( 4 - 6 - 2026) బరిలోకి దిగితే చీతా ఆడేస్తాడు కబడ్డీ ఆట! జై జగనన్న వేసిన బాట పిరంగి గుండు తన మాట!క్యాప్షన్ : ఈ నెల అంటే జూన్ 4 వ తేదీన ఉదయం 9.30 గంటలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నయ్య గారు బేతంచెర్ల నగర ప్రజల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ' ఈ చలో మున్సిపాలిటి ' ( ఊరి బయట నీళ్ల కళకళ - ఊరిలో నీళ్ల విలవిల ) కార్యక్రమానికి బేతంచెర్ల నగర మరియు మండలం నుంచి అశేష సంఖ్యలో వైస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు,శ్రేయోభిలాషులు,మన బుగ్గన రాజారెడ్డి అన్నయ్య గారు సాధించిన అభివృద్ధిని చూసి వ్యక్తిగతంగా ఆయనను అభిమానించే పట్టణ పుర ప్రజలు అందరూ కూడా ' ఓ చీమలదండులా ' జన సంధ్రాన్ని,జన ప్రభంజనాన్ని తలపించేలా చాలా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన గురుతర భాద్యత మనందరి భుజస్కంధాలపై ఎంతైనా వుంది.ఎందుకంటే నీరు అనేది మానవకోటికి ఓ ప్రాణాదారం వంటిది,అలాంటి నీరు లేనిదే ఏ ప్రాణకోటి కూడా మనుగడ సాగించడం దాదాపు దుర్లభం.సరిగ్గా అలాంటి నీటి దాహర్తి సమస్య ఇప్పుడు బేతంచెర్ల పట్టణ ప్రజలకు వచ్చింది కాబట్టి,అదేమాదిరి ' అన్ని ఉండి అల్లుడి నోట్లో శని మాదిరి ' నీటి వనరులు తగినంత పుష్కలంగా ఉండి కూడా వాటిని బేతంచెర్ల నగర ప్రజలకు సరఫరా చేయడంలో అధికారులు,పాలకులు తీవ్ర అపసోపానాలు పడుతూ,పట్టణ ప్రజల నీటి దాహర్తిని తీర్చడంలో వారంతా తీవ్ర అశ్రద్ధను చూపుతున్న నేపథ్యంలో,ఈ నీటి దాహర్తి సమస్య పరిష్కారం విషయంలో వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి,వారి మెడలు వంచి అయిన మన బేతంచెర్ల పట్టణ ప్రజలకు తక్షణమే ఈ నీటి దాహర్తి సమస్య పరిష్కారం అయ్యేలా మనమంతా ఉద్యమిద్దాం! అందుకోసం మనమంతా ' ఐకమత్యమే మహాబలం ' అనే నీతి నానుడికి అనుగుణంగా చెయ్యి చెయ్యి కలిపి మనమనుకున్నది సాధిద్దాం! అంతేకాదు ' పోరాటమే ఊపిరి ' అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకోని మరీ మనమంతా కదం తొక్కుదాం,ఈ బేతంచెర్ల ప్రజలమేలు కోరి చేసే ఈ నీటి ఉద్యమానికి మనమంతా జై కొడదాం!చేయూతను అందిద్దాం! ప్రశ్నించే హక్కుకు సలాం కొడదాం! జై జై జగన్! జై జై బుగ్గన!✍️✍️✍️👉👉👉
- మధుసూదనరెడ్డి బుగ్గన,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు! #ysr