హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి

18 Posts • 15K views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
817 views 22 days ago
నాగనాథస్వామి ఆలయం, తిరునగేశ్వరం......!! రాహువుకు చెందిన ఈ ఆలయం తమిళనాడులోని తొమ్మిది నవగ్రహ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం కుంబకోణం నగర౦ నుండి తూర్పు దిక్కున 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరునగేశ్వరంలో ఉంది. ఈ ఆలయం తన సహచరి గిరి గుజాంబిక (పార్వతి) తో కలసి ఉన్న నాగనాథస్వామి (శివుడు) కు చెందినది. ఈ దేవత రెండు ప్రక్కల సరస్వతి, లక్ష్మీదేవి ఉన్నారు. ఈ ఆలయంలో తన ఇద్దరు భార్యలు నాగకన్ని, నాగవల్లి లతో కూడిన రాహు భగవానుని సందర్శకులు చూడవచ్చు. రాహువు ఒక శాపం నుండి విముక్తి పొందటానికి ఈ ఆలయంలో శివుని పూజించాడు. ఇతర దేవాలయాలలో రాహువు సర్పముఖాన్ని కల్గి ఉండి నాగనాధ్ స్వామి ఆలయంలో మానవ ముఖాన్ని కల్గి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయంలో కొన్ని మండపాలు, బురుజుల గోపురాలు, ఎత్తైన ప్రాకారాలు ఉన్నాయి. కోట గోడల్లా ఉండి, బయటి ప్రాకారాలతో కలసి ఉన్న 4 ప్రవేశ బురుజులను చూడవచ్చు. రాహుభగవానుని విగ్రహం నైరుతి మూలలో ఉంది. ఈ ఆలయంలో దక్షిణం వైపున 4 మండపాలతో కూడి చుట్టూ రథం రూపంలో 100 స్థూపాల మండప౦ ఉన్న ఒక చెరువును చూడవచ్చు. ఈ ఆలయ నిర్మాణం చోళుల శైలిని పోలి ఉంటుంది. క్షీరాభిషేకం సమయంలో రాహువు విగ్రహంపై పోసిన పాలు నీలిరంగులోనికి మారి ప్రతి ఒక్కరికి కనబడటం ఈ ఆలయం లోని ఒక ముఖ్య లక్షణ౦. మన పురాణాల్లో నాగపాములకు ప్రత్యేక స్థానం. నాగలోకం, నాగినీలు నాగదేవలు, నాగమణి ప్రస్తావన వినిపిస్తూనే ఉంటుంది. అయితే అవన్నీ ఒట్టి ట్రాష్ అంటూ కొట్టిపడేసే హేతువాదులు ఉన్నారు.. అయితే సైన్స్ కు అందని వింతలూ శాస్త్రజ్ఞులు చెందించని రహస్యాలు ఉన్న దేవాలయాలు భారత దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి రాహు ఆలయం. ఈ ఆలయంలో నాగదోషంతో బాధపడేవారు రాహుకాలంలో పాలు పోస్ట్.. నీలి రంగులోకి మారి.. కిందకు జారిపడిన తర్వాత మళ్ళీ తెల్లని పాల రంగులోకి మారతాయి.. నాగ దోష పరిహారం చేసే ఒకే ఒక్క ఆలయంగా ప్రసిద్దిగాంచినది ఈ ఆలయం ఈ ఆలయంలో ప్రధానంగా పూజలను అందుకుంటున్నది రాహువు. గర్భాలయంలో నాగరాజు రావుతో మండపంలో తన భార్యలైన నాగరాజ సింహ, చిత్రరేఖలతో రాహువు కొలువై ఉన్నాడు. ఈ గుడికి రాహు , నాగ దోషం ఉన్నవారు విశేష పూజలను నిర్వహిస్తారు. మరొక విశేషం ఏమిటంటే ‘ రాహుకాలం ‘ లో పాలాభిషేకం చెయ్యడం. రాహువు కి పాలాభిషేకం చెయ్యడం వలన తమకు ఉన్న ‘ రాహుగ్రహ ‘ దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. ఇలా రాహు కాలంలో రాహుభగవాన్ కి పాలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాలు కంఠం నుండి దిగగానే ” గొంతు వద్ద నీలం రంగు గా మారుతుంది. అనంతరం ఆ పాలు నేలపై పాడినప్పుడు తెల్లగా కావడం విశేషం. ఈ వింతను చూడడానికి రాహుకాలంలో భారీ సంఖ్యలో హాజరవుతారు. ఇలా పాలు నీలి రంగులోకి మారడానికి కారణం. నాగమణి అని పురాణాల కథనం. ఈ నాగమణి గురించి విష్ణు పురాణం, గరుడపురాణంలో కూడా ఈ నాగమణి ప్రస్తావన వుందంట. ఆలయానికి ఎలా వెళ్లంటే? మరి ఎంతో మహిమాన్వితమైన ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్లాలంటే శనివారం ఉదయం 11కి లేదా ఆదివారం సాయంత్రం 4-6 మధ్యలో వెళ్ళాలి. హైదరాబాదునుండి అనంతపురం, బెంగుళూరు మీదుగా 16 గంటల పడుతుంది. చెన్నై మీదుగా ఒక రోజు పడుతుంది. #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి
