ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩
562 Posts • 25K views
PSV APPARAO
900 views 12 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శరత్ పూర్ణిమ / కోజాగరి పూర్ణిమ/కౌముది పండుగ/కౌముది లక్ష్మీ వ్రతం 🔱🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 *కౌముది లక్ష్మీ వ్రతం* ప్రతి మాసంలోను పౌర్ణమికి ఉంటుంది. పౌర్ణమి రోజున చేసే ప్రపూజలు, వ్రతాలు విశిష్ట ఫలితాలను ఇస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆశ్వయుజ పౌర్ణమి రోజున చేసే లక్ష్మీదేవి ఆరాధన కూడా అనంతమైన ఫలితాలు ఇస్తుందని పురాణ వచనం. ఈ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు ఆరాధన విశేషమైన పుణ్య ఫలితాలను ఇస్తే, పౌర్ణమి రోజున చేసే లక్ష్మీ పూజ సిరిసంపదలను ప్రసాదిస్తుందని చెబుతారు. ఆశ్వయుజ పౌర్ణమిని 'కౌముది' పౌర్ణమి అని అంటారు. ఈ రోజున లక్ష్మీదేవి వ్రతం ఆచరించి జాగరణ చేయడం వలన, ఆశించిన ఫలితాలు శీఘ్రంగా అందుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పౌర్ణమి రాత్రి వేళలో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ, తన వ్రతం ఆచరించిన భక్తులను అనుగ్రహిస్తూ వెళుతుందట. అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్య్ర బాధలు తొలగిపోయి. సిరి సంపదలు చేకూరతాయి. అందువలన లక్ష్మి దేవి అనుగ్రహం కోసం ఈ పౌర్ణమి రోజున ఆ తల్లిని పూజిస్తూ, సేనిస్తూ ఉండాలని పండితులు చెబుతారు. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
15 likes
14 shares
PSV APPARAO
618 views 8 days ago
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #సౌభాగ్యకరం అట్లతదియ వ్రతం🙏 #అట్లతద్ది #అట్ల తదియ #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *సౌభాగ్యకరం అట్లతదియ వ్రతం* 'సలక్షణ'మైన భర్తను పొంది, 'సులక్షణ'మైన సాంసారిక జీవితాన్ని స్వంతం చేసుకోవాలని కన్యలు కోరుకుంటే. జీవితాంతం సుమంగళిగా ఉండాలనీ, పుత్ర పౌత్రాదులతో, అషెశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తూ వివాహితలైన మహిళలు ఈ నోమును భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. భారతీయ వైదిక సంస్కృతిలో నోములకు, వ్రతాలకు ప్రత్యేక స్థానముంది. ఇవి వనితల కోసం నిర్దేశింపబడినవి. అయితే అవి వారి కొసమేననే అభిప్రాయానికి రాకూడదు. ఆయా నోములు, వ్రతాల ఫలాలు ఇంటిల్లిపాదికీ అందుతాయి. అటువంటి వాటిలో ఆశ్వయుజ బహుళ తదియ నాడు భక్తి శ్రద్ధలతో ఆచరించే అట్ల తదియ ఒకటి. 