ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩
559 Posts • 25K views
PSV APPARAO
771 views 3 days ago
#తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవాలు 🙏🕉️🙏 TTD UTSAVS #తిరుమల శ్రీ వేంకటేశ్వరుని వైభవం🕉️ శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు చూద్దాం రారండి 🙏 #🕉️శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు🙏 #🕉️శ్రీవారి బ్రహ్మోత్సవాలు🚩🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 *బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం* ఓ బ్రహ్మా! నాకు ఉత్సవాన్ని జరిపించమని స్వామి కోరగా బ్రహ్మ ఆయన ఆజ్ఞను అనుసరించి స్వయంగా ఉత్సవాన్ని జరిపించాడు. కన్యారాశిలో సూర్యుడు ప్రవేశించిన అనంతరం చిత్తా నక్షత్రంలో 'ధ్వజారోహణం', ఉత్తరాషాఢ నక్షత్రం నాడు 'రథోత్సవం', శ్రవణం నాడు 'చక్రస్నానం', ఇలా బ్రహ్మదేవుడే స్వయంగా ప్రారంభించి జరిపిన ఉత్సవం అయినందున దీనిని "బ్రహ్మోత్సవం” అని అంటారు. పరబ్రహ్మకు చేసిన ఉత్సవం కూడా అయినందున దీనిని 'బ్రహ్మోత్సవం' అని అంటారు. _ధ్వజారోహణం_ అంకురారోపణ జరిగిన తర్వాత రోజు ఉదయం జరిగే ఉత్సవం 'ధ్వజారోహణ' ఉత్సవం. అనగా గరుడ ధ్వజాన్ని పైకెగరేస్తారు. ఈ ధ్వజారోహణకు ముందు ముద్గా న్నం అనగా పెసరపప్పుతో చేసిన పులగాన్ని (పొంగలి) గరుడునికి నివేదన చేస్తారు. ధ్వజంపై నిలిచిన గరుడుడు శ్రీవారి బ్రహ్మోత్సవానికి రావాల్సిందిగా భక్తులందరినీ ఆహ్వానిస్తాడు. ఈ గరుడుడే సకల దోషాలను, పాపాలను అపవిత్రతను తన దృష్టితో ఎనిమిది యోజనాల దూరం అనగా 96 కిలోమీటర్ల దూరం వరకు తొలగిస్తాడు. _పెద్దశేష వాహనం_ ధ్వజారోహణం జరిగిన నాటి సాయంత్రం మలయప్ప స్వామిని పెద్ద శేష వాహనంపై నాలుగు మాడ వీధులలో అంగరంగ వైభవంగా సకల పరిజన పరి చందంగా తాళ, నృత్య, వాద్య, సంగీత, గానసంరంభంతో, వేదపండితుల వేదఘోష లతో, దివ్య ప్రబంధ అధ్యాపకుల ప్రబందాధ్యాయముతో పాటు భక్తుల కోలాహలం మధ్యన స్వామి ఊరేగుతారు. పెద్దశేష వాహనం అనగా ఆదిశేషుడే. ఆదిశేషుడనగా ఆది- మొదటి, శేషుడు-సేవకుడు అనగా మొదటి సేవకుడు అని అర్థం. శ్రీమన్నారాయణునికి నిరంతరం వెంట ఉండి అతనికి కావాల్సిన అన్ని సేవలు అన్నీ తానే అయ్యి చేస్తాడు ఆదిశేషుడు. స్వామి నివసించడానికి తానే ఇల్లుగా, పడుకోవడానికి శయ్యగా, కూర్చోవడానికి సింహాసనంగా, నడవడానికి పాదుకలుగా, తలకింద తలగడగా, చలివేస్తే దుప్పటిగా, వర్షం, ఎండ వస్తే గొడుగుగా ఇలా స్వామికి ఎప్పుడు ఏ సేవ కావాలన్నా తానే ఆ పరికరంగా మారి సేవ చేస్తాడు కావున 'ఆదిశేషుడు' అని పిలువబడతాడు. అందుకే మొదటి వాహన భాగ్యం ఆదిశేషుడికే స్వామి కల్పించాడు. ఈ విధంగా సేవలు చేయ డమే కాకుండా స్వామి ఏ రూపంలో ఉన్నా తాను కూడా అతనికి తగిన రూపంలో ఉంటూ వెంట అవతరిస్తాడు. ఆదిశేషుడు తన వేయి శిరములలో ఒక శిరములోని ఒక చిన్న భాగంలో అఖి లాండ కోటి బ్రహ్మాండములను సిద్ధార్థ (ఆవగింజ) రూపంలో ధరిస్తాడు. ఇంత బ్రహ్మాండాన్ని ఒక ఆవగింజలా ధరించే మహాబలుడు ఆదిశేషుడు. అతనికి కాస్త తల భారంగా అనిపించినపుడు అనగా భూమిపై నివసించే ప్రాణులు సహించరాని పాపా లను చేసినప్పుడు పాపాల భారం మోయలేనని కొంచెం తల కదలిస్తాడు. ఏప్రాంతంలో ఆదిశేషుని తల కదిలితే ఆ ప్రాంతంలో భూకంపం సంభవిస్తుంది. ఈ విధంగా ఆది శేషుడు మొదట సకల జగత్తుకు