దేశంలో సరికొత్త ఐటీ విప్లవానికి నాంది పలికిన శ్రీధర్‌ వేంబుతో చేసిన అరట్టై(పిచ్చాపాటి)లోని కొన్ని విశేషాలివి... *పల్లెలంటే ప్రాణం!* మా నాన్నావాళ్లది తంజావూరులోని ఒళిగచ్చేరి అనే కుగ్రామం. కావేరి ఉపనది కొల్లిడం ప్రవహించే పల్లెకాబట్టి... పచ్చదనంతో నిండి ఉండేది. నాకు ఎప్పుడు సెలవులొచ్చినా ఈ ఊరికి వచ్చేసేవాణ్ణి. సెలవులు అయిపోయాక తిరిగి వెనక్కి వెళ్ళనని మొండికేసేవాణ్ణి. ఏడ్చి గీపెడుతున్న నన్ను బలవంతంగా తీసుకొచ్చి బస్సెక్కించేవారు. ఆ ఊరి గుర్తుగా ఏ రాయో రప్పో తెచ్చుకుని... దాచుకునేవాణ్ణి. ఆ ఊరిపైన నాకున్న మమకారమే జోహో కంపెనీని గ్రామీణ ప్రాంతాలకి తెచ్చేలా చేసింది! *మూడున్నరవేల రూపాయలతోనే…* మా నాన్న సాంబమూర్తి వేంబు మద్రాసు హైకోర్టులో స్టెనోగా చేసేవారు. అప్పట్లో ఆయన జీతం రూ.3500! ఆ అత్తెసరు ఆదాయంతోనే మా అమ్మ కన్మణి మమ్మల్నందర్నీ పెంచింది. నేను చిన్నప్పటి నుంచీ స్కాలర్‌షిప్‌లతోనే చదువుకున్నాను. చిన్నప్పుడు అమ్మ నేర్పిన పొదుపు, నిరాడంబర జీవనం నా జీవిత విధానంగా మారిపోయాయి. *ఓనమాలు దిద్దాను…* ఐఐటీ-మద్రాసులో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చేశాక... అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ ముగించాను. ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీలో లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది. మంచి జీతం... బంగ్లా కూడా ఇచ్చారు. అక్కడితో మా కుటుంబ కష్టాలన్నీ తీరిపోయేవే కానీ... నాకు అధ్యాపకవృత్తి సరిపోదనిపించింది. బయటకొచ్చేశాను. నాకే మాత్రం అర్థంకాని సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాల్లో ఓనమాలు నేర్చుకున్నాను. క్వాల్‌కమ్‌ సంస్థలో ఉద్యోగినయ్యాను. చిన్నకంపెనీల అవసరాలని తీర్చే సాఫ్ట్‌వేర్‌లని అందించాలని... ‘అడ్వెంట్‌ నెట్‌ కంపెనీ’ని ప్రారంభించాను. *పేరులో ఏముంది..?* మా సంస్థ లక్ష్యం చిన్న కంపెనీలే కాబట్టి ‘అడ్వెంట్‌ నెట్‌’ అన్న పేరుని... స్మాల్‌ ఆఫీస్‌ హోమ్‌ ఆఫీస్‌(సోహో) అని మార్చుకున్నాం. విభిన్నంగా ఉండాలని ‘ఎస్‌’ని కాస్తా జెడ్‌గా మార్చి ‘జోహో’గా చేశాం! *వాడి కోసం…* మా అబ్బాయి పేరు సిద్ధు. వాడికి రెండేళ్లు ఉన్నప్పుడు ఆటిజం ఉందని తెలిసింది. దాంతో నేనూ నా భార్య ప్రమీల తీవ్ర మానసిక క్షోభని అనుభవించాం. చిన్నప్పుడు నేను చూసిన పల్లెటూరి వాతావరణం వాడికి మేలు చేస్తుందని బలంగా నమ్మాను. నేను గ్రామీణ ప్రాంతాల్లోనే జీవించాలని నిర్ణయించుకోడానికి అదీ ఓ కారణమని చెప్పాలి! *పల్లెటూరి సత్తా అది!