'సలక్షణ'మైన భర్తను పొంది, 'సులక్షణ'మైన సాంసారిక జీవితాన్ని స్వంతం చేసుకోవాలని కన్యలు కోరుకుంటే, జీవి తాంతం సుమంగళిగా ఉండాలనీ, పుత్ర పౌత్రాదులతో, అషెశ్వ ర్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తూ వివాహితలైన మహిళలు ఈ నోమును భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. సకల సౌభాగ్య ప్రదాత్రి అయిన గౌరీ దేవి ఈ నోముకు అధిష్ఠాత్రి. అశ్వీయుజ బహుళ తదియ నాడు చంద్రోదయమైన తర్వాత గౌరీదేవిని ప్రతిష్ఠించి, పూజించి మినుములు, బియ్యం కలిపి విసిరి ఆ పిండితో అట్లను చేసి గౌరీ దేవికి నివేదించి ముత్తయిదువులను గౌరిగా భావించి, అలంకరణ చేసి, పది ఫలాలను, పది అట్లను రవికల బట్టతో వాయనంగా అందించి ఆశీస్సులందుకోవడం ఈ నోములోని విశేషం. ఆహూతులైన సువాసినులకు ప్రసా దంగా ఫలపుష్పాదులతో సహా ఇచ్చి ఆశీస్సులందుకోవాలి. ఆపై నోముకు సంబంధించి కథ చెప్పుకుని అక్షతలు దేవిపై, తనపై వేసుకుని వ్రత సమాప్తి చేయాలి. పరమ శివుని పతిగా పొందాలనే లక్ష్యంతో పార్వతి తపస్సు చేస్తున్న సమయంలో త్రిలోక సంచారి అయిన నారదుడు ఆమె మనోరథ సిద్ధికై ఈ నోమును చెప్పాడని పురాణ వచనం. ఆ విధంగా ఈ నోము చేయించడంతో ఆమె కోరిక తీరింది. ఈ వ్రతాన్ని చంద్రోదయ సమయంలో నిర్వహిస్తారు. కనుక దీనిని చంద్రో దయ గౌరీ వ్రతంగా పిలుస్తారు. చంద్రోదయ వ్రతం ఆచరించి రుక్మిణీ దేవి శ్రీకృష్ణుని భర్తగా పొందిందని శ్రీమద్భాగవతం ఉటంకిస్తోంది. *వ్రత విధానం* ఆశ్వీయుజ తదియ నాడు వేకువజామునే లేచి వ్రతులై గౌరిని పూజించాలి. రోజంతా ఉపవసించాలి. అవకాశం లేని వారు పక్వాహారం కాకుండా ఫలాలను ఆరగించవచ్చు. పాలు తాగవచ్చు, తాంబూలం కూడా సేవించవచ్చు. రోజంతా పిన్నలు, పెద్దలు కలిసి ఆటపాటలతో ఆనందంగా గడపాలని, ఊయలలూగడం వంటివి చేసి రోజంతా సంతోషంగా ఉండా లని వ్రత విధానం చెబుతోంది. కథ ఒకప్పుడు పాటలీ పుత్రాన్ని ఏలే మహారాజుకు సునామ అనే కుమార్తె ఉండేది. అందచందాలలో ఆమె సాటిలేనిది. అయితే ఆమెకు ఎంత ప్రయత్నించినా వివాహం కాలేదు. తన చెలికత్తెలందరికీ వివాహాలైవారు పిల్లా పాపలతో సంతోషంగా ఉండడం ఆమెను కుంగదీసింది. గౌరి అంటే ఎంతో భక్తి కలిగిన ఆమె తన బాధను దేవి కూడా పట్టించుకోవటంలేదని గౌరీ ఆలయానికి వెళ్ళి ప్రాణత్యాగానికి సిద్ధపడింది. ఇంతలో చంద్రోదయ వ్రతాన్ని ఆచరిస్తే సలక్షణుడైన వ్యక్తితో వివాహం జరుగుతుందని, వ్రత విధి విధానాలను తెలియజేస్తూ ఒక వాణి వినిపించింది. సునామ ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకుని ఇంటికి చేరింది. తాను దేవాలయంలో విన్న విధంగా చంద్రదోయ వ్రతాన్ని నిర్వర్తించడానికి సంకల్పిం చింది. ఆశ్వయుజ తదియనాడు రాకుమారి సునామ వ్రతదీక్ష పూనింది. అయితే చంద్రోదయం వరకూ ఆమె ఉపవాసం ఉండడం కష్టమని ఆమె ఆ కఠిన నిబంధనలను పాటించలేదని భావించి ఆమెపై ప్రేమతో ఆమె సోదరుడు కొద్దిగా చీకటి