#ఆషాఢంలో జరిగే అతిపెద్ద యాత్ర పూరీ జగన్నాథుడి రథయాత్ర - శ్రీక్షేత్రం - పూరిధామ్ #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత
*పూరీ జగన్నాథ రథయాత్ర :*
నేడు జగన్నాథుడి రథయాత్ర. ఈ జగత్తనే మాయా నాటకాన్ని నడిపిస్తున్న, కృష్ణావతారం ముగించిన తరువాత... పూరీ క్షేత్రంలో దారు బ్రహ్మగా స్థిరపడిన జగన్నాథుడు. ఓడ్ర భూమిలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా తలుచుకునేది.. పూజించేది ఆయన్నే. వారికి ఆయనే సర్వస్వం. మీకు తిరుమల శ్రీవేంకటేశ్వరుడు, తమిళులకు శ్రీరంగనాథుడు, గుజరాతీలకు ద్వారకాధీశుడు ఎలాగో... ఒడిశావాసులకు జగన్నాథ స్వామి అంతటి ప్రీతిపాత్రం. ఒడిశాలో స్వామి ఆలయం లేని ఊరు ఉండదు అంటే అతిశయోక్తి కాదు.
1967లో మొదటిసారిగా భారతావని బయట పూరీ జగన్నాథ రథయాత్ర జరిగింది. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరం అందుకే వేదికైంది. ఇస్కాన్ సంస్థ తొలిసారిగా విదేశీగడ్డపై రథయాత్ర నిర్వహించింది. ఆ తర్వాత 1969లో లండన్లోనూ తొలి రథయాత్ర జరిగింది. వీటితో పాటు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 108కిపైగా నగరాల్లో రథయాత్ర వేడుకలు నిర్వహిస్తుంటారు. ఇక భారతావనిలోనూ అహ్మదాబాద్ (గుజరాత్), మహేశ్ (పశ్చిమబెంగాల్) తదితర ప్రదేశాల్లోనూ వందల ఏళ్లుగా రథయాత్రలు జరుగుతున్నాయి.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రథయాత్ర గురించే కదా. రథయాత్ర కేవలం ఒకరోజుతో పూర్తయ్యే పండుగ కాదు. పన్నెండురోజులపాటు జరిగే వేడుక. ఆషాడ శుద్ధ విదియనాడు మూలవిరాట్టులను రథాలపై కొలువుదీర్చి లక్షలాది భక్తుల కోలాహలం నడుమ పూరీ పురవీధుల్లో ఊరేగిస్తారు. జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్ర ఈ ముగ్గురికి వేరు వేరు రథాలు ఉంటాయి. 44 అడుగుల ఎత్తు.. 16 చక్రాలు ఉండే జగన్నాథ స్వామి రథం పేరు నందిఘోష్, ఎరుపు పసుపు రంగు వస్త్రాలతో రథాన్ని అలంకరిస్తారు. 43 అడుగుల ఎత్తు.. 14 చక్రాలు ఉండే బలభద్రుడి రథం తాళధ్వజ్, ఎరుపు-ఆకుపచ్చ వస్త్రాలతో ఉంటుంది. 42 అడుగుల ఎత్తు.. 12 చక్రాలతో.. ఎరుపు సలుపు వస్త్రాలతో ఉండే సుభద్రాదేవి రథం దర్శదళన్. రథయాత్రకు ప్రతి ఏటా కొత్త రథాలు తయారుచేయాల్సిందే. ముందుగా బలభద్రుడి రథం.. తర్వాత సుభద్రాదేవి రథం.. చివరగా జగన్నాథ స్వామి రథం కదులుతాయి. యాత్ర ప్రారంభమయ్యే ముందు పూరీ మహారాజు వచ్చి రథాల ముంగిట బంగారు చీపురుతో ఊడ్చటం ఇప్పటికీ కొనసాగుతున్న సంప్రదాయం. మధ్యాహ్నవేళ కదిలిన రథాలను సంధ్యా సమయానికల్లా స్వామి పిన్నిగారైన గుండీచా మందిరానికి చేరుస్తారు. వారం రోజులపాటు మూడు రథాలు అక్కడే ఉంటాయి. ఎనిమిదో రోజున తిరిగి రథాలెక్కి ప్రధానాలయం వద్దకు చేరుకుంటాయి. తిరుగు రథయాత్ర పూర్తయిన తర్వాతి రోజున... బోలెడన్ని బంగారు నగలతో అలంకరిస్తారు. ఈ అలంకారంలో మాత్రమే కరచరణాలతో దర్శనమిస్తాయి. మరుసటిరోజున.. విగ్రహాల ఎదుట భారీ మట్టిపాత్రలో పంచామృతాన్ని నివేదిస్తారు. ఆలయప్రవేశం లేని పితృదేవతలు ఈ పంచామృతాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారని ప్రతీతి. సామాన్య భక్తులు ఈ పంచామృతాన్ని స్వీకరించరు.
520 views•26 days ago
00:00
00:18
#🕉 शिव भजन #🔱सावन स्पेशल स्टेटस 🚩 #🕉 ओम नमः शिवाय 🔱 #🕉 ओम नमः शिवाय 🔱 #🔱हर हर महादेव #🔱हर हर महादेव #🔱बम बम भोले🙏