ఈ మధ్య కాలంలో రసబాసగా,తీవ్ర గందరగోళంగా,ఆందోళనభరితంగా మారుతున్న ఆస్తుల పంపకాలు!
లేదా
తల్లిదండ్రులు తమ ఆస్తుల పంపకాల విషయంలో సమానత్వాన్ని పాటిస్తే ఎలాంటి ఘర్షణలకు,అలజడులకు తావు ఉండదు!
ఈ మధ్య కాలంలో ఆస్తుల పంపకాల విషయంలో కొంతమంది తల్లిదండ్రులు సమానత్వం పాటించకుండా ఒక కుమారునికి ఎక్కువ ఆస్తి ఇచ్చి మరో కుమారుడికకి ఏమో అరకొర ఆస్తులతో సరి పెడుతున్నారు.నిజంగా చెప్పాలంటే ఈ సమాజానికి సంబంధించి ఇది ఏ మాత్రం ఆరోగ్యకరమైన పరిణామం కాదు.ఇందువల్ల ఒక తల్లికి చెందిన బిడ్డల మధ్యనే లేనిపోని పొరపచ్ఛాలు,అనవసర ఘర్షణలు, అనారోగ్యకరమైన వాతావరణం సంభవించి అక్కసు,ద్వేషంతో ఒక్కొక్కసారి ఒకరిపై మరొకరు హత్యకు కుట్ర పన్నడం,కత్తులు దూసుకోవడానికి సైతం వెనుకంజ వేయకపోవడం వంటి ప్రమాదకరమైన,అపాయకరమైన పరిస్థితులు ప్రస్తుత సమాజంలో కోకొల్లలుగా సంప్రాప్తిస్తున్నాయి అనే మాట అక్షర సత్యం.ఒక విధంగా చెప్పాలంటే పరిస్థితులు ఏ విధంగా తయారు అయ్యాయి అంటే ' తోలుత గాయం అయినప్పుడే దానికి చికిత్స చేస్తే సరిపోతుంది,అలా కాకుండా ఆ గాయం ముదిరిపాకాన పడ్డాక వైద్యం చేయించుకుంటే ఏమి ప్రయోజనం ' ఆ విధంగా ఆస్తుల పంపకాల విషయంలో తల్లిదండ్రులు మొదట్లోనే కడు జాగ్రత్త వహించి ఎవరికి చెందాల్సిన ఆస్తులు వారికే చెందేటట్లు సరి సమానంగా వాటాలు పంచడం,వీలునామాను సైతం సరి సమానంగా వ్రాయడం వంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే ప్రస్తుతం మరియు భవిష్యత్ లో సైతం వారి బిడ్డల మధ్య ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు.అలా కాకుండా తమకున్న ఇద్దరి కుమారులలో ఒకరిపైనే ఎక్కువ ప్రేమ,అప్యాయతలు ఓలకబోసి వారికే సింహాభాగం ఆస్తిని ఇవ్వాలని చూస్తే మాత్రం ఇరువురి కుమారుల మధ్య లేనిపోని గోడవలు,వైషమ్యాలు మొదలయ్యి,వాగ్వివాదాలు సైతం ఇద్దరి మధ్య పెరిగిపోయి చివరికి అవి ' చిలికి చిలికి గాలివానలా ' మారి,తయారు అయ్యి ఎలాంటి అవాంచనీయమైన హింసలకు అయిన దారి తీసే ప్రమాదం పొంచి ఉంటుంది.కాబట్టి ఇలాంటి అభద్రతభావాన్ని కొని తెచ్చుకునే బదులు తల్లిదండ్రులు అనే వారు ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ తమ కుమారులకు ఆస్తులను న్యాయబద్దంగా పంచితే అది ఇరువురి కుమారుల కుటుంబాలకు సర్వదా శ్రేయస్కరం.అలా కాకుండా అంతా తమ చేతుల్లోనే వుంది కదా,తమ మాటే వేద వాక్కు అనే అతివిశ్వాసంతో,అజమాయిషితో తల్లిదండ్రులు తమ ఆస్తులను ఎక్కువ భాగం ఒకరికే కట్టబెట్టాలని చూస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది అన్నట్లు వారు తీవ్ర పరిణామాలను వారి కుమారుల నుంచి సైతం ఎదుర్కొక తప్పదు కాక తప్పదు,ఒక్కొక్కసారి అది శృతిమించి తల్లిదండ్రులకు సైతం వారి సొంత బిడ్డల నుంచే తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని సైతం తీసివేయలేం అనే మాట అక్షర సత్యం.
ఏదిఏమైన ఆస్తుల పంపకాల విషయంలో మాత్రం తల్లిదండ్రులు ముందు వెనుక అలోచించి,నలుగురి పెద్ద వాళ్ళతో మంతనలు,సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే ఏది మంచో,ఏది చెడో ఒక్కసారి వివేకంతో యోచన చేసి మరీ తమ కుమారులకిరువురికి ఆస్తుల పంపకాలలో ఎలాంటి తేడాలు,భేదాలు చూపించకుండా ఇరువురికి సమంగా ఆస్తులు చెందేలా వారి తల్లిదండ్రులు వీలునామా వ్రాస్తే భవిష్యత్ లో ఇరువురి మధ్య ఎలాంటి ఆనారోగ్యకరమైన,అలజడి వాతావరణం ఏర్పడకుండా,వారిరువురు ఎటువంటి కోపోద్రేకాలకు,ఆవేశకావేశాలకు లోను కాకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో అంటే ' సర్వేజనా సుఖినోభవంతు ' అన్న రూపేనా తమ బిడ్డలు అందరూ అత్యంత సురక్షితంగా,రక్షణాత్మకంగా వారి మానాన వారు సుఖంగా,ఒక మంచి భద్రతభావంతో జీవించగలుగుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఏమైనా ఒక తల్లికి పుట్టిన కుమారులు ఇద్దరు సమానమే,ఇందులో ఏ ఒక్కరూ తక్కువ కాదు అనే స్ఫూర్తిదాయకమైన పంథాలో ముందుకు వెళ్లి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తులను సమానంగా,వాగ్వివాదాలకు,సమస్యాత్మక పరిస్థితులకు అతీతంగా పంచగలిగితే ఏ ఒక్క కుటుంబంలోని సభ్యులు అయిన ఒకరికొకరు ప్రేమ, అప్యాయతలతో,అనురాగాలు, అనుబంధాలతో మసలుకుంటూ కుటుంబం అంటే ఈవిధమైన,ఇలాంటి ఆదర్శమైన,స్ఫూర్తిదాయకమైన పంథాలో నడవాలి అని ఈ సమాజం,ఈ సమాజంలోని ప్రజలు భావించేలా ఆ కుటుంబంలోని యావత్తు సభ్యులు నడుచుకుంటే వారి జీవితాలు నిత్య నూతనంగా,ఎనలేని ఆనందాలకు,సంతోషాలకు నిలయంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లడం తథ్యం.
- బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా!
#ఉమ్మడి. కుటుంబం👪@$