పడుతున్న వేళ ఆమె పూజ చేస్తున్న ప్రాంగణంలో ఒక వృక్షా నికి పెద్ద అద్దం వేలాడదీయించి, దానికి ఎదురుగా ఒక గడ్డి వాము నుంచి దానిని కాల్పించాడు. కాలుతున్న గడ్డివాము కాంతి ఆ అద్దంలో చంద్రోదయ మనట్టు కనిపించేలా ఏర్పాటు చేశాడు. అనంతరం చెల్లెలితో చంద్రోదయమైందని నమ్మ బలికాడు. దానితో ఆమె చంద్రోదయం కాకుండానే వ్రతం ముగించి ఆహారం తీసుకుంది. వ్రతం భంగమవడంతో ఫలితం దక్కలేదు. సునామ స్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అయితే వ్రతం చేసినా దేవి తనను కరుణిం చలేదని నిరాశ చెందిన సునామ అంతఃపురాన్ని వీడి అడవుల బాటపట్టింది. అక్కడ ప్రాణాలు వదలాలని నిశ్చయించుకుంది. ఆమె కృత కృత నిశ్చయానికి అబ్బురపడిన గౌరీశంకరులు వృద్ధుల రూపంలో వచ్చి సునామ సోదరుడు చేసిన తప్పిదాన్ని చెప్పి మళ్ళీ వ్రతం చేయమని చెప్పారు. ఆ వృద్ధులను పార్వతీ పరమేశ్వరులుగా భావించిన సునామ మరోమారు వ్రతాన్ని చేసింది. పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు పొందిన సునామకు కరివీరుడనే ఉత్తమునితో వివాహం జరిగింది. గౌరీ కృపతో ఆ దంపతులు సత్సంతానాన్ని పొంది సుఖసంతోషాలతో, భోగ భాగ్యాలతో జీవించారు. అట్లతదియ నోమును సువాసినులు పదేళ్ళ పాటు ప్రతి ఏడాది నిర్వహించి ఆ తర్వాత ఉద్యాపనం చెప్పుకోవాలి. పది మంది ముత్తయిదువలకి నల్లపూసల తాడు, లక్క జోళ్ళు, రవికలబట్టలు, దక్షిణ తాంబూలాలతో పదేసి అట్లు వాయనంగా ఇచ్చి ఆశీస్సులు పొందాలి. ఇలా ఉద్యాపనం చేసిన అతివలు సంసారంలో సుఖసంతోషాలతో, సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని పురాణ కథనం. అట్ల తద్ది నోములో ఎన్నో జ్యోతిష, వైద్య, విజ్ఞాన శాస్త్ర రహస్యాలు ఇమిడి ఉన్నాయి. జ్యోతిషశాస్త్ర రీత్యా కుజుడు అట్ల ప్రియుడంటారు. అట్లు నివేదించడం వల్ల కుజ దోషం తొలగుతుంది. స్త్రీలలో రజోదయానికి కారకుడు కుజుడే. అందువల్ల ఈ వ్రతంతో సంతోషించి అతను ఋతు సంబంధ సమస్యల నుంచి రక్షిస్తాడు. ఇక ఆయుర్వేదాన్ని అనుసరించి అట్లు చేయడానికి బియ్యం, మినుములు వాడతారు. మినుములు రాహువుకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. వీటితో తయారైన అట్లు నివేదించి వాయనం ఇవ్వడం చేత ఈ రెండు గ్రహాలు సంతుష్టులై స్త్రీలకు గర్భస్రావాలు వంటివి జరగ కుండా సుఖంగా ప్రసవం జరిగేలా చూస్తాడు. ఇంతటి మహత్వపూర్వమైన అట్లతద్ది నోములోగల అంతరార్థాన్ని గ్రహించి అతివలందరూ ఆచరించగలిగితే శుభం కలుగుతుంది. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
8 likes
7 shares
PSV APPARAO
