ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩
624 Posts • 27K views
PSV APPARAO
674 views
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #🙏భీష్మాష్టమి శుభాకాంక్షలు #భీష్మాష్టమి శుభాకాంక్షలు *మానవాళికి మార్గదర్శి* *జనవరి 26 సోమవారం భీష్మాష్టమి సందర్భంగా* ... మాఘ శుక్ల సప్తమి మొదలు ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకా లుగా భావిస్తారు. భారత యుద్ధం సమ యంలో క్షతగాత్రుడై, దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్త రాయణం వచ్చే వరకూ, అంపశయ్యపై పరుండి ఉండి మాఘ శుక్ల సప్తమి నుండి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడనా డారని చెపుతారు. కాల నిర్ణయ చంద్రిక, నిర్ణయసింధు, ధర్మ సింధు, కాల మాధవీయం మున్నగు గ్రంథాలు మాఘ శుద్దాష్టమిని భీష్మ నిర్యాణ దీనంగా చెపుతున్నాయి. కార్తీక బహుళ అమావాస్యనాడు భారత యుద్ద ప్రారంభదినంగా భావించ బడుతుంది. కార్తీక మాసంలో రేవతీ నక్షత్రం నాడు శ్రీకృష్ణుడు, కౌరవుల వద్దకు రాయబారానికి పయనమై నట్లు భారతంలో ఉంది. "కార్తీక పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం అవు తుంది. కృత్తికా నక్షత్రానికి మూడవ పూర్వపు నక్షత్రం రేవతి. ఆనాటి గణనలో రేవతీ నక్షత్రం శుద్ధ త్రయోదశి అవుతుంది. రాయ బారిగా వెళ్ళిన కృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులున్నాడు. వస్తూ కర్ణునితో మాట్లా డాడు. సదరు సంభాషణలో శ్రీకృష్ణుడు జ్యేష్ఠా నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్ధం ప్రారంభం కాగలదని కర్ణునికి చెపు తాడు. భీష్ముడు అంపశయ్యపై యాభై ఎనిమిది రోజులున్నట్లు భారతంలో స్పష్టపరచ బడింది. భీష్మాచార్యులు యుద్ధం చేసింది పది రోజులు. భారత యుద్ధ ప్రారంభమైన కార్తీక బహుళ అమావాస్య నుండి 68రోజులు లెక్కిస్తే వచ్చేది మాఘ శుద్దాష్టమి. అదీగాక భారతయుద్ధ ప్రారంభంలో అర్జునుడు బంధు వధకు శంకిస్తాడు. ఆ సందర్భంలోనే శ్రీకృష్ణుడు, విజయునికి తత్త్వోపదేశం చేస్తాడు. ఆ ఉపదేశమే భగవ ద్గీత. ఈ ఉపదేశం యుద్ధం ప్రారంభదినాన జరిగింది. ఆ దినాననే గీతా జయంతి (భగవ ద్గీత పుట్టినదినం)గా జరపడం కొన్ని చోట్ల ఉంది. కనుక మాఘ శుక్లపక్ష అష్టమియే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు. పద్మ పురాణంలో, హేమాద్రి వ్రత ఖండంలో భీష్మా ష్టమి గురించి చెప్పబడింది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుందని విశ్వాసం. ఈనాడు భీష్మునికి తర్పణం విడవాలని స్మృతి కౌస్తుభం తెలుపుతున్నది. కృత్యసార సముచ్చయాధారంగా భీష్మాష్టమి శ్రాద్ధదినం. భీష్మ ద్వాదశి వ్రతం ఈ దినాననే ప్రారంభిస్తా రని నిర్ణయసింధువు స్పష్టపరుస్తున్నది. భీష్మాష్టమి భారత దేశమంతటా జరుపుకోవా ల్సిన పర్వమని వ్రతోత్సవ చంద్రిక సూచిస్తు న్నది. కొందరు పంచాంగకర్తలు ఈనాటి వివర ణలో నందినీ పూజ, భీష్మాష్టమిగా పేర్కొం టారు. "వైయాఘ్రసద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ, అపుత్రాయ తదామ్యే తజ్జలం భీష్మాయవర్మణే, వసూ రామవతారాయ శంతనోరాత్మజాయచ, అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రాహ్మచా రిణే". అంటూ ఈదినం నాడు భీష్ములకు తర్పణం విడవాలని అమాదేర్ జ్యోతిషి పేర్కొంటున్నది. ఈనాడు తర్పణం, శ్రాద్ధం చేసిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని పురాణోక్తి. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
