ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత
545 Posts • 47K views
PSV APPARAO
726 views 4 days ago
#శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు 🕉️ శ్రీవారి వాహన సేవలు🔯 భక్తీ ముక్తిదాయకం 🙏 శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణానికి ఊపయోగించే దర్భ చాప, తాడును టిటిడి అటవీ విభాగం కార్యాలయం నుండి సోమవారం డిఎఫ్‌వో శ్రీ ఫణి కుమార్ నాయుడు, సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 24వ తేదీన సాయంత్రం 5.43 నుండి 6.15 గంటల వరకు మీనలగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. ధ్వజారోహణానికి దర్భ చాప, తాడు కీలకం బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు. ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణుదర్భను టిటిడి అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేశారు. అటవీశాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో 60 కిలోల బరువైన దర్భ చాప, 255 మీటర్ల పొడవైన 106 కిలోల తాడు సిద్ధం చేశారు. దర్భ వైశిష్ట్యం దర్భ (కుశ గడ్డి) వేదోక్త శాస్త్రాలలో అత్యంత పవిత్రమైనదిగా పేర్కొనబడింది. ఋగ్వేదం “కుశాః పవిత్రా భవతు” అని దర్భను శుద్ధికరమైనదిగా చెప్పగా, యజుర్వేదంలో దర్భాసనంపై కూర్చొని చేసే ఉపాసన శ్రేష్ఠఫలితాలను ఇస్తుందని పేర్కొంది. శాస్త్రీయంగా చూసినా ఇందులో సిలికా అధికంగా ఉండటంతో వాతావరణ శుద్ధి, సూక్ష్మక్రీముల నిర్మూలన జరుగుతుంది. కాబట్టి వేదోక్త కర్మల్లో దర్భ వినియోగం, దైవిక వరమని భావించబడుతుంది.
15 likes
13 shares
PSV APPARAO
41K views 1 days ago
#శ్రీ కనకదుర్గమ్మ వైభవం 🔱 ఇంద్రకీలాద్రి - బెజవాడ (విజయవాడ)🙏 #💐శ్రీ మహాలక్ష్మి దేవి✨ #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 బెజవాడ ఇంద్రకీలాద్రి శారదా నవరాత్రులు ఐదవ రోజు: అమ్మవారి అలంకారం శ్రీమహాలక్ష్మీదేవి గా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ తల్లి 🙏🏼 రూపం: రెండు కమలాలను చేతుల్లో ధరించి, అభయ వరద హస్తముద్రలో దర్శనమిస్తుంది. వెనుకనుంచి గజరాజు సేవ. అష్టలక్ష్ముల సమష్టి రూపంగా మహాలక్ష్మీ. క్షీరాబ్ధి పుత్రిక, డోలాసురుడిని సంహరించిన శక్తి మధ్యస్థరూపం. పురాణవివరణ: అమ్మను పూజిస్తే సర్వమంగళ ఫలాలు, ఐశ్వర్యం, శుభప్రదం అవుతుంది. చండీసప్తశతిలో: “యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా” → అన్ని జీవులలో లక్ష్మీ రూపం దుర్గాదేవి అని సూచిస్తుంది. నైవేద్యం: వడపప్పు, క్షీరాన్నం స్తోత్రం: *శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం క్లీం బీజంతో పఠించటం శ్రేయస్కరమ్. ప్రత్యక్షదేవతా ఫలాలు: దారిద్ర్య నాశనం, ఐశ్వర్యప్రాప్తి, సర్వసుఖ సంపత్తి. ప్రతిదినం పఠించటం ద్వారా సర్వం శాంతి, శ్రేయస్సు, భోగసౌభాగ్యం లభిస్తుంది. ధ్యానం సూచన: పద్మకరాం, ప్రసన్నవదనాం, హస్తాభ్యాం భక్తప్రదాం అని ద్యానము. కమల, చంద్రవదన, చతుర్భుజ రూపాలను కల్పనచేత ప్రతిబింబించవచ్చు. ప్రార్ధన: త్రికాలం జపం చేయుట ద్వారా భోగసౌభాగ్యాలు, కోటిజన్మ సంపదలు. భృగువార పఠనం ద్వారా కుబేర సంపత్తి, దారిద్ర్యమోచనం.