722 views 12 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: శరత్ పూర్ణిమ / కోజాగరి పూర్ణిమ/కౌముది పండుగ/కౌముది లక్ష్మీ వ్రతం 🔱🕉️🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 *శరత్ పూర్ణిమ* విజయదశమి తరవాత వచ్చేది- శరత్ పూర్ణిమ. ఇది ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ. ఈ పర్వదినాన లక్ష్మీదేవిని విశేషంగా పూజి స్తారు. మహిళలు వ్రతం ఆచరిస్తారు. శార దాదేవిని ఆరాధిస్తారు కాబట్టి, దీన్ని 'శారదా పూర్ణిమ' అని పిలుస్తారు. ఇదే పూర్ణిమ నాటి రాత్రి లక్ష్మీదేవి భువిలోని ఇళ్లకు వెళ్తుందని, తలుపు తట్టి 'రాత్రివేళ కొబ్బరి నీరు మాత్రమే సేవించి మేలుకొన్నదెవరు' అని ప్రశ్నిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. 'కో జాగర్'- అంటే, 'మేలుకొన్నదెవరు' అని అర్థం. అటువంటి స్త్రీలు గల ఇంట్లోకి దేవి ప్రవేశించి, సకల సంపదలూ అనుగ్రహిస్తుందని భక్తకోటి నమ్ముతుంది. లక్ష్మికి వాహనం- పైడికంటి పక్షి. ఆ చల్లని తల్లి చేతిలో గవ్వల భరిణ ఉంటుందట. బియ్యం ఆమెకు ఎంతో ఇష్టమని చెబుతారు. అందుకే బెల్లం పాయసాన్ని దేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. గవ్వలు అంటే, దేవి చేతిలోని నాణేలు! సముద్రం నుంచి ఆవిర్భవించడం వల్ల, సహజంగానే ఆమె చేతిలో గవ్వలుంటాయి. అవి సిరిసం పదలకు సంకేతాలన్న భావన లోకంలో నెలకొని ఉంది. దేవికి అటుకులు, కొబ్బరి అత్యంత ప్రీతికర మైనవి. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో మహి ళలు బియ్యపు పిండిని ముద్దలుగా చేసి, ఇంటి ద్వారాల వద్ద ఉంచుతారు. ఇంటి గోడల మీద ఆ తల్లి పాదముద్రలు, శంఖాల బొమ్మలు, పైడికంటి పిట్టల చిత్రాలు వేస్తారు. గవ్వలాడుతూ, పాటలు పాడుకుంటూ, లక్ష్మిని ఆహ్వా నిస్తూ రాత్రంతా తదేక చిత్తంతో జాగారం చేస్తారు. భక్తులు కొబ్బరినీరు మాత్రమే తీసుకుంటారు. వారు సంధ్యాసమయం నుంచి శంఖనాదం చేస్తుంటారు. ఆశ్వయుజ పూర్ణిమ వ్రత కథ 'భవిష్యో త్తర పురాణం'లో వివరంగా ఉంది. నియమ నిష్ఠలు కలిగిన వ్రతం ఇది. పార్వతికి వని తలు షోడశోపచార పూజలు చేస్తారు. అరి సెలు, అప్పాలతో పాటు కూరలు, అన్నం సిద్ధపరుస్తారు. ఆ తల్లితో పాటు నందికేశ్వర ప్రతిమలు ఉంచుతారు. ధర్మ అర్థ కామ మోక్షాలకు సంకేతంలా 'చతుర్భుజ'గా మహే శ్వరిని భావించి అర్చిస్తారు. నైవేద్యం, తాంబూలం, హారతి, ప్రదక్షిణ ముగిసిన అనంతరం- విగ్రహాన్ని జలంలో నిమజ్జనం చేయడం తరతరాల సంప్రదాయం. వ్రత విధానాన్ని సాక్షాత్తు పరమేశ్వరే ఉప దేశించిందని పురాణ గాథలు చెబుతాయి. మగధ రాజ్య నివాసి వలితుడు భాగ్య వంతుడు కావడానికి, భార్యాసమేతంగా నిశ్చిం తగా కాలం గడపడానికి అపార భక్తిశ్రద్దలే కారణమని అవి వివరిస్తాయి. శ్రీమహాలక్ష్మి కృపా కిరణాలు సదా తమపై ప్రసరించాలని భక్తజనులు త్రికరణ శుద్ధిగా కోరుకుంటారు. ఆమె నామ శబ్దాన్ని