ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: అమలక ఏకాదశి దాన ఫలాన్ని అక్షయం చేసే అమలక ఏకాదశి
• 129 views
PSV APPARAO
554 views
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: అమలక ఏకాదశి దాన ఫలాన్ని అక్షయం చేసే అమలక ఏకాదశి #దాన ఫలాన్ని అక్షయం చేసే అమలక ఏకాదశి *ఆమలకీ ఏకాదశి* *ఏకాదశీ వ్రత మహిమ* ఫాల్గుణమాస శుక్లపక్షంలో వచ్చే ఆమలకీ ఏకాదశి మహిమ మాంధాత వశిష్ఠుల సంవాదరూపంలో బ్రహ్మాండపురాణంలో వర్ణించబడింది. ఒకసారి మాంధాత వశిష్ఠముని దగ్గరకు చేరి “ఓ మహాభాగా! మీరు నా పట్ల ప్రసన్నులై ఉన్నచో, సకల శుభాలను పొందగలిగే ఒక వ్రతాన్ని దయతో నాకు తెలపండి" అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా వశిష్ఠుడు ఇలా అన్నాడు. "రాజా! అందరికీ శుభాన్ని కలుగజేసే ఒక మహావ్రతం యొక్క మహిమను, చరిత్రను నీకు వివరిస్తాను. ఆ వ్రతం పేరు ఆమలకీ ఏకాదశీ వ్రతం. ఈ వ్రతాన్ని పాటించడం వలన కలిగే ప్రభావం సకల పాపాలను నశింపజేసి ముక్తిని ఒసగడమే కాకుండ వేయి గోవులను దానం చేసిన ఫలం కూడ సిద్ధిస్తుంది.” "పూర్వం వైదిషమనే పురం ఉండేది. దానిలో మిక్కిలి సంపన్నులైన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు నివసించేవారు. ఆ అందమైన నగరంలో నాస్తికుడు గాని, పాపిగాని ఉండేవాడు కాడు. నగరమంతా ఎప్పుడూ వేదమంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. అట్టి సుప్రసిద్ధ నగరంలో చైత్రరథుడనే రాజు ఉండేవాడు. అతడు చంద్రవంశజుడైన పశబిందుకుని కులంలో జన్మించాడు. చైత్రరథుడు బలవంతుడు, వీరుడు, ఐశ్వర్యవంతుడు, శాస్త్ర కోవిదుడై ఉండేవాడు. అతని రాజ్యపాలనలో రాజ్యమంతట సుఖసంపదలు వెల్లివిరిసి ఉండేవి. పురప్రజలందరు విష్ణుభక్తికి అంకితులై ఉండి ఏకాదశీ వ్రతాన్ని పాటిస్తుండేవారు. హరిభక్తి కారణంగా వారందరు ఆ రాజ్యంలో సుఖంగా జీవించేవారు. రాజ్యంలో బీదవాడు గాని, పిసినారిగాని ఒక్కడైనా ఉండేవాడు కాడు. ఈ ప్రకారం ఆనందంగా అనేకసంవత్సరాలు గడచిపోయిన తరువాత ఫాల్గుణమాస శుక్లపక్షంలో ఒకసారి ద్వాదశితో కూడిన ఆమలకీ ఏకాదశి వచ్చింది. ఇటువంటి ఏకాదశి మహత్తర లాభాన్ని చేకూరుస్తుందని తెలిసిన రాజు, అతని ప్రజలు దానిని యథావిధిగా నిర్వహించాలని సంకల్పించారు. ఏకాదశిరోజు ప్రొద్దున్నే రాజు, అతని ప్రజలు నదిలో స్నానం చేసి, ఒడ్డునే ఉన్నట్టి విష్ణు ఆలయాన్ని సందర్శించారు. గుడి ప్రాంగణంలోనే ఒక ఆమలకీ వృక్షం ఉంది. రాజు ఆ చెట్టు మొదట్లో నీళ్ళు నింపిన కుండను, గొడుగును, వస్త్రాన్ని, పాదుకలను, పంచరత్నాలను పూజార్థం ఉంచాడు. తరువాత అతడు జలమును, పాదుకలను, ఛత్రాన్ని, సువర్ణమును, వజ్రములను, ముత్యాలను, వైడూర్యములను, సుగంధ ధూపమును సమర్పించి శ్రీపరశురాముని, ఆమలకీ వృక్షాన్ని పూజించాడు. పిదప అతడు ప్రజలతో, ఋషులతో గూడి పరశురాముని కీర్తించాడు”. “ఓ పరశురామా! ఓ రేణుకనందనా! ఓ ఆమలకీ వృక్షచ్ఛాయలో నిలిచినవాడా! ఓ కామమోక్షప్రదాతా! ఇవే నీకు మా వందనములు”. తరువాత అతడు ఆమలకీవృక్షాన్ని స్తుతించాడు. “ఓ ఆమలకీ! ఓ విశ్వపోషకా! బ్రహ్మతనయా! ఓ సమస్త పాపవినాశకా! నీకు మా వందనములు. దయచేసి మా అర్పణలను స్వీకరింపుము”. ఈ విధంగా భగవంతుని, ఆమలకీని పూజించిన తరువాత రాజు, అతని ప్రజలు విష్ణు ఆలయంలోనే రాత్రంతా జాగరణ చేశారు. భక్తితో పాటలు పాడారు. ఆ సమయంలో విధివశాత్తుగా ఒక వేటగాడు అక్కడకు వచ్చాడు. నానారకాలైన జంతువులను చంపి అతడు జీవికను సంపాదించే వాడు. నెయ్యిదీపంతో, ధూపంతో శోభితమైన మందిరంలోనికి ప్రవేశించిన ఆ వేటగాడు చాలామంది జనులు మేల్కొని ఉన్నవారై భగవంతుని కీర్తించడం కనిపించింది. వాడు కూడ వాళ్ళతో పాటే కూర్చొని జరుగుతున్నదేమిటో చూడసాగాడు. అదృష్టవశాత్తు అతనికి కుండపై ఉంచిన దామోదరుని దర్శనం కలిగింది. వాడు విష్ణుభగవానుని దివ్యకథలను కూడ విన్నాడు. వాడు ఆకలితో ఉన్నప్పటికిని రాత్రంతా మేల్కొని ఉన్నవాడై ఏకాదశి మహిమలను విన్నాడు. మర్నాడు ప్రొద్దున్నే రాజు తన ప్రజలతో పాటు తన పురానికి వెళ్ళిపోయాడు. వేటగాడు కూడ ఇంటికి వెళ్ళిన తరువాత భోజనం చేశాడు. తరువాత కొన్ని సంవత్సరాలకు వేటగాడు దేహాన్ని చాలించాడు. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసిన ఫలితంగా వాడు మరుజన్మలో అసంఖ్యాక రథగజతురగపదాతిదళంతో కూడిన రాజుగా జన్మించాడు. జయంతి పురాన్ని పాలించే విదూరథునికి అతడు వసురథునిగా జన్మించాడు. అతడు వెయ్యి గ్రామాలకు రాజు అయ్యాడు. అతడు సూర్యునితో సమానంగా తేజోమయుడు, చంద్రునితో సమానంగా ప్రకాశమానుడు, విష్ణువుతో సమానంగా శక్తిమంతుడు, భూదేవితో సమానంగా ఓర్పు కలవాడుగా ఉండేవాడు. సత్యసంధుడైన అతడు ధర్మపరుడై విష్ణుభక్తునిగా అయ్యాడు. ఒకరోజు వసురథుడు అడవిలో వేటకు పోయి దారి తప్పాడు. తీవ్రంగా అలసిపోయిన అతడు ఏ దారి తోచక ఒక చెట్టుక్రింద నడుం వాల్చి చేయినే తలగడగా పెట్టుకొని నిదురించాడు. అదే సమయంలో ఆ అడవిలో వసించే కొందరు మ్లేచ్ఛులు వచ్చి అతనిని నానా రకాలుగా హింసించారు. అతనిని తమ శత్రువుగా భావించి వారు చంపడానికి సిద్ధపడ్డారు. ఆ రాజు పూర్వం తమ తండ్రులను, తల్లులను, పుత్రులను, పౌత్రులను, మామలను నిర్దాక్షిణ్యంగా చంపి తాము దిక్కు తోచక తిరిగేటట్లు చేశాడని వారు భావించారు. ఈ విధంగా తలచి వారు ఆయుధాలనెత్తి రాజును కొట్టారు. కాని ఆశ్చర్యకరంగా వారి ఆయుధాలు ఏవీ కూడ రాజుయొక్క శరీరాన్ని తాకలేదు. అతని శరీరంపై చిన్న గాయమైనా కాలేదు. ఆ విధంగా తమ ఆయుధాలు వ్యర్థమయ్యేసరికి మ్లేచ్ఛులందరు ఖిన్నులై ప్రాణభీతి పొందారు. అడుగు ముందుకు వేసే శక్తి కూడ వారికి లేకపోయింది. ఆ సమయంలో ఒక అసాధారణ అందకత్తె గంధాభరణభూషితయై రాజుయొక్క దేహం నుండి బయటకు వచ్చింది. చక్కని పూమాలతో అలంకృతయై యున్న ఆమె కన్నులు కోపంతో ఎఱ్ఱబడి ఉన్నాయి. భ్రుకుటి ముడిచిన ఆమె చేతిలో చక్రాన్ని ధరించి క్రోధంతో మ్లేచ్చులను చంపడానికి ముందుకు ఉరికి క్షణంలో వారిని నిహతులను చేసింది. ఈ సంఘటన పూర్తి కాగానే రాజుకు మెలకువ వచ్చింది. ఘోరమైన సంఘటనను చూసి రాజు నిద్రనుండి మేల్కొని భీతుడై మ్రాన్పడిపోయాడు. తరువాత శత్రువు