9 likes
11 shares
PSV APPARAO
556 views
#షట్తిల ఏకాదశి #షట్తిల ఏకాదశి💐🎂 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #షట్తిల ఏకాదశి శుభాకాంక్షలు #షట్తిల ఏకాదశి శుభకాంక్షలు *షట్తిల ఏకాదశి* _జనవరి 14 బుధవారం షట్తిల ఏకాదశి సందర్భంగా..._ 🔯 *షట్తిల_ఏకాదశి_అంటే_ఏమిటి?* ☸️ *ఆరోజు_ఏంచేయాలి?* ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తిల అంటే నువ్వులు షట్తిల ఏకాదశి రోజు ఆరు విశిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం శ్రేయస్కరమని శాస్త్రాల్లో పేర్కొన్నట్లు పండితులు చెబుతున్నారు. ఆ రోజు శ్రీమన్నారామణునికి, పితృదేవతలకు అత్యంత ప్రీతికమైనది. అందువల్ల షట్ తిల ఏకాదశినాడు ఆచరించాల్సిన ఆరు ధర్మ విధులు. *షట్తిల ఏకాదశి నాడు నిర్వర్తించాల్సిన ఆరు తిల విధులు* *ఆ ఆరు తిల విధులు ఏమిటంటే..* 🌺1) తిలాస్నానం - నువ్వుల నూనె వంటికి రాసుకుని , నువ్వులతో స్నానం చేయాలి నువ్వులు నెత్తిమీద నుండి జాలువారేలా స్నానం చేయాలి. 🌺 2) తిల లేపనం – స్నానానంతరం నువ్వులను ముద్ద చేసి ఆ పదార్థాన్ని శరీరానికి పట్టించడం 🌺 3) తిల హోమం - ఇంటిలో తిల హోమం నిర్వహించాలి. 🌺 4) తిలోదకాలు – పితృ దేవతలకు తిలోదకాలు సమర్పించాలి. అంటే నువ్వులు నీళ్లు వదలడం అన్నమాట , నువ్వులు బొటన వేలుకు రాసుకుని ఒక పద్దతి ప్రకారం నీళ్లతో వదలడం. 🌺 5) తిలదానం - నువ్వులు కాని , నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. 🌺 6) తిలాన్నభోజనం – నువ్వులు కలిపి వండిన భోజనం భుజించడం. అంటే బియ్యం వుడికె సమయంలో నువ్వులు వేస్తే అది తిలాన్నం అవుతుంది) ఆ రోజున తిలలతో నిర్వహించే ఈ ఆరు పనులు పూర్తి చేస్తే శ్రీ మహా విష్ణువుతో పాటుగా పితృ దేవతలు కూడా సంతోషించి శుభప్రదంగా ఆశీర్వదిస్తారు. ఈ నాడు చేసే షట్తిలా కార్యక్రమాలు శ్రీ మహావిష్ణువును ఎంతో తృప్తిపరుస్తాయట. ప్రతీ ఏటా తిలా ఏకాదశిని యధావిధిగా పాటిస్తే ఆ శ్రీమన్నారాయణుడు సంతసించి ఇహలోకంలో సర్వసుఖాలు , మరణానంతరం ఉత్కృష్ట లోకాలు ప్రాప్తింప చేస్తాడు. 📌 *సూచన:-*  షట్తిల ఏకాదశి రోజున నిర్వహించే హోమము , దాన క్రియలు మాత్రం పురోహితుని పర్యవేక్షణలో జరుపవలసి ఉంటుంది. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
12 likes
12 shares
PSV APPARAO
534 views
