ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత
576 Posts • 47K views
PSV APPARAO
652 views 29 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ధన్వంతరి జయంతి #ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు #🙏శ్రీ ధన్వంతరి జయంతి🕉️ #అమృత పురుషుడు ధన్వంతరి *ఈరోజు ధన్వంతరి జయంతి* *అమృత పురుషుడు ధన్వంతరి* ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి ధన్వంతరి జయంతి. దేవతల ప్రార్ధన మేరకు శ్రీహరి వారికి అమృతము అందించాలని సంకల్పంతో క్షీరసాగర మథనం జరిపించగా క్షీరసాగరము నుంచి అమృతభాండం తీసుకుని ధన్వంతరి ఆవిర్భవించాడు. ధన్వంతరిని 'అమృత పురుషుడు' అని అంటారు. 'ధను' అంటే చికిత్సకు అందని వ్యాధి. 'అంత' అనగా నాశము. ‘రి' అనగా కలిగించువాడు. చికిత్సకు లొంగని వ్యాధులను నశింపచేయువాడు అని ధన్వంతరి శబ్దానికి అర్థం. సకల లోకాలలో చికిత్సకు అందని వ్యాధి మరణమే అయినందున దానిని తొలగించి అమృతాన్ని ఇచ్చి అంతర్థానం అయినట్లు భాగవతాది పురాణాలలో చెప్పబడింది. అలా వచ్చిన స్వామి వృక్షశాస్త్రాన్ని, ఔషధ శాస్త్రాన్ని చికిత్సా విధానాన్ని వివరించే 18 మహాగ్రంథాలను అందించారు. వాటిని ఆధారంగా చేసుకుని చ్యవన, అత్రి, బృహస్పతి, కవి, చంద్ర, వరుణ, మను, ఇక్ష్వాకు మొదలగువారు వైద్యశాస్త్ర గ్రంథాలను అందించారు. ఇలా ధన్వంతరి వైద్యశాస్త్రాన్ని ఆరోగ్య సూత్రాలను అందించారు. *ఆశాచ పరమా వ్యాధి: తతో ద్వేషః తతో మనుః ।* *తేషాం వినాశనే వైద్యం నారాయణ పరాస్మృతిః ॥* ధన్వంతరి అనే గ్రంథానుసారం అన్ని వ్యాధుల కంటే పెద్ద వ్యాధి 'ఆశ', తర్వాతది 'ద్వేషం' తద నంతరం 'కోపం'. ఈ మూడు వ్యాధులకు చికిత్స నారాయణ మంత్రం. ఇటువంటి ఆధ్యాత్మిక వ్యాధి నివారణ, ఆది భౌతిక వ్యాధి నివారణ, ఆది దైవిక వ్యాధి నివారణలకు వైద్య శాస్త్రాన్ని ప్రవర్తింపచేసిన వాడు ధన్వంతరి. #namashivaya777
18 likes
12 shares
PSV APPARAO
743 views 3 months ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు జన్మించిన రోజు 🙏 #శుభ శ్రావణ శనివారం స్పెషల్ 🙏🕉️🙏 శ్రీ శ్రీనివాస ప్రవర - మంగళ స్వస్తి వాచకము #శ్రావణ శనివారం #శ్రావణ శనివారం💐🎂 🔔 *అద్భుత విశేషం*🔔 హిందూ బంధువులందరికీ ముఖ్యమైన సమాచారం ఓం నమోవెంకటేశాయ ఆగస్ట్ 9 వ తారీకు శనివారం రోజున అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు జన్మించిన రోజు శ్రావణమాసం, శ్రావణ పౌర్ణమి, శనివారం, శ్రవణా నక్షత్రం, చాలా అద్భుతమైన పర్వదినం ఈ విధంగా అన్ని ఒకే  రోజు రావడం చాలా విశేషం కావున ఆరోజున ప్రతి ఒక్కరు సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తప్పనిసరిగా దర్శించి తరించవలసిందిగా మనవి ఆరోజు ప్రతి ఒక్కరు స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసిమాలను సమర్పించండి లేదా కనీసం తులసీదళాన్ని భక్తితో స్వామికి సమర్పించి ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నామాలను స్మరిస్తూ స్వామి దర్శనం చేసుకోండి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోలేని వారు  మీరు ఎక్కడ ఉన్నా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని తలుచుకుని పై నామాలను స్మరణ చేసుకోండి ముఖ్యంగా యువత తమ యొక్క హీరోల పుట్టినరోజున ఎంతో ఘనంగా ఖర్చు పెడుతూ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అటువంటిది అఖిలాండకోటి బ్రహ్మాండాన్ని అంతటినీ సంరక్షించే మన వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం రోజున అందరూ భక్తిశ్రద్ధలతో దర్శించి తరించాలని కోరుతున్నాం మన వలన  పదిమంది స్వామి దర్శనం చేసుకున్న ,భగవన్నామం చేసిన వారి చేసే పుణ్యం లో కొంత భాగం మన ఖాతాలో పడుతుంది  ఈ మెసేజ్ నా పరిధిలో ఒక 10,000 పంపిస్తున్నాను ప్రతి ఒక్క హిందువు బంధువు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం.. https://youtu.be/fo-BwtMZmK0 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
15 likes
9 shares
PSV APPARAO
818 views 3 months ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #అడిగిన వరాలిచ్చే అన్నవరం శ్రీ సత్య నారాయణ స్వామి 🙏🙏🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 *అడిగిన వరాలిచ్చే అన్నవరం శ్రీ సత్య నారాయణ స్వామి* *జులై 26 శనివారం శ్రీ సత్య నారాయణ స్వామి అవిర్భావం సందర్భంగా...* _తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం దేవాలయం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం._ శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారు వెలసిన దివ్యదామం. ఇక్కడ ప్రతి నిత్యం నిత్య కల్యాణం పచ్చతోరమే. ప్రతి రోజు ఈ క్షేత్రం భక్తులతో కిట కిటలాడుతుంటుంది. స్వామివారు భక్తులతో కొలుపులందుకుంటూ కళ కళలాడుతుంటాడు. శ్రీసత్యనారాయణ స్వామి ఆవిర్భవించిన శ్రావణ శుద్ధ విదియ రోజున ఇక్కడ విశేష పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీసత్యనారాయణ స్వామి ఆలయాన్ని అన్నవరం రత్నగిరి కొండపై నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం జరిగి శతాబ్దం పూర్తి చేసుకున్న ఈ ఆలయం చాలా ప్రాశ్యస్త్యం, ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో ఉన్న పంపా నది భక్తులను ఆకట్టుకుంటుంది. కొండపై నిర్మితమై ఉన్న ఈ దేవాలయంలో కొలువైన శ్రీసత్యనారాయణ స్వామిని దర్శించేందుకు ఘాట్ రోడ్డు నిర్మించారు. మెట్ల మార్గం ద్వారా వెళ్లి కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతం చేసుకోవడానికి వీలుగా నిర్మించారు. సామూహిక వ్రతాలు ఇక్కడ ఎంతో ప్రత్యేకతగా నిలుస్తాయి. నేత్రపర్వంగాసాగే ఈ వ్రతాలు చూసి తీరవలసిందే. ఇతిహాసాల ప్రకారం అడిగిన వరాలు ఇచ్చే దేవుడు కాబట్టి అన్నవరం దేవుడుగా ప్రఖ్యాతి చెందాడు. స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేషులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకరేమో భద్రుడు, ఇంకొకరు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీవీర వేంక వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి (రత్సాచలం) గా మారుతాడు. తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వారికీ, రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏకకాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రంలో గురువారంనాడు రత్నగిరిపై వెలుయు చున్నాను, నీవు నన్ను శాస్త్రబద్ధంగా ప్రతిష్టించి సేవించు" అని చెప్పి అంతర్ధానమయ్యాడు. మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకుంటారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు (కృష్ణకుటజం) కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి పైకి తీసుకొనిపోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీన (శాలివాహన శకం 1813) ప్రతిష్ఠించారు. ఆలయాన్ని సా.శ. 1934 లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నాలు గలవి, శూల శిఖరాలతో ఉన్నాయి. రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరాలు, మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధాల భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం శిల్పుల నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉండాలి. ఈ ఆలయం ఆ ప్రకారం రెండు అంతస్తులలో నిర్మితమయింది. కింది భాగంలో యంత్రం. పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. కింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్పిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజలందుకోవడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణించిన యంత్రం ఇక్కడ ఉంది. *మూలతో బ్రహ్మరూపాయ* *మధ్యతశ్చ మహేశ్వరం* *అధతో విష్ణురూపాయ* *త్ర్యైక్య రూపాయతేననుః* అని స్తుతిస్తారు. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
13 likes
11 shares
PSV APPARAO
2K views 4 months ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి (స్కంద పంచమి / కుమార షష్ఠి) అరాధన ఫలితం 🙏 #కుమారోపాసన⚕️సుబ్రహ్మణ్యోపాసన 🙏 #🙏సుబ్రహ్మణ్యస్వామి #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ . *** ఈ రోజు కుమార షష్ఠి *** తమిళనాడు, తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నమ్మకం ఎక్కువే, పిల్లలు పుట్టకపోయినా, జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని నమ్ముతారు. సుబ్రహ్మణ్యస్వామి జన్మించింది కుమారషష్టి రోజునే. శివుడు ఓసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు. ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడట, అంతే మన్మధుడి మీద శివునికి విపరీతమైన కోపం వచ్చేసింది. వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేశాడు. అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకు వచ్చింది. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. దాంతో ఆయన దాన్ని గంగానదిలో రెల్లుపొదల మధ్య విడిచిపెట్టాడు. ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది అని పురాణగాధ. కుమారస్వామి అవతరించింది ఆషాఢమాసంలోని షష్టి తిథినాడే అని కొందరి నమ్మకం. అందుకే ఈ రోజుని కుమారషష్టి పేరుతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. కుమారస్వామి ఆరు ముఖాలతో అవతరించాడు కాబట్టి ఆయనను షణ్ముఖుడు అని పిలుస్తారు. అందుకే ఆయనకు షష్టి తిథి అంటే చాలా ఇష్టం. ఇక ఆషాఢమాసంలో తను పుట్టిన రోజైన కుమారషష్టి అంటే మరీ ఇష్టం. కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా చేసుకుంటారు. ఆ ముందు రోజుని స్కందపంచమిగా పిలుస్తారు. ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి కుమారషష్టి రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండు రోజుల్లో వల్లీదేవసేన సమేతంగా ఉన్న స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే సంతానం కలిగి తీరుతుందని నమ్మకం. ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించినా సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది. వీలైతే మనకి దగ్గరలో ఉన్న నాగరాళ్లు లేదా పుట్ట దగ్గర చిమ్మిలి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసినా మంచిదే. స్కందపంచమి , కుమారషష్టి రోజులలో ఇలా స్వామిని కనుక ఆరాధిస్తే జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయట. సంతానం కలగాలన్నా, సంపదలు రావాలన్నా ఈ రోజు స్వామిని పూజించాలి. కోర్టు లావాదేవీలలో విజయం సాధించాలన్నా రాబోయే పరీక్షలలో మంచి మార్కులు రావాలన్నా ఈ స్కందపంచమి, షష్టి తిథులలో స్వామిని తల్చుకోవాలి. ఓం నమో శరవణభవ..
19 likes
15 shares