🧡🧡గీతా గోవిందం 💜💜

3 Posts • 55K views
Satya Vadapalli
1K views 1 months ago
🚩 *శ్రీ వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం*🚩 *సప్తరుషి కృతం* శేషాచలం సమాసాద్య కశ్య పాద్యా మహర్షయః వేంకటేశం రమానాథం శరణం ప్రాపురంజసా! కలి సంతారకం ముఖ్యం స్తోత్రమేతజ్జపేన్నరః సప్తర్షి వాక్ప్రసాదేన విష్ణుస్తస్మై ప్రసీదతి!! కశ్యప ఉవాచ: కాది హ్రీమంత విద్యాయాః ప్రాప్త్యైవ పరదేవతా! కలౌ శ్రీ వేంకటేశాఖ్యా తామహం శరణం భజే!! అత్రి ఉవాచ: అకారాది క్షకారాంత వర్ణైర్యః ప్రతిపాద్యతే! కలౌ శ్రీ వేంకటేశాఖ్యాః శరణం మే ఉమాపతిః!! భరద్వాజ ఉవాచ: భగవాన్ భార్గవీ కాంతో భక్తాభీప్సిత దాయకః! భక్తస్య వేంకటేశాభ్యో భారద్వాజస్య మే గతిః!! విశ్వామిత్ర ఉవాచ: విరాడ్విష్ణుర్విధాతా చ విశ్వ విజ్ఞాన విగ్రహః! విశ్వామిత్రస్య శరణం వేంకటేశో విభుస్సదా!! గౌతమ ఉవాచ: గౌర్గౌరీశ ప్రియో నిత్యం గోవిందో గోపతిర్విభుః! శరణం గౌతమస్యాస్తు వేంకటాద్రి శిరోమణిః!! జమదగ్ని ఉవాచ: జగత్కర్తా జగద్భర్తా జగద్ధర్తా జగన్మయః! జమదగ్నేః ప్రపన్నస్య జీవేశో వేంకటేశ్వరః!! వశిష్ఠ ఉవాచ: వస్తు విజ్ఞాన మాత్రం యన్నిర్విశేషం సుఖం చ సత్! తద్బ్రహ్మైవాహ మస్మీతి వేంకటేశం భజే సదా!! సప్తర్షి రచితం స్తోత్రం సర్వదాయః పఠేన్నరః! సో౭భయం ప్రాప్నుయాత్సత్యం సర్వత్ర విజయీ భవేత్!! *శ్రీ వెంకటేశ్వర స్వామి తత్వాన్ని సప్త ఋషులు ఆవిష్కరించిన స్తోత్రం.* *ఓం నమో వేంకటేశ్వర నమో నమః* #దేవుళ్ళ స్టేటస్ #శుభోదయం #😍గోవిందా గోవింద 🙏 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻శనివారం భక్తి స్పెషల్
28 likes
21 shares
Satya Vadapalli
1K views 3 days ago
#శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం - వాడపల్లి: తూర్పు గోదావరి జిల్లాలోని ఆత్రేయపురం నుండి నుండి 6 కి.మీ దూరంలో ఉంటుంది ఈ గ్రామం. ఈ ఆలయం ఏంతో ప్రసిద్ధి చెందిన ఆలయం ఈ ఆలయాన్ని కోనసీమ_తిరుపతి అని కూడా అంటారు. ఈ ఆలయ విశేషాలు చూస్తే తల్లి గోదారమ్మ రెండు పాయలుగా విడిపోయి ఒకటి వశిష్ఠ మరొకటి గౌతమి పాయలు గా పయనిస్తోంది. పచ్చని కోనసీమలో గోదావరి నది ఒడ్డున గౌతమి పాయ నందు వాడపల్లి గ్రామంలో శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామి వారి అవతారంలో ఇక్కడ స్వయంభూ వెలిసారు. వాడపల్లి గ్రామాన్ని పూర్వం " నౌకాపురి " అని పిలిచేవారు. నది ఒడ్డున వెలసిన స్వామి వారిని నారద మహర్షి వారు కనుగొని తన స్వహస్తలలో ప్రతిష్టించి వెంకటేశ్వరునిగా నామకరణం చేశారు. గోదావరి నదిలో వరద ముంచెత్తడం వలన నారదుడు నిర్మించిన ఆలయం నది గర్భంలో కలిసిపోయింది. ఆ రోజుల్లో పినుబోతు గజేంద్రుడు అను వారు కొన్ని పడవలకు అధిపతిగా ఉండేవారు ఒకసారి పెద్ద తుఫాన్ సంభవించడంతో ఆ పడవలు అన్ని సముద్రంలో కలిసిపోగా ఆయన స్వామి వారిని వేడుకున్నాడు స్వామి నా పడవలు సముద్ర గర్భం నుండి తీయిస్తే నిన్ను గోదావరి నది నుండి వెలికి తీసి నీకు ఆలయం నిర్మించి ప్రతిష్టిస్తాను అని అనగా ఆ మరుసటి రోజు నౌకలు అన్ని నది ఒడ్డుకి చేరడంతో అన్న మాట ప్రకారం స్వామి వారికి ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమేనా ఆలయ పూజలు అర్చకులకు భారంగా ఉండటం వలన స్వయంగా స్వామి వారు పెద్దాపురం సంస్థాన రాజు అయిన రాజా శ్రీ వత్సవాయి పెమ్మ గజపతి మహారాజు గారికి కలలో కనిపించి దైవ సమాన పూజలతో నువ్వు పునితుడవు అయితే వైకుంఠమునకు చేరువుతావు అని చెప్పగా ఆయన స్వామి వారి గురించి అడిగి తెలుసుకుని వాడపల్లి కి చేరి స్వామి వారి నిత్య నైవేద్య పూజల నిమిత్తం 1759 వ సంవత్సరంలో రాజు గారు వారి ఆస్తి 270 ఎకరాలు స్వామి వారికి సమర్పించారు. ఈ క్షేత్రం మూల విరాట్ రాతితో చేసినది కాదు చెక్కతో చేసినది. ఇక్కడ ఏడు వారాలు వ్రతం చేసి ఎనిమిదవ వారం అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అని నమ్మకం అందుకే ప్రతి స్థిరవారం ( శనివారం ) ఈ ఆలయానికి సుమారు 50 వేల కు పైనే భక్తులు విచ్చేస్తారు. ఎంతటి కష్టాలు అయిన సరే స్వామి వారిని 7 స్థిరవారాలు దర్శిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయి అని బలమైన నమ్మకం. ఈ ఆలయంలో స్వామి వారికి కుడి వైపున వేణుగోపాల స్వామి వారు, ఉత్తరం వైపు అలివేలుమంగతయారు అమ్మవారు, ఆగ్నేయంలో శ్రీ రామానుజులు వారు వారి శిష్యులు, దక్షిణం వైపు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారు దర్శనం ఇస్తారు మనకి. ప్రతి శనివారం ఈ ఆలయంలో 108 లేదా 7 ప్రదక్షిణాలు చేసే వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. || ఓం నమో వేంకటేశాయ || #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #😍గోవిందా గోవింద 🙏 #🌅శుభోదయం #దేవుళ్ళ స్టేటస్
109 likes
1 comment 19 shares