ShareChat
click to see wallet page

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో జరిగే కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వనించారు. సీఎం చంద్రబాబును క్యాంప్ కార్యాలయంలో దుర్గగుడి పాలక మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో శీనా నాయక్ కలిసి ఆహ్వానపత్రిక అందించారు. స్వామివార్ల చిత్రపటం, ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చారు. #ChandrababuNaidu #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్

357 వీక్షించారు