ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩
573 Posts • 26K views
PSV APPARAO
564 views 1 days ago
#శుభ కార్తీక మాసం - ఈ మాసంలో జరుపుకొనే పూజలు- నోములు - పండుగ లు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: ఉత్పన్న ఏకాదశి ఆదికేశవుల పరమ పవిత్ర పుణ్య దినం 🕉️🔱🙏🙏🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఏకాదశి *ఉత్పన్న ఏకాదశి* *ఈరోజు ఉత్పన్న ఏకాదశి సందర్భంగా...* కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఇది పరమ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి, ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిధి. ఉపవాసములు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీమహావిష్ణువు యొక్క శక్తి స్వరూపములను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనది. ముర అనబడే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది... అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని నామధేయం చేశాడు... సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపములలో ఒకటి. అందువల్ల ఉత్పన్న ఏకాదశి ని ఏకాదశి తిధి యొక్క జయంతిగా భావిస్తారు. ఈరోజు ఉపవాసం తప్పనిసరిగా చేయవలెను, ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపములు హరించబడతాయి. ముర అంటే తామసిక , రాజసిక , అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించిన వారి ఆ మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠప్రాప్తి పొందగలరు. వితంతువులు కానీ ఈ రోజు ఉపవాసము ఆచరించిన యెడల ముక్తిని పొందగలరు. ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత: ఉత్పన్న ఏకాదశి యొక్క గొప్పతనాన్ని శ్రీ కృష్ణుడు మరియు యుధిష్ఠిర రాజు మధ్య సంభాషణ రూపంలో 'భవవ్యోత్తర పురాణం' వంటి వివిధ హిందూ గ్రంథాలలో వర్ణించారు. 'సంక్రాంతి' వంటి పవిత్ర రోజులలో విరాళాలు ఇవ్వడం లేదా హిందూ తీర్థయాత్రలలో పవిత్ర స్నానం చేయడం వంటివి ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. ఉత్పన్న ఏకాదశి అతని / ఆమె పాపాల నుండి విముక్తి పొందాడని మరియు చివరికి మోక్షాన్ని పొందుతారని భావిస్తారు. మరణం తరువాత 'వైకుంఠం' విష్ణువు నివాసానికి నేరుగా తీసుకువెళతారు. వేయి ఆవులను దాతృత్వంగా దానం చేయడం కంటే ఉత్పన్న ఏకాదశి మహిమ ఇంకా ఎక్కువ అని నమ్ముతారు. ఉత్పన్న ఏకాదశిలో ఉపవాసం హిందూ మతం యొక్క మూడు ప్రధాన దేవతలు బ్రహ్మ , విష్ణు , మరియు మహేశ్వరులకు ఉపవాసానికి సమానం. అందువల్ల హిందూ భక్తులు ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని పూర్తి అంకితభావంతో, ఉత్సాహంగా పాటిస్తారు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
10 likes
10 shares
PSV APPARAO
694 views 20 days ago
