Amaravati

50 Posts • 30K views
అమరావతిలో ఐకానిక్ టవర్లను, సాధారణ పరిపాలనా భవనాలను పోల్చి ఖర్చు ఎక్కువైందని వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం చూస్తే, అసలు రాజధాని నిర్మాణం వెనుక ఉన్న ఆలోచననే వారు అర్థం చేసుకోవడం లేదో, లేక తెలిసీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారో అనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సాధారణ సెంట్రల్ సెక్రటేరియట్ భవనాల చదరపు అడుగు రేట్లను తీసుకుని, అమరావతిలో నిర్మించే ఐకానిక్ నిర్మాణాల ఖర్చుతో పోల్చి ఏదో పెద్ద విషయం కనిపెట్టినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఈ పోలికే తప్పు. అమరావతిని నిర్మించాలని నిర్ణయించినప్పుడే ఇది కేవలం ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కాకూడదని నిర్ణయించుకున్నాం. ఇది రాష్ట్ర గౌరవాన్ని ప్రతిబింబించే రాజధానిగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ గర్వకారణంగా నిలవాలి. అందుకే ప్రపంచ స్థాయి ఆర్కిటెక్ట్‌లతో డిజైన్లు రూపొందించించాం. అందుకే కొన్ని భవనాలను ప్రత్యేకంగా ఐకానిక్ నిర్మాణాలుగా ప్లాన్ చేశాం. ఒక త్రీ స్టార్ హోటల్ గది నిర్మించడానికి 30-40 లక్షలు ఖర్చవుతుంది. అదే ఫైవ్ స్టార్ హోటల్ గది కోటి ఇరవై లక్షల నుంచి కోటి ముప్పై లక్షల వరకు ఖర్చవుతుంది. అత్యంత లగ్జరీ హోటళ్లలో అది రెండు కోట్ల వరకు కూడా వెళ్లొచ్చు. మూడు చోట్లా గది ఒకటే. కానీ ఖర్చు ఒకటి కాదు. హ్యుందాయ్ క్రెటా, మెర్సిడెస్ బెంజ్ GLA రెండూ ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్తాయి. కానీ ఒకటి 20 లక్షలు ఉంటే, మరొకటి 60-70 లక్షలు ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం కేవలం ఉపయోగానికి మాత్రమే కాదు, నాణ్యతకు, డిజైన్‌కు, ప్రతిష్ఠకు, గుర్తింపుకు కూడా చెల్లిస్తున్నాం. అమరావతి ఐకానిక్ నిర్మాణాల విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మనం ఢిల్లీకి వెళ్తే వందలాది ప్రభుత్వ భవనాలు కనిపిస్తాయి. కానీ ఫోటోలు దిగేది రాష్ట్రపతి భవన్ ముందు, పార్లమెంట్ ముందు. ఎందుకంటే అవే రాజధాని గుర్తింపును నిర్వచించే నిర్మాణాలు. ప్రపంచంలో ఏ నగరానికి వెళ్లినా వేలాది భవనాలు కనిపిస్తాయి. కానీ ఆ నగరాన్ని గుర్తు చేసే భవనాలు కొన్ని మాత్రమే ఉంటాయి. లండన్‌ను వెస్ట్‌మినిస్టర్ ఎలా నిర్వచిస్తుందో, న్యూయార్క్‌ను ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఎలా నిర్వచించిందో, అమరావతిని కూడా ఈ ఐకానిక్ నిర్మాణాలే నిర్వచించబోతున్నాయి. అందుకే వాటిపై ఎక్కువ ఖర్చు పెట్టడం వ్యర్థం కాదు. అది ఒక శతాబ్దం నిలిచే రాజధాని గుర్తింపుపై చేసే పెట్టుబడి. అసలు వైసీపీ ప్రజలకు చెప్పని విషయం ఏమిటంటే, అమరావతిలోని చాలా సాధారణ ప్రభుత్వ భవనాలు చదరపు అడుగుకు నాలుగు వేల రూపాయల లోపే నిర్మితమవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భవనాల కంటే కూడా తక్కువ ఖర్చుతో నిర్మిస్తున్నారు. కానీ వాటిని పక్కనపెట్టి, కేవలం ఐకానిక్ నిర్మాణాల ఖర్చును మాత్రమే తీసుకుని మొత్తం అమరావతి ప్రాజెక్టును విమర్శించడం రాజకీయ ప్రచారం తప్ప, నిజాయితీతో కూడిన విశ్లేషణ కాదు. వాళ్లు చూస్తున్నది ఖర్చు మాత్రమే. మనం చూస్తున్నది 100 సంవత్సరాల తర్వాత కూడా నిలిచే ఒక రాజధాని గుర్తింపును. రెండు సంవత్సరాలు ఆగండి. అమరావతిలో కట్టబోయే ఐకానిక్ భవనాల రేంజ్ ఏమిటో, వాటి స్కేల్ ఎంత పెద్దదో, వాటి ఆర్కిటెక్చర్ ఎంత ప్రత్యేకమో అప్పుడు అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు వైసీపీ నాయకులు విమర్శిస్తున్న నిర్మాణాలే, రేపు అమరావతి గుర్తింపుగా నిలుస్తాయి. అప్పుడు ఈ పోలికలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో వాళ్లకే అర్థమవుతుంది #jai amaravati #one state, one capital, jai amaravati #andhra pradesh #📰జాతీయం/అంతర్జాతీయం #💪పాజిటీవ్ స్టోరీస్
6 likes
10 shares
svd suryajyothy
1K views 29 days ago
ఆంధ్రప్రదేశ్ ని డెస్టినీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గా మనం మార్చుకున్నాం#andhrapradesh #naralokesh #investment #svdsuryajyothy #news ##Nara Lokesh #andhrapradesh #శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు #svdsuryajyothy #news
21 likes
14 shares