వేదవి హితంగా, అనంత సంపదకు పర్యాయ పదంగా వారు సర్వదా తలచుకుంటారు. ఈ పండుగను మహారాష్ట్ర మహిళలు మహోత్సాహంగా జరుపుతారు. వెన్నెల రాత్రి ఆహారంగా పాలలో నానబెట్టిన అటుకుల్ని స్వీకరిస్తారు. పంచదార, కుంకుమ పువ్వు వేసి క్షీరాన్నం వండుతారు. ఆ పాయస పాత్రను బయట వెన్నెలలో ఉంచడం వల్ల, సహజసిద్ధంగానే చంద్రకిరణాల అమృత శక్తి ప్రసరి స్తుందని అనేకులు నమ్ముతారు. ఈ వ్రతాచరణ విధానం కాలక్రమంలో మహారాష్ట్ర నుంచి అన్ని రాష్ట్రాలకూ విస్తరిం చింది. ఇంటింటా సిరులు కురిపించే నిండైన పున్నమి వెన్నెల వేళగా దీన్ని తెలుగువారు పరిగణిస్తారు. సాయంకాలం ప్రారంభమయ్యే పండుగ సందర్భంగా, తల్లి తన బిడ్డలకు కొత్త వస్త్రాలిస్తుంది. దేవ వైద్యులైన అశ్వని పరిరక్షణలో పిల్లలందరూ చల్లగా ఉండాలని మాతృమూర్తి ఆశిస్తుంది. అలాగే, ఈ శుభసమయంలో నారదీయ పురాణ గ్రంథాన్ని దానం చేస్తే మరెన్నో ఉత్తమ ఫలి తాలు కలుగుతాయన్నది భక్తజనుల ప్రగాఢ విశ్వాసం! *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
12 likes
10 shares
PSV APPARAO
940 views 16 days ago
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 🪔 *శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీ రాజరాజేశ్వరి* 🪔 మనస్సుకు అధిపతి చంద్రుడు'. చంద్రుడు వెన్నెలను బాగా పండించే ఋతువు శరదృతువు. శరదృతువులో మొదటి మాసం, ఆశ్వయజుమాసం, చంద్రుడంటే 'తల్లి'. జన్మనిచ్చిన మాత, జగన్మాత. చంద్రుడు అనుగ్రహం ఉంటే, మనస్సు నిశ్చలంగా ఉంటుంది. నిశ్చల మైన మనస్సుతో ఏ కార్యాన్నైనా చేయగ లుగుతాం. చంద్రాను -గ్రహం, తల్లి ఆరాధ నతో లభిస్తుంది. ప్రతిరోజూ జగన్మాత ఆరాధన చేసినా, శర దృతువులో ఆశ్వయుజమాసంలో శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు అనగా నవమి వరకూ తల్లి ఆరాధనకు శ్రేష్టమని విశేష ఫలితాన్నిస్తుందని పురాణములు, ఉపనిష త్తులు పేర్కొన్నాయి. నవాహ్నిక దీక్షగా (తొమ్మిది రోజులు) వ్రతాన్ని ఆచరించి, మనలో ఉన్న పశు రాక్షసత్వాన్ని పార ద్రోలి, నరుడు నరోత్తముడవుతాడు. పదవరోజు విజయదశమి. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవా నికి మకుటాయమానమైన పండుగ, విజయదశమి. నవ రాత్రి పూజకు జయకేతనం విజయదశమి. లోకాలనేలే ప్రభ్వి శ్రీ రాజరాజేశ్వరీ మాతను విజయదశమి రోజున పూజిస్తారు. "యాదేవీ సర్వభూతేషు, శక్తి రూపేణ సంస్థితా నమ స్తస్యై నమస్తస్యై నమో నమః" అన్నది దేవీ సప్తశతి, శక్తి ఆరాధన ఎందుకు చేయాలి అంటే విశ్వమంతా 'వక్తి'మయం. శక్తిలేనిదే ఏ పనీ చేయలేం. ఆత్మశక్తిని పెంపొందించుకుంటేనే మానవుడు ప్రగతిపథంలో పయని స్తాడు. అంతేకాదు, ఎందరికో ఆదర్శప్రాయుడై వారి జీవితా లలో కూడా వెలుగును నింపే శక్తి