#కార్తీక మాసం సోమవారం మహా శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు🕉️🐚🔱 #శుభ కార్తీక మాసం 🪔🕉️🔱🪔శివకేశవుల పరమ పవిత్ర ఆధ్యాత్మిక మాసం 🙏🙏🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #🙏ఓం నమః శివాయ🙏ૐ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ 🏵️🪔🏵️ *మోక్షాన్నిచ్చే కార్తీక సోమవారం* 🏵️🪔🏵️ అధ్యాత్మికంగా కార్తీక మాసం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో అన్ని రోజులు ప్రత్యేకమైనవే. కార్తీక సోమవారం మరింత శ్రేష్టమైనది. ఈ మాసంలో సోమవారం రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజించి దానధర్మలు చేసేవారికి పాపాలనుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శివాలయాలను దర్శించడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. ముత్తెదువలు భక్తిశ్రద్ధలతో శివుడిని కొలిస్తే సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని శాస్త్ర వచనం. సోమవారం బ్రహ్మీముహూర్తంలో స్నానమాచరించి పరిశుభ్రమైన బట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలు పాటించాలి. ఇలా చేయడం వలన నిత్య సిరి సంపదలతో, సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని పండితులు చెబుతారు. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషమైనా తొలగిపోతుంది. సోమవారం ఉమామహేశ్వరులను పూజిస్తే దారిద్య్ర్యం, సమస్యలు తొలగిపోతాయి. పార్వతీ పరమేశ్వరుల పటానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చెయ్యాలి. పూలు సమర్పించుకోవాలి. తరువాత శివాష్టకం చదువుతూ విభూదిని సమర్పించాలి. పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించాలి. ఇలా ప్రతి సోమవారం చేయడంవల్ల అప్పుల బాధలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి. మూడు ఆకులు కలిగిన బిల్వపత్రం శివుని మూడు కనులకు చిహ్నం. అంతేకాదు త్రిశూలానికి సంకేతం కూడా. అందువల్ల బిల్వపత్రాన్ని శివునికి సమర్పించడంవల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. శివునికి ప్రీతికరమైనది వెలగపండు. ఇది దీర్ఘాయిష్షును సూచిస్తుంది. ఈ పండుని స్వామికి సమర్పించడం వల్ల ఆయుష్షు పెరుగుతుంది. శివపార్వతులను వేకువ జామున పూజించడం వలన ఎక్కువ ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ప్రతి రోజు పూజలు ఆచరించని వారు కనీసం సోమవారం రోజున పూజలు చేస్తే పుణ్యం లభిస్తుంది. ఈ రోజున శివాలయంలో ఉసిరికాయపై వత్తులు ఉంచి దీపం వెలిగించడం శ్రేష్టం. కార్తిక సోమవారం నాడు పాటించే స్నానం, దానం, దీపారాధనం, అర్చనం, దైవ దర్శనం అనే పంచకృత్యాలను కార్తిక సోమవార వ్రతంగా ఆచరిస్తారు. వసిష్ఠ మహర్షి ద్వారా జనక మహారాజు కార్తిక సోమవార వ్రత వైభవాన్ని తెలుసుకుని, ఆచరించి మహాదేవుడి కృపకు పాత్రుడయ్యాడని పురాణాలు వివరిస్తున్నాయి. ఉపవాస దీక్షతో శుద్దోదకం, గోక్షీరం, పంచామృతాలతో రుద్రాభిషేకం, బిల్వదళాలతో రుద్రార్చన కార్తిక సోమవారంనాడు నిర్వహించాలని రుద్రాక్షోపనిషత్తు చెబుతోంది. ఉపవాస దీక్షను పాటించలేనివారు సమంత్రక స్నాన జపాదులు చేసినా శివుని అనుగ్రహం పొందవచ్చు. మనోవికారాలను రూపుమాపుకోవడానికి శివభక్తే అసలైన ఔషధమని శివానందలహరిలో జగద్గురువు ఆదిశంకరులు చెప్పారు. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
14 likes
12 shares
PSV APPARAO
788 views 23 days ago