ఆధారం. శ్రీమన్నారాయణుడు రాముడిగా అవత రించినప్పుడు ఆదిశేషుడు లక్ష్మణస్వామిగా వచ్చాడు. తమ్ముడిగా సేవ చేసిన ఫలితంగా కృష్ణావతారంలో అన్నగా అవతరించమని ఆదేశిస్తే కృష్ణునికి అన్నగా బలరామునిగా అవతరించాడు. కలియుగంలో వ్యాకరణ శాస్త్రం తెలియక అంటే మాట్లాడలేక ఇబ్బం దిపడుతున్న జనుల కోసం పాణిని మహర్షి రచించిన 'అష్టాధ్యాయి' సూత్రాలకు వ్యాఖ్యానం చేయడానికి 'పతంజలి'గా అవతరించి మహాభాష్యం రాసి వాక్ శుద్ధిని చేశాడు. ఈ పతంజలే యోగ భాష్యం రాసి మనఃశుద్ధిని, వైద్యశాస్త్రంలో భాష్యం రాసి శరీర శుద్ధిని చేశారు. తరువాత చాలా కాలానికి భగవద్రామానుజులుగా అవతరించి బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం చేసి 'శ్రీభాష్యం' అను పేరుతో అందించారు. ఇంతటి దివ్యమైన సేవ చేసిన మహానుభావుడు అయినందున మలయప్ప స్వామి మొదటి వాహన సేవా భాగ్యాన్ని ఆదిశేషునికి ఇచ్చారు. _చిన్న శేష వాహనం_ ధ్వజారోహణం తెల్లవారి ఉదయం మలయప్ప స్వామి చిన్న శేష వాహనం పై నాలుగు మాడ వీధులలో విహరిస్తారు. చిన్న శేషుడు అనగా శేషుని తమ్ముడు వాసుకి. ఈ వాసుకి శ్రీమన్నారాయణుని ఆజ్ఞతో క్షీరసాగర మధన సమయంలో మందర పర్వ తానికి కవ్వపు తాడుగా మారి సముద్రాన్ని చిలకడానికి సహాయం చేశాడు. స్వామి ఆజ్ఞతో తన పడగల నుండి అనగా ముఖముల నుండి విషజ్వాలలు చిమ్ముతూ రాక్షసు లను మూర్ఛాక్రాంతులను చేశాడు. తన విషాన్ని సముద్రంలో ఉద్గారం(వాంతి) చేసి సముద్రంలో హాలాహలం పుట్టడానికి తన వంతు సేవ చేసి ఆ హాలహలాన్ని పానం చేసి లోకాలను రక్షించే అవకాశాన్ని శంకరునికి ఇచ్చి దానికి కృతజ్ఞతగా శంకరుని చేతికి కంకణమైనాడు. తన చెల్లెలైనా 'జగత్కారు' ని 'జగత్కారు' అనే మహర్షికి ఇచ్చి వివాహం చేసి బ్రహ్మ ఆజ్ఞను పాటించి ఆ దంపతుల సంతానమైన ఆస్తికునితో జనమేజయుడు ఆచరించిన సర్పయాగాన్ని నివారించి అఖిల నాగులకు జీవితాన్ని ప్రసాదించిన మహానుభావుడు 'వాసుకి', అందుకే మలయప్ప స్వామి వాసుకికి రెండవ సేవా భాగ్యాన్ని ప్రసాదించాడు. _హంసవాహనం_ చిన్న శేషవాహన సేవ జరిగిన నాటి సాయంత్రం మలయప్ప స్వామి హంస వాహ నం పై విహరిస్తారు. శ్వేత వర్ణంతో పాలని, నీటిని వేరు చేయగల ఏకైక పక్షి 'హంస' కావున దీనిని జ్ఞానానికి ప్రతీకగా వ్యవహరిస్తారు. అంటే మంచిచెడులేవో తెలిపి దేనిని ఆచరించాలో తెలియజేసే దానిని జ్ఞానం అంటారు. జ్ఞానాన్ని స్వీకరించి అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. పాలను స్వీకరించి నీటిని విడిచిపెట్టాలి. జ్ఞానాన్ని ప్రభోదించే సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులను పరమహంసలు అంటారు. ఒకసారి బ్రహ్మలోకంలో ఋషులందరూ ఎవరు కనబడినా మీరెవరు? అని అడుగుతారని ఇచ్చట మీరు అన్నదానికి అర్థం ఏమిటని బ్రహ్మను ప్రశ్నించారు. శరీరాన్ని ఉద్దేశించా లేక ఆత్మనా. ఒకవేళ శరీరమే అయితే ఏ రూపమో ప్రత్యక్షంగా కనబడుతోంది కదా. ఆత్మ స్వరూపం ఒక్కటే కావున ఆత్మను ఎవరని అడగడం కుదరదు అయినందున మీరెవరు అనే ప్రశ్న తప్పు కదా అని బుషులు బ్రహ్మను ప్రశ్నించారు. సమాధానం ఎలా ఇవ్వాలో తెలియక బ్రహ్మ శ్రీమన్నారాయణునిస్మరిం చగా వారికి తత్త్వాన్ని తెలుపడానికి స్వామి ఒక హంస రూపంలో వారి ముందుకు వచ్చారు. హఠాత్తుగా వచ్చిన హంసను చూసిన ఋషులు మీరెవరని అడుగగా హంస గా కనబడుతున్నాను కదా లోపల ఉన్న ఆత్మ మీలో ఉన్నదాని