23 likes
12 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
2K views 1 months ago
శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఏ దేవాలయానికి వెళ్లకూడదంటారు.. ఎందుకు? తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తులు దర్శనం పూర్తికాగానే తిరుమల దగ్గరలో ఉన్న అన్ని దేవాలయాలు దర్శించుకొంటారు. అవి పాపనాశనం, కాణిపాకం.. చివరగా శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి దర్శించుకున్న తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదంటారు. అలా వెళితే అరిష్టం అని హిందు సాంప్రదాయంలో చెప్పబడింది. శ్రీకాళహస్తి దేవాలయమే ఎందుకు చివరగా దర్శించుకోవాలి. మరే గుడికి ఎందుకు వెళ్లకూడదు. వెళ్తే ఏమవుతుంది? శ్రీకాళహస్తి దర్శనం తరువాత నేరుగా ఇంటికే ఎందుకు వెళ్ళాలి? పంచ భూతాల నిలయమైన ఈ విశ్వంలో (గాలి, నింగి, నేల, నీరు, నిప్పు) వాటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిసాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి లోని శ్రీకాళహస్తీశ్వరగా వెలసిన వాయులింగం. అయితే ఇక్కడి గాలిని తగిలిన తరువాత మరే దేవాలయానికి వెళ్లకూడదు అనేది ఇక్కడి ఆచారం. అందులో నిజం లేకపోలేదు. సర్పదోషం, రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా తొలగుతాయని చెబుతారు. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణేశ్వరుని దర్శనంతో కాలసర్పదోషం తొలుగుతుంది. ప్రత్యేక పూజలు చేసుకున్న వారు నేరుగా ఇంటికే వెళ్లాలని చెబుతారు ఇక్కడి పూజారులు. కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లినా దోష నివారణ జరగదని ఇక్కడి విశ్వాసం. గ్రహణాలు, శని బాధలు పరమశివుడికి ఉండవని మిగతా అందరు దేవుళ్ళకు శని ప్రభావం, గ్రహణ ప్రభావం ఉంటుందని పురాణాలలో ఉంది. ఇందుకు నిదర్శనంగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దేవాలయంతో సహా మిగిలిన అన్ని దేవాలయాలు దేశవ్యాప్తంగా గ్రహణ సమయంలో మూసివేస్తారు. గ్రహణ అనంతరం సంప్రోక్షణ జరిపిన తరువాతే పునఃదర్శనం ప్రారంభమవుతుంది. కానీ మూసివేయని ఒకే ఒక్క దేవాలయం శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరునిది. ఇక్కడి దేవుడికి గ్రహణ ప్రభావం ఉండదని పురాణాల్లో చెప్పబడింది. గ్రహణ సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. గ్రహణ సమయంలో భక్తుల దోష నివారణ పూజలు ఎక్కువగా చేస్తారు. అందుకే ఇక్కడి దేవుడి దర్శనం చేసుకున్నాక ఇక ఏ దేవాలయానికి వెళ్లనవసరం లేదన్నమాట. #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి
15 likes
15 shares
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
4K views 4 months ago
