ఆంధ్ర ప్రదేశ్
129 Posts • 357K views
News Express 9
631 views 4 months ago
రేపు ఏపీని తాకనున్న నైరుతి రుతుపవనాలు. మరో 24 గంటల్లో రాయలసీమను తాకనున్న రుతుపవనాలు. రేపటి నుంచి ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం. తీరం వెంబడి 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు. #Monsoon2025 #WeatherAlert #RainAlert #AndhraPradesh #ఆంధ్ర ప్రదేశ్ #🌨️వాతావరణ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🗞ప్రభుత్వ సమాచారం📻
11 likes
11 shares
News Express 9
607 views 4 months ago
BIG BREAKING: ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కేరళలో అరెస్ట్ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు ఆయన్ని కేరళలో అరెస్ట్ చేశారు. కాకాణి గోవర్థన్ రెడ్డిని రుస్తుం మైనింగ్ కేసులో ఏ4గా ఉన్నారు. పోలీసుల విచారణకు హాజరు కాకుండా రెండు నెలలుగా ఆయన పరారీలో ఉన్నారు. దీంతో నేడు ఆయన్ని బెంగుళూర్లో అరెస్ట్ చేశారు. #kakanigovardhanareddy #KakaniGovardhanReddyPolicearrest #APPolice #🧐ఈరోజు అప్‌డేట్స్ #ఆంధ్ర ప్రదేశ్ #🗞ప్రభుత్వ సమాచారం📻 #🏛️రాజకీయాలు #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ
13 likes
2 shares
News Express 9
637 views 4 months ago
విశాఖపట్నం వాసులకు,టూరిస్టులకు డబుల్ ధమాకా... విశాఖపట్నం వాసులకు, అలాగే విశాఖను సందర్శించే టూరిస్టులకు డబుల్ ధమాకా.. త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులు విశాఖ వీధుల్లో చక్కర్లు కొట్టనున్నాయి. విశాఖపట్నంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి, అలాగే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు గానూ గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్.. హాప్ ఆన్ హాప్ ఆఫ్ (HOHO) బస్సులను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది. పర్యాటకులతో పాటుగా స్థానికులకు కూడా సౌకర్యవంతమైన రవాణాను అందించేందుకు జీవీఎంసీ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (GVSCCL) ఈ ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా విద్యుత్తుతో నడిచే రెండు డబుల్ డెక్కర్ HOHO బస్సులను కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇందులో ఒకటి ఎయిర్ కండిషన్డ్ కాగా.. మరొకటి నాన్ ఏసీ డబుల్ డెక్కర్ బస్సు. ఈ మేరకు రెండు డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేసేందుకు జీవీఎస్‌సీసీఎల్ ప్రతిపాదనలను కోరుతోంది. ఈ రెండు డబుల్ డెక్కర్ బస్సులను విశాఖపట్నంలోని అన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల మీదుగా నడపనున్నారు. పర్యాటక శాఖ భాగస్వామ్యంతో కలిసి ఈ ప్రాజెక్టు చేపట్టాలని జీవీఎంసీ ఆలోచిస్తోంది. విశాఖలోని ముఖ్యమైన ప్రదేశాలను చుట్టేసేలా ఈ బస్సులను తీసుకువస్తే పర్యాటకులకు మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఒక్కరోజులోనే విశాఖలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను చుట్టేయాలనుకునేవారికి ఈ హోహో డబుల్ డెక్కర్ బస్సులు అనుకూలంగా ఉంటాయి. తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతమైన ప్రయాణంతో విశాఖ అందాలను ఆస్వాదించవచ్చు. అలాగే అటు స్థానికులకు కూడా ఉపయోగపడతాయి. ఏంటీ హాప్ ఆన్ హాప్ ఆఫ్ బస్సుల ప్రత్యేకత హాప్ ఆన్ హాప్ ఆఫ్ విధానం వలన ప్రయాణికులు ఒకచోట బస్సు ఎక్కి, తమకు ఇష్టమైన ప్రదేశంలో దిగొచ్చు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించిన తర్వాత.. ఆ వెనుక వచ్చే బస్సులో తిరిగి ప్రయాణించే వీలుంటుంది. దీంతో తమకు ఇష్టమైన చోట దిగి.. మళ్లీ వెనుక వచ్చే బస్సులో ఖర్చు లేకుండా ప్రయాణించే వీలును ఈ హాప్ ఆన్ హాప్ ఆఫ్ విధానం కల్పి్స్తుంది. ఇక ఈ బస్సులు విద్యుత్ ఆధారంగా నడుస్తాయి. దీంతో పర్యావరణ కాలుష్యం ఉండదని అధికారులు చెప్తున్నారు. డబుల్ డెక్కర్ బస్సులు కావటంతో బస్సులో ప్రయాణిస్తూ అద్దాల మధ్య నుంచి విశాఖ అందాలను వీక్షించే అవకాశం కలుగుతుంది. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే విశాఖలో ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గించేందుకు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు, #vizag #vizagtourism #visakhapatnam #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🧐ఈరోజు అప్‌డేట్స్ #ఆంధ్ర ప్రదేశ్ #🗞ప్రభుత్వ సమాచారం📻
7 likes
9 shares