వంతుడవుతాడు. దీనితో సమాజ వికాసం కలుగుతుంది. ఇదే దేశాభ్యున్నతికి దోహదం చేస్తుంది. తల్లిగా కరుణించి, లాలించి తండ్రిగా పోషించి, గురు వుగా విజ్ఞానాన్ని అందించి, విశ్వంలోని ఏ పదార్థానికి ఎంత సామర్థ్యం ఉందో ఎంత ప్రాధాన్యతనివ్వాలో అన్న విష యాన్ని తెలియజేస్తూ, తప్పుదోవ తొక్కకుండా బిడ్డల్ని ఒక కంట కనిపెట్టి ఉండేది- జగన్మాత. అందుకే ఆ మహాశక్తిని 'శ్రీమాతా' అన్నారు. జగన్మాత సామ్రాజ్యం- మూడు లోకా లలో వ్యాపించి ఉంటుంది. బ్రహ్మాండమంతటా వ్యాపించిన తల్లి 'మహా' రాజ్ఞి'. రాజ లక్షణమైన రాజఠీవి, పరిపాలనకు ఉండవలసిన కాఠిన్యం, మాతృ వాత్సల్యం- ఈ త్రిగుణాలతో సృష్టిస్థితి లయలను త్రిమూర్తులచేత చేయిస్తూ, త్రిమూర్తులకే కాక, చతుర్దశ భువనములకు ప్రభ్వి, సింహాసనేశ్వరి శ్రీ రాజరా జేశ్వరి. 'శ్రీ' అంటే లక్ష్మి, సమస్త లక్ష్మీ సంతతని ప్రసాదించే త్రిజగన్మాత- శ్రీ రాజ రాజేశ్వరి. తల్లి కరుణార్ద్ర నయనాలతో, విశ్వం మేల్కొంటుంది, ప్రపంచం ఉదయిస్తుంది. తల్లి ఆగ్రహిస్తే విశ్వం లయమవుతుంది. విశ్వమహాసామ్రాజ్ఞిగా, తల్లికి అందరూ సమానమే. అయితే ఋజు మార్గంలో విద్యుక్త ధర్మాన్ని నిర్వ ర్తించే వారికి ఆమె చేయూతనిస్తుంది. మండలాధిపతులు, భూమండలాధిపతులు, రాజ్యాధిపతుల అందరూ సామ్రాజ్య పదవీ లబ్ధులు. తన భక్తులకు భాహ్య సామ్రాజ్య పదవికన్న మిన్న అయిన ఆత్మానంద సామ్రాజ్య పదవిని అనుగ్రహించే శ్రీదేవి శ్రీ రాజరాజే శ్వరి, ఇంద్రాది అష్ట దిక్పాలకులు రాజులయితే, వారికి రాజులు సత్వ రజ తమో గుణాతీతులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వీరి చేత సృష్టి, స్థితి లయ కార్యములను గావింపజేసే ప్రభ్వి- శ్రీమాత- శ్రీ మహారాజ్ఞి, సింహసనేశ్వరి, కను కనే శ్రీ రాజరాజేశ్వరి సార్ధక నామధేయురాలైంది. "చితాభస్మాలేపో గరల మశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతి హారీ పశుపతిః కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవాని త్వత్పాణి గ్రహణ పరిపాటీఫలమిదమ్" చితాభస్మాన్ని పూసుకొనేవాడు, విషమే ఆహారమయినవాడు, దిక్కులే వస్త్రాలుగా గలవాడు, తలపై జడలవాడు, మెడలో పాముల దండలవాడు, పశువులకు పతి, చేతిలో తల పుట్టె కలవాడు, భూతనాధుడు- పరమశివుడు అయినా ఎల్లలోకాలకు ప్రభువు అయినాడు "ఓ భవుని రాణీ" అని సంభో ధిస్తు అటువంటి జగదీశైక పదవి ఈశ్వరునికి లభించటానికి కారణం- నీ పాణిగ్రహణం పరిపాటే ఫలమేనని, శ్రీ రాజరాజేశ్వరీ సామ్రాజ్య వైభవాన్ని వివరించాడు శ్రీ శంకర భగవత్పాదులు. సాత్విక సాధన, పవిత్ర భావన, నిర్మల హృదయం, నిశ్చల మనస్సు- వీటితో సంపూర్ణ శరణాగతితో భక్తిభా వంతో, తల్లిని స్మరిస్తే, మన యోగక్షేమాల్ని, జగన్మాత చూసుకుంటుంది. ఆ తల్లే శ్రీ రాజరాజేశ్వరి. "పరాశక్తి మనుపరాద నాపై పరాకేలనమ్మా పురాణి ధర్మ సంవర్ధని శ్రీపురాధీశ్వరి రాజరాజేశ్వరి" సర్పభూషణుడైన శివుడు, దేవరాజైన ఇంద్రుడు, జలజభవుడైన బ్రహ్మ, రాక్ష సారులైన దేవతలు- అందరూ జగన్మాత, శ్రీ రాజరాజేశ్వరీదేవి అనుగ్రహం కోసం ప్రాకులాడతారు. లోకాధిపతులందరూ ఆ జగన్మాత కరుణా కటాక్షము లతోనే శాశ్వత సౌఖ్యాన్ని పొందారని చెప్తూ, అటువంటి శ్రీ మహారాజ్ఞి రాజ్యంలో దుష్టులు అనగా సాధుజనులను నిరాకరించేవారికి ప్రవేశము లేదని, ధర్మవర్తనులకు, త్యాగశీలురకు మాత్రమే- శ్రీ రాజరాజేశ్వరి సామ్రా జ్యంలో స్థానం ఉంటుందని, వారికే ఆ జగన్మాత శాశ్వతానందాన్ని అందిస్తుం దని, తిరువారూరులోని శ్రీ రాజరాజేశ్వరీదేవి అయిన ధర్మసంవర్ణనీ మాతను సద్గురు త్యాగరాజస్వామి, ఆధ్యమైన ఆది తాళ నిబద్ధనలో, సావేరీ రాగంలో గానం చేశారు. ఇది శ్రీ రాజరాజేశ్వరీ సామ్రాజ్య స్వారాజ్య సిద్ధికి దర్పణం. పరమేశ్వరుణ్ణి రంజింపజేసే పరమేశ్వరి- శ్రీరాజరాజేశ్వరి, ప్రపంచంలో మంచితనానికి మారుపేరు జగన్మాత. తనలాగానే బిడ్డలు కూడా మంచిగా నడుచుకోవాలని హితవు పలుకుతుంది. శ్రీచక్రం- యంత్రం, శ్రీవిద్య మంత్రం- శ్రీ సహస్రం- తంత్రం- శ్రీచక్రమునందు నవ (తొమ్మిది) ఆవరణ ములుంటాయి. అందులో 'బిందు' రూపంలో మహాచైతన్యంతో వెలిగే, మహోదాత్తశక్తి శ్రీ రాజరాజేశ్వరి. ఈ విశాల కువలయమే తల్లికి ఆలయం, శ్రీవిద్య, శ్రీచక్ర సంబంధిత విషయాలు గురుముఖతగా తెలిసికోవాలి. అయినా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. మనశ రీరమే ఒక శ్రీచక్రం. అందులో నవ ఆవరణలుంటాయి. అవి త్రైలోక్యమోహన చక్రం, సర్వాశాపరిపూర్వక చక్రం, సర్వసంక్షోభణ చక్రం, సర్వసౌభాగ్యదా యక చక్రం, సర్వార్ధసాధక చక్రం, సర్వరక్షాకర చక్రం, సర్వరోగహర చక్రం, సర్వసిద్ధిప్రద చక్రం, తొమ్మిదవది సర్వానందమయ చక్రం. ముత్తుస్వామి దీక్షి తులవారు నవావరణ కీర్తనలు మనకందించారు. అత్యద్భుతమైన కీర్తనలు. 'శ్రీకమలాంబా జయతి అంబా శ్రీ కమలాంబా జయతి.. సూకరానవాద్యర్చిత మహాత్రిపుర సుందరీం రాజరాజేశ్వరీం సువాసినీం, కర సర్వానందమయ చక్రవాసినీం, చింత్రాయేహం" అని, దేవీ అనుగ్రహసిద్ధుడు, దేవీ ముక్తాహార వరప్రసాది, తొమ్మిదవ ఆవరణానికి మనకిచ్చిన కీర్తన, శ్రీ రాజరాజేశ్వరీ దేవి పూజకు పూర్తి స్ఫూర్తినిస్తుంది. శక్తితత్త్వం, ఈశ్వరతత్త్వం, పైకి అనగా సామాన్య దృష్టికి వేరుగా కనపడినా అది ఒకే తత్త్వం, అభిన్న స్వరూపాలు. ఆ రెండు తత్త్వములు వాక్కు అర్ధం లాంటివి. అవి కలిసే ఉంటాయి. ఇదే శివశక్తి సామరస్యం, జీవుడు శివ శక్తుల సంయుక్తోపాసన చేయాలి. ఈ విషయాన్నే 'అంగన సహిత భుజంగ శయన ఎన్నకంగళి గుత్సవవీయో' అనే కీర్తనలో సూచించారు. కర్నాట సంగీతానికి