విచిత్ర రాజకీయాలు😂

• 2K views
🔹“విద్యార్థుల భవిష్యత్తు మా రాజకీయ అజెండా  కాదు.. మా బాధ్యత!” 🔹“హామీలు కాదు.. అమలు కావాలి!” 🔹“మాటలు వద్దు.. డీఎస్సీపై సీబీఐ విచారణ  జరపండి!” 🔹“పేద విద్యార్థుల చదువును ఆపే ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తాం!” 🔹“ప్రజల గొంతును అణచలేరు.. న్యాయం కోసం మా పోరాటాన్ని ఆపలేరు!” - నిరసన ర్యాలీ కార్యక్రమంలో ప్రభుత్వంపై నిప్పులు చేరిన డాక్టర్ సాకే శైలజనాథ్. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తో కలిసి మండల పార్టీ అధ్యక్షులు గువ్వల శ్రీకాంత్ రెడ్డి గారు అధ్యక్షతన నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ గారి పెద్దమ్మ గుడి సర్కిల్ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ఫ్లక్కాడ్స్ ప్రదర్శిస్తూ నినాదాలతో తేరు బజారు వీధుల గుండా భారీ నిరసన ర్యాలీనీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం డాక్టర్ సాకే శైలజనాథ్ గారు మాట్లాడుతూ.... ఈరోజు బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో మనం నిర్వహిస్తున్న ఈ ర్యాలీ ఒక సాధారణ రాజకీయ కార్యక్రమం కాదు. ఇది నిరుద్యోగ యువత ఆక్రందనకు  ప్రతిరూపం. ఇది విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న  పోరాటం. ఇది ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం  ఎదురుచూస్తున్న పేద విద్యార్థుల ఆవేదన.ఇది డీఎస్సీ  అభ్యర్థులకు న్యాయం చేయాలనే డిమాండ్. అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెబుతున్నాం.. ప్రజలను మభ్యపెట్టే మాటలు ఇక చాలూ! హామీలు ఇచ్చి తప్పించుకునే రోజులు ఇక చాలూ! యువత భవిష్యత్తుతో రాజకీయాలు ఆడే రోజులు ఇక చాలూ! ప్రజా సమస్యలకు సమాధానం చెప్పాల్సిందే! అని అన్నారు. డీఎస్సీ ప్రక్రియపై అభ్యర్థుల నుంచి తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేము అడుగుతున్న ప్రశ్న ఒక్కటే? అక్రమాలు జరగలేదని ప్రభుత్వం నమ్ముతున్నప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోంది? సీబీఐ విచారణకు సిద్ధమవ్వండి. నిజాలు బయటకు రానివ్వండి. తప్పు జరగకపోతే ప్రభుత్వం క్లీన్‌చిట్ తీసుకోవచ్చు కాద. విద్యాశాఖకు సంబంధించిన ఇంత తీవ్రమైన ఆరోపణలు వస్తున్నప్పుడు సంబంధిత మంత్రి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? మంత్రి పదవి అంటే కేవలం అధికారం అనుభవించడానికి కాదు. బాధ్యత వహించడానికి! అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యోగం లేదు… ఉపాధి లేదు… పోటీ పరీక్షలకు ఖర్చులు పెరుగుతున్నాయి… కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోంది… ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగ యువతకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఏమి చేస్తోంది? పేద కుటుంబాల పిల్లలు ఉన్నత విద్య చదవాలంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతో ముఖ్యమైనది. ఒక తండ్రి తన కొడుకును చదివించడానికి అప్పు చేస్తాడు. ఒక తల్లి తన కూతురు చదువు కోసం తన బంగారం తాకట్టు పెడుతుంది. విద్యార్థి కాలేజీకి వెళ్లి “నా ఫీజు ఎప్పుడు వస్తుంది?” అని అడిగే పరిస్థితి వస్తే అది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది విద్యార్థి భవిష్యత్తుతో ఆటలాడటం కాదా? అని అన్నారు. ఈరోజు శింగనమల నియోజకవర్గం గడ్డమీద నుంచి  నేను ప్రభుత్వానికి ఒక బహిరంగ సవాల్ చేస్తున్నాను. డీఎస్సీలో తప్పు జరగలేదని మీకు అంత నమ్మకం ఉంటే — సీబీఐ విచారణకు అంగీకరించండి! ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు లేవని చెబితే — పూర్తి లెక్కలను ప్రజల ముందు పెట్టండి! నిరుద్యోగ భృతిపై హామీ ఉంటే — అమలు తేదీ ప్రకటించండి! యువత భవిష్యత్తుపై మీకు చిత్తశుద్ధి ఉంటే  ఉద్యోగాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించండి! ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మా నాలుగు డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి! 1️⃣ డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలి! 2️⃣ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి! 3️⃣ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలి! 4️⃣ నిరుద్యోగ భృతి ₹3,000 వెంటనే అమలు చేయాలి! ఈ నాలుగు డిమాండ్లు నెరవేరే వరకు మన పోరాటం ఆగదు! అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నార్పల సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామక ప్రక్రియపై అనేక మంది అభ్యర్థులు సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి? ప్రతి అనుమానాన్ని పారదర్శకంగా నివృత్తి  చేయడం. అందుకే ఈ వ్యవహారంపై స్వతంత్ర సీబీఐ  విచారణ జరిపి నిజానిజాలను ప్రజలకు తెలియజేయాలని మేము బలంగా డిమాండ్ చేస్తున్నాం. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కావు. కానీ ప్రజల  విశ్వాసం శాశ్వతం కావాలి. అందుకే ఈ వివాదంపై  రాజకీయ బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్  తన పదవికి రాజీనామా చేసి స్వతంత్ర విచారణకు  అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, భోగాతి ప్రతాపరెడ్డి, బండ్లపల్లి ప్రతాపరెడ్డి, బొమ్మను శ్రీరామ్ రెడ్డి, మడుగు పల్లి నాగేశ్వర్ రెడ్డి, చామలూరు రాజగోపాల్, మండల పార్టీ అధ్యక్షులు, ఎల్లారెడ్డి, పరంధామ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ఖాదర్ వలీ, శివశంకర్, నాయకులు అంకె ముసలన్న, ఆదినారాయణ, మల్లికార్జున, నాగలింగారెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, పూల నారాయణస్వామి, లలిత కళ్యాణి, నాగరత్నమ్మ, పార్వతి, పద్మావతి, ఐటీ విభాగం జోనల్ మంజునాథ్, రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, స్టూడెంట్ విభాగం అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఉట్టి కాటమయ్య, హరికృష్ణ, ఆంజనేయులు, సురేష్ కుమార్, పట్నం పనింద్ర, ఎన్వి నారాయణ, భయపరెడ్డి, అంతే నరేష్, ఓబిరెడ్డి, సుంకిరెడ్డి, శ్రీనివాసరెడ్డి చీమల శీనా,షారోన్ కుమార్ , తాటికొండ దేవ,తాటికొండ రామాంజి,నాగరాజు, విష్ణు నారాయణ, ఎంపీపీ.వెంకటనారాయణ, కొంరెడ్డి భాస్కర్ రెడ్డి,,సాకే రామాంజనేయులు, ప్రభుదాస్, తారక్ ,కళ్యాణ్, రాజు, హరి హర నాయుడు,తదితరులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. 🔥 Join the conversation and share your thoughts. 🔗 https://communityxo.com/jagan/app/post/3a1ec0de-531b-4b7f-943a-7dd739354141 #రాజకీయ Shared via Jagan 2.0
8 likes
17 shares
Sekhar Digitals & Reporter 9603197203
543 views 10 days ago
#రాజకీయాలు #ఎన్నికలు #ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు #మున్సిపాలిటీ ఎన్నికలు.. 🤠 #🗞ప్రభుత్వ సమాచారం📻 *స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం..ఎన్నికల కమిషన్..* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్(SEC) అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఓటరు జాబితా, రిజర్వేషన్లు, కోర్టు కేసులు వంటి కీలక అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే *ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొన్నారు.* అయితే ఎన్నికలు ఆలస్యమైనా, ఎన్నికల నిర్వహణకు అవసరమైన అంతర్గత ఏర్పాట్లను ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించారు.. __________________________ *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
18 likes
8 shares