#కార్తీక మాసం ప్రత్యేక పర్వదినాలు #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #త్రిలోచన గౌరీ వ్రతం #కార్తీకమాసం *త్రిలోచన గౌరీ వ్రతం* *సౌభాగ్యప్రదాయిని త్రిలోచన గౌరీ వ్రతం* *అక్టోబర్ 24 శుక్రవారం త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా...* *న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్ |* *న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్ ||* అర్థం: *కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీలేదు. గంగానదివంటి ఇతర నదేదీలేదు.* _శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెలరోజులు పర్వదినాలే._ *సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే* *త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే||* తాత్పర్యం: *మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థాలను సాధించి, శరణు జొచ్చినవారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతీ, ఓ దుర్గాదేవీ, ఓ నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.* సంతాన సౌభాగ్యాలు తమ జీవితానికి సార్ధకతగా స్త్రీలు భావిస్తుంటారు. అలాంటి సంతాన సౌభాగ్యాలను ప్రసాదించేది, కాపాడేది గౌరీదేవి అని విశ్వసిస్తుంటారు. ఇక నోములు, వ్రతాల్లోను వాళ్ల ఆరాధన అందుకునేది, అనుగ్రహించేదికూడా ఆ అమ్మవారే. చల్లని మనసున్న ఆ తల్లిని కార్తీక మాసంలో పూజించడం వలన కలిగే ఫలితాలు అనంతాలని ఆధ్యాత్మిక గ్రంథాలుచెబుతున్నాయి. ముఖ్యంగా 'కార్తీక బహుళ తదియ' రోజున గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. తదియ తిథికి అధి దేవత గౌరీదేవి కావడం వలన ఈ రోజున అమ్మవారిని అంకితభావంతో సేవించాలి. కార్తీకమాసంలో తదియ తిథి రోజున త్రిలోచన గౌరి వ్రతం చేసుకుంటారు. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు మూర్తీభవించినట్టుగా ఉంటుంది, శివుడు చిన్మయ రూపంలో ఉంటాడు. అంతేకాదు శివలింగం ఎంత తడిస్తే, ఎంత చల్లబడితే, ఎంత ఆరాధన చేస్తే లోకాలు అంత చల్లబడతాయి. కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు తీరుతూ ఉంటాయి. ఈ పాపాలు ఎందుకు తీరాలనే ప్రశ్న చాలామందికి కలుగుతుంది. దీనికి సమాధానమే శంకరాచార్య విరిచిత పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జరరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే ఈ సంసార భ్రమణ పరితాపం వదిలి పోవటానికి రెండు జన్మల మధ్య పరితాపాన్ని త్యజించటానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు. అంతేకాదు మానవ జననానికి కారణం కోరిక. ఈ కోరికకు ఒక రూపం మన్మథుడు. అలాంటి మన్మథుడిని తన మూడో కంటితో దహనం చేసినవాడు ఈశ్వరుడు. అయితే ఈ చర్యలన్నింటిలోను అమ్మవారి ప్రమేయంకూడా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రమేకాదు పార్వతీదేవిదికూడా. అందుకే ఆమెను త్రిలోచన అనికూడా పిలుస్తారు. తన భక్తులకు శివుడు ఎలాంటి వరాలిస్తాడో అమ్మవారుకూడాఅంతే దయతో భక్తులను కనికరిస్తుంది. అమ్మను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే, అందుకోసమే కార్తీక మాసంలో తదియ నాడు త్రిలోచన గౌరి వ్రతంచేస్తారు. ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పూలతో పూజచేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కొన్ని పద్దతులు పాటించాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. "మౌనం" మనస్సును శుద్ధి చేసేది కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండేప్రయత్నం చేయాలి. "స్నానం" దేహాన్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఉభయ సంధ్యలలోచన్నిటి స్నానం చేయాలి. "ధ్యానం" "బుద్దిని శుద్ధి చేస్తుంది. కావున నిరంతరం ఏ పని చేస్తున్న ధ్యాన స్థితిలో ఉంటూ విద్యుత్థర్మాలు నేరవేర్చుకోవాలి. "దానం" మనం ఈ భూమి మీదకు వచ్చేప్పుడు ఏమి తేలేదు. పోయేప్పుడు ఎవ్వరు ఏమి తీసుకుపోలేరు. కావున దేనిమీద నాది అని బ్రాంతిచెందక సాధ్యమైనంతలో నీకున్న సంపాదనలో ఎంతో కొంత సాటి జీవుల శ్రేయస్సు కొరకు సహాయపడగలగాలి. "ఉపవాసం" ఉండాలి. దీనివలన ఆరోగ్యాం శుద్ది అవుతుంది. "క్షమాపణ" ఎవరైన తెలిసి తెలియక పొరపాటు చేస్తే క్షమించే గుణం ఉండాలి. తద్వార మానవ సంబంధాలు బలపడతాయి. నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి. సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడాని కిసిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి. కరుగుతున్న కాలానికీ, జరుగుతున్న సమయానికీ, అంతరించే వయసుకీ, మిగలి పోయే జ్ఞాపకమే "మంచితనం" అదే మనకు ఆభరణం. మనిషిలో "అహం" తగ్గినరోజు "ఆప్యాయత" అంటే అర్థం అవుతుంది. "గర్వం" పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నాలో దైవత్వం ఉండాలని కోరుకోవాలి తప్ప నేనేదేవున్ని అనే గర్వం రానివ్వకుండా వ్యవహరించగలిగితే ఈ వ్రత ఫలితం దక్కుతుంది. నిజానికి ఈ పై సూత్రాలుపాటిస్తే ఏ వ్రతంచేయనక్కరలేదు. సమస్త జీవులలో పరమాత్మను సందర్షించిననాడు నీలో పరమాత్మ అంతర్లీనమై ఉన్నాడని భావం. ఆస్థితికి రావడానికి కృషిచేయాలి. సాధారణంగా ఈశ్వరుణ్ణి త్రిలోచనుడు (మూడు కన్నులు కలవాడు) అంటాం. కానీ ఈరోజు గౌరీ దేవిని అంటే అమ్మవారినికూడా త్రిలోచనిగా భావించి అర్చించాలి. శివ పార్వతులకు భేదంలేదు. వారిద్దరూ ఒక్కటే స్వరూపం. అందుకే శాస్త్రం చెబుతోంది. మూడోకన్ను జ్ఞానానికి సంకేతం. అమ్మవారిని ఈరోజున యధాశక్తి ఆరాధించడంవల్ల గౌరీదేవి అనుగ్రహంవల్ల సాధకుడిలో జ్ఞానశక్తి జాగృతమౌతుంది. ఈ రోజున ఉప్పు వేయకుండా చేసిన పులగం నైవేద్యంగా పెట్టి ఆహారంగా తీసుకోవాలి. అలాగే ఉప్పును దానం ఇవ్వాలి. దీనివల్ల విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉప్పులేని చప్పిడి ఆహారం తీసుకోవడంవల్ల సాధకుడికి జిహ్వచాపల్యం, కోరికలు తగ్గి ఆరోగ్యం కలుగుతుంది. అమ్మలగన్న అమ్మ మనసు అంతకన్నా సున్నితంగా కనిపిస్తుంది. ఆ తల్లి పూజను ఎంత ఘనంగా చేశారనే దానికంటే, ఎంత భక్తి శ్రద్ధలతో చేశారనే దానికే ఆమె ప్రాధాన్యతనిస్తుంది. అలా తనని ఆరాధించినవారికే ఆమె ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, సంతాన సౌభాగ్యాలను అనుగ్రహిస్తుంది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
10 likes
12 shares
PSV APPARAO
892 views 23 days ago
