ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత

563 Posts • 49K views
PSV APPARAO
1 days ago
#శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం 🕉️🙏🙏🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు అధ్యాత్మిక విశిష్ఠత కామిక ఏకాదశి / అజ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత 🕉️ నారాయణ తే నమో నమః 🙏 #కామిక ఏకాదశి *శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం* *శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఫలం* *భగవద్గీత పారాయణం మరియు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి...* భగవద్గీత పారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా గీతా పఠన మహాత్మ్యాన్ని భూదేవికి వివరించాడు. గీతా పఠనం వలన పాపాలు నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని, ఉత్తమ గతిని పొందుతారు. మానవజన్మ కర్తవ్యం గురించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఎంతగానో ఘోషించాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థ పరచక భగవత్‌ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసికోవాలి. ఈ స్వల్పమైన జీవితకాలంలో మానవుడు, సత్ప్రవర్తనపరుడై జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. సృష్టికర్తయైన ఆ భగవంతుడే అవతార రూపమున మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది. అలాగే సృష్టిలో జన్మించిన ప్రతిజీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత. భగవంతుడు సర్వాంతర్యామి, నిరాకారుడు, నిర్గుణుడు. అన్ని రూపాలు అతనివే. భగవంతుని ఏ రూపంలోనైన ఆరాధించవచ్చును. ⚜️ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు పారాయణం ప్రతి రోజు చెయ్యడం వలన అద్భుతాలు జరుగుతాయి. ⚜️ మహా విష్ణు దేవతలందరి లో ఉత్తమోత్తమైన దేవుడు.. సర్వోపగతుడు. ఇందు లేడందు సందేహమ్ము వలదు..చక్రీ సర్వోపగతుండు.ఆ దేవాది దేవుడినుండే అన్ని దేవతల సాక్షాత్కారము జరుగును. ⚜️ ప్రతి రోజు విష్ణు నామ పారాయణం జపం చేసినట్టయితే.. జీవితంలో ఉన్నత స్తానానికి చేరుకోవచ్చు. అదృష్ఠం కలుగుతుంది.. రాజ యోగం కలుగుతుంది. ⚜️ పితృ దోషాలు కనుమరుగవుతాయి. గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. తద్వారా దారిద్ర ఇతి బాధలు కనుమరుగవుతాయి. ⚜️ జ్ఞానానికి మోక్షానికి దగ్గర దారి శ్రీ మహా విష్ణు ఆరాధన. ఏవరైతే ప్రతి నిత్యం బ్రహ్మ ముహూర్తములో రావి వృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్ర నామం పారాయనం గావిస్తారో వారి సంకల్పం సిద్దిస్తుంది. మానసిక సమస్యలు తగ్గి వారి మనస్సు దృఢమై కార్యోణ్ముక్తుడిని చేస్తుంది. ⚜️ మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం. ⚜️ ఎవరైతే ప్రతి నిత్యం వింటారో వారి మానసిక, శారీరక బాధలు తగ్గి సుఖ జీవనం లభిస్తుంది. ⚜️ ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం సుదర్శన శక్తి లభిస్తుంది. మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి. అంత: శతృవులు నశిస్తారు. ⚜️ శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం వల్ల నవ గ్రహ దోషాలు తొలగి, వాక్షుద్ది కలుగుతుంది. జ్ఞానం వృద్ది నొందుతుంది.తద్వారా దేవుని సాక్షాత్కారం లభిస్తుంది. ...... ⚜️ జీవిత సత్యాన్ని భోధ పరుస్తుంది... పారాయణం అనంతరం మీ పేరు, చిరునామా ఫోన్ నంబర్ మా వాట్సాప్ నెంబర్ +919700722711 కు మెసేజ్ చేయగలరు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
