సంస్కృతి సాంప్రదాయలు

1 Post • 95 views
👣🌿🧿 PRIYADARSHI 🧿🌿👣
550 views 15 hours ago
* సకలశుభాల కొరకు శ్రావణ మాసంలో పసుపు కొమ్ములతో లక్ష్మీపూజ * శ్రావణమాసంలో సకల శుభాలను కలిగించే పసుపు కొమ్ములతో శ్రీ మహాలక్ష్మిఅమ్మవారి పూజ.... శ్రావణ మాసంలో ప్రతి రోజు పూజ ఇంట్లో చేసుకునే మహాలక్ష్మిఅమ్మవారి పూజకు ముందుగా మీరు ఏ కోరికతో చేస్తున్నారో సంకల్పం చెప్పుకోవాలి.. ఈ పసుపు కొమ్ముల పూజను శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారం నుండి ప్రారంభించాలి. మాసం మొత్తం చేయాలి. ప్రతి రోజు ఉదయం ఇల్లు వాకిట్లో శుభ్రం చేసి ఈ నెల రోజులు గడపకు పసుపు కుంకుమా పెట్టాలి... అమ్మవారి విగ్రహం ఉన్న వారు అయితే అమ్మవారికి పసుపు నీటితో అబీషేకం చేయాలి, చేస్తున్న సమయంలో శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అనుకుంటూ చేయాలి... విగ్రహం లేని వారు అమ్మవారి ఫోటో ని అలంకరించిన చాలు, విగ్రహం ఉన్నవారు అభేషేకం ఐయ్యాక అమ్మవారికి అలంకారం చేసి, పూజకు కావాల్సిన వి సిద్ధం చేసుకుని దీపాలు అన్ని పెట్టి ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవాలి. కొన్ని పసుపు కొమ్ములు తీసుకుని అమ్మవారికి దండలాగా కట్టాలి ఈ దండను రోజు కట్టాల్సిన పని లేదు మొదటి రోజు కట్టిన పసుపుకొమ్ముల దండను నెల రోజులు వేయవచ్చు, తర్వాత మీ కోరిక ను అమ్మవారికి చెప్పుకుని యదా శక్తి పూజ చేస్తున్నాము అని విన్నవించు కుని, 108 పసుపు కొమ్ములతో అమ్మవారికి లక్ష్మిఅష్టోత్తరం చదువుతూ ఒక్కో నామానికి ఒక్కో పసుపుకోమ్ము అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి నెల రోజులు ప్రతి రోజూ అష్టోత్తరం చదవాలి.. అర్చన ఐయ్యాక నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి.. ఈ నెల రోజులు పూజ ప్రారంభంలోనే చిన్న గిన్నెలో పానకం పెట్టాలి పూజ ఐయ్యాక ఆ పానకం తీర్థo లాగా సేవించాలి. వారంలో ఒక్కసారి అయినా తీపి అన్నం, పులిహోర వండి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదం స్వీకరించడం శుభాన్ని కలిగిస్తుంది. ఆ పసుపు కొమ్ములు మరుసటి రోజు వరకు అలానే అమ్మవారి పాదాల దగ్గరే ఉంచాలి... మరుసటి రోజు మళ్ళీ పూజ సమయంలో శుభ్రం చేసే టప్పుడు ఆ పసుపుకొమ్ముల పక్కకు తీసి పెట్టి ,అవే పసుపు కొమ్ములు మళ్ళి అర్చనకు వాడాలి, అలా నెల రోజులు అదే పసుపుకొమ్ములు వాడాలి.. ఆఖరి రోజు అమ్మవారికి, పంచామృతము అభేషేకం చేసి 11 మంది ముత్తైదువులకు.. తాంబూలం ఇవ్వాలి ఏదైనా తీపి వండి మహా నివేదన చేసి ఆ ముత్తదువులకు తాంబూలంలో పండు తో పాటు ఒక పసుపుకొమ్ము, చిల్లర, పువ్వులు, మీరు వండిన ప్రసాదం వారికి ఇవ్వాలి..అక్షింతలు వేయించుకుంటే మంచిది.. మీరు 11 మందికి ఇచ్చే వారిలో ఒక కన్నె ముత్తైదువు కూడా ఉండాలి... ఇది చాలా విశేషమైన అర్చన, ఇంటిల్ల పాదికి సకల శుభాలు కలుగుతుంది, గ్రహ దోషం తో పాటు అన్ని సమస్యలు తీరిపోయే పరిస్కారం దొరుకుతుంది.. ఆటంకం వస్తే 7 వ రోజు నుండి మళ్ళీ కొనసాగించవచ్చు. *నియమాలు* ఆటంకం రాకూడదు, ఆడవారికి అయితే మైలు స్నానం అయ్యాక 7 వ రోజు నుండి కొనసాగించాలి, ఈ నెల రోజులు మాంసాహరం తినకూడదు, పూజ పూర్తి అయ్యాక ఆహారం తినాలి కానీ ఉపవాసం చేయకూడదు మీరు ఎంత సంతోషంగా శ్రద్ధగా పూజ చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది.. వివాహితులు రోజూ తలస్నానమ్ చేయాలి (బ్రహ్మచర్య నియమం లేదు కనుక). అవివాహితులు మంగళ, శుక్ర, నాడు తల స్నానం