రాశి ఫలాలు

42 Posts • 1M views
Aaryan Rajesh
1K views 28 days ago
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 22 - 06 - 2026, వారం ... ఇందువాసరే ( సోమవారం ) శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం, *🌺నేటి విశేషం🌺* _*రేపటి నుండి ఆరుద్ర కార్తె ప్రారంభం*_ *తొలకరి చినుకు.. ఆరుద్ర మెరుపు* ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే. వాతావరణం చల్లబడి , తొలకరి జల్లులు కురియగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. వర్షాలు కురుస్తుండటంతో ఈ మృగశిర కార్తెలోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తుంటాయి. రైతులకు ఆనందం కలిగిస్తుంటాయి. అన్నదాతలకు మేలు చేసే ఈ పర్యావరణ నేస్తాలు... ఇప్పటి తరానికి ఇవేవో తెలియదు.. కానీ పల్లెటూళ్లో ఉండే పెద్దవారికి ఓ 30 ఏళ్లు పైబడిన వారందరికీ ఆ పురుగులు ఏంటో అవి తీసుకొచ్చే మెసేజ్ ఎంటో స్పష్టంగా తెలుసు.. ఇవి రైతులు దుక్కులు దున్నాక పొలాల్లో సందడి చేస్తాయి. వీటిని ఏ రైతు చంపడు.. ఎవ్వరినీ చంపనీయడు.. దేవతలకు , వరుణ దేవుడికి ప్రతిరూపంగా వీటిని భావిస్తారు.. కొలుస్తారు.. అలాంటి ఆరుద్ర పురుగులు వర్షాలు బాగపడి కాలమవుతుందనుకుంటేనే మనుషులకు కనిపిస్తాయి. ఈ పురుగులు గ్రామాల్లో కనిపించాయంటే రైతులు సంతోషంతో గంతులేస్తారు. ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం సంవృద్ధిగా వర్షాలు పడతాయని సంకేతం.. చెరువులు , కుంటలు , ప్రాజెక్టులు నిండుతాయనే ధీమా రైతుల్లో నెలకొంటుంది. ఈ అరుద్ర పురుగులు మనకు కనిపిస్తున్నాయంటే ఈసారి కాలమైనట్టే లెక్క.. ‘అరుద్ర’తో రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. బీడువారిన నేతలపై తొలకరి జల్లులు పడగానే బిలబిలామంటూ ఆరుద్ర పురుగులు నేలపైకి వచ్చేస్తాయి. అలా ఆరుద్రపురుగులు నేలపై కనిపిస్తే ఆ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురుస్తాయనీ..రైతన్నలు చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చని అంటారు. అలా..ఆరుద్ర పురుగులకు , రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఎర్రగా , బొద్దుగా చూడ ముచ్చటగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని రైతులు శుభసూచకంగా భావిస్తారు. ఇక వ్యవసాయం పనులు మొదలు పెట్టుకోవచ్చని ఆనందంగా పొలాలకేసి మళ్లుతారు. ఎర్రగా..బొద్దుగా..చక్కటి రంగులో మెరిసిపోయే ఈ అందమైన పురుగులు తొలకరి వర్షాలు కురవగానే కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి. వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ఆరుద్ర కార్తె అనుకూలమైంది. ఈ కార్తెలో మాత్రమే కనబడే అరుదైన పురుగు ఆరుద్ర. అందుకే దాన్ని ఆరుద్ర పురుగు అంటారు. ఇవి ప్రకృతి నేస్తాలు. సాధారణంగా ఈ ఆరుద్ర పురుగులు ఆరుద్ర కార్తెలో కనిపిస్తాయి. ఈ పురుగులను రైతులు చూస్తే చాలు ఆనందంతో పరవశించిపోతారు. ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని రైతుల నమ్మకం.