కుర్చీ తాత ఇకలేరు

2 Posts • 2K views
( 21 - 5:- 2026) పుట్టినవాడు గిట్టక మానడు అనే నానుడి ఎంత నిజమైనప్పటికి,మనం ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఏమి తీసుకురాము,అదేమాదిరి ఈ భూమి మీద నుంచి శాశ్వత నిష్క్రమణ తీసుకునేటప్పుడు కూడా ఎవరైనా,ఎంతటివారైనా, మహమహులు అయిన నూలు పోగు కూడా వారి వెంట తీసుకుపోరు.కేవలం రిక్త హస్థాలతో మాత్రమే వారంతా వెళ్ళిపోతారు.అయితే ఎన్ని అష్ట ఐశ్వర్యాలు,మణి మాణిక్యాలు ఉన్న అవేవి మన వెంట రావు.ఆవి ఆశాశ్వతం కూడా,అయితే మనం వెళ్ళిపోయిన మనల్ని మరో పది కాలాల పాటు ఈ సమాజం, ఈ సమాజంలోని ప్రజలు గుర్తించుకునేది మనం జీవించి ఉన్నప్పుడు చేసిన మంచి పనులు మాత్రమే శాశ్వత గుర్తింపుకు నోచుకుంటాయి అనే మాట అక్షర సత్యం.ఆ విధంగా తన దగ్గర అష్ట ఐశ్వర్యాలు,మణి మాణిక్యాలు లేకున్నా,ఆయన ఓక సామాన్యుడు అయిన కేవలం తనకున్న వాక్ చాటుర్యం,నిజాన్ని నిర్భయంగా మాట్లాడే దమ్ము, దైర్యం ఈ కుర్చీతాత సొంతం.ఆ నైపుణ్యంతోనే సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయ్యి తనకంటూ ఓక ప్రత్యేక ఇమేజ్,గుర్తింపు సాధించుకున్న ఈ కుర్చీ తాత నింగికి పయనమై వెళ్లడం అత్యంత బాధాకరం.ఈ విషాద సమయాన అత్యంత శోక సముద్రంలో మునిగిపోయిన కుర్చీ తాత కుటుంబసభ్యులు వీలయినంత త్వరగా ఈ విషాదం నుంచి కోలుకొని మాములు మనుషులు అయ్యేలా ఆ సర్వేశ్వరుడు వారిని తన అనంత కరుణ,కృప కటాక్ష్యలతో అనుగ్రహించాలని హృదయపూర్వకంగా,మనసా, వాచ,కర్మణ కోరుకుంటున్నాను! - మధుసూదనరెడ్డి బుగ్గన,సామాజిక విశ్లేషకుడు, బేతంచెర్ల! #కుర్చీ తాత ఇకలేరు
11 likes
8 shares