చేస్తే సరిపోతుంది, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం 9 లోపు పూజ ఐపోవాలి , ఈ పూజ అంతా అరగంట సమయం పడుతుంది అంతే ఆ కాసేపు అయినా ప్రశాంతంగా అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించాలి. ఈ నెల రోజులు రోజూ కూడా రోజంతా శ్రీ మహాలక్ష్మి దేవి నమః అనుకుంటూ ఉండటం చాలా మంచిది... ఒకవేళ ఏదైనా పని మీద ఊరికి వెళ్ళితే వచ్చాక మళ్ళీ మొదటి నుండి చేయాలి... ఇందులో ఏలాంటి మార్పు ఉండదు.. (మిగిలిన పసుపుకొమ్ములు వంటకు వాడుకోవచ్చు) #తెలుసుకుందాం #మనసాంస్కృతిసంప్రదాయాలు #🪔శ్రావణ మాసం
10 likes
6 shares
*పెళ్లి లో కన్య ను గంప లో మేనమామ ఎందుకు తేవాలి..???* *వెదురు బుట్ట తయారుచేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు. బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో కూర్చుంటుంది.* *గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది.* *మనభారతీయ సంసృతి లో ఆమె కామపత్ని కాదు. "సహధర్మచారిణి."* *ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు.* *అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి.* *ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి!* *పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది.* *అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది.* *ఆమెయే ఆతని లక్ష్మి.* *అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం. అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి.* *అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది.* *ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది. ఆమె ‘నిత్యానపాయినీ’. ఆమె ఎన్నడూ విష్ణువును విడిచి పెట్టి ఉండదు.* శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా చారజనంబు గాఁగ, విరజానది గౌతమిగా, వికుంఠము న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ! అన్నారు గోపరాజు గారు. *శ్రీమహా విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది.* *ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీ దేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది. ఎన్నడూ విడిచిపెట్టదు.* అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది. ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ. అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది. ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది. ఇక్కడ లక్ష్మి పుట్టింది. అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను. ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది. అందుకే... *ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి.* *వెదురు బుట్ట పద్మానికి సంకేతం.* ఎందుకు పద్మంలో కూర్చోవాలి? *ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞములు చేయాలి.* *ఎంతో ధార్మికంగా సంపాదించాలి. ఆయనకి సంతానం కలగాలి. ఆయన సంతోష పడిపోవాలి.* *ఆయన తండ్రి కావాలి, తాత కావాలి. ముత్తాత కావాలి.* *ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది.* *ఆ సంతానం నానుండి రావాలి. ‘ధర్మ ప్రజాపత్యర్థం’ ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే.* నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం. లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది నారాయణ మూర్తిని పొందడానికి. పద్మంలో వెళ్ళాలి. అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం. ఈ ప్రేమ ఎవరిది? మా అక్కచెల్లెళ్ళది. మా అక్క చెల్లుళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు. తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు. ఈమె నీ లక్ష్మి. ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోవక్కరలేదు. నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ. మారేవరకు బుట్టలోనే కూర్చుంటుంది. బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు. అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు. *మేనమామలు ప్రేమైక మూర్తులు.* లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం. నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది. నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి. అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు. లక్ష్మీ దేవిని తెచ్చారు నారాయణుడు అని నా కొడుకుని చూసి. మీరు పదికాలాలు బ్రతకండి అని ఆయుః కారకం కనుక అంచు ఉన్న పంచెల చాపు మేనమామలకి ఇస్తారు. *మేనమామలే ఎందుకు తేవాలి?* తెలుగునాట ఒక లక్షణం ఉంది. అక్క చెల్లెళ్ళకి ఆడపిల్ల పుడితే ఒరేయ్ నీకు భార్య పుట్టింది అంటారు. ఎన్నడూ నేను నా మేనకోడలిని ఆ దృష్టితో చూడలేదు. ఆమెను లక్ష్మిగానే చూశాను. నారాయణుడిని చేరుతుంది అనుకున్నాను. భర్తృ భావనతో చూడలేదు. *పవిత్రభావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు.* *అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం.* అందుకే పెళ్ళి కూతుర్ని మేనమామ బుట్టలో తేవడం. *ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి "సంస్కృతి'' మన భారతీయ సంస్కృతి. #తెలుసుకుందాం #మనసాంస్కృతిసంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు
11 likes
15 shares
వివాహ మంత్రాలు - అంతరార్థాలు.................!! వివాహం ఒక వైదిక కార్యం. ఇందులో అనేక దశలు ఉంటాయి. రకరకాల మంత్రాల సమ్మేళనంగా సాగే ఈ వివాహ ప్రక్రియలో అనేక తంతులు కూడా ఉంటాయి. సంస్కృత మంత్రాలతో సాగే మన వివాహ ప్రక్రియలో ఉన్న అర్థాలు, అంతరార్థాలు ఎలా ఉంటాయో స్థాలీపులాక న్యాయం గా చూద్దాం. పాణిగ్రహణం సమయంలో ఒకచోట సోమ: ప్రధమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర: తృతీయో అగ్నిష్టేపతి స్తురీయ స్తే మనుష్య జా: అని పురోహితుడు మంత్రం చదువుతాడు. దీనికి అర్థం ‘అమ్మాయీ! నిన్నుముందుగా సోముడు అనగా చంద్రుడు వరించాడు. తర్వాత గంధర్వుడు వరించాడు.అగ్ని మూడోవానిగా వరించాడు. మనుషులలో పుట్టిన నేను నాల్గవవానిగా నీకు భర్తనయ్యాను అని అర్ధం. అర్థం కాని భాషలో పంతులు మంత్రాలు చదువుతుంటే భలేచదువుతున్నాడని సంతోషిస్తాం. మరి తెలుగులో అర్థం చెబితే వధువు తల్లిదండ్రులు ఏమిచేస్తారు? మరి ఇంకా అర్థం కానిభాషతో వధూవరులను తిట్టిద్దామా ? మంత్రాలతోకూడిన వివాహాలకు ఫుల్ స్టాప్ పెడదామా ? కన్యా దానం పేరిట ఏమి జరుగుతోంది? నిశ్చితార్థం వివాహం కాబోయే జంట మధ్య జరగాలి. కానీ, అలా జరుగుతోందా? ఆ సమయంలో పురోహితుడు ఏం చెబుతున్నాడో చూడండి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి, ధ్రువంత ఇంద్రాగ్నిశ్చ రాష్ట్రం ధారాయతాం ధ్రువం, ధ్రువం ధ్రువేణ హవిశా తస్త్మ్ర దేవా అధిబ్రువన్, అయంచ బ్రహ్మణ స్పతి దాంపత్య సామ్రాజ్యాన్ని ధరించనున్న నీకు రాజైన