#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #BRS party భగ్గుమన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్రలపై బీఆర్ఎస్ దళం గర్జించింది. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసును ముడిపెట్టి చట్టవిరుద్ధంగా సిట్ విచారణ చేస్తుండడంపై భగ్గుమన్నది. అధినేతకు సంఘీభావంగా ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించింది.
కాంగ్రెస్ కుట్రలపై గర్జించిన గులాబీ సేన
ఊరూరా నిరసనల హోరు
బైక్ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు
కాంగ్రెస్ కుట్రలపై బీఆర్ఎస్ దళం గర్జించింది. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసును ముడిపెట్టి చట్టవిరుద్ధంగా సిట్ విచారణ చేస్తుండడంపై భగ్గుమన్నది. అధినేతకు సంఘీభావంగా ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించింది. పల్లె, పట్టణం అనేతేడా లేకుండా ఎక్కడ చూసినా దండుగా కదిలివచ్చిన నాయకులు, కార్యకర్తలు నల్ల జెండాలు చేతపట్టి బైక్ర్యాలీలు తీశారు. వివిధ రూపాల్లో రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలు తయారు చేసి శవయాత్రలు నిర్వహించారు. కార్పొరేషన్/ కమాన్చౌరస్తా/ కరీంనగర్రూరల్ /హుజూరాబాద్/ రూరల్/ జమ్మికుంట/ ఇల్లందకుంట/ సైదాపూర్/వీణవంక/ మానకొండూర్/ శంకరపట్నం/ చిగురుమామిడి/ గన్నేరువరం/ తిమ్మాపూర్/ చొప్పదండి/ కొత్తపల్లి/ రామడుగు/ గంగాధర, ఫిబ్రవరి 1: కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు దిండిగాల మహేశ్, దూలం సంపత్, ఎడ్ల అశోక్, సోహన్సింగ్, చంద్రశేఖర్, బేజుగం మధు, శ్రీనివాస్రెడ్డి, లింగపల్లి సత్యనారాయణ, వసంతరావు, ఆరె రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు