🕉️🙏యోగిని ఏకాదశి విశిష్టత 🌺☪️👩‍👩‍👧‍👦🌧️

18 Posts • 40K views
*పండరీపురం పాండురంగ ఉత్సవం* _పండరీపురం పాండురంగ ఉత్సవం_ *ఓం నమో పాండురంగాయ* *ఓం నమో పుండరీక వర్మయా* *ఓం నమో నారాయణాయ* *ఓం నమో ఆశ్రిత జన రక్షకాయ* శ్రీ పాండురంగ స్వామి వారి లీలావిశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం పండరీపురం. ఈ ఆలయంలో ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తారు. దీనినే పండరీపురం పాండురంగ ఉత్సవం అంటారు. అన్ని ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొట్టమొదటిది. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయాన్ని, పాండురంగస్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రత్యేక సేవలు చేస్తారు. కీర్తనలు పాడతారు. మహారాష్ట్ర చంద్రభాగ (భీమా) నదీ తీరాన పండరిపురంలో కొలువైన పాండురంగ స్వామిని విఠలుడు అనికూడా పిలుస్తారు. ఈ స్వామి వైభవం తొలి ఏకాదశి నాడే చూడాలని చెబుతారు. అంత వైభవంగా అక్కడ ఉత్సవం జరుగుతుంది. మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 'విఠోబా' పేరుతో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. విష్ణువు మరో రూపమే మహారాష్ట్రలోని పండరిపురంలో కొలువైన పాండురంగడు. శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన పుండరీకుడికి మోక్షం ప్రసాదించడానికి పండరీపుర క్షేత్రంలో పాండురంగడుగా అవతరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీపాండురంగ స్వామివారి లీలా విశేషాలకు నిదర్శనంగా, భక్తుల పాలిటి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న పండరీపురం దివ్య క్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఈ పుణ్య క్షేత్రాన్ని ఆనుకుని ఉన్న భీమా నదిలో స్నానమాచరిస్తారు. భీమా నదిలో స్నానం చేయడం వలన సకల పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు నదికి సమీపంలో ఉన్న పుండరీకుని మందిరానికి చేరుకుంటారు. శ్రీపాండురంగ స్వామి ఇక్కడ కొలువుతీరడానికి పుండరీకుడే కారణంగా చెబుతుంటారు. ఆ కారణం చేత భక్తులు మొదటగా పుండరీకున్ని దర్శించుకుంటారు. శ్రీపాండురంగ స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పద్దెనిమిదవ శతాబ్దం కాలంలోనే ఈ ఆలయం అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. ఇక్కడ పాండురంగస్వామిని భక్తులు మెట్లమార్గం ద్వారా దర్శించుకుంటారు. పండరీపురంలో శ్రీపాండురంగస్వామి కొలువుదీరడం వెనుక ఒక పురాణగాథ ఉంది. పుండరీకుడు అనే వ్యక్తి భోగాలాలసుడై విష్ణు భక్తులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాడు. అప్పుడు అతని తల్లిదండ్రులు శ్రీహరిని వేడుకుని, తమ కొడుకు బుద్ది మార్చమని అర్థించేవారు. కాలక్రమంలో వేశ్యాలోలుడైన పుండరీకుడు తల్లిదండ్రులను, భార్యను కూడా ఇంట్లో నుండి వెళ్లగొట్టాడు. అనంతరం జరిగిన పరిణామాలతో పుండరీకుడికి జ్ఞానోదయమై పశ్చాత్తాపం చెంది అహో రాత్రులు అన్నపానీయాలు మానుకుని తమ తల్లిదండ్రులకు సేవచేశాడు. పుండరీకున్ని శ్రీహరి పరీక్షించదలచి, పుండరీకుడి దగ్గరకు వచ్చి, తాను వచ్చానని చెప్పాడట. అంతలో పుండరీకుడు తాను తన తల్లిదండ్రుల సేవలో ఉన్నానని, అతని వద్దకు ఒక ఇటుకను విసిరి అక్కడ దాని మీద ఆసీనులుకమ్మని చెప్పాడు. పుండరీకుడు వచ్చేవరకు శ్రీకృష్ణుడు ఆ ఇటుకరాయి మీద నిలబడి ఉంటాడు. పుండరీకుడు తల్లిదండ్రులకు చేసిన సేవలకు మెచ్చుకొని శ్రీహరి అతనికి వరం ఇవ్వాలనుకున్నాడు. పుండరీకుడు శ్రీహరిని అక్కడే ఉండమని