సుబ్బారెడ్డి మనిషి స్వార్థం కోసం విచ్చలవిలవిడి ఎరువులు , రసాయనాలు వాడుతూ పుడమి తల్లిని కాలుష్యకాసారంగా మారుస్తున్నాడు. దీంతో వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఈ ఆరుద్ర పురుగును కొన్ని చోట్ల.. పట్టు పురుగు అనీ , చందమామ పురుగు అనీ , లేడీ బర్డ్ అనీ , ఇంద్రగోప పురుగు అని కూడా అంటారు. ఇలా చాలా పేర్లు ఉన్న ఈ పురుగు చూడటానికి ఎర్రని మఖ్మల్ బట్టతో చేసిన బొమ్మలాంటి పురుగులా ఉంటుంది. ముట్టుకుంటేనే అత్తిపత్తి చెట్టు ఆకుల్లా ముడుచుకు పోయే స్వభావం ఉన్న ఈ పురుగులు నేలమీద కాసింత ఇసుక నేలల్లో , పచ్చగడ్డి కాసింత ఉన్న చోట్లలో విరివిగా కనిపిస్తాయి. ఈ అందమైన , మెత్తనైన పురుగులు వర్షాకాలం తొలకరి వర్షాలు కురవగానే , బిల బిల మంటూ కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి. *🌺 సర్వేజనాః సుఖినో భవంతు 🌺* *_📿శుభమస్తు📿_* *🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏* రాజేష్ #నేటి రాశి ఫలాలు
9 likes
18 shares
Aaryan Rajesh
8K views 12 days ago
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం, *_నేటి మాట_* 🔔 *కృతజ్ఞత* 🔔 *దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి 10 ప్రత్యేక కారణాలు* 1. రోడ్డు మీద టైర్లు నడుస్తున్న కొద్దీ అరిగిపోతాయి, కానీ మన పాదాల అరికాళ్ళు జీవితాంతం నడిచినా, పరిగెత్తినా దాదాపు అలాగే ఉంటాయి. 2. మానవ శరీరంలో దాదాపు 75% నీరే ఉంటుంది, అయినా లక్షలాది రంధ్రాలు ఉన్నా ఒక్క చుక్క కూడా బయటకు కారదు. 3. ఆధారం లేకుండా ఏ వస్తువూ నిలబడలేదు, అయినా మానవ శరీరం తనను తాను సహజంగా సమతుల్యం చేసుకుంటుంది. 4. రీఛార్జింగ్ చేయకుండా ఏ బ్యాటరీ పనిచేయదు, కానీ గుండె పుట్టినప్పటి నుండి మరణం వరకు ఆగకుండా కొట్టుకుంటూనే ఉంటుంది. 5. ఏ పంపు కూడా శాశ్వతంగా నడవదు, అయినా రక్తం జీవితాంతం శరీరంలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. 6. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కెమెరాలకు కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన కళ్ళు ప్రతి దృశ్యాన్ని వేల మెగాపిక్సెల్‌లకు సమానమైన నాణ్యతతో చిత్రీకరిస్తాయి. 7. ఏ ప్రయోగశాల కూడా ప్రతి రుచిని పరీక్షించలేదు, అయినా నాలుక ఎలాంటి పరికరాలు లేకుండా వేలాది రుచులను గుర్తిస్తుంది. 8. అత్యంత అధునాతన సెన్సార్లకు కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన చర్మం అతి చిన్న స్పర్శను, అనుభూతిని కూడా గ్రహించగలదు. 9. ఏ యంత్రమూ ప్రతి ధ్వనినీ సృష్టించజాలదు, కానీ మానవ స్వరం వేలకొద్దీ పౌనఃపున్యాలను సృష్టించగలదు. 10. ఏ పరికరమూ అన్ని ధ్వనులనూ పూర్తిగా విశ్లేషించజాలదు, కానీ మన చెవులు ప్రతి ధ్వనినీ అర్థవంతంగా గ్రహించి, అన్వయించుకుంటాయి. దేవుడు ప్రసాదించిన ఈ అమూల్యమైన వరాలకు మనం కృతజ్ఞతతో ఉండాలి, ఫిర్యాదు చేయడానికి మనకు నిజంగా ఏ హక్కూ లేదు. ప్రతి ఉదయం నిద్రలేవడమే ఒక అద్భుతం. కాబట్టి ప్రతిరోజూ సర్వశక్తిమంతుడైన దేవునికి కృతజ్ఞతలు తెలుపండి. *_🌺శుభమస్తు🌺_* 🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #నేటి రాశి ఫలాలు
76 likes
110 shares