#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఉత్తమగతికి సోపానం భీష్మ ఏకాదశి 🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: కర్మ యోగి భీష్మాచార్యుడు భీష్మాష్టమి / భీష్మ ఏకాదశి /భీష్మ స్తుతి 🙏 #జయ ఏకాదశి / భీష్మ ఏకాదశి విశిష్టత *ఉత్తమగతికి సోపానం భీష్మ ఏకాదశి* భీష్మ ఏకాదశినాడు చేయవలసిన విధివిధానాలు ఏమిటి అనే సందేహం వస్తుంది. సాధారణంగా ప్రతి ఏకాదశి నాడు చేసినట్టే ఉపవాస జాగరణాదులతో పాటు భీష్మ ఆరాధన కూడా చేయాలి. ఈ రోజు భీష్ముణ్ని ఆరాధిస్తే విష్ణువు సంతోషిస్తాడని పెద్దలు చెబుతారు. భగవంతునికి తన పూజ కన్న తన భక్తుల పూజ చేయడం ఎక్కువ ఇష్టమని అంటుంటారు. ఇక్కడ దానిని గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజున భీష్మారాధనతో మన లక్ష్యమైన ఉత్తమలోక ప్రాప్తి సాధించడంలో విజయులవుతారని అంటారు. నేడు భీష్మ ఏకాదశి. భీష్ముడు విష్ణువులో ఐక్యమైన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి అయినందున ఈ ఏకాదశికి ముందు ఆయనకు గుర్తుగా భీష్మ అనే పేరు చేర్చారు. అంతేకాక ఆయన విష్ణు భక్తుడు. ఏకాదశి విష్ణువుకు ప్రీతికరమైన రోజు. అందువల్ల విష్ణు ప్రీతికరమైన ఆ రోజుకు ఆయన ప్రియ భక్తుడైన భీష్ముని పేరు పెట్టారు. నిజానికి ఈ ఏకాదశి పేరు జయ ఏకాదశి. దీనిని విష్ణు తిథి అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈరోజు ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయని దీనికి జయ ఏకాదశి అనే పేరు పెట్టారు. ఇంద్రుడు రాక్షసుల మీద ఈ తిథి నాడు యుద్ధానికి వెళ్లడం వల్ల ఆయన విజయం సాధించాడని, భృగు మహర్షి తన తపస్సులో విజయం సాధించి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాడని, అగస్త్యుడు మూడు గుక్కల్లో సముద్రాన్ని తాగి వేసినదీ ఈ తిథినాడేనని చెబుతారు. అయితే ఈ ఏకాదశినాడు చేయవలసిన విధి విధానాలు ఏమిటి అనే సందేహం వస్తుంది. సాధారణంగా ప్రతి ఏకాదశి నాడు చేసినట్టే ఉపవాస జాగరణాదులతో పాటు భీష్మ ఆరాధన కూడా చేయాలి. ఈ రోజు భీష్ముణ్ని ఆరాధిస్తే విష్ణువు సంతోషిస్తాడని పెద్దలు చెబుతారు. భగవంతునికి తన పూజ కన్న తన భక్తుల పూజ చేయడం ఎక్కువ ఇష్టమని అంటుంటారు. ఇక్కడ దానిని గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజున భీష్మా రాధనతో మన లక్ష్యమైన ఉత్తమ లోక ప్రాప్తి సాధించడంలో విజయుల వుతారని అంటారు. ఇక్కడ భీష్ముని గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. భీష్ముడు అష్ట వసువులలో ఒకడనే విషయం తెలిసిందే. శాపవశాన గంగా దేవి కుమా రునిగా భూమిపై అవతరించాడు. ఆయన మహా వీరుడు. విష్ణువు అవతారమైన పరశురాముడే యుద్ధంలో ఆయనను ఓడించలేకపోయాడు. ఇక ఆయన పట్టుదలకు మారు పేరు. ప్రతిజ్ఞ చేశాడంటే ఇక వెనక్కు తగ్గేది లేదు. అందుకే తండ్రికి ఇచ్చిన మాట కోసం తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయాడు. ఆయన తాను పరమాత్మగా భావించే కృష్ణుని మాదిరి ధర్మ పక్షపాతి. ఇక ఆయన నోటి నుంచే ఈనాడు ఎక్కువ మందికి సుపరిచితమైన అమోఘమైన విష్ణు సహస్రనామం వచ్చింది. అనుశాసనిక పర్వంలో భీష్మ యుధిష్ఠిర సంవాదంలో ఇది ఒక భాగమని విజ్ఞులు చెబుతారు. కృష్ణుని నవ్వు రాజిల్లెడి మోము చూస్తూ దైవ కృపతో ఆయన ఈ సహస్రనామాలు చెప్పాడని అంటారు. భీష్ముడు మనకు ఎన్నో విషయాలు చెప్పారు. ధర్మంగా ఉండాలని, ఆడిన మాట