#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #అడిగిన వరాలిచ్చే అన్నవరం శ్రీ సత్య నారాయణ స్వామి 🙏🙏🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩
*అడిగిన వరాలిచ్చే అన్నవరం శ్రీ సత్య నారాయణ స్వామి*
*జులై 26 శనివారం శ్రీ సత్య నారాయణ స్వామి అవిర్భావం సందర్భంగా...*
_తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరం దేవాలయం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం._
శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారు వెలసిన దివ్యదామం. ఇక్కడ ప్రతి నిత్యం నిత్య కల్యాణం పచ్చతోరమే. ప్రతి రోజు ఈ క్షేత్రం భక్తులతో కిట కిటలాడుతుంటుంది. స్వామివారు భక్తులతో కొలుపులందుకుంటూ కళ కళలాడుతుంటాడు. శ్రీసత్యనారాయణ స్వామి ఆవిర్భవించిన శ్రావణ శుద్ధ విదియ రోజున ఇక్కడ విశేష పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీసత్యనారాయణ స్వామి ఆలయాన్ని అన్నవరం రత్నగిరి కొండపై నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం జరిగి శతాబ్దం పూర్తి చేసుకున్న ఈ ఆలయం చాలా ప్రాశ్యస్త్యం, ప్రాముఖ్యతను పొందింది. సమీపంలో ఉన్న పంపా నది భక్తులను ఆకట్టుకుంటుంది. కొండపై నిర్మితమై ఉన్న ఈ దేవాలయంలో కొలువైన శ్రీసత్యనారాయణ స్వామిని దర్శించేందుకు ఘాట్ రోడ్డు నిర్మించారు. మెట్ల మార్గం ద్వారా వెళ్లి కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతం చేసుకోవడానికి వీలుగా నిర్మించారు. సామూహిక వ్రతాలు ఇక్కడ ఎంతో ప్రత్యేకతగా నిలుస్తాయి. నేత్రపర్వంగాసాగే ఈ వ్రతాలు చూసి తీరవలసిందే. ఇతిహాసాల ప్రకారం అడిగిన వరాలు ఇచ్చే దేవుడు కాబట్టి అన్నవరం దేవుడుగా ప్రఖ్యాతి చెందాడు.
స్థలపురాణం ప్రకారం పర్వతశ్రేషులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకరేమో భద్రుడు, ఇంకొకరు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థానమైన భద్రాచలంగా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీవీర వేంక వేంకట సత్యనారాయణ స్వామిగా వెలసే రత్నగిరి (రత్సాచలం) గా మారుతాడు.
తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం సమీపంలో గోరస గ్రామ ప్రభువు రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వారికీ, రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏకకాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రంలో గురువారంనాడు రత్నగిరిపై వెలుయు చున్నాను, నీవు నన్ను శాస్త్రబద్ధంగా ప్రతిష్టించి సేవించు" అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకుంటారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు (కృష్ణకుటజం) కింద పొదలో స్వామివారి పాదాల మీద సూర్యకిరణాలు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి పైకి తీసుకొనిపోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీన (శాలివాహన శకం 1813) ప్రతిష్ఠించారు. ఆలయాన్ని సా.శ. 1934 లో నిర్మించారు. పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నాలు గలవి, శూల శిఖరాలతో ఉన్నాయి. రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరాలు, మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధాల భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.
ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం శిల్పుల నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉండాలి. ఈ ఆలయం ఆ ప్రకారం రెండు అంతస్తులలో నిర్మితమయింది. కింది భాగంలో యంత్రం. పై అంతస్తులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. కింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణుమూర్తిగా అర్పిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజలందుకోవడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణించిన యంత్రం ఇక్కడ ఉంది.
*మూలతో బ్రహ్మరూపాయ*
*మధ్యతశ్చ మహేశ్వరం*
*అధతో విష్ణురూపాయ*
*త్ర్యైక్య రూపాయతేననుః* అని స్తుతిస్తారు.
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*