#త్రిలోచన గౌరీ వ్రతం #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శుభ కార్తీక మాసం 🪔🕉️🔱🪔శివకేశవుల పరమ పవిత్ర ఆధ్యాత్మిక మాసం 🙏🙏🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #కార్తీక మాసం *త్రిలోచన గౌరీ వ్రతం* *సౌభాగ్యప్రదాయిని త్రిలోచన గౌరీ వ్రతం* *అక్టోబర్ 24 శుక్రవారం త్రిలోచన గౌరీ వ్రతం సందర్భంగా...* *న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్ |* *న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్ ||* అర్థం: *కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీలేదు. గంగానదివంటి ఇతర నదేదీలేదు.* _శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెలరోజులు పర్వదినాలే._ *సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే* *త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే||* తాత్పర్యం: *మంగళకరమైన వాటన్నిటిలోనూ అతి మంగళకరమై, సర్వ మంగళ నామధేయురాలవై, అన్ని అర్థాలను సాధించి, శరణు జొచ్చినవారికి ఆశ్రయమిచ్చే, ముక్కంటి దేవర అయిన శివుని అర్ధాంగి అయిన ఓ పార్వతీ, ఓ దుర్గాదేవీ, ఓ నారాయణీ, నీకు నమస్కరిస్తున్నాను.* సంతాన సౌభాగ్యాలు తమ జీవితానికి సార్ధకతగా స్త్రీలు భావిస్తుంటారు. అలాంటి సంతాన సౌభాగ్యాలను ప్రసాదించేది, కాపాడేది గౌరీదేవి అని విశ్వసిస్తుంటారు. ఇక నోములు, వ్రతాల్లోను వాళ్ల ఆరాధన అందుకునేది, అనుగ్రహించేదికూడా ఆ అమ్మవారే. చల్లని మనసున్న ఆ తల్లిని కార్తీక మాసంలో పూజించడం వలన కలిగే ఫలితాలు అనంతాలని ఆధ్యాత్మిక గ్రంథాలుచెబుతున్నాయి. ముఖ్యంగా 'కార్తీక బహుళ తదియ' రోజున గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి. తదియ తిథికి అధి దేవత గౌరీదేవి కావడం వలన ఈ రోజున అమ్మవారిని అంకితభావంతో సేవించాలి. కార్తీకమాసంలో తదియ తిథి రోజున త్రిలోచన గౌరి వ్రతం చేసుకుంటారు. ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు మూర్తీభవించినట్టుగా ఉంటుంది, శివుడు చిన్మయ రూపంలో ఉంటాడు. అంతేకాదు శివలింగం ఎంత తడిస్తే, ఎంత చల్లబడితే, ఎంత ఆరాధన చేస్తే లోకాలు అంత చల్లబడతాయి. కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే పాపాలు తీరుతూ ఉంటాయి. ఈ పాపాలు ఎందుకు తీరాలనే ప్రశ్న చాలామందికి కలుగుతుంది. దీనికి సమాధానమే శంకరాచార్య విరిచిత పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జరరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే ఈ సంసార భ్రమణ పరితాపం వదిలి పోవటానికి రెండు జన్మల మధ్య పరితాపాన్ని త్యజించటానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు. అంతేకాదు మానవ జననానికి కారణం కోరిక. ఈ కోరికకు ఒక రూపం మన్మథుడు. అలాంటి మన్మథుడిని తన మూడో కంటితో దహనం చేసినవాడు ఈశ్వరుడు. అయితే ఈ చర్యలన్నింటిలోను అమ్మవారి ప్రమేయంకూడా ఉంటుంది. అందుకే పరమేశ్వరుడి కన్ను శివుడిది మాత్రమేకాదు పార్వతీదేవిదికూడా. అందుకే ఆమెను త్రిలోచన అనికూడా పిలుస్తారు. తన భక్తులకు శివుడు ఎలాంటి వరాలిస్తాడో అమ్మవారుకూడాఅంతే దయతో భక్తులను కనికరిస్తుంది. అమ్మను ప్రసన్నం చేసుకుంటే భక్తుల కోరికలన్నీ తీరినట్లే, అందుకోసమే కార్తీక మాసంలో తదియ నాడు త్రిలోచన గౌరి వ్రతంచేస్తారు. ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పూలతో పూజచేస్తే అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అంటే కొన్ని పద్దతులు పాటించాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. "మౌనం" మనస్సును శుద్ధి చేసేది కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండేప్రయత్నం చేయాలి. "స్నానం" దేహాన్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఉభయ సంధ్యలలోచన్నిటి స్నానం చేయాలి. "ధ్యానం" "బుద్దిని శుద్ధి చేస్తుంది. కావున నిరంతరం ఏ పని చేస్తున్న ధ్యాన స్థితిలో ఉంటూ విద్యుత్థర్మాలు నేరవేర్చుకోవాలి. "దానం" మనం ఈ భూమి మీదకు వచ్చేప్పుడు ఏమి తేలేదు. పోయేప్పుడు ఎవ్వరు ఏమి తీసుకుపోలేరు. కావున దేనిమీద నాది అని బ్రాంతిచెందక సాధ్యమైనంతలో నీకున్న సంపాదనలో ఎంతో కొంత సాటి జీవుల శ్రేయస్సు కొరకు సహాయపడగలగాలి. "ఉపవాసం" ఉండాలి. దీనివలన ఆరోగ్యాం శుద్ది అవుతుంది. "క్షమాపణ" ఎవరైన తెలిసి తెలియక పొరపాటు చేస్తే క్షమించే గుణం ఉండాలి. తద్వార మానవ సంబంధాలు బలపడతాయి. నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి. సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడాని కిసిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి. కరుగుతున్న కాలానికీ, జరుగుతున్న సమయానికీ, అంతరించే వయసుకీ, మిగలి పోయే జ్ఞాపకమే "మంచితనం" అదే మనకు ఆభరణం. మనిషిలో "అహం" తగ్గినరోజు "ఆప్యాయత" అంటే అర్థం అవుతుంది. "గర్వం" పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నాలో దైవత్వం ఉండాలని కోరుకోవాలి తప్ప నేనేదేవున్ని అనే గర్వం రానివ్వకుండా వ్యవహరించగలిగితే ఈ వ్రత ఫలితం దక్కుతుంది. నిజానికి ఈ పై సూత్రాలుపాటిస్తే ఏ వ్రతంచేయనక్కరలేదు. సమస్త జీవులలో పరమాత్మను సందర్షించిననాడు నీలో పరమాత్మ అంతర్లీనమై ఉన్నాడని భావం. ఆస్థితికి రావడానికి కృషిచేయాలి. సాధారణంగా ఈశ్వరుణ్ణి త్రిలోచనుడు (మూడు కన్నులు కలవాడు) అంటాం. కానీ ఈరోజు గౌరీ దేవిని అంటే అమ్మవారినికూడా త్రిలోచనిగా భావించి అర్చించాలి. శివ పార్వతులకు భేదంలేదు. వారిద్దరూ ఒక్కటే స్వరూపం. అందుకే శాస్త్రం చెబుతోంది. మూడోకన్ను జ్ఞానానికి సంకేతం. అమ్మవారిని ఈరోజున యధాశక్తి ఆరాధించడంవల్ల గౌరీదేవి అనుగ్రహంవల్ల సాధకుడిలో జ్ఞానశక్తి జాగృతమౌతుంది. ఈ రోజున ఉప్పు వేయకుండా చేసిన పులగం నైవేద్యంగా పెట్టి ఆహారంగా తీసుకోవాలి. అలాగే ఉప్పును దానం ఇవ్వాలి. దీనివల్ల విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఉప్పులేని చప్పిడి ఆహారం తీసుకోవడంవల్ల సాధకుడికి జిహ్వచాపల్యం, కోరికలు తగ్గి ఆరోగ్యం కలుగుతుంది. అమ్మలగన్న అమ్మ మనసు అంతకన్నా సున్నితంగా కనిపిస్తుంది. ఆ తల్లి పూజను ఎంత ఘనంగా చేశారనే దానికంటే, ఎంత భక్తి శ్రద్ధలతో చేశారనే దానికే ఆమె ప్రాధాన్యతనిస్తుంది. అలా తనని ఆరాధించినవారికే ఆమె ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, సంతాన సౌభాగ్యాలను అనుగ్రహిస్తుంది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
14 likes
12 shares