chandrababu

2K Posts • 2M views
Kalam Daily
714 views 14 days ago
మ‌హిళ‌లు పిల్ల‌లు క‌నే మిషిన్లు కాదు Kiran Bedi Criticizes CM Chandrababu’s Population Policy #chandrababu #Kiran bedi #viral #KiranBedi #ChandrababuNaidu #PopulationPolicy #Kalam #KalamDaily #KalamTelugu
11 likes
11 shares
P.Venkateswara Rao
585 views 2 days ago
#చంద్రబాబు #🟡తెలుగుదేశం పార్టీ #పొలిటికల్ సెటైర్స్ 😂 *30 ఏళ్లుగా అలుపెరగని మహానటన❗* MAY 29, 2026🎯 మన దేశంలో భారత రత్న అత్యున్నత పురస్కారం. ప్రతి మహానాడు సందర్భంలోనూ భారత రత్న పురస్కార అంశం చర్చకు వస్తుంటుంది. తెలుగు సమాజం ఏమైనా అనుకుంటుందనే వెరపు కూడా లేకుండా, ఎన్టీఆర్కు ఆ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని మహానాడులో తీర్మానిస్తుంటారు. వెండితెరపై ఎన్టీఆర్ గొప్ప నటుడు. ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఎన్టీఆర్కు భారత రత్న కోసం ప్రయత్నిస్తున్నామంటూ, ఆయన ఫొటోలు, విగ్రహాలతో రాజకీయాలు చేస్తున్న వారి నటన అమోఘం, అద్భుతమనే విమర్శలున్నాయి. సినిమాల్లో నటించడం మాత్రమే ఎన్టీఆర్కి తెలుసు. రాజకీయాల్లో నటించడం తెలియదు. అందుకే ఏ నాయకుడికి లేని చేదు అనుభవాలు ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఉన్నాయి. ఒకే నాయకుడు రెండుసార్లు వెన్నుపోటుకు గురి కావడం బహుశా దేశ రాజకీయ చరిత్రలో వుండదేమో. కానీ ఎన్టీఆర్ రెండుసార్లు వంచనకు గురయ్యారు. తన అనుకున్న వాళ్లను ఎంతగా నమ్ముతారో, రెండుసార్లు వెన్నుపోటుకు గురి కావడమే నిదర్శనం. ఎక్కడైతే నమ్మకం, అంధ విశ్వాసం వుంటుందో, అక్కడే వంచన, దుర్మార్గం నీడలా వుంటాయి. అదును చూసి చావు దెబ్బ కొడుతుంటాయి. వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లో మోసానికి గురైన వారిని తీసుకోండి. బాగా నమ్మినోళ్ల చేతుల్లోనే వంచనకు గురై వుంటారు. దురదృష్టవశాత్తు ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత కూడా వంచనకు గురవుతున్నారు. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ 30 ఏళ్లుగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన జయంతిని పురస్కరించుకుని మహానాడు నిర్వహిస్తుంటారు. ఆ సభల్లో చేసే తీర్మానాల్లో ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనేది తప్పనిసరిగా వుంటుంది ఇంతకూ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాల్సింది మన జాతీయ ప్రభుత్వమేనా? లేక ఇతర దేశాల ప్రభుత్వాలా? అనే అనుమానం వస్తుంది. భారత ప్రభుత్వమే భారత రత్న, పద్మశ్రీ, పద్మ విభూషణ్ తదిరత అత్యున్నల పురస్కారాల్ని ప్రతి ఏడాది ప్రకటించి, అందజేస్తుంటాయి. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం ఎవరి మద్దతుతో ఏర్పడిందో అందరికీ తెలుసు. టీడీపీ అత్యంత క్రియాశీలక భాగస్వామి. పురస్కారాల్ని ఇచ్చే అధికారాన్ని చేతిలో పెట్టుకుని, మహానాడులో డిమాండ్ చేస్తుండడం జనానికి విడ్డూరంగా తోస్తోంది. 30 ఏళ్లుగా ఒకే డిమాండ్పై అలుపెరగని నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తుండడం సామాన్య విషయం కాదు. వెండితెరపై ఎన్టీఆర్ నటనకు ముగ్ధులయ్యే సంగతిని కాసేపు పక్కన పెడదాం. ఎన్టీఆర్కు భారతరత్న పురస్కారం పేరుతో రాజకీయ తెరపై అద్భుతంగా నటిస్తున్న వారికి నటించే వాళ్లకు ఏదైనా విశిష్టత బహుమతి ఇస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది.