❤️🩵*పంచరంగ క్షేత్రాల గురించి విన్నారా!🪭 🟠🟡రంగనాథ స్వామి ఆలయాలు🪭 💜💛జలం ఏ పాత్రలోకి ఒంపితే, ఆ రూపాన్ని పొందుతుంది. భగవంతుడు కూడా అంతే! భక్తులు ఏ రూపంలో ఆయనను కొలుచుకోవాలనుకుంటే.... ఆ రూపంలోకి ఇమిడిపోతాడు. అలా ఆదిశేషుని మీద శయనించే విష్ణుమూర్తిని, రంగనాథస్వామిగా కొల్చుకోవడం కద్దు. దక్షిణాదిన ఈ రంగనాథ స్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో పంచరంగ క్షేత్రాల గురించి చెప్పుకోవాల్సిందే. కావేరీ తీరాన వెలసిన ఈ పంచరంగ క్షేత్రాలు తమిళ, కన్నడ ప్రజలకు చాలా ప్రత్యేకం. ఆ పంచరంగ క్షేత్రాల వివరాలు ఇవిగో… 💦- 1-శ్రీరంగపట్నం💧 ఈ పేరు వినగానే మనకు టిప్పు సుల్తాన్‌ కథలే గుర్తుకువస్తాయి. టిప్పు రాజ్యానికి రాజధానిగా సాగిన ఈ పట్నానికి ఆ పేరే అందులోని రంగనాథుని ఆలయం మీదుగా వచ్చింది. ఇక్కడి శ్రీదేవి, భూదేవి సహిత రంగనాథుని ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్‌ సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించినవారే! 💦-2- తిరుప్పునగర్‌💧 తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉందీ గ్రామం. ఇందులోని స్వామి పేరు ‘అప్పకుడతాన్‌ పెరుమాళ్‌’. ఇక్కడ ఉభమన్యు అనే రాజుకి విష్ణుమూర్తి ఒక ముసలివాని రూపంలో దర్శనమిచ్చాడట. ఆయనకు ఎంత ఆహారాన్ని అందించినా ఆకలి తీరలేదట. చివరికి పరాశర మహర్షి సూచనతో భక్తితో అప్పాలని అందించినప్పుడే తృప్తి లభించిందట. అప్పటి నుంచి ఈ స్వామికి అప్పకుడతాన్ స్వామి అని పేరు. పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటిగా కూడా ఈ ఆలయాన్ని ఎంచుతారు. 💦-3-కుంబకోణం💧 ఒకప్పుడు హేమ రుషి అనే ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సుని ఆచరించాడట. దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువల నుంచి ఉద్భవించింది. అలా అవతరించిన లక్ష్మీదేవిని కోమలవల్లి అన్న పేరుతో కొలుచుకున్నారు. లక్ష్మీదేవి చెంత ఆ విష్ణుమూర్తి కూడా ఉండాల్సిందే కదా! ఆయన కూడా భువికి అవతరించాడు. ఇలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిల్చుకుంటారు. 💦-4-మయిలదుతురై💧 చంద్రుని తపస్సుకి మెచ్చి ఆ విష్ణుమూర్తి అవతరించిన చోటు ఇది. పరాకల్‌ అనే ఆళ్వారుని భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారట. అలా చూసుకున్నా ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు తోస్తుంది. ఇక్కడి స్వామి పేరు ‘పరిమళ పెరుమాళ్‌’. వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటైన ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని చెబుతారు. 💦-5-శ్రీరంగం💧 పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని ఆద్యరంగం (చివరి క్షేత్రం)గా పిలుస్తారు. కానీ అన్నింటిలోకీ ప్రముఖమైనది ఈ ఆలయమే! విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖురూపంలా తోచే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమైంది. ఇక్కడి మూలవిరాట్టుని సాక్షాత్తు విభీషణుడు ప్రతిష్టించినట్లు చెప్పుకొంటారు. విష్ణుభక్తిలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే! గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది ఇక్కడే! ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించడానికే 300 ఏళ్లకు పైగా సమయం పట్టిందని చెబుతారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురంగా ప్రసిద్ధకెక్కిన ఈ ఆలయాన్ని దర్శించకుంటే సర్వశుభాలూ జరుగుతాయని నమ్మకం. 💦ఇవీ పంచరంగ క్షేత్రాల విశేషం. కొన్ని జాబితాలలో ఇందులోని కుంబకోణం బదులు వటనగరంలోని రంగనాథ పెరుమాళ్‌ ఆలయాన్ని పేర్కొంటూ ఉంటారు. 🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒 #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #hindu temples #హిందూ దేవలయల సమాచారంతెలుసుకోండి
39 likes
37 shares