హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి
16 Posts • 15K views
❤️🩵*పంచరంగ క్షేత్రాల గురించి విన్నారా!🪭 🟠🟡రంగనాథ స్వామి ఆలయాలు🪭 💜💛జలం ఏ పాత్రలోకి ఒంపితే, ఆ రూపాన్ని పొందుతుంది. భగవంతుడు కూడా అంతే! భక్తులు ఏ రూపంలో ఆయనను కొలుచుకోవాలనుకుంటే.... ఆ రూపంలోకి ఇమిడిపోతాడు. అలా ఆదిశేషుని మీద శయనించే విష్ణుమూర్తిని, రంగనాథస్వామిగా కొల్చుకోవడం కద్దు. దక్షిణాదిన ఈ రంగనాథ స్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో పంచరంగ క్షేత్రాల గురించి చెప్పుకోవాల్సిందే. కావేరీ తీరాన వెలసిన ఈ పంచరంగ క్షేత్రాలు తమిళ, కన్నడ ప్రజలకు చాలా ప్రత్యేకం. ఆ పంచరంగ క్షేత్రాల వివరాలు ఇవిగో… 💦- 1-శ్రీరంగపట్నం💧 ఈ పేరు వినగానే మనకు టిప్పు సుల్తాన్‌ కథలే గుర్తుకువస్తాయి. టిప్పు రాజ్యానికి రాజధానిగా సాగిన ఈ పట్నానికి ఆ పేరే అందులోని రంగనాథుని ఆలయం మీదుగా వచ్చింది. ఇక్కడి శ్రీదేవి, భూదేవి సహిత రంగనాథుని ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్‌ సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించినవారే! 💦-2- తిరుప్పునగర్‌💧 తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉందీ గ్రామం. ఇందులోని స్వామి పేరు ‘అప్పకుడతాన్‌ పెరుమాళ్‌’. ఇక్కడ ఉభమన్యు అనే రాజుకి విష్ణుమూర్తి ఒక ముసలివాని రూపంలో దర్శనమిచ్చాడట. ఆయనకు ఎంత ఆహారాన్ని అందించినా ఆకలి తీరలేదట. చివరికి పరాశర మహర్షి సూచనతో భక్తితో అప్పాలని అందించినప్పుడే తృప్తి లభించిందట. అప్పటి నుంచి ఈ స్వామికి అప్పకుడతాన్ స్వామి అని పేరు. పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటిగా కూడా ఈ ఆలయాన్ని ఎంచుతారు. 💦-3-కుంబకోణం💧 ఒకప్పుడు హేమ రుషి అనే ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సుని ఆచరించాడట. దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువల నుంచి ఉద్భవించింది. అలా అవతరించిన లక్ష్మీదేవిని కోమలవల్లి అన్న పేరుతో కొలుచుకున్నారు. లక్ష్మీదేవి చెంత ఆ విష్ణుమూర్తి కూడా ఉండాల్సిందే కదా! ఆయన కూడా భువికి అవతరించాడు. ఇలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిల్చుకుంటారు. 💦-4-మయిలదుతురై💧 చంద్రుని తపస్సుకి మెచ్చి ఆ విష్ణుమూర్తి అవతరించిన చోటు ఇది. పరాకల్‌ అనే ఆళ్వారుని భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారట. అలా చూసుకున్నా ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు తోస్తుంది. ఇక్కడి స్వామి పేరు ‘పరిమళ పెరుమాళ్‌’. వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటైన ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని చెబుతారు. 💦-5-శ్రీరంగం💧 పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని ఆద్యరంగం (చివరి క్షేత్రం)గా పిలుస్తారు. కానీ అన్నింటిలోకీ ప్రముఖమైనది ఈ ఆలయమే! విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖురూపంలా తోచే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమైంది. ఇక్కడి మూలవిరాట్టుని సాక్షాత్తు విభీషణుడు ప్రతిష్టించినట్లు చెప్పుకొంటారు. విష్ణుభక్తిలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే! గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది ఇక్కడే! ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించడానికే 300 ఏళ్లకు పైగా సమయం పట్టిందని చెబుతారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురంగా ప్రసిద్ధకెక్కిన ఈ ఆలయాన్ని దర్శించకుంటే సర్వశుభాలూ జరుగుతాయని నమ్మకం. 💦ఇవీ పంచరంగ క్షేత్రాల విశేషం. కొన్ని జాబితాలలో ఇందులోని కుంబకోణం బదులు వటనగరంలోని రంగనాథ పెరుమాళ్‌ ఆలయాన్ని పేర్కొంటూ ఉంటారు. 🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒 #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి
39 likes
37 shares
