ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత
647 Posts • 48K views
PSV APPARAO
580 views
#శివ - ఎందుకు శివుడు సర్వోన్నత దేవుడు? why shiva is the supreme god ? #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మహా శివరాత్రి /మహాశివరాత్రి పర్వదినం శివపార్వతుల కళ్యాణం 🔱🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #🙏హ్యాపీ మహాశివరాత్రి📿 *మహా శివరాత్రి* ఆయన నామం నిరాడంబరం. 'శివ' అని రెండక్ష రాలు ఉచ్చారణలో శ్రమ లేదు. అయితేనేమి, ఆ నామం సర్వోత్కృష్టం. ఆయన రూపం నిరాడంబరం. అసలు నామ రూప రాహిత్యానికే సంకేతమయిన లింగ రూపం. ఆయన వేష భాషలూ ఆహార విహా రాలూ నిరాడంబరం. ఆయన ఆహారం కాలకూటం. ఆభరణాలు పాముల దండలు. వస్త్రం ఏనుగు తోలు, వాహనం వృద్ధ వృషభం. ఆయనకు నచ్చే పూజా విధులూ నిరాడంబరమే. ఆకు దొప్పతో అన్ని నీళ్లూ, అందుబాటులో ఉంటే నాలుగు మారేడు దళాలూ ఆయనకు ప్రియమైన పూజా ద్రవ్యాలు. భక్తుడు గడుసుదేరి, 'స్వామీ! నేను మానస పూజ తప్ప భౌతికంగా ఏమీ చేయలేను. మానసికంగానే నీకు ఉత్తుత్తి రత్నాసనం, చందనం, పుష్పం, ధూపం, దీపం, ఉత్తుత్తి పంచ భక్ష్యాలూ, పాయసాలూ, తాంబూలాలూ, ఛత్ర చామరాలూ సమర్పిస్తున్నాను. అందుకో. నేను పూజలూ, పునస్కా రాలూ చేయలేను కనుక నేను ఏది చేస్తే అదే నా పూజగా భావించవయ్యా. అన్నా సరే, 'దానికేముంది, అలాగే! భావన కదా ముఖ్యం!' అంటూ ప్రసన్నత కురిపించే భోళా శంకరుడు ఆయన. ఆయన భక్తులూ నిరాడంబరులే. ఏ వేదాలూ ఎరుగని సాలీడు, ఏ శాస్త్రాలూ చూసి ఉండని కాళ సర్పం, ఏ విద్యలూ అభ్యసించి ఉండని ఏనుగూ, ఏ మంత్ర తంత్రాలూ ఎరగని చెంచు కన్నప్పా- కారెవరూ శివ కటాక్షానికి అనర్హులు. అయితే, భక్తులను అనుగ్రహించి కోరిన వరా లిచ్చే విషయంలో మాత్రం శంకరుడు చూపే ఆడం బరం, ఔదార్యం సాటి లేనివి. అలకాధిపతి కుబేరుడి అష్టశ్వర్యాలన్నీ ఈ ఆది భిక్షువు పెట్టిన భిక్షే. తను హాలాహలం గొంతులో నింపుకొన్నాడు కానీ, అమరు లకు అబ్బిన అమృతప్రాశన తన ఔదార్య ఫలమే. అడిగీ అడగకుండానే అన్నీ ఇచ్చే ఆది దేవుడి అనుగ్రహం పొందేందుకు అనువైన రోజు మహా శివ రాత్రి మళ్లీ వచ్చింది. ఉపవాసంతో, జాగరణతో, నిరం తర శివనామ జపంతో, నిష్టగా జరిపే ప్రహార పూజ లతో శాస్త్రోక్త విధి ఆచరించగల శివదీక్షాపరులూ, శివ రాత్రి వ్రతతత్పరులూ ఎలాగూ ధన్యులే. అభిషేకాలూ, అర్చనలూ, లింగోద్భవ సమయారాధనలూ, కల్యాణో త్సవాలూ చేతులారా చేసేవారూ, కళ్లారా చూసే వారూ భాగ్యశాలులే. శివరాత్రి నాడు శివలింగానికి చెంబుడు నీరు సమర్పించేవాళ్లూ, ఓ బిల్వ దళం సమర్పించేవాళ్లూ, చిత్త శుద్ధితో నమశ్శివాయ అని ముమ్మారు మనసారా స్మరించేవాళ్లు కూడా ఆ కరుణా సింధువు కటాక్షానికీ పాత్రులవుతారు. *ఆడంబరాలన్నింటినీ తృణీకరించే ఆ ఆర్త త్రాణ పరాయణుడిని, చిటికెడు చిత్తశుద్ధి ఆకట్టుకొంటుంది.* *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
5 likes
8 shares
PSV APPARAO
706 views
#శ్రీ భాలక తీర్థ (కృష్ణా ధామ్),గుజరాత్‌ (సౌరాష్ట్ర):శ్రీకృష్ణుడు తన భౌతికదేహాన్ని విడిచిపెట్టిన స్థలం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత శ్రీ భాలక తీర్థ (కృష్ణా ధామ్), గుజరాత్‌ (సౌరాష్ట్ర): శ్రీకృష్ణుడు తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన అత్యంత పవిత్రమైన స్థలం 🙏 శ్రీ భాలక తీర్థ (కృష్ణా ధామ్), ప్రభాస్ క్షేత్రం - గుజరాత్ (సౌరాష్ట్ర), తేదీ: ఫిబ్రవరి 15, 2026, మాఘ కృష్ణ త్రయోదశి (మహాశివరాత్రి) - ఆదివారం *మధ్యాహ్నం దర్శనం* గుజరాత్‌లోని సౌరాష్ట్ర తీరంలో వేరావల్ సమీపంలో ఉన్న శ్రీ భాలక తీర్థ (కృష్ణా ధామ్), శ్రీకృష్ణుడు తన భౌతిక దేహాన్ని విడిచిపెట్టిన అత్యంత పవిత్రమైన స్థలం. సోమనాథ్ దేవాలయానికి 4 