Mohan
1.5K views
22 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party మూసీలో లక్షన్నర కోట్ల అవినీతి చేస్తున్న రేవంత్💰 కాంగ్రెస్‌ నడిపేది సర్కారా? రౌడీ దర్బారా❓ 🚨 పిచ్చోడి చేతిలో రాయి కాదు.. రాష్ట్రమే ఉన్నది 📃 ఈ శతాబ్దపు మోసం అభయహస్తం మ్యానిఫెస్టో 📣 కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకునేందుకు సిద్ధంకావాలి 📢 ఇంటింటికీ వెళ్లి వివరించి ప్రజల్లో చైతన్యం తేవాలి 💥 బీఆర్‌ఎస్వీ నేతలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశం అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మైనింగ్‌ అక్రమాలను ప్రశ్నించిన సందర్భంలో ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణి ప్రదర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు అడిగితే విజిలెన్స్‌ కేసులు, ప్రతిపక్షంగా తాము నిలదీస్తే బెదిరిస్తున్నారు, కాంగ్రెస్‌ నడిపేది సర్కారా.. రౌడీ దర్బారా? రేవంత్‌ బెదిరింపులకు బీఆర్‌ఎస్‌ ఎప్పటికీ భయపడదు. మూసీ సుందరీకరణ ముసుగులో రేవంత్‌రెడ్డి చేస్తున్న భారీ కుంభకోణంపై నగర ప్రజల్లో చైతన్యం కల్పించాలి. ప్రభుత్వ అరాచకాలను అడ్డుకునేందుకు విద్యార్థి విభాగం సిద్ధం కావాలి. ఏప్రిల్‌ 2న ప్రెస్‌క్లబ్‌లో ప్రజా సంఘాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటుచేయాలి. ఏప్రిల్‌ 4నుంచి 14వరకు వరకు 50 బృందాలుగా ఏర్పడి మూసీ పరీవాహక ప్రాంతాలు, బస్తీలు, గల్లీల్లో పర్యటించి ఇంటింటికీ వెళ్లి మూసీ ప్రక్షాళన వెనుక ఉన్న కాంగ్రెస్‌ కుట్రను వివరించాలి. హైదరాబాద్‌ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతదే. మూసీ ప్రక్షాళన ముసుగులో రేవంత్‌రెడ్డి చేస్తున్న లక్షన్నర కోట్ల స్కామ్‌పై ప్రజల్లో చైతన్యం తేవాలి. మూసీ పరీవాహక ప్రాంతాలు, బస్తీల్లో బీఆర్‌ఎస్వీ నేతలు ఇంటింటికీ వెళ్లి కాంగ్రెస్‌ కుట్రను వివరించాలి. కరపత్రాలు, పోస్టర్లు, టీ షర్టులతో క్యాంపెయిన్‌ చేయాలి. విద్యార్థుల దెబ్బకు ప్రభుత్వం దిగిరావాలి.