వంటిదే కదా మరి మీరె వరు అని మీరే ఎలా అడిగారు అని హంసరూపంలో ఉన్న స్వామి తిరిగి ప్రశ్నించారు. ఇదంతా చూసిన ఋషులు వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అనుకొని సాష్టాం గ దండ ప్రణామం చేసి చేతులు జోడించి స్వామీ! మా సందేహాన్ని తొలగించండని ప్రార్థించారు. నేను మనిషిని, నేను పశువును, నేను రాక్షసుడిని అని చెబితే అవన్నీ శరీరాలు, నేను అంటే శరీరం కాదు కదా. శరీరమే ఆత్మ అనుకున్న వారే నేను మనిషిని అంటారు. కాని ఆత్మజ్ఞానం ఉన్నవారు భగవంతుడు ఆత్మగా ఉన్నా, జీవాత్మ ఆత్మగా ఉన్నా మానవ శరీరాన్ని అని చెప్పాలి, వీరే ఆత్మజ్ఞానులు, మీరెవరు అన్న ప్రశ్నకు ఆత్మ జ్ఞానం ఉన్న వారా లేనివారా అని అర్థం. ఇలా ఆత్మ, అనాత్మ వివేకాన్ని క్షీరనీర న్యాయంతో తొలగించిన అవతారం హంసా వతారం. అందుకే మనలోని అహంకారాన్ని తొలగించి ఆత్మ వివే కాన్ని కలిగించాలనే అనుగ్రహ బుద్ధితో స్వామి హంసను తన వాహనంగా చేసుకొని ఆత్మను శరీరం మోయటం లేదు. ఆత్మే శరీరాన్ని మోస్తుందని తెలియ జేస్తున్నాడు. పరమాత్మ జీవాత్మకు ఆధారం. అదే విధంగా జీవాత్మ శరీరానికి ఆధారం, ఈ ఆత్మను తాను స్వయంగా మోసుకొని తన లోకానికి చేర్చేవాడు పరమాత్మ అన్న ధర్మ సూక్ష్మాన్ని బోధించడమే హంస వాహనంలోని ఆంతర్య మని స్వామి స్వయంగా హంస వాహనం పై విహరిస్తూ బోధిస్తాడు. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
22 likes
9 shares
PSV APPARAO
639 views 6 days ago
#శరన్నవరాత్రులు 🔱 నవదుర్గలు (ఆధ్యాత్మికం విశిష్టతలు) #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #శరన్నవరాత్రులు 🔱 జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు🙏 #శుభప్రదం🔯 శుభ నిజ ఆశ్వయుజ మాసం⚛️ దేవీ దసరా శరన్నవరాత్రులు - దేవీ అలంకరణాలు 🙏 🔱🕉️🔱🙏 #🔱 దేవి శరన్నవరాత్రులు 🔱 శరన్నవరాత్రులు - జగన్మాత వైవిధ్య కళల ఆరాధన నవరాత్రులు *రేపటి నుంచే శరన్నవరాత్రులు ప్రారంభం* సారస్వత కల్పంలో సత్త్వరజస్తమోగుణాలు మూడింటికి అధిష్టాత్రి మహాలక్ష్మి. సమస్త విశ్వానికి ఆమె మొదట ఉంది. ఆమె స్వరూపం లక్ష్యాలక్ష్యంగా ఉంటుంది. ఆమె అంతటా వ్యాపించి ఉంది. ఆమె శూన్యంగా ఉన్న జగత్తును చూసి మహాకాళి రూపాన్ని ధరించింది. సత్వ గుణంతో సరస్వతీ రూపం ధరించింది. శరన్నవరాత్రుల్లో పూజలందుకునేది జగన్మాతే. వివిధ రూపాల్లో ఆమెను ఈ పుణ్యదినాల్లో విశేషంగా ఆరాధిస్తుం టారు. 'అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ' అని మహాకవి పోతన సరస్వతీ, లక్ష్మి పార్వతులకు కన్న తల్లి అని జగజ్జననిని స్తుతించారు. ఆయన పద్యంలో దుర్గమ్మను స్తుతి చేశారు. పార్వతినే దుర్గ అంటారు కదా. ముగ్గురమ్మలలో పార్వతి ఉంది కదా! దుర్గ పార్వతిని కనడమేమిటి అనే సంశ యం కలుగుతుంది. దీనికి సమాధానంగా పురాణం ఏం చెబు తోందో చూడాలి. ప్రస్తుతం శ్వేత వరాహ కల్పం నడుస్తోంది. ఇలాంటి కల్పాలనేకం ఉన్నాయి. వాటిలో సారస్వత కల్పం ఒకటి. దేవీ భాగవతం ఆ కల్పానికి చెందిన కథలతో ఉంటుంది. ఆ కల్పంలో సత్త్వరజస్తమోగుణాలు మూడింటికి అధిష్ఠాత్రి మహాలక్ష్మి. సమస్త విశ్వానికి ఆమె మొదట ఉంది. ఆమె స్వరూ పం లక్ష్యాలక్ష్యంగా ఉంటుంది. ఆమె అంతటా వ్యాపించి ఉంది. ఆమె శూన్యంగా ఉన్న జగత్తును చూసి మహాకాళి రూపాన్ని ధరించింది. సత్వగుణంతో సరస్వతీ రూపం ధరిం చింది. అపుడు