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రదేశంలోనే జరా అనే వేటగాడి బాణం కృష్ణుడి పాదానికి తగిలి, ఆయన వైకుంఠానికి ప్రస్థానం చేశారని (శ్రీకృష్ణ నిజాధామ ప్రస్థాన లీల) పురాణాలు చెబుతున్నాయి. భాలక తీర్థ ముఖ్య విశేషాలు: • నిజాధామ ప్రస్థానం: ఇక్కడ కృష్ణుడు బాణపు గాయంతో మరణించి, ద్వాపర యుగాన్ని ముగించి, కలియుగానికి నాంది పలికిన ప్రదేశంగా భావిస్తారు. • దేవాలయ నిర్మాణం: ఇక్కడ శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఉన్న అరుదైన విగ్రహం, అలాగే మురళీధరుని విగ్రహం కొలువై ఉన్నాయి. • పవిత్ర ప్రదేశం: ఆలయ ప్రాంగణంలో పురాతన మర్రి చెట్టు మరియు తులసి వనం ఉన్నాయి. 9వ శతాబ్దంలో శ్రీ వల్లభాచార్యులు ఇక్కడ 9 రోజుల పాటు శ్రీమద్భాగవత గీతను బోధించారని చెబుతారు. • ప్రభాస్ క్షేత్రం: ఇది సోమనాథ్ సమీపంలోని ప్రాచీన ప్రభాస్ పటన్ ప్రాంతంలో ఉంది, దీనికి సింధు లోయ నాగరికతతో కూడా సంబంధం ఉంది. • సందర్శనకు ఉత్తమ సమయం: నవంబర్ నుండి ఫిబ్రవరి మరియు జన్మాష్టమి సమయం. ఈ ప్రదేశం భక్తులకు అత్యంత ఆధ్యాత్మిక అనుభూతిని మరియు ప్రశాంతతను అందిస్తుంది. 🛕
3 likes
16 shares
PSV APPARAO
564 views
#ధర్మధ్వజం (హిందు చైతన్య వేదిక) భక్తిసమాచారం ప్రతి రోజు మీకోసం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మహా శివరాత్రి /మహాశివరాత్రి పర్వదినం శివపార్వతుల కళ్యాణం 🔱🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శివ - ఎందుకు శివుడు సర్వోన్నత దేవుడు? why shiva is the supreme god ? #🕉️మహాశివరాత్రి స్టేటస్🕉️ ఒకరోజు మహా సాద్వి పార్వతి దేవి తన సతీ దేవుడైన పరమేశ్వరుని ఈ విధంగా ప్రశ్నించిందట, ఏమిటి స్వామి మీరు గొప్ప జగత్కర్తలు మీరు తలుచుకుంటే అన్ని మీ ముందు ఉంటాయి, సుఖ సంతోషాలతో రాజ భోగాలు అనుభవించకుండా మమ్మల్ని అంతః పురాన్ని విడిచిపెట్టి ఎప్పుడూ శ్మశాన వాటికలో పిచ్చుకల గూడు లాంటి తలతో వంటి మీద చినిగిన వస్త్రాలతో ఒక బిచ్చగాడులా ఎదురు చూస్తుంటారు..? పరమ శివుడు ఓ నా ప్రియ సఖి పార్వతి దేవి ఓసి పిచ్చిదానా నా మనసులో వ్యధ నీకు అర్థం కాలేదు అందుకే అలా మాట్లాడుతున్నావు, అయితే చెపుతాను విను లయ కారకుడు అని నన్ను అందరు ఎందుకు కొలుస్తున్నారో తెలుసా నేను తలుచుకుంటే ఎవరినైనా శాశ్వతంగా నిద్ర పుచ్చగలను, కాని వారు చేసుకున్న కర్మలే వారిని శ్మశాన వాటికకు అంటే నా దగ్గరకు చేరుస్తున్నాయి! జీవాత్మ వారితో ఉన్నంత కాలం ఆస్తులు అంతస్తులతో పాటు బార్య పిల్లలు తోబుట్టువులు బంధుమిత్రులు వారికి అండగా తోడుగా నిలుస్తారు, ఎప్పుడైతే ఆత్మ శరీరం నుండి ఒక్కసారి వేరవుతుందో శ్మశానంలో ఖననం చేసి దేహాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోతారు, ఎవ్వరు తోడు లేరని బాధపడుతున్న అంతరాత్మకు మీ కోసం నేను ఉన్నాను భయపడవద్దు అని దైర్యం చెప్పి వారిని అక్కున చేర్చుకుంటున్నాను! పరమేశ్వరుని అంతరార్థం తెలుసుకున్న జగన్మాత పార్వతి దేవి మీరు లయ కారకులు కనుక అందర్ని ప్రేమతో మీ బిడ్డలుగా స్వీకరిస్తున్నారు, అని చెప్పి అప్పటి నుండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో బాగంగా దుర్గమ్మ తల్లిగా అవతరించి ఆది దంపతులు ఇద్దరు అర్ధ నారీశ్వరులు గా దర్శనమిస్తున్నారు, అందుకే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు... మన జీవితం అంతా శివ పార్వతుల భిక్ష అని తెలుసుకుందాం! నేడు మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివ పార్వతుల ఆశీస్సులు మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ... మహా శివరాత్రి శుభాకాంక్షలు, సర్వం శ్రీ పరమేశ్వర్యర్పణమస్తు, మీ ఆర్.కె! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
10 likes
11 shares