📣క్రైమ్ అప్‌డేట్స్🚨

15K Posts • 16M views
సూర్యాపేట మండలం దుబ్బ తండాకు చెందిన ధరావత్ సతీష్ కు, నల్గొండ జిల్లా పెద్దవూర తండాకు చెందిన ధరావత్ శిల్పతో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా శిల్పకు నల్లగొండ జిల్లా హాలియాకు చెందిన, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఓ ఛానల్ రిపోర్టర్ గా పనిచేస్తున్న వెంకట్ రెడ్డితో అక్రమ సంబంధం ఉందని భర్త సతీష్ ఆరోపిస్తున్నాడు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు వెంకట్ రెడ్డితో కలిసి తనను హత్య చేయడానికి భార్య శిల్ప పథకం రచించిందని సతీష్ తెలిపాడు. ఈ విషయం తెలియడంతో ప్రాణభయంతో సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసి 10 రోజులు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సతీష్ తన బంధువులతో కలిసి సోమవారం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టాడు. #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్ #🙏ఆడళ్ళు మీకు జోహార్లు #📣క్రైమ్ అప్‌డేట్స్🚨 #👉నేరాలు - ఘోరాలు🚨 #💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖
11 shares