మహాలక్ష్మి వారిని తమకు జంటగా దేవతలను సృష్టించమని చెప్పింది. తాను బ్రహ్మను, లక్ష్మీదేవిని సృష్టిం చింది. మహాకాళి చంద్రశేఖరుని, భారతిని సృష్టించింది. సర స్వతి విష్ణువును, గౌరీదేవిని సృష్టించింది. ఇలా మొదట ఉన్న ఆద్య లక్ష్మి ముగ్గురమ్మలకు మూలపుటమ్మ అయింది. ఆ ఆద్య మహాలక్ష్మియే దుర్గమ్మ. మహాలక్ష్మి బ్రహ్మకు భారతిని, రుద్రు నికి గౌరిని, విష్ణువుకు లక్ష్మిని ఇచ్చింది. ఇలా అక్కచెల్లెళ్ళు వివాహం చేసుకోవచ్చా అనే సంశయం కలుగుతుంది. మనలా పార్థివ శరీరాలతో ఉన్నవారికి కలిగే పిల్లలకు వావి వరసలుం టాయి. కాని తేజోమయమైన మానసిక సృష్టిలోని వారికి ఈ వావి వరుసలుండవు. వారికే దోషం ఉండదు. బ్రహ్మ భారతితో కలిసి బ్రహ్మాండాన్ని పుట్టించాడు. గౌరి తో కూడిన రుద్రుడు బ్రహ్మాండాన్ని భేదించాడు. బ్రహ్మాండ మధ్యంలో మహాభూతాదులు, స్థావరజంగమాత్మకమైన జగ త్తు పుట్టింది. లక్ష్మితో కూడిన విష్ణువు ఆ జగత్తును పోషించి పాలించాడు. గౌరితో కూడిన మహేశ్వరుడు ఆ జగత్తునంతటినీ సంహరించాడు. ఇలా త్రిమూర్తులూ సృష్టి స్థితి సంహారాలు చేస్తున్నారు. ఆద్య మహాలక్ష్మి సర్వ సత్త్వమయియై, నిరా కారంగాను, ఆకారంతోను, అనేకమైన పేర్లతో విలసిల్లుతూ ఉంది. సృష్టి ప్రారంభంలో జగత్తంతా ఒకే సముద్రంగా ఉంది. అప్పుడు ఆదిశేషునిపై విష్ణు దేవుడు పవ్వళించి యోగనిద్రలో ఉన్నాడు. ఆయన చెవి గులివి నుంచి ఇద్దరు రాక్షసులు బయలు దేరారు. వారి పేర్లు మధుకైటభులు. విష్ణుదేవుని నాభికమలం నుంచి బ్రహ్మ ఆవిర్భవించాడు. మధుకైటభులు బ్రహ్మను చంపడానికి ప్రయత్నించారు. ఆయన ఏకాగ్ర హృదయంతో యోగమాయను స్తుతించాడు. ఆమె యోగనిద్రా రూపిణి. విష్ణువు నుంచి బయటకు వచ్చింది. అప్పుడు మెళకువ పొం దిన విష్ణువు, మధుకైటభులతో యుద్ధం చేశాడు. మధు కైట భులు యోగమాయా మోహితులై 'నీ యుద్ధం మాకు సంతో షం కలిగించింది. ఏమి కావాలో కోరుకో' అన్నారు. 'మీరు నాకు వధ్యులు కావాలి' అన్నాడు విష్ణుదేవుడు. వారు అనవ సరంగా వరమిస్తామన్నామనుకుని నాలిక కరచుకుని 'నీళ్ళు లేని చోట మమ్మల్ని వధించవచ్చు' అన్నారు. విష్ణువు తన శరీరాన్ని పెంచి తొడపై వారి నుంచి చక్రంతో వారి శిరస్సులు ఛేదించాడు. ఇలా సృష్టికి పూర్వం విష్ణువుకు యోగనిద్ర తొల గించి, అసురులకు మోహం కలిగించి తోడ్పడింది యోగ మాయ. అవిడే మహాకాళి. మరోసారి మహిషుడనే అసురుడు దేవతలను జయిం చాడు. అష్టదిక్పాలకాదుల అధికారాలన్నీ అతనే వశం చేసుకు న్నాడు. అతడు గొప్ప తపస్వి. స్త్రీ చేతిలో తప్ప అతను మరణిం చడు. అమిత బలం కల అతనిని ఏ స్త్రీ ఎదిరిస్తుందని దేవతలు బ్రహ్మదేవుని ఎదుట బెట్టుకుని విష్ణు మహేశ్వరులను శరణు వేడారు. విష్ణు దేవునికి, శంకరునికి కోపం వచ్చింది. అప్పుడు వారి ముఖాల నుంచి గొప్ప తేజస్సు వెలువడింది. ఇంద్రాది దేవతల శరీరరాల నుంచి కూడా తేజ స్సులు వెలువడ్డాయి. ఆ తేజస్సు లన్నీ ఏకమై అన్ని దిక్కులూ వ్యాపించాయి. ఆ తేజం చివరి కొక స్త్రీ రూపం ధరించింది. శంభుని తేజస్సుతో అమెకు ముఖం ఏర్పడింది. యముని తేజస్సుతో జుట్టు ఏర్పడింది. విష్ణువు తేజస్సుతో బాహువు లేర్పడ్డాయి. ఇలా దైవ తేజస్సు లతో ఏర్పడిన ఆమెకు దేవతలు తమ ఆయుధాల నుంచి శూలం, చక్రం, వజ్రం మొదలైన ఆయు ధాలను ఏర్పరచి సమర్పిం చారు. ఆమెకు హిమాలయుడు సింహవాహనం సమర్పించాడు. ఆమె అట్టహాసం చేసింది. దేవతలు భక్తితో