కోరుకున్నాడు. అందువల్ల శ్రీహరి అక్కడే శిలారూపుడయ్యాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీహరి అలా శిలారూపుడైన దివ్వ క్షేత్రమే పండరీపురం. మధురలో ఉన్న రుక్మిణీదేవి కృష్ణుడు కనుపించక పోవటంతో ఆయనను వెదుక్కుంటూ వచ్చిన రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు పండరీపురంలో నిలబడి ఉండటం చూసి తాను కూడ అక్కడే ఉండిపోయింది. కాని తనతో చెప్పకుండ కృష్ణుడు వచ్చినందుకు అలిగిన రుక్మణీదేవి ఆయన పక్కన కాకుండ కొంత దూరంగా ఉండి పోయింది. అందువల్లనే పాండురంగ ఆలయంలో కాకుండా ఆలయం వెనుక పక్క రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. పక్కన ఉన్న ఉపాలయాల్లో సత్యభామ, రాధాదేవి, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, సూర్యనారాయణుడు, మహాలక్ష్మీ, వేంకటేశ్వరస్వామికూడా కొలువుతీరి ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడ పాండురంగస్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో కనిపిస్తారు. ఆషాఢ ఏకాదశినాడు నిర్వహించే పాండురంగస్వామి ఉత్సవం సందర్భంగా ఈ ప్రాంతమంత భక్తజన సంద్రమవుతుంది. ఉత్సవంలో స్వామివారిని దర్శించుకుంటే వారి ఆశీర్వాదం మెండుగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఉత్సవంలో పాల్గొనడానికి తరలి వస్తారు. ___________________________________________ ఓం శ్రీ మాత్రే నమః ✍🏻 ___________________________________________ #🕉️🙏యోగిని ఏకాదశి విశిష్టత 🌺☪️👩‍👩‍👧‍👦🌧️ #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #🌅శుభోదయం #జయ పాండురంగ విఠల ప్రభో 🙏🕉️🙏
2751 likes
17 comments 257 shares
*యోగిని ఏకాదశి శుభాకాంక్షలు* నేడు యోగినీ ఏకాదశి సందర్భంగా... దైవనామస్మరణతో మనసు మీదా, ఉపవాసంతో శరీరం మీదా అదుపుని సాధించి... భగవంతునికి చేరువకావడమే ఏకాదశి ఉపవాసాల వెనుక ఉన్న పరమార్థం. అందుకే ఏడాది పొడవునా ప్రతి ఏకాదశికీ ఏదో ఒక విశిష్టతను కల్పించారు పెద్దలు. అలా ఈనాటి జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున వచ్చే ఏకాదశి పేరే... యోగినీ ఏకాదశి. ఈ యోగినీ ఏకాదశి గురించి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుకి ఉపదేశించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ ఏకాదశి ఆచరణ గురించి ఓ చిత్రమైన కథ ప్రచారంలో ఉంది. అదేమిటంటే... అలకాపురిని ఏలుతున్న కుబేరుడు పరమ శివభక్తుడు. శివార్చన కోసం కావల్సిన పుష్పాలను సమకూర్చే పనిని కుబేరుడు, హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు. తనకు అప్పగించిన పనిని హేమమాలి పరమ నిష్టతో ఆచరించేవాడు. మానససరోవరం నుంచి పుష్పాలను తీసుకువచ్చి కుబేరుని చెంత ఉంచేవాడు. ఒకనాడు భార్య సౌందర్యారాధనలో మునిగిపోయి ఉన్న హేమమాలి కుబేరుని శివారాధన గురించే మర్చిపోయాడు. అక్కడ అంతఃపురంలో ఉన్న కుబేరుడు తన చెంతకి ఎంతకీ పుష్పాలు రాకపోయేసరికి చిరాకుపడిపోయాడు. కుబేరుడు మండిపడుతూ ‘నీ శరీరం మీద మోహంతో, మనసు సైతం మలినమైపోయింది. అందుకు ప్రతిఫలంగా కుష్టు వ్యాధిగ్రస్తుడవై భార్యకు దూరంగా భూలోకం మీద జీవించమం’టూ శపించాడు. కుబేరుని మాటలకు హేమమాలి గుండె పగిలిపోయింది. తొలి తప్పుని మన్నించమంటూ తన స్వామిని ఎంతగా వేడుకున్నా ఉపయోగం లేకపోయింది. ఇక కుబేరుని శాపాన్ని స్వీకరించి కుష్టువ్యాధిగ్రస్తుడై, భూలోకం మీద సంచరించసాగాడు. హేమమాలి అదృష్టమో, లేక ఇన్నాళ్లుగా అతను శివారాధనలో పాల్గొన్న పుణ్యఫలమోగానీ... అతనికి మార్కండేయ రుషి దర్శనం లభించింది. హేమమాలిని