PSV APPARAO
559 views • 8 hours ago
#మాఘ మాసం / కుంబ మాసం మహిమ 🌄 మాఘ స్నానం విశిష్టత #మాఘమాసం మాహా పుణ్యమాసం 🌄 మాఘమాసంలో పర్వదినాలు 🙏 #పర్వ దినాలు #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #మాఘ మాసం ప్రాముఖ్యత
*మాఘమాసం మాహా పుణ్యమాసం*
ఈభూమండలంలో ఉన్న దేశాలన్నిటి లోను భారతదేశం, కర్మ ధర్మ ధ్యాన పరాయణమై, సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాల యాది పర్వతాలు, గంగాది నదులూ, నైమిశం మొదలైన అరణ్యాలూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ, మొద లైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందాయి. వైశాఖం, ఆషాడం, కార్తీకం, మాఘం, మొదలైన పవిత్రమైన పుణ్యదాయకమైన కాలంలో చేసే స్నానం, జపం, తపం, మొద లైన వాని వల్ల, వచ్చే పుణ్యం, బగణ్యమైనది. అంటే ఇంత అని లెక్కకురానిది. అలాగే మఘమాసం సూర్యభగవానునికి ఎంతో ప్రీతికరమైనదిగాను, పుణ్యకార్యాలకు, నదీస్నానాలకు ఎంతో పుణ్యదాయకంగాను, ఈ నెలలో మరణించిన వారికి అమృతత్వం సిద్దిస్తుందని మాఘ పురాణంలో చెప్పుబడింది. కొంతమంది ఈ నెల్లాళ్ళు ముల్లంగి దుంపను తినరు. ఈ మాసంలో నువ్వులను, బెల్లంను కలిపి తినాలట. నువ్వులను దానమివ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది.
_శ్రీ పంచమి_
'మాఘశుద్ద పంచమి'ని శ్రీ పంచమి అంటారు. ఈ పంచమి నాడే 'సరస్వతీదేవి' జన్మించిందట. ఈనాడు 'రతీ మన్మధులను మల్లెపూ లతో పూజిస్తారు. ఉత్తర భారతంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్ద తతో ఉందట. అవేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలక రించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి దర్శనమిచిందట. ఆ వాగీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని స్తఙ్ఞతను ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులకు ఆదిష్టాత్రి అయింది ఆ దేవి. అప్పటి నుండి శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది.
_మాఘశుద్ధ సప్తమి_
ఇదే 'సూర్య సప్తమి' అని కూడా పిలువబడుతుంది. రథసప్తమి సుర్య గ్రహణదినం వలె ఇది పరమపవిత్రమైనది. ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానానికి ముందు చెరకుగడతో నీటిని కదిలిస్తారు. నమస్కారం 'ప్రియ:సూర్య' అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమ స్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తుంది. ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.
సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే 'శమంతకమణి' ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని యజవాల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం భాస్కరా దిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి. రధసప్తమి నాటి స్నానం సప్త సప్త మహాసప్త ద్వీపా వసుందరా! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితతణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట.
_భీష్మాష్టమి_
భీష్మాష్టమి 'మాఘమానస్యచాష్టమ్యాం శుక్ల పక్షేచ పార్ధివ! ప్రాజాపత్యేద నక్షత్రే మధ్య ప్రాస్తే దివాకరే! 'శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథినాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యాన స్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడట. స్వచ్ఛంద మరణం ఆయనకి వరం. ఆయ నకు తర్పణలు విడిచి పెట్టడం నెలగంటు పెట్టినప్పటినుంచీ పెట్టిన గొబ్బెమ్మలను ఎండబెట్టి దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమినాడే దైవ సాయుజ్యం పొందినా శ్రీ కృష్ణుని సమక్షంలోనే విష్ణుసహస్రనా మాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందాడు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు. చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ, ఇక మాఘమా సంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే. ఈ విధంగా మాఘ మాసమంతా 'శివరాత్రి' వరకూ అన్ని పర్వదినాలే.
*🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
15 likes
9 shares