PSV APPARAO
8 days ago
#శ్రీ కృష్ణుడు కుచేలుడి స్నేహం #నిజమైన స్నేహితులు #నిజమైన స్నేహితులు మీరే #నిజమైన స్నేహబంధం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *చిన్న వయసులో వేద పాఠశాలలో శ్రీ కృష్ణుడు కుచేలుడు అత్యంత స్నేహితులు గా మెలిగారు వారికి తెలియదు ఒకరు రాజు మరొకరు పేద అని, విద్యా కాలం మొత్తం పూర్తి అయ్యింది ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు, ఒకనాడు స్నేహితుడైన శ్రీకృషుడ్ని కలవడానికి కటిక పేద బ్రహ్మణుడు కుచేలుడు వచ్చాడు భటులు అంతః పురంలోనికి ప్రవేశపెట్టలేదు, దివ్యశక్తి గల కృష్ణుడు ఆ విషయాన్ని గ్రహించి తానే స్వయంగా కుచేలుడ్ని భుజం మీద చేయి వేసుకుని లోపలకు తీసుకు వెళ్ళాడు, రాజ భవనం లోపలకు వెళ్లాక అర్ధం అయ్యింది శ్రీకృష్ణుడు ఎంత గొప్ప వాడో అని నాలాంటి పేద వాడికి లోపలకు ప్రవేశించే అర్హత లేదు అని వెనుదిరగ బోయాడు కుచేలుడు, మిత్రమా లోపలకు రమ్ము అని చేయి పట్టుకుని తీసుకు వెళ్ళి ఆసనం వేసి కూర్చోబెట్టి పాదాలు కడిగి అతిధి మర్యాదలు చేసి నాకోసం ఏమి తెచ్చావు మిత్రమా అని శ్రీకృష్ణుడు అడిగినపుడు తన చిరిగిన వస్త్రంలో కొంగుకు ముడి వేసి తెచ్చిన అటుకులు ఇచ్చాడు, అమ్మకండగా తిని స్నేహితునికి గొప్ప వరాన్ని ఇచ్చాడు, ఆనాటి నుండి స్నేహితుల దినోత్సవ వైభవం వెలుగులోకి వచ్చింది... నన్ను నన్నుగా అభిమానించే ప్రియమైన మిత్రులకు శ్రేయోభిలాషులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!* *మీ పొలిమేర శివ వెంకట అప్పారావు!* P S V APPPARAO (Gopalapatnam🇮🇳Visakhapatnam) 💐🤝💐🤝💐🤝💐🤝💐🤝💐
PSV APPARAO
847 views 16 days ago
#అలా పండరిపురంలో "వార్కరీ ఉత్సవం" జయ జయ పాండురంగ విఠలా! #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఆషాడ మాసం - ఆధ్యాత్మికతకు అనువైన మాసం #జయ పాండురంగ విఠల ప్రభో 🙏🕉️🙏 *పండరీపురం పాండురంగ ఉత్సవం* *పండరీపురం పాండురంగ ఉత్సవం* > ఓం నమో పాండురంగాయ > ఓం నమో పుండరీక వర్మయా > ఓం నమో నారాయణాయ > ఓం నమో ఆశ్రిత జన రక్షకాయ శ్రీ పాండురంగ స్వామి వారి లీలావిశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం పండరీపురం. ఈ ఆలయంలో ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తారు. దీనినే పండరీపురం పాండురంగ ఉత్సవం అంటారు. అన్ని ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి మొట్టమొదటిది. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయాన్ని, పాండురంగస్వామి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ప్రత్యేక సేవలు చేస్తారు. కీర్తనలు పాడతారు. మహారాష్ట్ర చంద్రభాగ (భీమా) నదీ తీరాన పండరిపురంలో కొలువైన పాండురంగ స్వామిని విఠలుడు అనికూడా పిలుస్తారు. ఈ స్వామి వైభవం తొలి ఏకాదశి నాడే చూడాలని చెబుతారు. అంత వైభవంగా అక్కడ ఉత్సవం జరుగుతుంది. మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 'విఠోబా' పేరుతో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. విష్ణువు మరో రూపమే మహారాష్ట్రలోని పండరిపురంలో కొలువైన పాండురంగడు. శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన పుండరీకుడికి మోక్షం ప్రసాదించడానికి పండరీపుర క్షేత్రంలో పాండురంగడుగా అవతరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీపాండురంగ స్వామివారి లీలా విశేషాలకు నిదర్శనంగా, భక్తుల పాలిటి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న పండరీపురం దివ్య క్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ముందుగా ఈ పుణ్య క్షేత్రాన్ని ఆనుకుని ఉన్న భీమా నదిలో స్నానమాచరిస్తారు. భీమా నదిలో స్నానం చేయడం వలన సకల పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు నదికి సమీపంలో ఉన్న పుండరీకుని మందిరానికి చేరుకుంటారు. శ్రీపాండురంగ స్వామి ఇక్కడ కొలువుతీరడానికి పుండరీకుడే కారణంగా చెబుతుంటారు. ఆ కారణం చేత భక్తులు మొదటగా పుండరీకున్ని దర్శించుకుంటారు. శ్రీపాండురంగ స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. పద్దెనిమిదవ శతాబ్దం కాలంలోనే ఈ ఆలయం అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. ఇక్కడ పాండురంగస్వామిని భక్తులు మెట్లమార్గం ద్వారా దర్శించుకుంటారు. పండరీపురంలో శ్రీపాండురంగస్వామి కొలువుదీరడం వెనుక ఒక పురాణగాథ ఉంది. పుండరీకుడు అనే వ్యక్తి భోగాలాలసుడై విష్ణు భక్తులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాడు. అప్పుడు అతని తల్లిదండ్రులు శ్రీహరిని వేడుకుని, తమ కొడుకు బుద్ది మార్చమని అర్థించేవారు. కాలక్రమంలో వేశ్యాలోలుడైన పుండరీకుడు తల్లిదండ్రులను, భార్యను కూడా ఇంట్లో నుండి వెళ్లగొట్టాడు. అనంతరం జరిగిన పరిణామాలతో పుండరీకుడికి జ్ఞానోదయమై పశ్చాత్తాపం చెంది అహో రాత్రులు అన్నపానీయాలు మానుకుని తమ తల్లిదండ్రులకు సేవచేశాడు. పుండరీకున్ని శ్రీహరి పరీక్షించదలచి, పుండరీకుడి దగ్గరకు వచ్చి, తాను వచ్చానని చెప్పాడట. అంతలో పుండరీకుడు తాను తన తల్లిదండ్రుల సేవలో ఉన్నానని, అతని వద్దకు ఒక ఇటుకను విసిరి అక్కడ దాని మీద ఆసీనులుకమ్మని చెప్పాడు. పుండరీకుడు వచ్చేవరకు శ్రీకృష్ణుడు ఆ ఇటుకరాయి మీద నిలబడి ఉంటాడు. పుండరీకుడు తల్లిదండ్రులకు చేసిన సేవలకు మెచ్చుకొని శ్రీహరి అతనికి వరం ఇవ్వాలనుకున్నాడు. పుండరీకుడు శ్రీహరిని అక్కడే ఉండమని కోరుకున్నాడు. అందువల్ల శ్రీహరి అక్కడే శిలారూపుడయ్యాడని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీహరి అలా శిలారూపుడైన దివ్వ క్షేత్రమే పండరీపురం. మధురలో ఉన్న రుక్మిణీదేవి కృష్ణుడు కనుపించక పోవటంతో ఆయనను వెదుక్కుంటూ వచ్చిన రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు పండరీపురంలో నిలబడి ఉండటం చూసి తాను కూడ అక్కడే ఉండిపోయింది. కాని తనతో చెప్పకుండ కృష్ణుడు వచ్చినందుకు అలిగిన రుక్మణీదేవి ఆయన పక్కన కాకుండ కొంత దూరంగా ఉండి పోయింది. అందువల్లనే పాండురంగ ఆలయంలో కాకుండా ఆలయం వెనుక పక్క రుక్మిణీదేవికి ప్రత్యేక ఆలయం ఉంది. పక్కన ఉన్న ఉపాలయాల్లో సత్యభామ, రాధాదేవి, కాలభైరవుడు, దత్తాత్రేయుడు, సూర్యనారాయణుడు, మహాలక్ష్మీ, వేంకటేశ్వరస్వామికూడా కొలువుతీరి ఉన్నారు. ప్రతిరోజు ఇక్కడ పాండురంగస్వామిని దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో కనిపిస్తారు. ఆషాఢ ఏకాదశినాడు నిర్వహించే పాండురంగస్వామి ఉత్సవం సందర్భంగా ఈ ప్రాంతమంత భక్తజన సంద్రమవుతుంది. ఉత్సవంలో స్వామివారిని దర్శించుకుంటే వారి ఆశీర్వాదం మెండుగా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఉత్సవంలో పాల్గొనడానికి తరలి వస్తారు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
16 likes
13 shares