ShareChat
click to see wallet page

నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. "ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల నేపాల్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణ యాత్ర చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. మాలో లేని కృషి, పట్టుదల మీలో ఉన్నాయి. మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో మాటలు, అవమానాలు ఎదుర్కొని ఉంటారు. వాటన్నింటినీ అధిగమించి ఇక్కడి వరకు వచ్చారు. మనలో ఉన్న కసి, పట్టుదలే మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి." #NaraLokesh #AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్

485 ने देखा
12 घंटे पहले