* మనం వాడుతున్న చాటింగ్, ఈమెయిల్‌ ఆప్‌లు అమెరికావి! నాకో దశలో... మన డేటా అంతటినీ వాళ్లు మనకి వ్యతిరేకంగా వాడితే ఎలా అన్న భయం కలిగింది. అందుకే మనదైన ఈమెయిల్‌ రూపొందించాలని... జోహోమెయిల్‌ని ప్రారంభించాను. ‘వాట్సాప్‌’కి ప్రత్యామ్నాయంగా అచ్చమైన తమిళపదంతో ‘అరట్టై’ని మొదలుపెట్టాను. మన పల్లెటూరి యువతే వీటికోసం పనిచేశారు. ఎనిమిదేళ్ల తర్వాత... వాటికి ఇప్పుడు లక్షల డౌన్‌లోడ్‌లు వస్తుండటం చూస్తే ఆనందంగా ఉంది! *ఫోర్క్‌లు ఎందుకు?* చెన్నైలో ఆఫీసు పెట్టిన కొత్తల్లో అక్కడున్న ఎగ్జిక్యూటివ్‌లూ ఉద్యోగులూ ఫోర్క్‌తో తినకపోతే చిన్నచూపు చూసేవాళ్లు. మన పద్ధతుల్ని కించపరచడం నాకు నచ్చలేదు. అందుకే, గ్రామీణ ప్రాంతాల్లో... పల్లెటూరి యువతతోనే సంస్థను నడిపి విజయం సాధించాలనుకున్నాను. ‘స్పోక్స్‌ అండ్‌ హబ్‌’ పేరుతో పల్లెటూళ్ళలో కంపెనీ శాఖల్ని ఏర్పాటుచేశాను. మొదట తమిళనాడు తెన్కాశిలోని మత్తలంపాళయానికి దగ్గర్లో ఉన్న సిల్లరైపురవు అనే ఊళ్లో ఆఫీసును ప్రారంభించి... నేనూ అక్కడే ఉండిపోయాను. *చాపమీదే…* తెన్కాశికి దగ్గర్లో చిన్న ఇంట్లోనే ఉంటాను. చాపమీదే పడుకుంటాను. మా ఇంట్లో ఫ్యాన్‌ తప్ప ఏసీ ఉండదు. తెల్లవారుజామున నాలుగింటికే నిద్రలేస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌లతో మాట్లాడాక... సైకిల్‌ మీద పొలానికి వెళ్లి పనుల్ని చూస్తుంటాను. ఊళ్లోని పిల్లలతో కలిసి చెరువులో ఈత కొడతాను. పనిమీద తెన్కాశి పట్టణానికి వెళ్లాలంటే నేనే ఎలక్ట్రిక్‌ ఆటో నడుపుకుంటూ వెళతాను. You are inspiration to many of us Sir 🫡🫡 How Simple You, Your lifestyle and Your Working style.......How grounded your thoughts are..... Loving your roots and living to the core.....is really really Appreciable......Your love towards your native place & Your Motherland is sooo impressive..... Shine on Sir......Make Our people also shine also...... Congratulations 🎉 🎉 🎉 🎉 🎉 🎉 Sir.....& salute 🫡 🫡 🫡 To your Contribution to our people.. #తెలుసుకుందాం #simplycity #endharo mahanubhavulu #mahanubhavulu #మహానుభావులు
12 likes
8 shares
బేతంచెర్ల మండల ప్రజానీకం హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి,రారాజు లాంటి వారు దివంగత బుగ్గన మురళీధర్ రెడ్డి గారు! ( పెద్దాయన వర్ధంతిని పురస్కరించుకొని 7 - 1 - 2026)! నిప్పు లాంటి మనిషి,పేద,సామాన్య,బడుగు,బలహీన వర్గాల పెన్నిధి,మాట మీద నిలబడే మడమ తిప్పని మహోన్నత వ్యక్తి,బేతంచెర్ల మండల సామాన్య ప్రజల శ్రేయోభిలాషి,వారికి ఏ సమస్య వచ్చిన మీ వెనుక నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి మరీ వారిని ఆపదల నుంచి గట్టేక్కించిన,పెద్ద మనిషి దివంగత బుగ్గన మురళీధర రెడ్డి గారు.