ShareChat
click to see wallet page

ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా నిస్వార్థ సేవలు అందించిన నిజమైన ప్రజానాయకుడు దివంగత నీలం సంజీవరెడ్డి గారు!( అయన 30వ వర్ధంతిని పురస్కరించుకొని )! ( 1 - 6 - 2026)! లేదా తన రాజకీయజీవిత అద్యంతం నైతిక విలువలకు కట్టుబడి,ప్రజా శ్రేయస్సే పరమావదిగా జీవించిన ఓ దార్శనికుడు,ఆదర్శ పరిపాలన దక్షకుడు ఈ దివంగత నీలం సంజీవరెడ్డి గారు! భారత రాష్ట్రపతిగా,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా,కేంద్రకమంత్రిగా,లోక్ సభాపతిగా,ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా,సంయుక్త రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి ప్రజల మన్ననలను విశేషంగా చూరగొన్న నిస్వార్థ రాజకీయవేత్తగా,ఓ దార్శనికుడుగా అందరికి సుపరిచితులు అయిన ఈ దివంగత నీలం సంజీవరెడ్డి గారి 30వ వర్ధంతి నేడు(1- 6 - 2026).ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన గొప్పతనం గురించి ఓ మారు మనమంతా స్మరణకు తెచ్చుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే కోట్లకు పడగలు ఎత్తుతూ రాజకీయ వారసత్వన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో వాటిని వ్యతిరేకించి ఎలాంటి హంగు,ఆర్భాటాలకు పోకుండా మన భారతదేశానికి,మన రాష్ట్రానికి మహోన్నత,అజారామమైన సేవలు అందించిన ఓ నిఖర్సైనా ప్రజా నాయకుడు ఈ దివంగత నీలం సంజీవరెడ్డి గారు.ముఖ్యంగా లోక్ సభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికార పక్ష - ప్రతిపక్షం మధ్య ఓ మంచి సద్భావన వాతావరణం ఏర్పరచి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన ఓ అచ్చమైన రాయలసీమ అణిముత్యం ఈ మన నీలం సంజీవరెడ్డి గారు.అంతేగాకుండా ఆంధ్రప్రదేశ్ అవతరణలో సైతం సంజీవరెడ్డి గారు ప్రముఖ పాత్ర పోషించాడు.ఇక రాష్ట్ర స్థాపనలో ప్రధాన,నిర్ణాయక ఘట్టమైన పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర తరపున అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రిగా వున్న సంజీవరెడ్డి గారు కూడా పాల్గొని ఒప్పందంపై సంతకాన్ని సైతం పెట్టిన ఘనత మన దివంగత నీలం సంజీవరెడ్డి గారిది.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అవతరించాక కాంగ్రెసు శాసన సభా పక్ష నాయకుడిగా వున్న బెజవాడ గోపాలరెడ్డిని ఓడించి తాను ముఖ్యమంత్రి అయ్యాడు.అలాగే అల్లూరి సత్యనారాయణ రాజును రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీకి నిలబెట్టి రంగాను ఓడించాడు.1960లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికవడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు.ఇంకా చెప్పుకుంటూపోతే కాంగ్రెసు అధ్యక్షుడిగా రెండేళ్లు పనిచేసి,మళ్ళీ1962లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు.రవాణా సంస్థల జాతీయీకరణ వివాదంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడంతో 1964 ఫిబ్రవరి 29న తన పదవికి రాజీనామా చేశారు మాట మీద నిలబడే,మరకను,మురికిని ఏ మాత్రం అంటించుకొని ఉన్నత వ్యక్తిత్వం గల ఈ నీలం సంజీవరెడ్డి గారు.. ఏదిఏమైన 1929లో మహాత్మాగాంధీ స్ఫూర్తితో తన చదువును సైతం పక్కకుపెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్ర్య పోరాటం వైపు దృష్టి సారించాడు సంజీవరెడ్డి గారు.1937లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెసు కమిటీకి కార్యదర్శిగా ఎన్నికై దాదాపు పదేళ్లు అయన అ పదవిలో కొనసాగారు.అంతేకాదు క్విట్ ఇండియా ఉద్యమంలో సైతం పాల్గొని డిటెన్యూగా జైలుకు వెళ్లారు.1940,1945 ల మధ్య ఎక్కువకాలం అతను జైలులో ఉన్నాడు.తిరిగి 1948లో మద్రాసు శాసన సభకు ఎన్నిక అయ్యాడు.ఇంకా చెప్పుకుంటూ పోతే 1947లో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభకు ఎన్నిక అయ్యారు.1949 నుంచి 1951 వరకు మద్రాసు రాష్ట్ర మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసారు.అదేమాదిరి 1951లో ఆంధ్ర - ప్రాంత కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు మంత్రి పదవికి రాజీనామా చేశారు సంజీవరెడ్డి గారు.అన్నింటికి మించి 1951లో ఆంధ్ర - ప్రాంత కాంగ్రెసు పార్టీ అధ్యక్ష పదవికి ఎన్.జి.రంగాతో పోటీపడి మరీ ప్రకాశం మద్దతు గల రంగాను ఆ ఎన్నికలలో ఓడించాడు.ఆ తర్వాత రంగా, ప్రకాశం కాంగ్రెసును విడిచి వెళ్లారు.అయితే ఎన్ని పదవులను అలంకరించిన అయా పదవులన్నింటికి ఎనలేని వన్నె తెచ్చిన ఈ దివంగత నీలం సంజీవరెడ్డి గారి జీవితంలో ఓక భరించలేని ఓ చేదు పుట్టెడు దుఃఖంతో కూడిన అనుభవం ఎదురైంది.అదేమంటే దురదృష్టవ శాత్తు తన ఐదేళ్ళ కుమారుడిని ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో కోల్పోయాడు.దాంతో నీలం సంజీవరెడ్డి గారు తన క్రియశీలక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు.అయితే కాంగ్రెసు పార్టీ పెద్దల ఒత్తిడి మేరకు మళ్ళీ పూర్తి స్థాయి రాజకీయాలలో భాగమైనారు ఈ దివంగత నీలం సంజీవరెడ్డి గారు. అయితే అయన తన రాజకీయ జీవితంలో అనుసరించిన నిబద్దత,క్రమశిక్షణ,అవినీతి మకిలీ అంటని అయన ఉన్నతమైన వ్యక్తిత్వం,అయా పదవులలో అయన చూపిన అంకితభావం,పోరాట పటిమ,దృఢచిత్తం ప్రస్తుత రాబోయే తరాల పాలకులకు ఓ స్ఫూర్తిదాయకం,ఆదర్శం అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు.అమర్ రహే!అమర్ రహే,జోహార్ దివంగత నీలం సంజీవరెడ్డి గారు! జైహింద్! మేరా హిందూస్తాన్ మహాన్!✍️✍️✍️🇮🇳🇮🇳🇮🇳 - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #😉ఎమోజి విషెస్😂 #🥳Celebrations Video🎆

517 వీక్షించారు
16 గంటల క్రితం