నమస్కరించారు. ఈ తేజస్విని గురించి మహి షాసురుడు విన్నాడు. అప్పుడతడు ఆమెను వశం చేసుకోవడం కోసం సైన్యాన్ని పంపాడు. విక్షురుడు, ఉదగ్రుడు, అసిలో ముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన అసుర నాయకు లను సైన్య సమేతంగా పంపాడు. ఆ దేవి నిశ్వాసం నుంచి లక్షలాది శక్తి గణాలు ఆవిర్భవించాయి. ఆ శక్తి గణాలు అసుర సైన్యాన్ని ఓడించాయి. దేవతలు పూలవాన కురిపించారు. ఈ దేవి మహాలక్ష్మి. ఈ జగజ్జనని మహిషాసురుణ్ని సంహరిం చింది. దేవతలందరు ఈ తల్లిని స్తుతించారు. ' నిన్ను స్మరించినంతనే మా ఆపదలు తొలగించు' అని ప్రార్థించారు. ఆమె అంగీకరించి అంతర్థానమైంది. ఆ తర్వాత శుంభనిశుంభులనే మహా పరాక్రమవంతులు బయలుదేరారు. వారు దేవతలను జయించారు. దేవతల అధి కారాలు లాక్కున్నారు. దేవతలకు జగజ్జనని గుర్తుకు వచ్చింది. ఆమెను ప్రార్థించారు. ఆ సమయంలో పార్వతీ దేవి జాహ్నవీ నదికి స్నానానికి వచ్చింది. ఆమె శరీరంలో నుంచి మహా సర స్వతి వెలుప లికి వచ్చింది. పార్వతి శరీరమనే కోశాన్నుంచి వెలువడింది కనుక ఆమెను కౌశికి అంటారు. అప్పుడు పార్వతి నల్లటి రూపంతో కాళిక అయింది. చండ ముండులనే భృత్యులు అంబిక సౌందర్యం గురించి శుంభునికి చెప్పారు. శుంభుడు అంబిక దగ్గరకు సుగ్రీవుని దూతగా పంపారు. అతడు త్రిలోకాధిపతి అయిన శుంభుని వరిం చమని కోరాడు. ఆమె 'నన్ను సంగ్రామంలో జయంచినవాడే నా భర్త అవుతాడని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి శుంభనిశుంభులలో ఎవరైనా నన్ను జయించి వివాహం చేసుకోవచ్చు' అంది. ఆ దూత అంబికను బెదిరిం చాడు. వానిని ఆమె లెక్క చేయ లేదు. అప్పుడు శుంభుడు ధూమ్రలోచనుడు, చండుడు, ముండుడు అనే వారిని అంబిక ను జయించమని పంపించాడు. అంబిక ధూమ్రలోచనుణ్ని భస్మం చేసింది. చండముం డులను కాళిక సంహరించింది. అప్పుడు నిశుంభుడు సైన్య సమేతంగా అంబికనెదుర్కొన్నాడు. అపుడుడు బ్రహ్మాది దేవతల శక్తులు స్త్రీరూప ధారిణులై ఆయు ధ సమేతంగా అంబిక సైన్యంగా ఏర్పడ్డారు. ఆ స్త్రీశక్తులన్నీ ఆయా దేవతల ఆకారాల్లో వారి వారి ఆయుధాలతో ఆ యుద్ధం లో పాల్గొన్నారు. అపుడు అంబిక శరీరాన్నుండి ఒక మహాశక్తి ఈవలకు వచ్చి 'శివునితో నీవు శుంభుని వద్దకు దూతగా వెళ్ళి 'ఇంద్రుని మూడులోకాలు ఇంద్రుడికి ఇచ్చి పాతాళానికి వెళ్లు. బలగర్వం తో సమరానికి దిగితే మా శక్తులు మీకు జవాబు చెబుతాయి అనే సందేశం వారికి చెప్పు' అంది. ఇలా శివుని దూతగా పంపినం దున ఆమెను శివ దూతి అన్నారు. అప్పుడు అసురులు యుద్ధా నికి తరలి వచ్చారు. అప్పుడు రక్త బీజుడనే అసురుడు దేవీ శక్తుల్ని సంహారం చేస్తున్నాడు. కింద పడిన అతని ఒక్కో రక్త బిందువు నుంచి అతనితో సమానబలం గల ఒక్కో అసురుడు జన్మిస్తాడు. ఇది అతనికున్న వరం. దేవీ శక్తులు ఆయుధాలతో కొట్టగా అతని రక్తం నేలపై పడడంతో అనేక రక్త బీజులు పుట్టి విధ్వంసం సృష్టించడం జరిగింది. అప్పుడు కాళిక సాయంతో రక్తం కింద పడకుండా అంబిక రక్తబీజుని సంహరించింది. తరు వాత నిశుంభుడు దేవితో తీవ్ర యుద్ధం చేశాడు. నిశుంభుడు మరణించిన తర్వాత శుంభుడు 'ఇతర శక్తుల ప్రభావంతో నీవు గర్విస్తున్నావ'ని దేవిని ఆక్షేపించాడు. దానితో నా కంటే ఇతరు లెవరున్నారని ఆ శక్తులందరినీ తనలో విలీనం చేసుకుంది అంబిక, అంబిక, శుంభుడు హోరాహోరీ పోరాడాక దేవి శుంభుని నాశనం చేసింది. అపుడు దేవతలందరు దేవిని