అదేవిధంగా ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆమడ దూరంగా వుంటూ,సామాన్య ప్రజలపై దౌర్జన్యం చేసే నాయకుల పాలిట ఒక సింహ స్వప్నమై నిలిచిన ఓ కొదమ సింహం,బేతంచెర్ల మండలంలో ఒక మకుటం లేని మహారాజులా ఒక వెలుగు వెలిగిన దార్శనికుడు,నిలువెల్లా మానవత్వం మూర్తిభవించిన ఒక గొప్ప మానవతా వాది మన దివంగత బి.ఎస్.ఎం.ఆర్ గారు.ఆయన జీవించినన్ని రోజులు వీలయినంత వరకు బేతంచెర్ల మండల ప్రజానీకానికి మంచి చేయాలని చూశాడు తప్ప ఏనాడూ కూడా వారి ఆస్తులను కొల్లగొట్టడం,వారిపై దౌర్జన్యం చేయడం వంటి నీతి తప్పిన చర్యలకు పాల్పడిన దాఖలాలు మచ్చుకైనను లేవు.ఒక విధంగా చెప్పాలంటే అన్యాయలు,అక్రమాలు చేయడం దివంగత బుగ్గన మురళీధర్ రెడ్డి గారి డిక్షనరీ లొనే లేని విషయం. ఏదిఏమైన బి.ఎస్.ఎం.ఆర్ గారు ఒక మచ్చ లేని వ్యక్తి.ఒక గొప్ప పేరు,ప్రఖ్యాతలు ఉన్న ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు మంచి పలుకుబడి,ప్రజాబలం మెండుగా ఉన్నప్పటికీ ఆయన ఒక సాధారణ వ్యక్తిలా అత్యంత నిరాడంబరంగా జీవించాడు.ఆయనకు పెద్ద పెద్ద నగరాలలో,మెట్రో పాలిటన్ సిటీస్ లో జీవించే ఆర్థిక స్తొమత ఉన్నప్పటికీ ఆయన చివరి శ్వాస విడిచేవరకు,అంతిమ ఘడియల వరకు కూడా తనకు జన్మనిచ్చిన బేతంచెర్ల నగరాన్నే అంటిపెట్టుకొని ఇక్కడి మండల ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడిన ఓ సమున్నత శిఖరం.ఇక్కడ నివసించే స్థానికులకు ఏ ఆపద వచ్చిన మొదట ఆయన ఇంటి తలుపునే తడతారు.ఎందుకంటే ఇక్కడి బేతంచెర్ల మండల ప్రజలకు ఆయన ఓ అపద్బాందవుడు లాంటి వారు.ఏమైనా ఆయన గారు లేని లోటు ఎప్పటికి పుడ్చలేనిది.కులాల,మతాలకు అతీతంగా అన్ని వర్గాలరికి మంచి చేసిన ఓ ఆత్మీయుడు లాంటి వారు,వేలాది మందికి జీవనోపాధి కల్పించిన వ్యక్తి.అన్నింటికి మించి ఇతర కొంతమంది నాయకుల మాదిరి ఆయన గారు దురాశ,వేలాది ఎకరాలను అప్పనంగా కొట్టేయాలనే దుర్బుద్ది కలిగిన వారు అయితే ఏనాడో వందలాది కోట్ల రూపాయలు వెనకేసుకునేవారు.కానీ ఏనాడూ ఆయన గారు అలాంటి నీచపు,అన్యాక్రాంతం చేసుకునే పనులకు పాల్పడలేదు.అందుకే ఆ మహానుభావుడు ఇప్పుడు మన మధ్య లేకపోయినా బేతంచెర్ల మండల ప్రజలకు ఆయన అందించిన వెలకట్టలేని,మహోన్నత సేవలు ఎంత కాలం అయిన,ఎన్ని తరాలు మారిన చెరిగిపోనివి,చిరస్మరణీయమైనవి.ఏమైనా బేతంచెర్ల మండలంలోని ప్రజల శ్రేయస్సును,అభివృద్ధిని మనసా,వాచ,కర్మణ ఆకాంక్షించిన ఓ ఉన్నతమైన వ్యకిత్వం ఈ పెద్దాయన దివంగత బుగ్గన మురళీధరరెడ్డి గారిది.అందుకే ఆయన గారు బేతంచెర్ల మండల ప్రజానీకం దృష్టిలో ఒక రారాజు,వారి హృదయాలలో కొలువై వున్న ఓ మహా పురుషుడు.ఇందులో ఎలాంటి సందేహానికి తావు లేదు.జోహార్ బి.ఎస్.ఎం.ఆర్ గారు!అమర్ రహే అమర్ రహే దివంగత,నిలువెత్తు శిఖరం బుగ్గన మురళీధరరెడ్డి గారు! ఇట్లు ఎల్లవేళలా వారి కుటుంబ శ్రేయస్సును కోరే, - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #🙏ఎందరో మహానుభావులు🙏
7 likes
4 shares