అద్యుడు, వాసుదేవ విఠలుని వాసిగా భజించిన శ్రీపురందరదాసు. ఈ తొమ్మిది రోజులలో (తిథులలో) మహాశక్తిలో, త్రిమూర్తులు అష్టదిక్పా లకులు, సమస్త దేవతలు తమ శక్తుల్ని విలీనం చేస్తారు. ఎందుకంటే, ఏ పురు షుని చేత కాకుండా స్త్రీమూర్తి చేతనే సంహరింపబడేటట్లు, వరములు పొందారు ఆ రాక్షసులు అందరూ. రాక్షసులనందరినీ సంహరించిన తదుపరి, విజయోత్సవంతో, మరల శివశక్తులను ఏకం చేసి అర్ధనారీశ్వర తత్త్వంతో ప్రకృతీ పురుషుల ఏకత్వాన్ని, శివశక్తుల సామరస్యాన్ని విజయదశమి రోజున సాయంత్రం సంధ్యాసమయంలో, శమీవృక్షం (జమ్మిచెట్టు) దగ్గర సంయుక్తో పాసన, ఏకేశ్వరోపాసన చేస్తారు. చంద్ర నక్షత్రమైన హస్తానక్షత్రంలో కలశస్థా పన చేసి, పాడ్యమి తిథి నుంచి జగన్మాత శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభించి మరల చంద్ర నక్షత్రమున శ్రవణా నక్షత్రంలో కలశోద్వాసనతో, శమీపూజ ఏకేశ్వరోపాసనతో కలశోద్వాసనతో శరన్నవరాత్రి పూజను విజయ దశమితో ముగిస్తారు. "శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాసిని, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శినీ" అన్న శ్లోకాన్ని పఠిస్తూ శమీవృక్షానికి ప్రదక్షిణ చేస్తారు. శమీ (జమ్మి) ఆకుల్ని ఒకరికొకరు యిచ్చుకుంటారు. ఈ ఆశ్వయుజ దశమి నుండి, మరలా వచ్చే సంవత్సరం ఆశ్వయుజ దశమి వరకు, విజయాన్ని చేకూర్చి కాపాడమని, శమీ వృక్షాన్ని ప్రార్థిస్తూ, శివశక్తుల సంయుక్తోపాసనగా దర్శి స్తారు. ఈనాటికి ఆ జమ్మిచెట్టు, బ్రాహ్మణ వీధిలో విజయవాడలో ఉన్నది. అక్కడే సంయుక్తోపాసన- శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు చేస్తారు. దీనికి గొప్ప స్థల పురాణం కూడా ఉన్నది. "శ్రీ రాజరాజేశ్వరి, త్రిపురసుందరి శివే పాహిమాం, వందే పూర్ణచంద్రికా శీతలే విమలే"- పూర్ణచంద్రునివలె చల్లనైన తల్లీ అంటూ, పూర్ణచంద్రికారా గంలో, ముత్తుస్వామి దీక్షితులు కీర్తించిన ఈ కీర్తన- చంద్ర నక్షత్రమయిన శ్రవణా నక్షత్రంలో వచ్చే విజయదశమి పండుగకు, శ్రీ రాజరాజేశ్వరీ పూజకు, సంపూర్ణ దీప్తినిస్తుంది. "శంకరి శంకరి కరుణాకరి, రాజరాజేశ్వరి, సుందరి పరాత్పరి గౌరి అంబి.. పరమ పావని, భవాని సదాశివ కుటుంబిని.." అని శివశక్తి సామరస్యాన్ని, కల్యాణి లయబ్రహ్మ, కామాక్షి వరప్రసాదుడు- శ్యామశాస్త్రి, మనకందించిన కీర్తన, విజయదశమి రోజున అర్చనలందుకొన్న శ్రీ రాజరాజేశ్వరీ తత్త్వానికి స్ఫూర్తినిస్తుంది. ఆధునిక విజ్ఞాన సముపార్జన, వికాసము- విశ్వమానవ కల్యా ణానికి ఉపకరించాలని, శ్రీమాత, శ్రీమహారాజ్ఞి శ్రీ రాజరాజేశ్వరీ పూజ, విజ యదశమి రోజున, విజయోస్తు అని చెప్తూ, విశదపరుస్తోంది. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
14 likes
4 shares