చూసిన మార్కండేయ రుషికి చెప్పలేనంత జాలి కలిగింది. ‘యోగినీ ఏకాదశినాడు ఉపవాసం ఉంటే నువ్వు శాపవిమోచనాన్ని పొందుతావు’ అంటూ ఉపాయాన్ని సూచించారు మార్కండేయులవారు. మార్కండేయులు సూచించిన మేరకు జ్యేష్ఠబహుళ ఏకాదశినాడు వచ్చే యోగినీ ఏకాదశి రోజున ఉపవాసమాచరించి, మనసులో దైవాన్ని పదే పదే ప్రార్థించి... హేమమాలి తన శాపవిమోచనాన్ని సాధించాడు. తిరిగి అలకాపురిని చేరుకుని తన భార్యను కలుసుకున్నాడు. అలా కేవలం హేమమాలి మాత్రమే కాదు... ఎవరైతే యోగినీ ఏకాదశి నాడు ఉపవాసాన్ని ఆచరించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తారో వారు గత పాపకర్మల నుంచి విమోచనం పొందుతారన్నది కృష్ణుని ఉవాచ. హేమమాలి వృత్తాంతం కేవలం ఒక గాథ మాత్రమే కాదు! జీవికి తన శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని విడనాడాలన్న హెచ్చరిక. ఆ మోహాన్ని జయించేందుకు ఏకాదశి ఒక సాధనం అని తెలియచేసే ప్రతీక! ఏకాదశి వ్రతంలో ఉన్న అంబరీషునిపై కోపించినందుకు శ్రీహరి చేతిలోని సుదర్శన చక్రం దూర్వాసుని వెంటాడిన కథ మనకు తెలిసిందే. మురాసుర సంహార సమయంలో విష్ణుదేవునికి సహకరించిన శక్తికే ఏకాదశి అనే పేరు వచ్చింది. చాంద్రమానం ప్రకారం పౌర్ణమికి, అమావాస్యకు తరువాత వచ్చే 11వ రోజును ఏకాదశి అని పిలుస్తారు. శుక్ల, కృష్ణపక్షాలు రెండూ కలిపి, సంవత్సరకాలంలో ఇరవైనాలుగు ఏకాదశులు వస్తాయి. అధికమాసం వచ్చినప్పుడు మరో రెండు వస్తాయి. ఈ ఇరవై ఆరు ఏకాదశులకు వేర్వేరు పేర్లున్నాయి. వాటికి సంబంధించిన కథలున్నాయి. ఈ కథలన్నింటినీ ధర్మరాజుకు శ్రీకృష్ణుడు వివరించినట్లు మహాభారతం పేర్కొంటోంది. భారతం ప్రకారం మార్గశిర మాసంతో మొదలుపెట్టి మళ్లీ మార్గశిరం వరకూ ఏకాదశి ప్రతం చేయడం ఒక విధానం. పగటిపూట ఉపవాసం చేయాలి. రాత్రికి విష్ణుస్మరణతో జాగరణ చేయాలి. ద్వాదశి తిథి దాటిపోకుండా విష్ణుభక్తులను పూజించి, భుజించాలి. జ్యేష్టమాసంలో అమావాస్యకు ముందుగా వచ్చే ఏకాదశికి అపర ఏకాదశి లేదా యోగిని ఏకాదశి అనిపేరు. త్రివిక్రమ రూపంలో ఉన్న వామనస్వామిని ప్రత్యేకంగా పూజించాలి. ఈ ఏకాదశిని ఆచరించిన వారికి పుత్రపౌత్రాభివృద్ధి, సంపదలు కలుగుతాయి. శ్రీ మహావిష్ణువును కుబేరుడు రోజూ పుష్పాలు, వనమాలల చేత అర్చించేవాడు. ప్రతినిత్యం ఇలా చేస్తున్న సమయంలో ఒకసారి పుష్పాలు తెచ్చే సేవకుడు తన విధిని మరచిపోయాడు. అందువలన స్వామి సేవకు లోపం కలిగిందని ఆ సేవకుడిని కుబేరుడు దూషించాడు. ఆ సేవకుడు తన అపచారాన్ని అంగీకరించాడు. శ్రీమన్నారాయణుడి ఆగ్రహానికి గురి అయ్యాడు, సర్వం కోల్పోయాడు. తర్వాత కుబేరుడి భోదన మేరకు జ్యేష్ఠ మాసం కృష్ణ పక్షంలో వచ్చే బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును అర్చించాడు. ఫలితంగా తన తేజస్సును, సేవక వృత్తిని తిరిగి పొందగలిగాడు. అందుకే ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. యోగులకు కూడా స్వామి కైవల్యాన్ని ప్రసాదించే ఏకాదశి కనుక దీనికి యోగిని ఏకాదశి అని పేరు వచ్చిందని మరియొక కథ ద్వారా పండితులు చెబుతున్నారు. అందువలన నేడు ఆ శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఉపవాసం ఉంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ___________________________________________ ఓం శ్రీ మాత్రే నమః ✍🏻 ___________________________________________ #🌅శుభోదయం #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #భక్తి -జ్ఞానం-ఆధ్యాత్మికత #🕉️🙏యోగిని ఏకాదశి విశిష్టత 🌺☪️👩‍👩‍👧‍👦🌧️
12 likes
13 shares