thirumala thirupati devasthaanam

50 Posts • 899K views
🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 🌹 శ్రీవారి గర్భగుడిలో ఎన్ని విగ్రహాలు పూజలందుకొంటాయి 🌹 🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷 శ్రీవారి గర్భగుడిలో మూలవిగ్రహముతో పాటుగా కౌతుకబేరము, ఉత్సవబేరము, స్నపనబేరము, బలిబేరము అనే విగ్రహాలు పూజలందుకొంటాయి. అంటే మొత్తముగా ఐదు విగ్రహాలుంటాయి. అవి (1) ద్రువబేరము (2) కౌతుకబేరము (3) స్నపనబేరము (4) ఉత్సవబేరము (5) బలిబేరము. ఈ ఐదు విగ్రహాలు వైష్ణవవైఖాసన ఆగమము ప్రకారం సందర్భోచితంగా పూజలందుకొంటాయి. దక్షిణ భారతదేశంలోని అనేక వైష్ణవాలయాలు ఇదే వైఖానస లేదా పాంచరాత్ర ఆగమ సంప్రదాయాలను అనుసరిస్తాయి, అయితే తిరుమల క్షేత్రం వైఖానస ఆగమాన్నే ప్రధానంగా పాటిస్తుంది. గ్రామశ్రేయస్సు కొరకు ద్రువబేరానికి పూజలు నిర్వహిస్తారు. ద్రువబేరమంటే మరేమి కాదు మూలవిగ్రహమే. దీన్నే స్థిరమైన, చలింపని విగ్రహంగా భావిస్తారు కనుకనే "ధ్రువ" అనే పేరు వచ్చింది. వైఖానసనాగము ప్రకారము గర్భగుడిలోని దేవుడు రెండు రకాలు. ఒకటి కంటికి కనిపించే బేరము, అంటే సాకారరూపమన్నమాట. రెండోది కంటికి కనబడని దేవుడు. ఈ దేవుడినే నిరాకారరూపుడని అంటారు. కనుక తిరుమలలోని తిరువెంగడనాథుని (శ్రీ వేంకటేశ్వరుని) రూపము సాకారమన్నమాట. మూలబేరాన్ని శిల, మట్టి, దారువు (కట్టె)లతో నిర్మించాలి. వీటికే నిత్యపూజలు వైఖాసన లేదా పాంచరాత్ర ఆగమాల ప్రకారము పూజలు జరపాలి. ద్రువబేరానికి అభిషేకముండదు, ఎందుకంటే మూలవిగ్రహం అత్యంత పవిత్రమైనదిగా, స్పర్శకు అతీతమైనదిగా భావించబడుతుంది. పాలు నేయి తేనె ఘృతం (పెరుగు) వంటి వాటితో తిరుమంజనసేవలు / అభిషేకాలు కౌతుకబేరానికి చేస్తారు. కౌతుకబేరమంటే దినసరిపూజకు ఏర్పాటుచేసిన బంగారు /వెండి/ పంచలోహాలతో చేసిన విగ్రహం. మూలవిగ్రహంలో వుండే శక్తిని కౌతుకబేరములోకి ఆవాహన చేసి పూజలు నిర్వహించి, సాయంత్రం పూజ ద్వారా తిరిగి ఆ శక్తిని మూలవిగ్రహంలోనికి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియనే ఉద్వాసనమంటారు. మూడవదైన విగ్రహము ఉత్సవవిగ్రహము. పుర ఊరేగింపునకు ద్రువబేరాన్ని తీసుకువెళ్ళటానికి వీలుకాదు కనుక ఉత్సవబేరాన్ని ఊరేగిస్తారు. తిరుమలలో ఈ ఉత్సవమూర్తినే "మలయప్పస్వామి" అని పిలుస్తారు, బ్రహ్మోత్సవాలు వంటి పర్వదినాలలో వాహనసేవలకు ఈ మూర్తినే ఊరేగిస్తారు. స్నపనబేరాన్ని అమ్మవారి విగ్రహాలతో పాటుగా కోనేరుకు తీసుకువెళ్ళి చక్రవారి స్నానము చేయిస్తారు. ప్రతిదేవాలయంలోనూ ప్రధానమూర్తితో పాటు పరివారదేవతలుంటారు. వీరిని ఉపదేవాలయాలలో వుంచి పూజిస్తారు. గరుడ, నంది, వినాయక, శ్రీదేవి భూదేవి, భైరవ, పరశురామ, బలరామ, యక్షగంధర్వ దేవతలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. చివరిది ఐదవదైన బలిబేరాన్ని పరివారదేవతలకు బలి ఇవ్వటానికి ముందు అర్చిస్తారు. బలి ఇవ్వడమంటే జంతువధ చేయడం కాదు. బల్యాన్నాన్ని (బలి అన్నము) ను సమర్పించడమే. కొన్ని ఆగమవిధానాలలో మూలవిగ్రహానికి అభిషేకము కూడా చేస్తారు. నిరాకార రూపుడైన భగవంతునికి అకారపూజా విధులేమి వుండవు, భక్తిప్రవృత్తులే ఇక్కడ ప్రధానము. ఈ పంచబేరాల విధానం కేవలం తిరుమలకే పరిమితం కాక, వైఖానస ఆగమాన్ని అనుసరించే అనేక దక్షిణ భారత వైష్ణవాలయాలలో కూడా విస్తృతంగా అమలులో ఉందని ఆగమశాస్త్ర పండితులు పేర్కొంటారు. ఏడుకొండలవాడా వెంకటరమణా ☆ \|/ ♧ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏 #TTD తిరుపతి తిరుమల #తిరుమల తిరుపతి దేవస్థానం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #తెలుసుకుందాం
59 likes
9 shares