8 likes
14 shares
P.Venkateswara Rao
2K views 7 days ago
#ఏపి న్యూస్ ఏపీ పాలిటెక్స్🎯 #చంద్రబాబు *బాబూ.. మీ పాలనపై నమ్మకం లేదా❓* MAY 24, 2026🎯 ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కేవలం తిరస్కరించడానికి మాత్రమే జరుగుతున్నాయి. ఇందుకు గత రెండు సార్వత్రిక ఎన్నికల ఫలితాలే నిదర్శనం. 2014లో విభజిత ఆంధ్రప్రదేశు అనుభవజ్ఞుడైన చంద్రబాబునాయుడు సీఎం అయితే బాగుంటుందని ప్రజలు భావించారు. ఆ మేరకు ఆయన నాయకత్వంలోని కూటమికి అధికారం కట్టబెట్టారు. అయితే ప్రజల అంచనాలకు తగ్గట్టు చంద్రబాబు పరిపాలన సాగించలేదు. దీంతో 2019లో చంద్రబాబును వద్దని జనం అనుకున్నారు. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల జగన్ పాలనతో జనం విసుగెత్తారు. ఆ కారణంగా 2024 ఎన్నికల్లో జగన్ను జనం తిరస్కరించారు. దీంతో మళ్లీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి అపరిమితమైన అధికారాన్ని దక్కించుకుంది. ప్రజలు మంచి పరిపాలన కోరుకుంటున్నారు. ప్రశాంత జీవితాన్ని గడపాలనేది ప్రతి మనిషి ప్రాథమిక కోరిక. పరిపాలన ఆధారంగా మళ్లీ అధికారం ఇవ్వడమా, ఇవ్వకపోవడమా అనేది ఆధారపడి వుంటుంది. ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ రెండేళ్ల పరిపాలన పూర్తి చేసుకోడానికి సిద్ధంగా వుంది. ప్రస్తుతానికి చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో సానుకూలత లేదు. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ పడాలని అంటుంటారు. ఈ లెక్కన చూస్తే ప్రజాభిమానాన్ని చూరగొనడంలో చంద్రబాబు విఫలమయ్యారని చెప్పొచ్చు. సీఎం చంద్రబాబు తరచుగా ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సొంత మీడియాలో కథనాలు చూస్తుంటాం. అంటే కూటమి ప్రజాప్రతినిధుల తీరు బాగాలేదని ఆయన వార్నింగ్లో చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 'గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్' అని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఎవరైనా శాశ్వతంగా తామే అధికారంలో వుండాలని కోరుకోవడంలో తప్పులేదు. అందువల్ల చంద్రబాబు మాటల్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే కోరిక ఉన్నంత మాత్రాన అన్నీ జరిగిపోవు. అందుకు తగ్గట్టు పరిపాలన సాగించాల్సింది తానే అని చంద్రబాబు విస్మరించడం విమర్శలకు దారి తీస్తోంది. 'ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి అది హానికరం. ఆ పార్టీ రాకూడదని పూజలు చేయాలి. గొడ్డలి పార్టీకిసహకరించకండి' అని ఆయన కోరారు. తన ప్రత్యర్థి పార్టీపై వ్యతిరేకతతో మాత్రమే అధికారంలో కొనసాగాలన్న ఆశ చంద్రబాబు మాటల్లో కనిపించింది. అంతే తప్ప, తనకు అపరిమితమైన అధికారాన్ని కట్టబెట్టారని, అందుకు తగ్గట్టు ప్రజలకు మంచి చేయాలన్న తలంపు చంద్రబాబులో మచ్చుకైనా కనిపించడంలేదు. తన పరిపాలన మళ్లీ అధికారం కట్టబెడుతుందనే నమ్మకం చంద్రబాబులో ఇసుమంతైనా లేదని స్పష్టమవుతోంది. ఇదిగో మీరు అపరిమితమైన అధికారాన్ని ఇచ్చారని, మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఫలానా మంచి పనులు చేస్తున్నానని ప్రజలకు చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇలా ఎంతకాలమని వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్పై వ్యతిరేకతతో రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివన్నీ తమ పాలనపై నమ్మకం లేని నాయకులు చేసే పనిగా నెటిజన్లు తప్పు పడుతున్నారు. ఇప్పటికైనా మంచి పనులు చేయడానికి మించిపోయింది లేదని ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఇచ్చిన హామీలపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించాలి. అలాగే ప్రత్యర్థులపై వ్యతిరేకత సృష్టించడం ద్వారా కాకుండా, పాజిటివ్ ఓట్తో తిరిగి అధికారంలోకి రావచ్చనే ఆలోచనతో బాబు అండ్ కో ముందుకు నడిస్తేనే భవిష్యత్ వుంటుందని నెటిజన్లు హితవు చెబుతున్నారు. ఐదేళ్ల పరిపాలనపై తీర్పు చెప్పే బాధ్యత ప్రజలపై వుంటుంది. ప్రజల మనసెరిగి పాలన చేస్తున్నామా? లేదా? అనేది చంద్రబాబు సమీక్షించుకోవాలి. అంతే తప్ప, గొడ్డలి పార్టీ, తల్లీచెల్లి అంటూ మాట్లాడ్డం ద్వారా ఓట్లు రాలుతాయని అనుకోవడమంత అజ్ఞానం మరొకటి వుండదని చంద్రబాబుకు తెలియదని అనుకోవాలా?
16 likes
24 shares