ఉమ్మడి. కుటుంబం👪@$

18 Posts • 42K views
P.Venkateswara Rao
619 views 1 months ago
#ఉమ్మడి. కుటుంబం👪@$ *బాగా నచ్చిన వార్త ! ఒక కప్పు కింద ఆరుగురు అత్తలు- 20 మంది కోడళ్లు‼️* July 7, 2026👏🏻👏🏻👏🏻 బాగా నచ్చిన వార్త… నిజానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా కనీసం ఓ హాఫ్ పేజీ వివరంగా కవర్ చేయాల్సిన వార్త అనిపించింది… అసలు ఒక ఇంట్లో ఒక అత్త, ఒక కోడలే సరిగ్గా ఉండలేకపోతున్నారు… నిత్యకయ్యం… అలాంటిది ఒక కప్పు కింద ఆరుగురు అత్తలు, 20 మంది కోడళ్లు కలిసి మెలిసి, మొత్తం 83 మంది ఉమ్మడి కుటుంబంగా ఉండటం ఎంత గ్రేటో కదా! వావ్! మన తెలుగు నేల మీదే!! కాలం మారినా చెక్కుచెదరని ఉమ్మడి కుటుంబాల మధురిమ! … కాలం మారుతోంది.. జీవనశైలి మారుతోంది. ‘ఇద్దరు-ముగ్గురు’ అనే చిన్న కుటుంబాల పరిధిలోకి నేటి సమాజం పరిమితమైపోతోంది. ఒకే ఇంట్లో అత్తా కోడళ్లు ఉండటమే గగనమైన ఈ రోజుల్లో, ఆరు తరాలు దాటినా, వందల మంది ఉన్నా ఏ మాత్రం విడిపోకుండా కలిసిమెలిసి ఉంటున్న కుటుంబాలను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఆప్యాయతలే ఆస్తులని నమ్మే అలాంటి ‘జంబో జాయింట్ ఫ్యామిలీల’ గాథలు నేటి సమాజానికి ఒక గొప్ప పాఠం. కుర్లపల్లి కోట.. ఐకమత్యమే మూలస్తంభం … అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దానికి కారణం హనుమంత రాయుడు, ముత్యాలప్పల కుటుంబం. రెండు కుటుంబాలతో మొదలైన వీరి ప్రస్థానం, నేడు ఆరు తరాలకు విస్తరించి ఏకంగా 83 మంది సభ్యులతో ఒకే గొడుగు కింద కొనసాగుతోంది. నియమబద్ధమైన జీవనం: 20 మంది కుమారులు, 20 మంది కోడళ్లు, ఆరుగురు అత్తలు.. వీరంతా ఒకే ఇంట్లో, ఒకే వంట గదిలో భోజనం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పని విభజన: కుటుంబ పెద్దలైన హనుమంత రాయుడు, ముత్యాలప్ప రోజువారీ పనులను పర్యవేక్షిస్తారు. వ్యవసాయం నుండి వ్యాపారాల వరకు ప్రతిదీ సమిష్టి నిర్ణయాలే. సంప్రదాయం: 120 ఎకరాల వ్యవసాయం, పశుపోషణ, ట్రావెల్స్ వ్యాపారం.. ఇలా అన్నింటినీ ఉమ్మడిగానే నిర్వహిస్తారు. పండుగల సమయాల్లో మూడు పొట్టేళ్లు, 40 కిలోల చికెన్ వండుకుని ఆత్మీయ విందు చేసుకోవడం వీరి ప్రత్యేకత. ఇది చదువుతుంటే మరో ఆదర్శ కుటుంబం గుర్తొచ్చింది… గ్లోబల్ ఆదర్శం: మిజోరం ‘చంగా’ కుటుంబం … ఉమ్మడి కుటుంబాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈశాన్య రాష్ట్రాలలోని మిజోరం గురించి ప్రస్తావించక తప్పదు. జోరామ్ చంగా (Ziona Chana) నాయకత్వంలో నడిచిన ఆ కుటుంబం ప్రపంచంలోనే అతిపెద్ద ఉమ్మడి కుటుంబంగా రికార్డు సృష్టించింది. 180 మందికి పైగా సభ్యులు ఒకే భవనంలో నివసిస్తూ, ఒక చిన్న సైన్యంలా క్రమశిక్షణతో జీవించడం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. వంట నుండి ప్రార్థనల వరకు ప్రతిదీ ఒకే నియమం, ఒకే క్రమం! మన హనుమంతరాయుడు కుటుంబం వాళ్లకన్నా ఏం తక్కువ..?! నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? ఈ రెండు కుటుంబాలను గమనిస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు స్పష్టమవుతాయి… మనస్పర్థలే పరిష్కారాలు…: “కోడళ్ల మధ్య చిన్న గొడవలు రావచ్చు, కానీ వాటిని బయటకు రానివ్వకుండా ఇంట్లోనే పరిష్కరించుకుంటాం” అని కుర్లపల్లి కుటుంబం చెప్పిన మాటలో ఎంతో పరిణతి ఉంది. అనుబంధాలే ఆస్తి…: ఆస్తుల పంపకాల కోసం కోర్టుల వరకు వెళ్లే నేటి కాలంలో, వీరు మాత్రం “అవసరమైతే ఇల్లు ఇంకాస్త పెద్దగా కట్టుకుంటాం కానీ, కుటుంబాన్ని విడగొట్టం” అని గట్టిగా చెబుతున్నారు. పనిలో ఐక్యత…: కుటుంబం అంటే కేవలం కలిసి ఉండటం మాత్రమే కాదు, ఒకరి కష్టంలో ఒకరు భాగస్వాములు కావడం. నేటి డిజిటల్ యుగంలో మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. విడిపోవడం సులభం, కానీ కలిసి ఉండటం ఒక కష్ట సాధన. “కలిసుంటే కలదు సుఖం” అనే సామెతను కేవలం పుస్తకాల్లోనే కాకుండా, ఆచరణలో చూపిస్తున్న కుర్లపల్లి, చంగా వంటి కుటుంబాలు, నేటి సమాజానికి నిజమైన వెలుగుదివ్వెలు…
8 likes
11 shares
ఈ మధ్య కాలంలో రసబాసగా,తీవ్ర గందరగోళంగా,ఆందోళనభరితంగా మారుతున్న ఆస్తుల పంపకాలు! లేదా తల్లిదండ్రులు తమ ఆస్తుల పంపకాల విషయంలో సమానత్వాన్ని పాటిస్తే ఎలాంటి ఘర్షణలకు,అలజడులకు తావు ఉండదు! ఈ మధ్య కాలంలో ఆస్తుల పంపకాల విషయంలో కొంతమంది తల్లిదండ్రులు సమానత్వం పాటించకుండా ఒక కుమారునికి ఎక్కువ ఆస్తి ఇచ్చి మరో కుమారుడికకి ఏమో అరకొర ఆస్తులతో సరి పెడుతున్నారు.నిజంగా చెప్పాలంటే ఈ సమాజానికి సంబంధించి ఇది ఏ మాత్రం ఆరోగ్యకరమైన పరిణామం కాదు.ఇందువల్ల ఒక తల్లికి చెందిన బిడ్డల మధ్యనే లేనిపోని పొరపచ్ఛాలు,అనవసర ఘర్షణలు, అనారోగ్యకరమైన వాతావరణం సంభవించి అక్కసు,ద్వేషంతో ఒక్కొక్కసారి ఒకరిపై మరొకరు హత్యకు కుట్ర పన్నడం,కత్తులు దూసుకోవడానికి సైతం వెనుకంజ వేయకపోవడం వంటి ప్రమాదకరమైన,అపాయకరమైన పరిస్థితులు ప్రస్తుత సమాజంలో కోకొల్లలుగా సంప్రాప్తిస్తున్నాయి అనే మాట అక్షర సత్యం.ఒక విధంగా చెప్పాలంటే పరిస్థితులు ఏ విధంగా తయారు అయ్యాయి అంటే ' తోలుత గాయం అయినప్పుడే దానికి చికిత్స చేస్తే సరిపోతుంది,అలా కాకుండా ఆ గాయం ముదిరిపాకాన పడ్డాక వైద్యం చేయించుకుంటే ఏమి ప్రయోజనం ' ఆ విధంగా ఆస్తుల పంపకాల విషయంలో తల్లిదండ్రులు మొదట్లోనే కడు జాగ్రత్త వహించి ఎవరికి చెందాల్సిన ఆస్తులు వారికే చెందేటట్లు సరి సమానంగా వాటాలు పంచడం,వీలునామాను సైతం సరి సమానంగా వ్రాయడం వంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే ప్రస్తుతం మరియు భవిష్యత్ లో సైతం వారి బిడ్డల మధ్య ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు.అలా కాకుండా తమకున్న ఇద్దరి కుమారులలో ఒకరిపైనే ఎక్కువ ప్రేమ,అప్యాయతలు ఓలకబోసి వారికే సింహాభాగం ఆస్తిని ఇవ్వాలని చూస్తే మాత్రం ఇరువురి కుమారుల మధ్య లేనిపోని గోడవలు,వైషమ్యాలు మొదలయ్యి,వాగ్వివాదాలు సైతం ఇద్దరి మధ్య పెరిగిపోయి చివరికి అవి ' చిలికి చిలికి గాలివానలా ' మారి,తయారు అయ్యి ఎలాంటి అవాంచనీయమైన హింసలకు అయిన దారి తీసే ప్రమాదం పొంచి ఉంటుంది.కాబట్టి ఇలాంటి అభద్రతభావాన్ని కొని తెచ్చుకునే బదులు తల్లిదండ్రులు అనే వారు ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ తమ కుమారులకు ఆస్తులను న్యాయబద్దంగా పంచితే అది ఇరువురి కుమారుల కుటుంబాలకు సర్వదా శ్రేయస్కరం.అలా కాకుండా అంతా తమ చేతుల్లోనే వుంది కదా,తమ మాటే వేద వాక్కు అనే అతివిశ్వాసంతో,అజమాయిషితో తల్లిదండ్రులు తమ ఆస్తులను ఎక్కువ భాగం ఒకరికే కట్టబెట్టాలని చూస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది అన్నట్లు వారు తీవ్ర పరిణామాలను వారి కుమారుల నుంచి సైతం ఎదుర్కొక తప్పదు కాక తప్పదు,ఒక్కొక్కసారి అది శృతిమించి తల్లిదండ్రులకు సైతం వారి సొంత బిడ్డల నుంచే తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని సైతం తీసివేయలేం అనే మాట అక్షర సత్యం. ఏదిఏమైన ఆస్తుల పంపకాల విషయంలో మాత్రం తల్లిదండ్రులు ముందు వెనుక అలోచించి,నలుగురి పెద్ద వాళ్ళతో మంతనలు,సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే ఏది మంచో,ఏది చెడో ఒక్కసారి వివేకంతో యోచన చేసి మరీ తమ కుమారులకిరువురికి ఆస్తుల పంపకాలలో ఎలాంటి తేడాలు,భేదాలు చూపించకుండా ఇరువురికి సమంగా ఆస్తులు చెందేలా వారి తల్లిదండ్రులు వీలునామా వ్రాస్తే భవిష్యత్ లో ఇరువురి మధ్య ఎలాంటి ఆనారోగ్యకరమైన,అలజడి వాతావరణం ఏర్పడకుండా,వారిరువురు ఎటువంటి కోపోద్రేకాలకు,ఆవేశకావేశాలకు లోను కాకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో అంటే ' సర్వేజనా సుఖినోభవంతు ' అన్న రూపేనా తమ బిడ్డలు అందరూ అత్యంత సురక్షితంగా,రక్షణాత్మకంగా వారి మానాన వారు సుఖంగా,ఒక మంచి భద్రతభావంతో జీవించగలుగుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఏమైనా ఒక తల్లికి పుట్టిన కుమారులు ఇద్దరు సమానమే,ఇందులో ఏ ఒక్కరూ తక్కువ కాదు అనే స్ఫూర్తిదాయకమైన పంథాలో ముందుకు వెళ్లి ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తులను సమానంగా,వాగ్వివాదాలకు,సమస్యాత్మక పరిస్థితులకు అతీతంగా పంచగలిగితే ఏ ఒక్క కుటుంబంలోని సభ్యులు అయిన ఒకరికొకరు ప్రేమ, అప్యాయతలతో,అనురాగాలు, అనుబంధాలతో మసలుకుంటూ కుటుంబం అంటే ఈవిధమైన,ఇలాంటి ఆదర్శమైన,స్ఫూర్తిదాయకమైన పంథాలో నడవాలి అని ఈ సమాజం,ఈ సమాజంలోని ప్రజలు భావించేలా ఆ కుటుంబంలోని యావత్తు సభ్యులు నడుచుకుంటే వారి జీవితాలు నిత్య నూతనంగా,ఎనలేని ఆనందాలకు,సంతోషాలకు నిలయంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లడం తథ్యం. - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #ఉమ్మడి. కుటుంబం👪@$
15 likes
11 shares