లందరు చచ్చిపడి ఉండటాన్ని చూసి విస్మితుడై "ఆహా! ఈ నా శత్రువులను చంపి నన్ను రక్షించిన ఆ శ్రేయోభిలాషి మిత్రుడెవ్వడు? ఈ గొప్పకార్యానికి నేను ఆతనికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని అన్నాడు. “కేశవుడు తప్ప శరణాగత జీవులను రక్షించే సామర్థ్యం వేరెవ్వరికి ఉంటుంది? ఆతడొక్కడే శరణాగతులైన భక్తులకు పోషకుడు" అనే మాట ఆకాశంలో వినవచ్చింది. ఆకాశవాణి వాక్కులు వినగానే రాజు అమితాశ్చర్య చకితుడయ్యాడు. భక్తిభావంతో అతని హృదయం ద్రవించింది. తరువాత అతడు రాజ్యానికి తిరిగివచ్చి ఎటువంటి అవాంతరం లేకుండా ఇంద్రునిలాగా రాజ్యపాలన చేశాడు. వశిష్ఠముని పలుకుతూ "రాజా! ఈ పవిత్రమైన ఆమలకీ ఏకాదశీ వ్రతాన్ని పాటించేవాడు నిస్సంశయంగా విష్ణుపదాన్ని పొందగలుగుతాడు” అని తెలియజేశాడు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
6 likes
15 shares
PSV APPARAO
1K views
#స్వామి ప్రణవనందా దాస్ ఆధ్యాత్మిక ప్రవచనాలు హరేరామ హరేకృష్ణ #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: విజయ ఏకాదశి 🕉️🙏 #విజయ ఏకాదశి 🙏 #విజయ ఏకాదశి💐🎂 *విజయ ఏకాదశి* *(ఫిబ్రవరి 13)* హరే కృష్ణ.. *భక్తి జనని అయిన ఏకాదశి యొక్క నియమాలను తెలుసుకుందాం* ✓ ధాన్యాలు, పప్పులు, శనిగలు, మక్కజొన్న, కూరగాయలలో(గొకర్కాయ, చిక్కుడుకాయ లాంటివి), బటాని వంటివి తినకూడదు. ✓*పండ్లు, పాలు, కాజు, బాదం, పిస్తా, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్, కంద మూలాలు, సగ్గు బియ్యం, *సామలు* లాంటివి మనం తినవచ్చు* / తులసి పత్త్రిన్ని/ఆకులని ఏకాదశి మరియు ద్వాదశి(ఏకాదశి తరువాత రోజున) తెంపకూడదు. ✓ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం, మన శరీరం యొక్క అవసరాలను తగ్గించి, శ్రవణం, కీర్తనం, హరి నామ స్మరణం ఎక్కువ చేయడం. ✓ మన రోజును కృష్ణుడి యొక్క విగ్రహాన్ని లేదా ప్రతిమను పూజించడంతో మొదలుపెట్టడం చాలా మంచిది. ధూపం, దీపం, తులసి పత్రం(ఏకాదశి ముందు రోజు తీసినవి), పండ్లు, పూలు సమర్పించి ఆ శ్రీ విష్ణువుని కృప కొరకు ప్రార్థించండి. ✓ హరే కృష్ణ హరే కృష్ణ | కృష్ణ కృష్ణ హరే హరే || హరే రామ హరే రామ రామ రామ హరే హరే ॥ అనే ఈ మహా మంత్రాన్ని ఎంత కుదిరితే అంత జపించండి. ✓ ఒక గమనిక ఏమిటంటే మనం ఏకాదశి రోజున మాంసము, చేపలు, గుడ్లు, పుట్ట గొడుగులు, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మత్తుపదార్తాలు(సిగరెట్, తంబాకు) మరియు ఇతర తామసిక పదార్థాలను సేవించకూడడు. ✓ ద్వాదశి (ఏకాదశి తరువాత రోజు) ప్రొదున్నే లేచి స్నానంచేసి, విష్ణు మూర్తిని ఆరాధించి, ఉపవాసాన్ని పారణ సమయమున (ఉపవాసము విడిచిపెట్టు సమయం) విడిచిపెట్టాలి, ఈ సమయం ప్రతి ఏకాదశికి మారుతుంది. శ్రీమాన్ ప్రణవానంద ప్రభూజీ యొక్క ప్రవచనాల గురించి మరియు రాబోయే కార్యక్రమాల గురించి మరిన్ని వివరాల కోసం ఈ వాట్సాప్ ఛానెల్ ని ఫాలో అవ్వండి 👇🏻👇🏻 https://whatsapp.com/channel/0029VaBLnhz8Pgs8IXNpoD2b
7 likes
19 shares