186 likes
1 comment 288 shares
PSV APPARAO
527 views 1 days ago
#దేవి శరన్నవరాత్రులు అయిదవరోజు శ్రీ శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి అలంకరణలో అమ్మవారి దర్శనం #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #💐శ్రీ మహాలక్ష్మి దేవి✨ #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత దసరా దుర్గ నవరాత్రులలో ఐదవరోజు శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మ అలంకారణ. అమ్మవారి అలంకారణ : నేడు అమ్మవారిని శ్రీమహాలక్ష్మిదేవిగా అలంకరించాలి. అమ్మ చీర రంగు : గులాబీ రంగు శారీ, Rose కలర్ శారీ. నైవేద్యం : రవ్వ కేసరి. పారాయణం : శ్రీ సూక్తం, శ్రీ మహాలక్ష్శి స్రోత్త్రాలు, శ్రీ మహాలక్ష్మి అష్టకం. తెల్లని, ఎరుపు రంగు పువ్వులతో పూజించి, శ్రీ మహాలక్ష్మి అష్టొత్తరం పఠించాలి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం దాసీభుత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్దవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తు ఉండగా శ్రీమహాలక్ష్మి దర్శనమిస్తుంది. ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల రూపమే శ్రీమహాలక్ష్మి దేవి. ఈమే క్షీరాబ్ది పుత్రిక. డోలారుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవత. శక్తి త్రయంలో ఈమే మధ్య శక్తి. ఈ దేవిని ఉపాసన చేస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. సర్వజగత్తులకి కారణమైన పరాశక్తే లక్ష్మీ దేవి. ఈ జగత్తు అంతా ఏ శక్తి చేత రక్షింపబడుతున్నదో ఆశక్తే "లక్ష్మీ" ఈ జగత్తులో ప్రతిదానికి ఒక లక్షణం ఉంది. ఆ లక్షణాన్ని అనుసరించే సర్వవిధ ప్రవర్తనలు సంభవమవుతాయి. అలా జగత్తుకి హేతభూతమైన లక్ష్మణ శక్తి లక్ష్మీ. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 'ఇవి నా విభుతులూ' అని విభుతి యోగంలో చెప్పినవన్ని లక్ష్మీ స్వరూపాలే. ఎవరైనా సరే ముందుగా లక్ష్మీ కటాక్షాన్నే కోరుకుంటారు. అయితే తన బిడ్డల సంగతి తెలుసు కనుక, విద్యాగంధం లేనివాడు అజ్ఞానవశాన ధనాన్ని చెడుపనులకు ఉపయోగించి, పాపాలను మూటకట్టుకుంటాడు అనే ఉద్దేశంతో మొదట అతనికి సరస్వతి ప్రసన్నతను అనుగ్రహించి, ఆ తరువాత ఐశ్వర్యాన్ని చక్కగా అనుభవించగలిగే వివేకాన్ని ఇస్తుంది. అందుకే ఆ తల్లిని ఐశ్వర్య ప్రదాయిని అని అన్నారు. సూర్య, చంద్ర, అగ్ని, వాయువు, భూమి మొదలు అయినవన్నీ ఐశ్వర్యాలే. ఈ ఐశ్వర్యాలకు కారణమైన పర బ్రహ్మ శక్తి ఐశ్వర్య రూపిణి లక్ష్మిదేవి. హృదయం నిండుగా భావన చేస్తే అమంగళాలకు చోటు ఉండదు. డబ్బుకు లోటు ఉండదు. చిత్తం సుద్ధమవుతుంది. సమస్త దరిద్రాలు ధ్వంసమవుతాయి. అందుకే ఆ తల్లి తత్వాన్ని గ్రహించి అందుకు తగినట్లుగా మసులుకుంటే ఏ సమస్యలు దరికి రావు. శుభ్రమైన ఇంట్లో, పంటపొలాల్లో, గోపురాళ్లో, తామరపువ్వుల్లో, రత్నాలలో, అద్దం మొదలైన వాటిలల్లో లక్ష్మీ కొలవు అయ్యి ఉంటుంది. ఆవునెయ్యితో గాని సువర్ణ జలంతో కాని లక్ష్మీ దేవికి అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కాబట్టి శరన్నవరాత్రులలో శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే సర్వమాంగళ్యాలు కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మి అష్టకం : నమస్తే‌స్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే| శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌స్తు తే ||1|| నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి | సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 2 || సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి | సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 3 || సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని | మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 4 || ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి | యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌స్తు తే || 5 || స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే| మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌స్తు తే || 6 || పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి | పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌స్తు తే || 7 || శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే | జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌స్తు తే || 8 || మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః | సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ | ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః || త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ | మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా || ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్. శ్రీ సూక్తం : ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్ | చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్ | యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహమ్ || అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీమ్ | శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్ || కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్ | పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియమ్|| చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియంలోకే దేవజుష్టాముదారామ్ | తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే ‌లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే || ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వః | తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః || ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ | ప్రాదుర్భూతో స్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాదు మే || క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్షీం నాశయామ్యహమ్| అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ || గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీమ్ | ఈశ్వరీగ్‍మ్ సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్|| మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి | పశూనాం రూపమన్యస్య మయి శ్రీః శ్రయతాం యశః|| కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ | శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్ || ఆపః సృజంతు స్నిగ్దాని చిక్లీత వస మే గృహే | ని చ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే || ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణామ్ హేమమాలినీమ్ | సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || ఆర్ద్రాం యః కరిణీం యష్టిం పింగలామ్ పద్మమాలినీమ్ | చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ || తాం మ ఆవహ జాతవేదో లక్షీమనపగామినీమ్ | యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో ‌శ్వాన్, విందేయం పురుషానహమ్ || ఓం మహాదేవ్యై చవిద్మహే విష్ణుపత్నీ చ ధీమహి | తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ || శ్రీ-ర్వర్చస్వ-మాయుష్య-మారోగ్యమావీధాత్ పవమానం మహీయతే | ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః|| ఓం శాంతిః శాంతిః శాంతిః ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమో నమః #namashivaya777
18 likes
8 shares
PSV APPARAO
506 views 1 days ago
#నవదుర్గలు - శ్రీ స్కంద మాత - 5వ స్వరూపం #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) దేవి నవరాత్రులలో రేపు 5 వ రోజు స్కందమాత ( శ్రీ మహాలక్ష్మీ దేవి ) ( 26.09.2025) ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాశించ వలెను. నవదుర్గలు : ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా|| నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి. దుర్గా ధ్యాన శ్లోకము : శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥ స్కందమాత ( శ్రీ మహాలక్ష్మి ) శ్లో సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా| శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ నైవేద్యం : పెరుగు అన్నం (దద్ధోజనం) !! , రవ్వ కేసరి కావలసినవి !! బియ్యం 1/4 కిలో పాలు 1/2 లీ చిక్కటి పెరుగు 1/2 లీ నూనె 1/2 కప్పు నెయ్యి 1 స్పూన్ కొత్తమిర , కరివేపాకు చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి పోపు సామాగ్రి జీడిపప్పు 20 ఉప్పు , ఇంగువ ఎండుమిర్చి !! చేసే విధానం !! ముందు బియ్యం కడిగి అన్నం వండి , కాస్త చల్లారాక కాచినపాలు , పెరుగు , ఉప్పు , వేసి బాగా కలిపి వుంచండి, సన్నగా తరిగిన చిల్లి , కొత్తమిర ,కోరిన అల్లం ,అన్నీరెడ్డిగ్గా వుంచుకొని ష్టవ్ పై మూకుడుంచి అందులో నునె వేసి పోపు కావలసినవన్నీ వేసిఎండుమిర్చి ఇంగువ తో పాటు తరిగి వుంచిన వన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపికాస్త నేతిలో జీడి పప్పులు వేయించి అవీవేయండిరుచికరమైన దద్ధోజనం అంటే ఆ తల్లికి అంత మక్కువ ఆ తల్లి దీవెనలతో అందరూ అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ ప్రార్థించాలి. !! రవ్వ కేసరి కి కావలసినవి !! రవ్వ 1 కప్ పంచదార 3/4 కప్ నెయ్యి 2 టెబల్ స్పూన్ కేసరి కలర్ / చిటికెడు. యాలకులు 4 ఎండు ద్రాక్షా 6 జీడిపప్పు 10 మిల్క్ 1 కప్ ( మిల్క్ మేడ్ 1 ) వాటర్ 1/2 కప్పు ముందు మూకుడులో కాస్త నెయ్యి వేసి రవ్వ దోరగా వేయించి తీసి ప్లేట్ లోవేసివుంచండి . మూకుడులో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు , ఎండుద్రాక్షవేయించితీసివుంచండి .