తప్పకూడదని. శంతనునికి పిండాలు సమర్పించేసందర్భంలో ఆయన శాస్త్ర వాక్యానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చి శంతనుని చేతిలో పిండం పెట్టక పోవడం ఆయన ధర్మనిరతికి సంకేతం. అంతేకాక తన ప్రతిజ్ఞతో, మానవుడై నవాడు ప్రతిజ్ఞ చేస్తే ఎలా దానిని నిలబెట్టుకోవాలో తన జీవితంతో చేసి చూపారు. అయితే తప్పుడు ప్రతిజ్ఞలు చేసి వాటిని నిలబెట్టుకోవడం కాదు. ఆ ప్రతిజ్ఞ కూడా ఒక ధర్మం కోసం చేశాడు. తన తండ్రి సుఖం కోసం ఆయన ఆ ప్రతిజ్ఞ చేశాడు. ఇవి కాక ఆయన చేసి చూపిన మరో బోధ ఎట్టి పరిస్థితిలోనూ బేలతనం పనికి రాదని, యుద్ధంలో ధర్మం పాండవుల పక్షాన ఉన్నాడని ఆయనకు తెలుసు. విష్ణు స్వరూపుడైన కృష్ణుడు అటు వైపున్నాడని తెలుసు. తాము ఓటమి పాలవుతామని తెలుసు. (ఈ విషయం చాలా మార్లు దుర్యోధనునికి తెలిపాడు) అయినా భీరువులా చేతులు ముడుచుకు కూర్చోలేదు. తన వంతు కృషిగా యుద్ధం చేశాడు. ఇది కూడా కృష్ణుడు గీతలో చెప్పిందే. ఫలితం ఆశించకుండా నీ కర్తవ్యాన్ని నిర్వహించు అనే నీతి దీనిలో మనకు కనిపిస్తుంటుంది. భీష్మస్తుతిలో కూడా ఆయన మనకు ఒక సందేశం చెప్పారు. కాలం ఎంత బలీయమైనదో వివరించారు. ఎంతటి వారికైనా కష్టాలు తప్పక పోవచ్చనే విషయం ఆయన ఆ సందర్భంగా చెప్పారు. భీష్మ స్తుతిలోని ఈ పద్యం ఆ విషయం చెబుతుంది. అది 'రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమై గాండీవము విల్లుట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట యుగ్ర గదాధరుడైన భీముడయ్యాజికి దోడు వచ్చునట యాపద గల్గుటిదేమి చోద్యమో ఉప పాండవులను అశ్వత్థామ చంపి వేసిన విషయానికి సంబంధించినదీ శ్లోకం. దీని అర్థం ప్రస్తుతం రాజు ధర్మరాజు, సాక్షాత్తు దేవతల రాజైన ఇంద్రుని కుమారుడు (అర్జునుడు) ధర్మజునికి తమ్ముడు. అతని చేతిలో ఉన్నది చూచినంతనే శత్రువులు భయకంపితమయ్యే గాండీవం. ఇకసారధి అంటారా అన్నిటినీ నడిపే సమర్థుడైన చక్రి, ఉగ్ర గదాధరుడైన భీముడు (ఏనుగులను తొండం పట్టి ఆకాశ వీధిలోకి ఎగరేసే వాడంటారు మరో చోట) అతనికి తోడుగా ఉంటాడట. ఇటువంటి బలవంతుల మధ్య ఉన్న ఉప పాండవులు చనిపోయారే కాలం ఎంత బలవత్తరమైనదో కదా అని ఆ విషయాన్ని ఆయన వివరించాడు. అంటే కాలం ఎవరికీ బంధువు కాదు. దానికి స్వపర భేదా లుండవు అనేది ఆయన మనకు బోధించాడు. ఇక కృష్ణునిపై ఆయనకున్న భక్తి అసమానం. చక్రం పట్టిస్తానన్న తన శపథం నెరవేర్చేందుకు ఆయన చక్రం పట్టాడని ఆయనకు తెలుసు. అయితే చక్రం పట్టడం కూడా ఆయన మరో భక్తునికి ఆపద తప్పించడానికనే విషయం గ్రహించారు. ఒక భక్తుని శపథం నెరవేర్చేందుకు చక్రం పట్టాడు. మరొక భక్తుణ్ని భీష్ముడి వాడి బాణాల నుంచి కాపాడేందుకు చక్రం పట్టాడు. పర మాత్మకు భక్తుల పట్ల ఉన్న ప్రేమను ఈ ఘట్టం వెల్లడిస్తుంది. ఎన్నో విధాలుగా భీష్ముడు మనకు ఆదర్శప్రాయుడు. ఈ భీష్మ ఏకాదశిని భీమ ఏకాదశి అని కూడా అంటుంటారు. భీమ అనేది గట్టితనం అనే అర్థాన్ని సూచిస్తుందని, ఈ ఏకాదశిని అంత గట్టిగా ఆచరిం చాలన్నదే దాని ఉద్దేశమని కొందరి అభిప్రాయం. *🚩 ┈┉┅━❀~ ॐ డైలీ విష్ ॐ ~❀━┅┉┈ 🚩*
16 likes
11 shares