#💥ఖమేనీ మృతి, కాల్పులు కొనసాగుతున్నాయి 100 మందికి పైగా విద్యార్థులు మృతి😢
HEART BREAKING: యుద్ధం తెచ్చిన గుండెకోత
ఇరాన్లోని మినాబ్లో షజారా తయ్యాబా బాలికల స్కూల్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో సుమారు 108 మంది విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. రక్తంతో తడిసిన బ్యాగులు, చిరిగిన పుస్తకాల మధ్య తమ బిడ్డల ఆనవాళ్ల కోసం తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న దృశ్యాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆటపాటలతో గడపాల్సిన పసిప్రాణాలు ఇలా విగతజీవులుగా మారడం లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వీడియో వైరలవుతోంది.