స్తుతిం చారు. ఈ మూడు చరిత్రలు పారాయణ చేయడం అమ్మ వారికిష్టం. నవరాత్రాలలో వీటిని పారాయణ చేస్తారు. వైవస్వత మన్వంతరంలో కూడా మరల శుంభనిశుంభు లనే అసురులు అల్లకల్లోలం సృష్టించినపుడు యశోదకు పుట్టిన విష్ణుమాయ వారిని సంహరించింది. ఆమె వింధ్యాచలంపై నివసిస్తుంది. అలాగే ఒక కాలంలో వైప్ర చిత్తులనే దానవులు లోకాలను పీడించారు. వారిని రక్త దంతిక అనే శక్తి సంహ రించింది. ఒకప్పుడు నూరు సంవత్సరాలు అనావృష్టి ఏర్ప డగా మునులు జగజ్జననిని స్తుతించారు. అప్పుడామె నూరు నేత్రాలతో వారిని ఆదరంగా చూసి వారి ఆకలి తీర్చంది. ఆ తల్లిని శతాక్షి అంటారు. ఈమెను హరిశ్చంద్రుడు ఆరాధిం చాడు. ఈ శతాక్షి కూరలతో మునులకు ఆహారం అందజేసింది. అందుకే ఆమెను శాకంభరి అని కూడా అంటారు. ఇప్పటికీ శాకంభరిగా అమ్మవారిని అలంకరిస్తుంటారు. ఒకప్పుడు దుర్గ ముడనే అసురుడు జనాన్ని పీడించేవాడు. అపుడు అమ్మవారు వానిని సంహరించారు. దీని వలన దుర్గాదేవిఅనే పేరు వచ్చిం ది. మరొకసారి అసురులు మునులను పీడిస్తుండగా భయం కరాకారంతో ఆ అసురులను సంహరించింది. ఆమెను భీమా దేవి అన్నారు. అరుణుడనే అసురుడు జనులకు చాలా పీడ కలి గించాడు. అపుడు దేవి అనేక భ్రమర రూపాలు ధరించి మూడు లోకాల హితం కోసం అతన్ని సంహరించింది. అమెను భ్రామరి అని ప్రశంసించారు. ఆమే భ్రమరాంబ. ఈ కథలు మార్కండేయ పురాణంలో సంగ్రహంగా ఉన్నాయి. దేవీ భాగ వతంలో ఈ కథలు విస్తృతంగా ఉన్నాయి. భువనేశ్వరిఅక్కడ ఇంకా భువనేశ్వరి, గౌరి, గంగ, సరస్వతి, ధర, వేదవతి, తులసి, సావిత్రి, మహాలక్ష్మి, స్వాహా, స్వధా, దక్షిణ, షష్ఠి, మంగళచండి, మానస, సురభి, రాధ, గాయత్రి మొదలైన దేవతా శక్తుల గాథలు కూడా ఉన్నాయి. వీరందరూ ఒకే జగజ్జనని అవతారాలని చెప్పడం కోసం దేవాలయాల్లో దేవికి వివిధ దేవతా శక్తుల అలంకారాలు చేస్తారు. అదే వరుసలో అలంకారాలు చేయాలనే నియమం లేదు. పాడ్యమి నాడు బాలా త్రిపుర సుందరి, విదియ నాడు గాయత్రి, తదియనాడు మహాలక్ష్మి, చవితినాడు అన్నపూర్ణ, పంచమి నాడు లలిత, షష్ఠినాడు శాకంభరి, సప్తమి నాడు సరస్వతి, అష్టమి నాడు దుర్గాదేవి, నవమినాడు మహిషాసుర మర్దిని, దశమినాడు రాజరాజేశ్వరి అలంకారాలు కొన్ని దేవాలయాల్లో చేస్తున్నారు. బాలను అర్చించేవారు బాలను, లలితను అర్చించేవారు లలి తను, రాజేశ్వరి ఆరాధకులు ఆమెను చండికను పూజించేవారు ఆమెను తొమ్మిది రోజులూ అర్చిస్తారు. 🚩*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
15 likes
7 shares
PSV APPARAO
771 views 6 days ago
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: మహాలయ అమావాస్య #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #మహాలయ అమావాస్య విశిష్టత (భాద్రపద బహుళ అమావాస్య ఆదివారం విశేష దినం) #మహాలయ అమావాస్య విశిష్టత (భాద్రపద బహుళ అమావాస్య ఆదివారం విశేష దినం) #మహాలయ అమావాస్య #మహాలయ అమావాస్య / పెద్దల అమావాస్య 🌑🙏 *పెద్దల అమావాస్య* మహాలయం అంటే గొప్ప వినాశనం లేదా మరణం అని అర్థం. మహాలయం అంటే గొప్పగా లయం కావడం. భాద్రపద మాసం కృష్ణపక్ష అమావాస్యకు "మహాలయ అమావాస్య" అని పేరు. దీనినే వాడుకలో పెద్దల అమావాస్య అని కూడా అంటారు. పితృదేవతల పూజలకు కేటాయించిన ఉత్కృష్టమైన రోజు కనుకనే ఆ పేరు వచ్చింది. భాద్రపద మాసంలోని కృష్ణ పక్షాన్ని మహాలయ పక్షం అని, ఆ పక్షంలోని చివరి రోజు