1. మహాలక్ష్మీ ఆలయం - ముంబై ముంబైలోని మహాలక్ష్మీ ఆలయం సంపద, శ్రేయస్సుకు అధిదేవత అయిన మహాలక్ష్మీ అమ్మవారి పురాతన సుప్రసిద్ధ దేవాలయం. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి విగ్రహాలు ఉంటాయి. ఇది 1831వ సంవత్సరంలో నిర్మించనబడిని అతి పురాతన దేవాలయం. ముంబై నగరంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో ఇదొకటి. ముఖ్యంగా నవరాత్రి, దీపావళి వంటి సమయాల్లో ఈ దేవాలయం చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరడంతో పాటు సిరిసంపదలు, శ్రేయస్సు, బుద్ధి కుశలత, జ్ఞానం కలుగుతాయని భక్తుల నమ్మకం. 2. లక్ష్మీ నారాయణ టెంపుల్‌ - వెల్లూర్‌ (శ్రీపురం) వెల్లూర్‌ సమీపంలో ఉన్న శ్రీపురం స్వర్ణ దేవాలయం సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన బంగారు ఆలయం. దీనిని శ్రీనారాయణి పీఠం నిర్మించింది. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయం. దీనిని లక్ష్మీనారాయణి స్వర్ణ దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయం శ్రీ యంత్రం ఆకారంలో ఉంటుంది. ఏడు ద్వారాలు కలిగి ఉండి వేల కిలోల (సుమారు 15 వేల) బంగారంతో నిర్మించబడి ఉంటుంది. ఇది ఆధ్యాత్మికతకు, గొప్ప శిల్ప కళకు నిదర్శనం. వెల్లూరు నుంచి సులభంగా ఇక్కడకు చేరుకోవచ్చు. జీవితంలో తప్పక చూడాల్సిన దేవాలయాల్లో ఇదీ ఒకటి. 3. నిమిషాంబ టెంపుల్‌ - శ్రీరంగపట్నం (కర్ణాటక) కర్ణాటక రాష్ట్రంలోని శ్రీరంగపట్నానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంజాం అనే చిన్న పల్లెటూరిలో పార్వతీ దేవి అవతారమైన నిమిషాంబ దేవి ఆలయం వెలసి ఉంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తాగునీరు, సాగునీరుకి ముఖ్య ఆధారం కావేరి నది. సాధారణంగా జీవుల దాహార్తిని తీర్చే కావేరి నది భక్తుల ఆధ్యాత్మిక ఆర్తిని కూడా తీరుస్తుంది. అందుకే శ్రీవైష్ణవులకు ఆరాధ్యమైన శ్రీరంగం క్షేత్రం మరియు శైవులకు ఇష్టమైన తంజావూర్ ఈ కావేరి నదీ తీరంలోనే ఉన్నాయి. ఇక ఈ పవిత్ర ప్రదేశంలోనే వెలసిన పార్వతీ దేవి అవతారమైన నిమిషాంబ దేవి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి. ఈ ఆలయాన్ని 400 ఏళ్ల క్రితం కృష్ణరాజ ఒడియార్‌ అనే రాజు నిర్మించినట్లు సమాచారం. ఇక్కడ అమ్మవారి విగ్రహంతో పాటు శ్రీచక్రాన్ని కూడా ఆరాధిస్తారు. అలాగే పార్వతీ దేవి అమ్మవారి ఆలయం పక్కనే శివుడికి సంబంధించిన ఉపాలయం కూడా ఉంటుంది. ఇక్కడి పరమేశ్వరుడిని మౌక్తికేశ్వరునిగా పిలుస్తారు. 4. వైష్ణో దేవి ఆలయం - జమ్మూ హిందువులకు సంబంధించి అత్యంత పవిత్రమైన వైష్ణోదేవి ఆలయం జమ్మూ కశ్మీర్‌లోని త్రికూట కొండలపై ఉంటుంది. దీనిని శ్రీమాతా వైష్ణోదేవి మందిర బోర్డు నిర్వహిస్తోంది. ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి, మహా సరస్వతి, మహాకాళీ త్రిమూర్తుల సమ్మేళనంగా ఉంటుంది. వైష్ణో దేవి మహాలక్ష్మి యొక్క అవివాహిత రూపం. ఆమెలో మహాసరస్వతి, మహాకాళి అంశాలు కూడా ఉంటాయి. హిందూ సంప్రదాయంలో ఇదొక ముఖ్యమైన శక్తిపీఠం. భక్తులకు అత్యంత పవిత్రమైన యాత్రా స్థలం. 5. గోల్డెన్‌ టెంపుల్‌ - అమృత్‌సర్‌ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం (Golden Temple Amritsar) సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ఆలయం గోపురం స్వచ్ఛమైన బంగారంతో పూత పూయబడింది. ఇది అమృత్‌ సరోవర్‌ అనే పవిత్ర కొలను చుట్టూ నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వంటశాల (లంగర్‌) కూడా ఉంటుంది. ఇది సిక్కుల సమానత్వ, సేవాభావాలకు ప్రతీకగా చెప్పొచ్చు. ఈ ఆలయాన్ని దర్శిస్తే సిక్కు సంస్కృతి, సంప్రదాయాలను దగ్గరగా చూసే అవకాశం కలుగుతుంది. ఇది మానసిక ప్రశాంతతకు ప్రతిరూపం. 6. శ్రీ బాలాజీ టెంపుల్‌ (తిరుమల) శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం (Balaji Temple Tirumala) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుమల శేషాచల కొండలపై వెలసి ఉంది. ఈ పవిత్ర హిందూ దేవాలయాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్నారు. దీనిని తిరుపతి బాలాజీ టెంపుల్‌ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ప్రతి రోజూ వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. 7. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం - ఉజ్జయిని ఉజ్జయినిలో వెలసిన ప్రసిద్ధ కృతయుగం నాటి శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. హిందూ పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు. సప్త మోక్ష ధామాల్లో ఒకటిగా విరాజిల్లుతోన్న ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఎన్నో రహస్యాలకు నెలవుగా ఉంది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని ఉజ్జయిని వద్ద షిప్రా నది ఒడ్డున వెలసిన ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో వెలసియున్న శివుడిని మహాకాళుడిగా వ్యవహరిస్తారు. ఈ మహాకాళుడుని కాలానికి మరియు మరణానికి దేవుడిగా భావిస్తారు. ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రంలో వెలసిన లింగం స్వయంభువు లింగం. ఈ మహా క్షేత్రంలో వెలిసిన శివలింగం ఇతర లింగాల వలె కాకుండా మంత్ర శక్తులతో ఏర్పడిన శివలింగంగా భావిస్తారు. అందుకే ఇక్కడి మహాకాళేశ్వరుడి దర్శనం భయం మరియు పాపాల నుండి విముక్తిని కలిగిస్తుందని చెబుతారు. 8. సిద్ధి వినాయక టెంపుల్‌ ముంబై సిద్ధిని బుద్ధిని ప్రసాదించే వినాయకుడు ఆగ్రహ ఆవేశాలతో అసుర సంహారం చేసిన ఘట్టాలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి. దేవతలకు సహాయం అందించడమే కాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకి సైతం కార్యసిద్ధిని కలిగించడం అనేది గణపతి యొక్క గొప్పతనం. సమస్త దేవతలచే పూజలు అందుకునే శ్రీమన్నారాయణుడే గణపతికి ఆలయాన్ని నిర్మించాడంటే వినాయకుడి విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. అంతటి ఖ్యాతి కలిగిన గణపతికి దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే.. ముంబైలోని ప్రభాదేవిలో ఉండే శ్రీసిద్ధి వినాయక గణపతి ఆలయం ప్రత్యేకమైనది. ఈ గణపతి క్షేత్రాన్ని దర్శిస్తే మనోభీష్టాలు నెరవేరుతాయని, పనుల్లో విఘ్నాలు తొలగి విజయాలు చేకూరతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ఆలయాన్ని దర్శించుకుంటుంటారు. ముఖ్యంగా గణేశ్‌ నవరాత్రుల వేళ ఈ ఆలయం బహు సందడిగా ఉంటుంది. 9. కాశీ విశ్వనాథ్‌ టెంపుల్‌ వారణాసి ఇది వారణాసిలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది శివుడికి అంకితం చేయబడిన ఆలయం. ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ ఆలయం పవిత్రమైన గంగా నది ఒడ్డున ఉంటుంది. ఈ కాశి వారణాసి నగరం అతి పురాతన నగరాల్లో ఒకటి. ఈ కాశీ విశ్వనాథ ఆలయాన్ని విశ్వేశ్వర్ లేదా విశ్వనాథ్‌ అని కూడా అంటారు. తెలిసీ తెలియక మనం చేసిన పాపాలకు సంబంధించి ప్రాయశ్చిత్తం పొంది ఆ పాపాలను పోగొట్టుకోవడానికి కాశీ విశ్వనాథుని వద్ద ఉన్న గంగా నది పవిత్ర జలాల్లో స్నానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వంటి అనేక మంది గొప్ప వ్యక్తులు ఈ కాశీ విశ్వనాథ్‌ ఆలయాన్ని సందర్శించారని చెబుతారు. 10. సూర్య దేవాలయం కోణార్క్‌ ఒడిశాలోని కోణార్క్‌ సూర్య దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఆలయం. ఈ దేవాలయం పెద్ద రథం ఆకారంలో 24 చక్రాలు, 7 గుర్రాలతో రాతితో చెక్కబడిన అద్భుతమైన వాస్తుశిల్పం కలిగి ఉంటుంది. సూర్య దేవాలయంతో పాటు అక్కడ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉండే అస్తరాంగ్ బీచ్‌ కూడా అద్భుతమైన సందర్శనీయమైన ప్రాంతం. ఈ బీచ్‌లో సూర్యాస్తమయం చూడడం అనేది అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. అలాగే కోణార్క్ మ్యూజియాన్ని కూడా సందర్శించవచ్చు. ఇక్కడ అనేక శిల్పాలు, ఇతర నాగరికతల అవశేషాలను సైతం చూడవచ్చు. #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి #🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳
12 likes
11 shares