నీళ్ళూ ,పాలూ ,కలిపి బాగా మరగనివ్వాలి.అందులో కేసరి కలర్ ,చెక్కర , రవ ,వేసి నెయ్యి వేస్తూ బాగాకలిపిఅందులోద్రాక్షా ,జీడిపప్పు ,మిగిలిన నెయ్యి అంతా వేసి బాగా కలిపి వేడి వేడి గా ఘుమ ఘుమగా నేతితో ఆ మహాలక్ష్మికి నైవేద్యం గా పెట్టి సౌభాగ్యం ఇవ్వమని ప్రార్ధించి నైవేద్యం పెట్టండి. స్కందమాత దుర్గా నవదుర్గల్లో ఐదో అమ్మవారైన స్కంధమాత దుర్గాదేవి అవతారాలలో 5వ అవతారం. కార్తికేయుని మరో పేరు స్కంధ నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది. నవరాత్రులలో ఐదవరోజైన ఆశ్వీయుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. రూపం నాలుగు చేతులతో ఉండే ఈ స్కందమాత దుర్గాదేవి సింహవాహనంపై ఉంటుంది. చేతిలో కమలం, జలకలశం, ఘంటా ఉంటాయి. ఒక చేయి అభయముద్రలో ఉండగా, స్కందుడు(కుమారస్వామి) ఆమె ఒళ్ళో కూర్చుని ఉంటాడు. తెల్లగా ఉంటుంది స్కందమాతా దేవి. విశిష్టత ఈ అమ్మవారు మోక్ష, శక్తి, ఐశ్వర్య ప్రదాయినిగా భక్తులు నమ్ముతారు. స్కందమాతాను ఉపాసించేవాడు నిరక్షరాస్యుడైనా జ్ఞానం ప్రాసాదిస్తుందని పురాణోక్తి. తనను పూజించే భక్తుల కోరికలన్నిటినీ తీర్చే అమ్మవారు ఈమె. నిస్వార్ధ భక్తి చూపేవారికి జీవితంలో ఇహ, పర సుఖాలను ప్రసాదిస్తుంది అని ధ్యానుల విశ్వాసం. ఈ అమ్మవారిని పూజించేటప్పుడు పూర్తిగా శరీరం, మనస్సు ఆమె మీదే లగ్నం చేయాలి అని దేవీ పురాణం చెబుతుంది. ఈ అమ్మవారిని పూజించినప్పుడు, ఆమె ఒడిలో ఉన్న ఆమె కుమారుడు స్కందుడు కూడా భక్తునిచేత పూజింపబడతాడు. దాంతో ఆ ఇద్దరి ఆశీస్సులూ భక్తునికి వస్తాయని భక్తుల నమ్మకం. ఈ అమ్మవారి ఉపాసకులు దైవ శోభతో ప్రకాశిస్తుంటారట. స్కందమాతా దుర్గా దేవిని పూజిస్తే జీవితం చివర్లో తప్పకుండా మోక్షం లభిస్తుందని పురాణోక్తి. ఈ దేవి అగ్నికి అధిదేవత కూడా. కథ తన కుమారుడు స్కంద/కార్తికేయ/కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకున్న స్కందమాతా దుర్గాదేవి. స్కందపురాణంలో కుమారస్వామి ఆవిర్భావం గురించి వివరంగా ఉంటుంది. శివ, పార్వతుల వివాహానంతరం ఎన్నో మన్వంతరాల(కొన్ని కోట్ల సంవత్సరాలు) కాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వారిద్దరి శక్తి ఒకటైన తరువాత, వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలనే దురుద్దేశ్యంతో ఇంద్రుడు, ఇతర దేవతలు కలసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు. ఆ పిండంతో కలసి అగ్ని ఒక గుహలో దాక్కుంటాడు. ఈ లోపు శివ తేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సును భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లుపొదల్లో విడిచిపెడుతుంది. అప్పుడు ఆ పిండాన్ని ఆరు కృత్తికలు పోషించగా, కుమారస్వామి జన్మిస్తాడు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండం అగ్ని దగ్గర ఉందని తెలుసుకుంటుంది. తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు, ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది అమ్మవారు. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండతూ ఉండమని, ఇది మంచి, ఇది చెడూ అని లేకుండా అన్నిటినీ మండిస్తూ ఉండమనీ శాపం ఇచ్చింది. ఇంతలో అక్కడకు వచ్చిన శివుడు ఆమెను శాంతించమనీ, కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. కృత్తికలు జన్మనిచ్చినా, ఆ తేజస్సు తనది కాబట్టీ ఆ బిడ్డ తనవాడేనని పార్వతీదేవి కుమారస్వామిని కైలాశానికి తెచ్చుకుంటుంది. కృత్తికలు పెంచారు కాబట్టీ కార్తికేయుడనీ, రెల్లు పొద(శరవణాలు)లో ఉన్నాడు కాబట్టీ శరవణుడని పేర్లు వచ్చాయి ఆయనకు. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామికి తారకాసురునికి శివ, పార్వతుల బిడ్డనైన తన వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకుని, అతనిపై యుద్ధం ప్రకటించి, దేవతల సేనకు అధ్యక్షుడై అతణ్ణి సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవ సేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శంభు, నిశంభులతో యుద్ధ సమయంలో ఐదవ రోజున అమ్మవారు స్కందమాతా దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది. #namashivaya777
15 likes
10 shares