కనుక మహాలయ అమావాస్య అని చెప్పారు. మహాలయ పక్షానికి పితృపక్షమని పేరు. పితృదేవతలను శోభన దేవతలు అని కూడా అంటారు. వీరు ఎప్పుడూ శుభం కలగాలని ఆశీర్వదిస్తుంటారు. అటువంటి పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులు నిర్వహించడం, పిండప్రదానాలు చేయడం, వంటి పితృపూజలు ఆచరించే పక్షం కనుక "పితృపక్షం" అనే పేరు వచ్చింది. అయితే ఈ కాలం చెడు కాలం అని శుభకార్యాలకు పనికి రాదని శాస్త్ర వచనం. పితృదేవతలకు శ్రాద్ధ విధులు మహాలయ పక్షంలోను. మహాలయ అమావాస్య నాడు నిర్వహించడం. వెనుకు కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం దేవదానవుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం భాద్రపద కృష్ణ పక్ష పాడ్యమినాడు మొదలై అమావాస్య వరకూ పదిహేను రోజులు జరిగింది. యుద్ధంలో దేవతల బలం క్షీణించింది. రాక్షసులు విజృంభించారు. యుద్ధంలో అనేకమంది మహర్తులు, మునులు, యతులు మృతిచెందారు. ఆయా వీరులు మృతి చెందిన రోజులకు యతిమహాలయం, శస్త్రహతమహాలయం అని పేర్లు ఏర్పడ్డాయి. అమావాస్య నాటికి దేవతలందరూ పూర్తిగా ఓడిపోయి అమరావతికి వెనుదిరిగారు. ఈ పక్షం రోజుల్లో ఎవరెవరు చనిపోయిన తిథి రోజు వారికి శ్రాద్ధ విధులు నిర్వహించడంతోపాటు అందరికీ అమావాస్యనాడు. శ్రాద్ధ విధులు నిర్వహించారు. అప్పటినుండి మహాలయ పక్షంలోనూ, మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన మొదలైంది. కన్య, తులా రాశుల్లో సూర్య భగవానుడు ఉన్న సమయంలో ప్రేతపురి శూన్యంగా ఉంటుంది. ఈ సమయంలో పితృదేవతలందరూ అన్నాన్ని కోరుతూ తమ ఇండ్ల చుట్టూ తిరుగూ ఉంటారని భారతంలో చెప్పారు. కనుక అన్నం కోరి ఇంటి చుట్టూ తిరిగే పితృదేవతల ఆత్మలను సంతృప్తి పరచడం కోసం శ్రాద్ధవిధులు ఆచరించడం, పిండప్రదానాలు చేయడం, తర్పణాలు వదలడంలాంటి కర్మలు ఆచరించాలని శాస్త్రం చెపుతోంది. ఈ సమయంలో పిండప్రదానాలు చేయకపోతే మహాలయ అమావాస్య వరకూ వేచి చూసిన పితృదేవతలు అసంతృప్తితో శపించి ప్రేతపురికి వెళ్లిపోతారని చెప్పారు. మహాలయ పక్షం "దినేదినే గయాతుల్యం" అని చెప్పారు. మహాలయ పక్షంలో మరణించిన తల్లి దండ్రులు, తాత ముత్తాతలు పూర్వీకులకు శ్రాద్ధవిధులు ప్రతిరోజూ నిర్వహించాలి. ఒకవేళ ప్రతిరోజూ వీలు కానిచో తిథినాడు నిర్వహించాలి. తల్లి మరణించి తండ్రి జీవించి ఉంటే నవమినాడు తర్పణ శ్రాద్ధవిధులు నిర్వహించాలి. లేదా అమావాస్యనాడు విధిగా నిర్వహించాలి. మహాలయ అమావాస్యనాడు శ్రాద్ధవిధులు నిర్వహించడం వల్ల త్రివేణీ సంగమలోను. గయలోను శ్రాద్ధవిధులు నిర్వహించిన ఫలితం కలుగుతుంది. మహాలయ పక్షంలోని అన్ని రోజులు కానీ, లేదా ఒక్క రోజుకాని, లేదా మహాలయ అమావాస్య నాడు కానీ పితృదేవతలను ఆరాధిస్తే వారు ఒక ఏడాది పాటు సంతృప్తులవుతారు అని స్కాందపురాణంలో పేర్కొన్నారు. పితృదేవతలు సంతృప్తి చెందితే వంశాభివృద్ధి కలుగుతుంది. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
7 likes
2 shares
PSV APPARAO
4K views 6 days ago