వరుణుడు, దేవుడైన బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని, వేదమూర్తియైన బ్రాహ్మణుడు స్థిరమైన వారుగా నిశ్చయించబడ్డారు. పై జాబితాలో అమ్మాయి ఐదుగురికి నిశ్చయించ బడింది. ఆ జాబితాలో అసలు కాబోయే పెళ్ళికొడుకు ప్రస్తావన ఏదీ? వివాహ ప్రకరణంలో ప్రధాన హోమం సమయంలో చెప్పే ఈ శ్లోకం ఏమిటి అంటే సోమః ప్రధమో వివిదే గంధర్వో వివిద ఉత్తర: ! తృతీయో అగ్ని స్టే పతి: తురీయస్తే మనుష్యజ: !! పుట్టిన ప్రతి ఆడపిల్ల మీదా ఒకటి నుండి ఐదో సంవత్సరం వచ్చేవరకూ చంద్రుడు రాజ్యంచేస్తాడట. అందుకే ఆ పిల్లలు బాగా ఆకర్షణీయంగా ఉండడమే కాక ఎప్పుడూ అలా గుర్తుకొస్తూ వుంటారు కూడా. ఏ చంద్రుడు మనస్సుని దృఢం చేస్తుంటాడో ఆ కారణంగా తండ్రి, మామయ్య, బాబాయి .... ఇలా అందరినీ, ఇంటినీ, పొరుగింటినీ కూడా ఇట్టే ఆకర్షించ గలుగుతారు ఈ కాలంలో. ఆరు నుండి పదో సంవత్సరం వచ్చే వరకూ ఆ పిల్లని చంద్రసాక్షిగా గంధర్వుడు స్వీకరించి రాజ్యం చేస్తాడు. గంధర్వుడు లావణ్యానికి అధినేత కాబట్టి ఆ పిల్లకి అందాన్ని కలిగిస్తాడు. ఆడపిల్లలలో నిజమయిన అందం (ఏ విధమైన దుర్భావనకూ లేని అందం) ఆరు నుండి పదేళ్ళ వరకూ బాగా ఉంటుంది. ఇక 11 నుండి 15 యేళ్ల మధ్య అగ్నిదేవుడు ఆడపిల్ల బాధ్యతను గంధర్వుని సాక్షిగా స్వీకరిస్తాడు. అగ్నిదేవుడు కామానికి అధిష్టాత కాబట్టి ఆమెలో కామగుణాన్ని 11 వ సంవత్సరం రాగానే ప్రవేశపెడతాడు. అగ్నిర్వై కామకారకః - శరీరంలో ఆమెకి అగ్నిని, కామగుణాన్ని ప్రవేశపెడతాడు. ఆకర్షణీయతని, మనస్సుని చంద్రుడు, లావణ్యాన్ని గంధర్వుడు ప్రవేశపెట్టాక, ఆమెలో కామగుణాన్ని అగ్ని ప్రవేశ పెడతాడు. 12-15 వయసుగల అమ్మాయిలు రజస్వ్వల కావడానికి కారణం ఇదే. ఇపుడామె వివాహానికి యోగ్యురాలు అయింది. అందుకనే వీరందరూ అంగీకరిస్తేనే పెళ్లి. చంద్ర సాక్షిగా గంధర్వుడు, గంధర్వ సాక్షిగా అగ్ని, అగ్ని సాక్షిగా వరుడు ఈమెని గ్రహిస్తారు. అందుకే అగ్ని సాక్షిగా వివాహం. వరుడు ఇంకా ఈమెని అగ్నిసాక్షిగా ధనాన్ని, పుత్రులను కూడా ఇచ్చాడు అని వరుడు అగ్నికి నమస్కరిస్తాడు. తనకి అభివృద్ధికి కాబోయే సంపద అంతా ఈమె ఇల్లాలుగా ఇంటి బాధ్యత చేపట్టాక వస్తుంది అని చెబుతుంది. అంటే మొదటి ఐదేళ్ళు చంద్రుడు అమ్మాయి బాధ్యత తీసుకుంటున్నాడు, తరువాత గంధర్వులు తీసుకుంటున్నారు, అటుపై అగ్ని దేవుని బాధ్యత అందుకే అగ్ని సాక్షిగా నీ వివాహం ఆయన తన బాధ్యత నీకు అప్పగిస్తున్నాడు. ఇది ఈ మంత్రార్థం. వీరి అందరికీ దంపతులు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రధాన హోమం చేస్తారు. వధువు చీరఅంచును వరుని ఉత్తరీయంఅంచును కలిపి ముడివేయడంను బ్రహ్మముడి అంటారు. పురోహితుడు ఇద్దరి కొంగులు ముడివేస్తూ ఈ మంత్రాన్ని చెప్తాడు. నిశ్చితార్ధంలో చెప్పినా ఇక్కడ బ్రహ్మముడి వేసి చెప్పినా ‘ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతి: ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్ .... అని దీవిస్తారు. అంటే దాంపత్యసామ్రాజ్యాన్ని అనుభవించే మీకు, రాజైన వరుణుడు, దేవుడు బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని నిశ్చలత్వాన్ని కలగజేయాలి. వీళ్ళ దాంపత్యం నిత్యనూతనంగా నిశ్చలంగా ఆనందమయంగా ఎప్పటికీ కలిసి ఉండాలని దేవతల అండగా ఉండాలని దీవిస్తారు. ప్రతీ దానికీ ఎంతో అందమైన అంతరార్థం వుంటుంది, సనాతనధర్మంలో. #తెలుసుకుందాం #మనసాంస్కృతిసంప్రదాయాలు #హిందూసాంప్రదాయాలు #సనాతన హిందూ ధర్మం #సనాతాన ధర్మం
11 likes
11 shares