#⚫మహాలయ అమావాస్య : ఇలా చేయండి..అన్ని కలిసి వస్తాయి #మహాలయ అమావాస్య విశిష్టత (భాద్రపద బహుళ అమావాస్య ఆదివారం విశేష దినం) #మహాలయ అమావాస్య విశిష్టత (భాద్రపద బహుళ అమావాస్య ఆదివారం విశేష దినం) #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత *పెద్దల అమావాస్య* మహాలయం అంటే గొప్ప వినాశనం లేదా మరణం అని అర్థం. మహాలయం అంటే గొప్పగా లయం కావడం. భాద్రపద మాసం కృష్ణపక్ష అమావాస్యకు "మహాలయ అమావాస్య" అని పేరు. దీనినే వాడుకలో పెద్దల అమావాస్య అని కూడా అంటారు. పితృదేవతల పూజలకు కేటాయించిన ఉత్కృష్టమైన రోజు కనుకనే ఆ పేరు వచ్చింది. భాద్రపద మాసంలోని కృష్ణ పక్షాన్ని మహాలయ పక్షం అని, ఆ పక్షంలోని చివరి రోజు కనుక మహాలయ అమావాస్య అని చెప్పారు. మహాలయ పక్షానికి పితృపక్షమని పేరు. పితృదేవతలను శోభన దేవతలు అని కూడా అంటారు. వీరు ఎప్పుడూ శుభం కలగాలని ఆశీర్వదిస్తుంటారు. అటువంటి పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులు నిర్వహించడం, పిండప్రదానాలు చేయడం, వంటి పితృపూజలు ఆచరించే పక్షం కనుక "పితృపక్షం" అనే పేరు వచ్చింది. అయితే ఈ కాలం చెడు కాలం అని శుభకార్యాలకు పనికి రాదని శాస్త్ర వచనం. పితృదేవతలకు శ్రాద్ధ విధులు మహాలయ పక్షంలోను. మహాలయ అమావాస్య నాడు నిర్వహించడం. వెనుకు కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం దేవదానవుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం భాద్రపద కృష్ణ పక్ష పాడ్యమినాడు మొదలై అమావాస్య వరకూ పదిహేను రోజులు జరిగింది. యుద్ధంలో దేవతల బలం క్షీణించింది. రాక్షసులు విజృంభించారు. యుద్ధంలో అనేకమంది మహర్తులు, మునులు, యతులు మృతిచెందారు. ఆయా వీరులు మృతి చెందిన రోజులకు యతిమహాలయం, శస్త్రహతమహాలయం అని పేర్లు ఏర్పడ్డాయి. అమావాస్య నాటికి దేవతలందరూ పూర్తిగా ఓడిపోయి అమరావతికి వెనుదిరిగారు. ఈ పక్షం రోజుల్లో ఎవరెవరు చనిపోయిన తిథి రోజు వారికి శ్రాద్ధ విధులు నిర్వహించడంతోపాటు అందరికీ అమావాస్యనాడు. శ్రాద్ధ విధులు నిర్వహించారు. అప్పటినుండి మహాలయ పక్షంలోనూ, మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన మొదలైంది. కన్య, తులా రాశుల్లో సూర్య భగవానుడు ఉన్న సమయంలో ప్రేతపురి శూన్యంగా ఉంటుంది. ఈ సమయంలో పితృదేవతలందరూ అన్నాన్ని కోరుతూ తమ ఇండ్ల చుట్టూ తిరుగూ ఉంటారని భారతంలో చెప్పారు. కనుక అన్నం కోరి ఇంటి చుట్టూ తిరిగే పితృదేవతల ఆత్మలను సంతృప్తి పరచడం కోసం శ్రాద్ధవిధులు ఆచరించడం, పిండప్రదానాలు చేయడం, తర్పణాలు వదలడంలాంటి కర్మలు ఆచరించాలని శాస్త్రం చెపుతోంది. ఈ సమయంలో పిండప్రదానాలు చేయకపోతే మహాలయ అమావాస్య వరకూ వేచి చూసిన పితృదేవతలు అసంతృప్తితో శపించి ప్రేతపురికి వెళ్లిపోతారని చెప్పారు. మహాలయ పక్షం "దినేదినే గయాతుల్యం" అని చెప్పారు. మహాలయ పక్షంలో మరణించిన తల్లి దండ్రులు, తాత ముత్తాతలు పూర్వీకులకు శ్రాద్ధవిధులు ప్రతిరోజూ నిర్వహించాలి. ఒకవేళ ప్రతిరోజూ వీలు కానిచో తిథినాడు నిర్వహించాలి. తల్లి మరణించి తండ్రి జీవించి ఉంటే నవమినాడు తర్పణ శ్రాద్ధవిధులు నిర్వహించాలి. లేదా అమావాస్యనాడు విధిగా నిర్వహించాలి. మహాలయ అమావాస్యనాడు శ్రాద్ధవిధులు నిర్వహించడం వల్ల త్రివేణీ సంగమలోను. గయలోను శ్రాద్ధవిధులు నిర్వహించిన ఫలితం కలుగుతుంది. మహాలయ పక్షంలోని అన్ని రోజులు కానీ, లేదా ఒక్క రోజుకాని, లేదా మహాలయ అమావాస్య నాడు కానీ పితృదేవతలను ఆరాధిస్తే వారు ఒక ఏడాది పాటు సంతృప్తులవుతారు అని స్కాందపురాణంలో పేర్కొన్నారు. పితృదేవతలు సంతృప్తి చెందితే వంశాభివృద్ధి కలుగుతుంది. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
31 likes
32 shares